సోమవారం, అక్టోబర్ 30, 2006

నా నెల్లూరు పర్యటన -3


Photo: cbrao

గాంధీ బాటలో ఉద్యమకారుడు సుకుమార్ రెడ్డి

దేశభక్తి ఉద్యమం గానివ్వండి, ప్రత్యెక రాష్ట్ర ఉద్యమం గానివ్వండి లేక ఎదైనా సేవా ఉద్యమం గానివ్వండి నెల్లూరు ప్రజలలో వీటిగురించిన అవగాహన, చైతన్యం ఎక్కువే. ఆంధ్ర రాష్ట్రానికై ప్రాణాలివ్వటానికి పొట్ట్ శ్రీరాములు వెనుకడుగు వెయ్యలేదు. మధ్యపాన వ్యతిరేకోద్యమం చూడండి. దూబగుంట లో మొదలైన మద్యం వ్యతిరేక ఐక్య వేదిక టెక్కలి నుంచి తెలంగాణ దాక తమ ప్రణాళిక అమలు చెయ్యటంతో, అప్పటి ముఖ్య మంత్రి ఎన్.టి.ఆర్. , సారా నిషేధం, అధికారికంగా చెయ్యక తప్పింది కాదు. అది నెల్లూరు ప్రజల సాంఘిక చైతన్యానికి ఒక సోదాహరణగా నిలిచింది.

ఇక సేవా కార్యక్రమాలకొస్తే, అవి, మన భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఉండి, పలువురికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాయి. నెల్లూరులో సాంఘికసేవా కార్యకర్తలకు కొదవలేదు. వారిలోని ఒక విశిష్ట వ్యక్తి తిక్కవరపు సుకుమార్ రెడ్డి. చూడటానికి వీరు పేరుకు తగ్గట్టే సౌమ్యంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాలలో తీరికలేకుండ పనిచేస్తూ పెరిగిన గడ్డంతో కనిపిస్తుంటారు. చూడగానే మన దృష్టిని ఆకర్షించేవి వారి చొక్కాపై ఉన్న రక రకాల బాడ్జీలు (అంగీకి తగిలించే బిళ్ళ బొమ్మలు). ఆ బిళ్ళలు పెట్టడం వెనుక గూడా ఒక సేవాతత్పరత కనిపిస్తొంది. ఆ Badges చూసిన వారు అవి ఏమిటని అడగటమూ, వాటి గురించి వారి వివరణా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ బిళ్ళలపై రక్తదాన, నేత్రదానాల అనుకూల నినాదాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదాలుంటాయి.

సింహపురి స్వచ్చంద రక్తదాతల సంస్థ

మన దేశంలో అనేక వినియోగదారుల సంఘాలున్నాయి. రక్త, నేత్ర బాంకులున్నాయి. అయితే దాతలు సేవ చెయ్యటానికై పొటీపడి స్థాపించిన భారతదెశపు తొలి రక్త సహాయకుల సంస్థ, సింహపురి స్వచ్చంద రక్తదాతల సంస్థ 1979 లో నెల్లూరులో స్థాపింపబడింది. 1987 లో భారతదేశపు తొలి నేత్ర దాతల సంస్థ స్థాపించబడీంది. ఈ రెండు సంస్థలకూ వ్యవస్థాపకుదూ, కార్యదర్శి తిక్కవరపు సుకుమార రెడ్డి.

ఇక రక్తదాన విషయంలో ప్రజలకున్న అజ్ఞానం అపారం. ‘సందిగ్ధం’ కథ లో డాక్టర్ సోమిరెడ్డి జయప్రద చెప్తారు - భార్య ఎంతో అపాయకర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా భర్త రక్తదానానికి వెనుకంజ వెయ్యటం, ఆఖరికి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టిసలాడుతున్న భార్య - వారు ఉద్యోగం చేసే వారు కదా- రక్తం ఇస్తే Job ఎలా చేస్తారు అంటూ డాక్టరును ప్రశ్నిస్తుంది. రక్తదానంపై ప్రజలకున్న అపోహల్ని తొలగించటానికై Nellore V.R.College, Town Hall లలో వేదిక పై రక్తదానాన్ని ఇవ్వటం ఎలాగో demonstration చేసి చూపారు. వీరి బ్లడ్ గ్రూపు అరుదైంది కావటంతో 40+ సార్లు రక్తదానం స్వయంగా చేశారు. రోగికెప్పుడవసరమైతే అప్పుడు రక్తాన్నందజేసే - తక్షణ రక్త మార్పిడీ విధానం (Direct blood transfusion method) లో కూడా పలు రక్తదానాలు, వీరి నేతృ త్వంలో జరిగాయి. మొత్తంగా కొన్ని వేల రక్తదానాలు జరిపించారు సుకుమార్ రెడ్డి. వీరి రక్తదాన సంస్థ అలాంటి మరో 10 సంస్థలు రావటానికి స్పూర్తికారకమైంది.

