శుక్రవారం, డిసెంబర్ 29, 2006

తెలుగు పరిమళ వ్యాప్తి



గత అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయం -సాకారం దాల్చిందని తెలియ చెప్పటానికి సంతోషిస్తున్నాను. తెలుగు పరిమళ వ్యాప్తి కై, మొదట 1000 పుస్తకాలు వేద్దామనుకున