Nellore Eye Donors Organisation

రక్తదానంలో ముందుండిన సుకుమార్ గారు నేత్రదానంలో వెనకుంటారా? బాంక్ ఉద్యొగి ఆనందరాం సింగ్ గారితో కలసి NEDO (Nellore Eye Donors Organisation) స్థాపించారు. వారి తండ్రి గారి నేత్రాలను దానం చేసి మిగతావారికి స్పూర్తినిచ్చారు. నేత్రాల సేకరణ చాల కఠినమైన ప్రక్రియ. గ్రామా లకు వెళ్ళి నేత్రదానం గురించి గ్రామస్తులకు విశదీకరించి, దాత చనిపొయిన 8 గంటలలోపు కంటి పాపను సేకరించి, చెన్నై లోని ఎగ్మోర్ కంటి బాంక్ కు సకాలంలో అందచేయటం ఒక పెద్ద సవాల్‌గా నిలుస్తోంది. కంటి సేకరణలో గ్రామాలలో సరైన డాక్టర్ అందుబాటలో ఉండరు కావున తానే స్వయంగా కంటి పాపను సేకరించి, నేత్రాలను థర్మాస్ ఫ్లాస్కులో ఉంచి ఎగ్మోర్ నేత్ర బాంక్‌కు పంపేవారు. ఎన్నో కష్టాలకోర్చి ఇంతవరకూ సుమారుగా 150 నేత్రాలను సేకరించి ఎగ్మోర్ బాంక్ కు పంపినారు.

తొక్కుడు బండి Bicycle

సుకుమార్‌గారు హేతువాది, సంఘసేవకుడు ఇంకా కవి. నా దృష్టికి వీరు రాసిన రెండు కవితలు అ) తొక్కుడు బండి ఆ) పొగాకు శతకము వచ్చాయి. ఇవి కూడ ఒక సామాజిక ప్రయోజనాన్ని దృష్టి లో పెట్టుకుని రాసినవే. సామాన్యుడు వాడే బైసికిల్ కూడా వీరి దృష్టిలో సామ్రాజ్యవాదాన్ని ఎదురించగల సత్తా ఉన్న ఆయుధమని వీరి నమ్మకం. Bicycleను వీరు తొక్కుడుబండి అంటారు. మోటార్ వాహనం నడపటమంటే ముడి చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న దేశాల సామ్రాజ్యవాదానికి మనము చేయూత నిచ్చినట్టేనని వీరి భావన. బైసికిల్‌పై నాలుగు పేజీల దీర్ఘ కవిత రాశారు.

అది జనచైనా వాహనం
అది భారత జన వాహనం
తొక్కుడుబండి అలనాటి పుచ్చలపల్లి సుందరయ్య వాహనం
ఇలనేటి గండవరం సేతురామయ్య, దాన్ని తొక్కి, తొక్కుడుబండి ప్రయాణ
షష్టి పూర్తి వేడుక జరుపుకొన్నారు

తొక్కుడుబండి తొక్కటం మనిషి ఆరొగ్యాన్ని, శక్తిని తెలియచేస్తుందనీ అంటూ ఈ వాహనం
పర్యావరణ కాలుష్యాన్ని పరిరక్షిస్తుందంటారు. మన దేశపుయొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు అదుపుతో ఖర్చవటానికి తోడ్పడుతుందనీ కావున తొక్కుడుబండి తొక్కటం అంటే మనకు దేశ భక్తి ఉన్నట్లే అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే తొక్కుడుబండి మనిషి ఆరొగ్యానికి, దేశ ఆర్ధిక అభివృద్ధికీ ఉపయోగపడుతుంది కావున అందరూ బైసికల్ వాడాలంటారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న మాట.

మంగళవారం, అక్టోబర్ 24, 2006

నా నెల్లూరు పర్యటన -2


Photo by cbrao

నెల్లూరు రాజకీయులూ, కవులూ, కళాకారులూ, నెరజాణలూ

మహాభారతం తెనిగించిన మహా కవి తిక్కన, ఆంధ్ర రాష్ట్రానికై అశువులు బాసిన పొట్టి శ్రీరాములు, Communist విప్లవ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య ఇక్కడి వారే. మన రాష్ట్రానికి ఇద్దరు ముఖ్య మంత్రులను ఇచ్చిందీ సింహపురి. వారు శ్రీయుతులు నేదురిమల్లి జనార్దనరెడ్డి,



కీ.శే. డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి. మరో రాజకీయ ప్రముఖులు ఎ.సి.సుబ్బారెడ్డి ఇక్కడివారే. నెల్లూరు జిల్లా ఎందరో ప్రతిభావంతులైన రచయితలకు, గాయకులకు, నటులకు జన్మనిచ్చింది.


కృషీవలుడు (The Tiller of the Land) -1919, ఫానశాల రచించిన కవి కోకిల దువ్వూరు రామిరెడ్డి, ఫిడేలు రాగాల పట్టాభి, నిదురించే తోటలొకి పాట ఒకటి వచ్చింది అంటూ మనల్ని నిద్రలేపిన గుంటూరు శేషేంద్ర శర్మ విక్రమ సింహపురివాసులే. రవీంద్రుని గీతాంజలిని తెనిగించిన సాహితీవేత్త, రాజకీయ నాయకుడు. మాజీ గవర్నరూ, కీర్తిశేషులు అయిన డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి, ఆచార్య ఆత్రేయ, పుష్పక్ మూకీ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, గాయకుడు బాలసుబ్రమణ్యం, వాణిశ్రీ, రాజనాల వంటి నటీ నటులకు నిలయమైందీ నెల్లూరు. . చిరంజీవి, పవన్ కల్యాణ్ బాల్యంలో ఇక్కడే విద్యనభ్యసించారు. రేగడి విత్తులు రచయిత్రి చంద్రలత,


పలు రచనలు చేసిన డాక్టర్ జయప్రద, పక్షి కథా రచయిత్రి ప్రతిమ ఇక్కడి వారే. ఇంక ఎందరో మహానుభావులు.......



నెల్లూరు పట్టణం

రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆటో లో రామకృష్ణగారింటికి ప్రయాణమయ్యాము. నా బాల్యంలో అంతగా ఊహ తెలియనప్పుడు ఈ ఊరు వచ్చాను. ఊహవొచ్చాక ఇదే నా ప్రధమ రాక. నెల్లూరు నేను ఊహించిన దానికన్నా చాలా పెద్ద ఊరు. విశాలంగా, సుందరంగా గోచరించింది. ఆంధ్ర కేసరి నగర్లో రామకృష్ణగారి నివాసం. దారిలో మాగుంట కాలనిలో ఎన్నో రమ్య భవనాలున్నాయి. అదే దారిలో మాకు రొట్టెల పండుగ జరిపే దర్గా, Audio cassette library and Braille centre for blind కనిపించాయి. రహదారిమీదే రామకృష్ణ గారు మాకు స్వాగతం పలికి వారి స్వగ్రుహానికి తీసుకెళ్ళారు.

పెరుగు రామకృష్ణ



నా నెల్లూరు ప్రయాణానికి ప్రేరణ, రామకృష్ణగారి ఫ్లెమింగో - విడిది పక్షుల దీర్ఘ కవిత. రామకృష్ణగారిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. వీరు రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖలో పని చేస్తున్నారు. మంచి హృదయమున్న కవి, రచయిత. పలు కవి సమ్మేళణాలలో పాల్గొన్నారు. ప్రతిష్టాకరమైన పలు
Photo: cbrao

అవార్డుల బహుమతి గ్రహీత. సభా కార్యక్రమాల నిర్వహణలో దిట్ట.

రామకృష్ణగారు
ప్రధాన కార్యదర్శి నెల్లూరు జిల్లా రచయితల సంఘం
ప్రాంతీయ కార్యదర్శి ఇండియన్ హైకూ క్లబ్
జాతీయ కార్యవర్గ సభ్యులు Indian Society of Authors, New Delhi
ఉపాధ్యక్షులు నెల్లూరు జిల్లా తెలుగు భాషోద్యమ సమితి గా ఉంటున్నారు.



ఆదిలో హంసపాదు

నెల్లూరు పట్టణానికి సుమారు 80 కిలో మీటర్ల దూరంలో నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం ఉంది. పక్షుల అధ్యయనం, వాటి ఛాయా చిత్రాలు తీయటంపై నాకు అనురక్తి. ఈ నెల్లూరు visitలో నేలపట్టు వెళ్ళాలని నా సంకల్పం. అయితే అక్కడ సంవృద్ధిగా నీరు చేరనందువలన ఇంకా వలస పక్షులు రాలేదని రామకృష్ణ గారు సమచారం అందచేసాక నా నేలపట్టు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను.

విశిష్ట వ్యక్తి

నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడే తిక్కవరపు సుకుమార రెద్ది గారి గురించి విని వున్నాను. వారిని చూడాలని ఉంది అని ప్రశాంతితో అన్న అర్థగంటకే వారే రామకృష్ణ గారింటికి వస్తున్నట్టుగా కబురందింది. వారిని కలవాలని నా మనసుత్సాహపడింది.

మంగళవారం, అక్టోబర్ 17, 2006

నా నెల్లూరు పర్యటన -1

నెల్లూరు రైలు ప్రయాణం ప్రశాంతి నుంచి e-mail 'దళారి పశ్చాత్తాపం' పుస్తకంపై seminar ఉన్నది - నెల్లూరు రావాలని. పెరుగు రామక్రిష్ణ గారి కవితా సంకలనం ఫ్లెమింగొ - విడిది పక్షుల దీర్ఘ కవిత సమీక్ష చేస్తూ ఉన్నాను. నెల్లూరు దగ్గరే నేలపట్టు ఉన్నది కావున అక్కడికి వెళ్ళి కొన్ని ఛాయా చిత్రాలు కూడ తీయాలని సంకల్పించాను. నేను వస్తున్నట్లు ప్రశాంతి కి కబురు పెట్టాను. 13 అక్టొబర్ 2006 రాత్రి సింహపురి ఎక్స్‌ప్రెస్ లో సికందరాబాద్ నుంచి ప్రయాణం. నేను స్టేషన్ కు వెళ్ళేసరికే ప్రశాంతి, ప్రశాంతి తండ్రిగారు రామప్రసాద్ నా కోసం నిరీక్షిస్తూ కనిపించారు. నేను వచ్చాను కనుక అప్పటిదాక ప్రశాంతి కి తోడుండిన రామప్రసాద్ గారు మాకు వీడ్కోలు చెప్పి వెళ్ళారు. ప్రశాంతి గురించి తెలియని వారి కోసం ఆమె గురించి నాలుగు మాటలు చెప్తాను. ప్రశాంతి M.Sc Computer Science చదివి Technical Writer గా ఒక MNC లో పనిచెస్తున్నారు. దయార్దహ్రుదయురాలు. To Make A Difference, Yahoo group ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. http://groups.yahoo.com/group/tomakeadifference/ 'దళారి పశ్చాత్తాపం’ పుస్తకం చదివి అందులోని భావాలు మిగతా వారికి కూడ అంద చేయాలనే తలంపుతో పలు సంస్థలు, మిత్రులకు TOMAD Group తరఫున ఈ పుస్తకాన్ని ఉచితంగా అంద చేసారు. నెల్లూరు జిల్లా రచయితల సంఘం తరఫున ఈ పుస్తకంపై గోష్టి కార్యక్రమానికి వారే నడుం కట్టారు. అనారోగ్యంతో ఉన్న ఒక తోటి ప్రయాణీకురాలకు వీడ్కోలు చెప్పటానికై స్టేషనకు వచ్చిన వారిలో ప్రశాంతి నెల్లూరు మిత్రులు కూడా ఉండటం కాకతాళీయం. సుమారు 62 సంవత్సరములున్న వీరు తీవ్ర అనారోగ్యాన్ని కూడ లెక్క చేయకుండా సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా క్రమం తప్పకుండా సెన్సార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సభ్యురాలిగా తనకున్న సౌకర్యాలు, ఒక మహిళా సభ్యురాలిగా సినిమా సెన్సారింగ్ లో గల సాధక బాధకాలు ఎంతో వివరంగా మాకు చెప్పారు. తాను ఇటీవల చూసిన ఒక చిత్రంలో బెడ్ రూం దృశ్యాలు, ఆ వెనువెంటనే బాత్ రూం దృశ్యాలు తనను ఎలా కలవరపెట్టాయో చెప్పారు. వ్యాపార దృక్పధంతో స్త్రీని నగ్నంగా చూపటానికి నిర్మాతల ఆరాటం, సెన్సార్ సర్తిఫికేట్ కోసమై సెన్సార్ బోర్డ్ సభ్యులను ప్రలోభపెట్టడానికి నిర్మాతల ప్రయత్నాలు వివరించారు. ఆ ఉద్యొగం కత్తి మీద సాము లాంటిదన్నారు. వారు ప్రస్తుతము ఇంకా సెన్సారు బోర్డ్ సభ్యులుగా ఉన్నారు కావున వారి పేరు వెళ్ళడించటము భావ్యము కాదు కనుక చెప్పటం లేదు. వీరికి తీరిక సమయం ఎక్కువ. హింది బాషలో మంచి పట్టు ఉంది కనుక మైథిలి శరణ్ గుప్త్ ‘సాకేత్’ (రామాయణంలో తక్కువ పాత్ర వున్న ఊర్మిళ పై రాసిన పద్య మాలిక ) , జయశంకర ప్రసాద్ పద్యకావ్యం, కామాయని ( మానవజాతి భావొద్వేగాలు, ఆలోచనలు, క్రియలను పౌరాణిక పాత్రల ద్వార ఇందులో ఆవిష్కరించారు), ప్రేమచంద్ గబన్ - The Stolen Jewels లాంటి కళాఖండాలను తెలుగులోకి అనువదించమన్న నా సలహాకు ఆమె ఆమోదాన్ని తెలిపారు. నెల్లూరులో వీరికి వీడ్కోలు చెప్పాక, నెల్లూరు స్టేషన్లో ప్రశాంతి మేనమామ శాయిక్రిష్ణ మాకు ఆహ్వానం పలికారు. .వారింటికి రమ్మన్న ఆహ్వానం ఉన్నప్పటికీ, రామక్రిష్ణ గారితో అనేక విషయాలు చర్చింపవలసిన ఆవశ్యకత వలన, నేను, ప్రశాంతి, రామక్రిష్ణ గారింటికే వెళ్ళాలని నిర్ణయించాము.

మంగళవారం, అక్టోబర్ 10, 2006

తెలుగు బ్లాగరుల సమావేశం అక్టోబర్ ‘06




Photo by cbrao ఎడమనుంచి కుడికి శ్రిహర్ష, శ్రీనివాసరాజు, చదువరి.

అక్టొబర్ నెల 8వ తారీకు సాయంత్రం వెంగళరావు నగర్ హంగ్రీజాక్స్ బేకరి వద్ద వీవెన్, చదువరి నాకోసం నిరీక్షిస్తూ కనిపించారు. వారిద్దరితొ బాటు ఒక నూతన వ్యక్తి కనిపించారు. ఎవరబ్బా అని అలోచిస్తుంటే వీవెన్ పరిచయం చేశారు త్రివిక్రం అని. త్రివిక్రం బ్లాగుపై నేను సమీక్ష రాసి ఉన్నాను. (చూడండి - https://paradarsi.wordpress.com). ఊహలకు భిన్నంగా త్రివిక్రం త్రివిక్రముడంతటివాడు కాడు, అట్లని వామనుడు కాదు. ఆలోచనలో, రాయటంలో పెద్ద కాని త్రివిక్రం ఉండటానికి మధ్యస్తంగా ఉన్నారు. మితభాషి.

ఇంతలో శ్రినివాస రాజు వచ్చారు. వీరి బ్లాగులు http://dsrinivasaraju.blogspot.com
http://harivillu.blogspot.com/index.html హరివిల్లు బ్లాగు బానర్ design స్వయంగా అందంగా చేశారు. స్వస్థలం విశాఖపట్టణం ఉద్యొగం హైదరాబాద్‌లో. శ్రినివాస రాజు ‘అందాల రాముడు’ అని, చూసే వారి feeling.




Photo by cbrao ఎడమనుంచి కుడికి సి.బి.రావు, వీవెన్, త్రివిక్రం.


వీవెన్ గురించిన పరిచయం Telugu Lover’s Meet on 24-09-‘06 http://deeptidhaara.blogspot.com లో రాసి ఉన్నాను. cbrao పరిచయంకూడ ఇదే వ్యాసంలో రాశాను. చదువరి ఊహించిన దానికన్నా స్ఫురద్రూపి. వీరి బ్లాగు http://chaduvari.blogspot.com/index.html
వీరి అసలు పేరు తుమ్మల శిరిష్ కుమార్. sirishtummala@gmail.com ఒక Software సంస్థలో యాజమాన్య బాధ్యతలో ఉన్నారు. తెలుగు బ్లాగరులు 'ఆకలి తొడేళ్ల బేకరి ' కి 0 నుంచి 3 కిలొమేటర్ల దూరంలో ఉంటే శిరిష్ ఒక్కరూ దూరంగా వివేకానందనగర్ కాలనిలో నివాసం. తెలుగు వికిపిడియ కార్యక్రమాల్లొ చురుగ్గా ఉంటారు. మిగతావారిని ప్రోత్సాహిస్తారు. వీరి స్వగ్రామం గుంటూరు జిల్లాలోని కావూరు.

సరే, కోరం ఉంది కదా! ఇక కార్యోన్ముఖులవుదామని వెంగళరావు నగర్ తోటకు వెళ్తే, అది తాళము వేసివుండుట వలన సిద్ధార్థ నగర్ తోటకు, చదువరి చతుష్చక్ర వాహనములో వెళ్లాము. ఇష్టా - గోష్టికి అనువైన బల్లలుపై కూర్చొనడమే తరువాయి, హర్ష నుంచి cell phone call వచ్చింది- హర్ష కొద్దిగా ఆలస్యం అవటంతో మమ్మల్ని miss అయ్యారు. ఎక్కడున్నారంటూ? అన్న ప్రశ్నకు వివరంగా బదులిచ్చి మేమున్న park కు రావటానికి కావలిసిన సూచనలిచ్చాను. అతను మన తెలుగుబ్లాగులో నూతన సభ్యుడట. ఇంతవరకూ ఎలంటి mails మన గుంపుకు పంపకపోవటంతో అతను అందరికీ కొత్తే. నేను రచ్చబండ లో రాసిన mails చూసి మన తెలుగుబ్లాగ్ గుంపు లో చేరినట్లుగా చెప్పారు. ఆశ్చర్యం ఏమంటే శ్రిహర్ష గుంపుకు కొత్త కాని కూడలికికి కాదు. శ్రిహర్ష బ్లాగు మీరు చూసే ఉంటారు. http://kinnerasani.blogspot.com/
హర్ష తీసిన ఈ చాయా చిత్రం చూడండి.




ఇందులో focal point నడిచే వ్యక్తి. స్థిర చిత్రంలో కూడా చలనం కనిపిస్తోంది. మంచి composition. harsha.pvss@gmail.com


మన బ్లాగర్ల సమావేశంలో ఎప్పుడూ నూతనంగా సమావేశంకు వచ్చినవారికి ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వటం అలవాటు. ఈ విధానంలో పరస్పర అవగాహనకు అవకాశం ఉంటుంది. ఈ నివేదికలో హర్షగురించి ఇంత రాయటానికి ఇదే కారణం. హర్ష స్నేహితుడు గ్రిద్దలూరు విజయకృష్ణ, గూగుల్, ఉత్తర అమెరికా లో పనిచేస్తున్నారు. చర్చ యునికోడ్‌పైన గూగుల్ అన్వేషణ
పైన మరలటంలో ఆశ్చర్యం లేదు. పలు పత్రికలు, కొన్ని తెలుగు వెబ్‌సైట్లు యునికోడ్‌ లో కాక ఇతర fonts వాడటం వలన పలు అంశాలు గూగుల్ అన్వేషణ లో రాలేక పోతున్నాయి.
తెలుగులో ఇంత సమాచారం లభ్యం అవుతున్నప్పుడు గూడా, అన్వేషణకు అందకపొవటమనే విచిత్ర పరిస్థిలో ఉన్నాం మనం. ఈ సందర్భంలో నాకు Samuel Taylor Coleridge రాసిన The Rime of the Ancient Mariner లోని కవిత గుర్తుకొచ్చింది.
"Water, water, everywhere,
And all the boards did shrink;
Water, water, everywhere,
Nor any drop to drink."

పడవ నడిసంద్రంలో నిలువడినప్పుడు ఒక నావికుని మనస్పందన, కాలరిడ్జ్ ఎంత చక్కగా చెప్పారో; సమాచార వెల్లువలో కొట్టుకపోతున్న మనకు ఈ సమాచార లేమి, నావికునికి మనకూ ఉన్న దగ్గర సామీప్యాన్ని చెప్పకనే చెప్తుంది. ఈ సందర్భంలో ఎంతో ముందుచూపుతో Unicode వ్యాప్తికై చావా కిరణ్ చేసిన, చేస్తున్న కృషిని అందరమూ అభినందించాము.

ఇష్టా గోష్టిలో పలు అంశాలు మా దృష్టిలోకి వచ్చాయి. http://www.archive.org/details/millionbooks
లో 2248 తెలుగు పుస్తకాలు లభ్యమౌతున్నాయి, ఉచితంగా. చూడండి. http://tinyurl.com/owpsz
పుస్తకాలకు www.amazon.com పెట్టింది పేరు. తెలుగులో కూడా అమజాన్ లాంటిది ఉంది తెలుసా? చూడండి - http://www.avkf.org ఇక్కడ ఎన్నో తెలుగు పుస్తకాల సమీక్షలు కూడా ఉన్నాయి. మీ అభిమాన రచయితల పుస్తకాలకై ఇక్కడ order చేసే సదుపాయం ఉంది. పుస్తక సమీక్షలన్నీ image .jpg లో వుండటం వలన search కి దొరకవు. అన్వేషణకి Unicode తప్పనిసరి అని మీకు తెలుసు. హర్ష ఈ avkf వారిని కలిసి Unicode గురించి చెపితే, వారు ఆసక్తి కనిపించారని చెప్పారు. మరి మనం ready యా?
http://eemaata.com/em ఈ-మాట electronic bi-monthly చూసారా? ఇది తెలుగులోని ఏకైక Unicode పత్రిక. తెలుగు బ్లాగరుల తరపున ఈ-మాట వారికి అభినందనలు తెలుపుదామా?
Unicodeలో లేని తెలుగు వెబ్సైట్లు, మాసపత్రికల విషయమై ఏమి చేద్దాము?

హర్ష ఆగమననికి ముందు చదువరి, సి.బి.రావు మధ్య తెలంగాణ విషయమై లఘు చర్చ జరిగింది. కొద్దిరొజులైనా తెలంగాణా ని పక్కకు పెట్టి వెరే విషయంపై చదువరి బ్లాగురాయటం అనే సక్రియ (మంచి పని) అభినందనలు అందుకొన్నాక సి.బి.రావు చర్చను కొనసాగిస్తూ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలనుట తప్పు. అసలు బాష ప్రాతిపదికపై రాష్ట్రం కావాలనుట ఒక చారిత్రాత్మక తప్పు. దేశము పరిపాలనా సౌలభ్యానికై, మాత్రమే విభజింపబడాలని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఈ నదీ జలాల పంపిణి గొడవలు, రాష్ట్రాల మధ్య సరిహద్దు తగాదాలు ఉండవన్నారు.

అసలు నాకైతే మానవజాతి విశ్వాన్ని, ఇట్లా దేశాలుగా విభజించుకొవటమే ఈ సరిహద్దు తగాదాలు, యుద్ధాలకు మూలకారణమనిపిస్తుంది. ఈ స్వార్థ పూరిత అభిమానాలు వదిలేసి , ఎప్పుడైతే మనం విశ్వ మానవులం అవుతామో అప్పుడే మనకు నిజమైన శాంతి దొరుకుతుందనే గట్టి భావన ఉంది. ఈ విశ్వశాంతి ఎప్పుడు సాధ్యపడేను?

సాయంత్రపు చీకటి మెల్ల మెల్లగా విస్తరిస్తూంది. చర్చలో పడితే పొద్దే తెలియదు. ఎంతటి మంచి విషయాలకైనా ముగింపు తప్పదు కదా! మరల వచ్చే నెల కలుద్దామంటూ, ఆనంద హ్రుదయాలతో - సమావేశం కంచికి -మనమింటికి.

శనివారం, అక్టోబర్ 07, 2006

పర్యావరణ సమతుల్యం : పక్షులు


Photo by cbrao

ప్రకృతిని, అందులోని జీవజాలాన్ని రక్షించడం ఎలా, ఏం చెయ్యాలి ? అంటే, వాటి జోలికెళ్ళక పోవటమే సరైన చర్య అంటే కొంత ఆశ్చర్యం కలుగక మానదు. వాస్తవం ఏమంటే, మనిషి తన స్వార్థానికై, అడవులను, కలప మరియు ఖనిజాలకై ఆక్రమించటంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతిని వృక్ష, జంతుజాలాల మనుగడకు తీరని విఘాతం కలుగుతుంది.


Jerdons Courser

ఉదాహరణకు కలివికోడి పక్షిసంగతి మాట్లాడు కొందాం. T.C. Jerdon అనే British Surgeon కడపజిల్లాలో కనుగొన్న ఈ పక్షి, ఈ మధ్య వార్తల లోకి వొచ్చింది . కనుమరుగైందనుకున్న కలివికోడిని, భరత్ భూషణి అనే పక్షి శాస్త్రజ్ఞుడు 86 ఏళ్ళ తరువాత మళ్ళ కనుక్కొవడం జరిగింది. బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ , Bird watchers Society of A.P. మరియు Department of Forest వారి కృషితో శ్రీలంకా మల్లేశ్వరం అభయారణ్యం ఏర్పడింది. అక్టోబరు 2005న తెలుగు గంగ కాలువపనులు ఈ అభయారణ్యం గుండా జరుపటానికి జరుగుతున్న ప్రయత్నాలు, భరత్ భూషణ్ గుర్తించి , సంబంధిత అటవీఅధికారులను సకాలంలో హెచ్చరించంటతో, కాలువనిర్మాణపనులను అటవీఅధికారులు ఆపివేసి, కలివికోడి ఆవాసాన్ని రక్షించారు. BNHS, BSAP, WWF ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చించి, కాలువ గతిని మార్చేప్రయత్నంలో కృతకృత్యులైనారు. మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు పక్షికేంద్రాన్ని దర్శిస్తే మనకు అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. BSAP సభ్యుడు మృత్యుంజయ రావు ఈ కేంద్రం అభివృద్ధికి చాలా కృషిచేసినారు. పక్షులను గ్రామస్తులు ఉపయోగ కరమైనవిగా గుర్తించటం వెనుక వీరి కృషి ఉంది. తొలుత పక్షులు రెట్టలు వేసి, చెరువు నీటిని పాడుచెయ్యడం వలన ఆ నీరు త్రాగడానికి పనికి రాకుండా పోయింది. స్నానం చేస్తే ఒళ్ళు దురదలు. గ్రామస్తులు కోపంతో, పక్షులకు ఆశ్రయమిస్తున్న చెరువులోని కొన్ని చెట్లను కొట్టివేసారు. దీనితో వలస పక్షులకు ఆవాసం కరువైంది. సంబంధిత అధికారులను కలసి, పక్షి కేంద్రం ఏర్పాటు అవసరాన్ని వివరించాక, ఇక్కడ పక్షి కేంద్రం స్థాపించారు. కాపలాదారునికూడా నియమించటం జరిగింది. పక్షులు వేసిన రెట్టలతో , సారవంతమైన నీరు , నేడు వ్యవసాయానికి ఉపయోగించి ఎక్కువ దిగుబడి పొందగలుగుతున్నారు రైతులు. సంబంధిత అధికారులు గ్రామస్తుల దైనందిక అవసరాలకు నీటి పంపిణి చెయ్యటంతో, పక్షుల మరియు గ్రామీణుల మధ్య ఘర్షణ తొలిగింది. ఇప్పుడు ఒకరికి ఒకరు మిత్రులైనారు.
ఒక ప్రదేశం యొక్క పరిసరాల స్వచ్ఛతను అక్కడి గాలి, నీరు మరియు అక్కడి జీవజాల పరిస్థితులను చూసి తెలుసుకోవచ్చు. కొంత కాలం క్రితం రసాయనాల రాకతో కలుషితమైన హుస్సేన్ సాగర్లో, చేపలు చనిపోవటం గమనించటం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంవారు సాగరజలాలను శుద్థి చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది మెచ్చుకోదగ్గ పరిణామం.

కొల్లేరు సరస్సులో మితిమీరిన ఆక్రమణల వలన, సరస్సు వైశాల్యం కుంచించుకుపోయి, 2005లో ఏలూరు తదితర ప్రాంతాలలో వరదలు వచ్చి, పంటపొలాలకు తీవ్రనష్టం కలిగింది. వలస పక్షులు సరైన వసతి, ఆహారం లేక ఈ సరస్సు నుంచి వేరే ప్రాంతాలను ఎంచుకొంటున్న తరుణంలో కొల్లేరు పునరుద్ధరుణ పనులు, ప్రకృతి సమతుల్యానికి ఎంతో ప్రాణమై నిలుస్తాయి. ప్రకృతిని ప్రేమించండి. పర్యావరణాన్ని కాలుష్యం భారినుండి కాపాడండి. ప్రకృతి పచ్చగా ఉన్నంతకాలం, మానవుడి మనుగడకి ఢోకాలేదు.
మీవంతు కృషిగా Bird watchers society of Andhra Pradesh, World Wildlife Fund వంటి సంస్థలలో సభ్యులుగా చేరి, ప్రకృతి సమతుల్య పరిరక్షణలో చేయూత నివ్వండి.
- - 25th July 2006 న ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం, ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్రసారమయ్యింది.

మంగళవారం, అక్టోబర్ 03, 2006

సామాజిక సేవ

మానవ సేవ మాధవ సేవ అని మీరు నమ్ముతారా? సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకునే ఆసక్తి ఉందా? అయితే ఈ గుంపులో సభ్యులు కావచ్చు.

http://groups.yahoo.com/group/tomakeadifference

సోమవారం, అక్టోబర్ 02, 2006

Telugu Lover’s Meet on 24-09-‘06

Kum. Lakshmi Prasanthi Uppalapati (known for her Dokku face4-http://geocities.com/dokkuface4/) an active member of Telugu Brains and MAD (To Make a difference Yahoo group) is a kind hearted lady. She is sympathetic to issues like child abuse, atrocities on woman and ambitious to help people, who need help. Recently, she conducted a Telugu lover’s meet at Ameerpet, Hyderabad, about which Sowmya wrote at http://www.telugupeople.com/discussion/MultiPageArticle.asp?id=45762&page=1

Allow me to present my account of the event.
The meeting was scheduled at 3 p.m. at Dr Sundar Raj’s clinic almost next to Sri Krishna Sweets. Dr Sundar is busy treating patients for diabetes etc ailments, in Ayurveda way. In Hyderabad you will see many medical shops attached to clinics. The difference here is a doctor almost attached to a sweet shop. Many enthusiastic Telugu lovers started pouring in to the clinic even before appointed time. The meeting started with introductions, as participants there belong to different groups like Telugupeople, Telugu Brains, Telugu blog and MAD people and didn’t know each other.

The meeting lasted for more than 3 hours. The entire atmosphere is charged with dynamic electricity and never there was a dull moment. The following members are present.

1) Phanindra
2) Hanokh Babu
3) Praveen
4) Siva Mangesh
5) Srinivas.Datla
6) Kashyap
7) Cbrao
8) Veeven
9 & 10) Chava Kiran & his friend
11) Lakshmi Prasanthi Uppalapati
12) Naresh
13) Dr.Sundar raj Perumal
14) Kavita
15) Suseela
16) Chandra Lakshmi
17) Sowmya
18) Poolavana Ravikiran
19) Swathi Ravikiran


Prasanthi: She started the deliberations; nay, introductions.

Phanindra is a very good singer and he adores Sirivennela Sitarama Sastry. He can speak hours on the lyrics of Sirivennela. He is in software development (DSP Engr) and works for a firm.

Hanok Babu: He is a native of Nellore. He is a good flute player. He is learning Piano as well. Alas he didn’t bring his flute to the meeting on that day. Better luck, next time.

Praveen: He is in software development and writes to telugupeople.com

Siva Mangesh: He works for a financial data firm and had his blogs. He is a member of Telugublog. http://sivamangesh.wordpress.com 
http://teluguvaramandi.wordpress.com

Srinivasaraju datla He is a good looking guy, soft in nature and in software development.
He maintains a blog at http://dsrinivasaraju.blogspot.com/

KASYAP P: He is in software development. ‘ గుంపులో గోవిందయ్య ’ - గా టీపీ లో పిలవబడు కశ్యప్‌ గారి హాస్య చతురత తో అందరినీ నవ్వించారు. He is a regular contributor to www.telugupeople.com

Cbrao: He is fond of reviewing Telugu blogs and ambitious to bring popularity to Telugu blogs. His blog reviews are published in several Telugu groups. He introduced late Sanjivadev (http://tinyurl.com/jl4j8) who was an artiste, art critic, philosopher and writer of several books in English and Telugu on various topics, to the audience. More info about him at
http://groups.yahoo.com/group/biosymphony/
http://deeptidhaara.blogspot.com/
http://paradarsi.wordpress.com/

Veeven: He is known for Lekhini, which renders good Telugu transliteration. Most Telugu bloggers use this software for writing their blogs. He is also a Wikipedian and writes to Wikipedia, Telugu encyclopedia. Contrary to expectations he is very simple in nature and great for the contribution of popularity of Telugu blogs. Recently he developed Nikhile which transliterates Telugu to RTS. He talks less and works more in the background. His website Koodali, an amalgamation of all Telugu weblogs is popular among bloggers.
http://veeven.com/
It has links to his other websites
లేఖిని | కూడలి | శోధిని | 3D Logos
http://veeven.wordpress.com/

Chava Kiran’s friend: Details about Kiran’s friend are not available. Both appear to be colleagues in the same software firm, where they are working.

Chava Kiran: Sharp, reacts quickly to a problem and helpful in attitude. He did yeoman service for the promotion of Telugu on net and a pioneer in Telugu blogs. He works in a MNC as a software developer. Contribution to Wiki: Kiran is one of the seven moderators and is an active participant in Wikipedia. His total edits in Wiki are 919. He is a staunch promoter of Telugu Unicode. He moderates http://groups.google.com/group/telugublog
Kiran's Blog: http://oremuna.com/blog

Lakshmi Prasanthi Uppalapati: She is a native of Nellore and a good samaritan. Fond of the book ‘దళారి పశ్చాత్తాపం’ ‘Confessions of an Economic Hit Man’ written by John Perkins and arranges seminar to discuss the contents of this book. She is organizing a seminar on this book in Nellore on Oct 15, 4 pm to 7 pm. All book-lovers can attend this meet. She is on the look-out for volunteers for social service activities, for which she has several ideas. She writes good modern songs and reads them to her friends.
http://geocities.com/dokkuface4
prasanthi.uppalapati@gmail.com

Naresh: He is a neighbour of Dr. Sundar Raj. Though he says that he didn't read much, he knows many things. He is a good reader and good singer as well. He can sing old Hindi songs very well. He remembers the lyrics too.

Dr.Sundar raj Perumal: He is knowledgeable in Sanskrit, Ayurveda and Yoga. He conducts Yoga classes everyday in the morning at his clinic, free of charge. He entertained the audience with jokes in Sanskrit language. Though most participants do not know Sanskrit, most of us enjoyed because of his good rendition of Sanskrit coupled with good performance. We had a hearty laugh. Dr. Sundar Raj - 93924-91036.


Dr. Kavita: Friend of Dr.Sunder Raj

Suseela: Sister of Dr.Sunder Raj. She served fruit salad to all the participants.

Chandra Lakshmi: She is a doctor working in the clinic of Dr.Sundar Raj.

Sowmya: Bubbly and friendly in nature. A Tamilian who writes book reviews in Telugu language and a student of IIIT, in Hyderabad. It is needless to say that she loves to read books. Know more about her at http://www.bitingsparrow.com/biosymphony/Sowmyablogreview.pdf
Sowmya’s blog at http://vbsowmya.wordpress.com/
She participated actively in the discussions. She wrote F.I.R. about this meet at http://www.telugupeople.com/discussion/MultiPageArticle.asp?id=45762&page=1 She is a regular contributor to www.telugupeople.com. Recently she joined as a member of Telugublog.

Kotta Ravikiran: He is more popular as Poolavana Ravikiran. He always wonders at the beauty of Telugu script, different fonts and language. He is a lover of Telugu literature and nature. He likes trekking in the hills and drenching himself in the wild rain. He is a book lover and likes Osho philosophy. He works in an animation studio and naturally likes a work that is creative. To know more about him visit his website at http://www.poolavana.com/

Swathi Ravikiran: She is wife of Kotta Ravikiran and mother of Neha. She is a post graduate in management and at present using all her skills in managing house and Ravikiran.

As I wrote earlier, participants are not familiar with each other. Most of the time was spent in introductions. Prasanthi informed the gathering about the availability of funds/sources and invited volunteers to join her social service activities. The entire meeting went on with full of jokes on poems/poets and other topics. The meeting brought few lovers of Telugu to a common platform. Let us all wish that it is a beginning for a much more meaningful meetings in future.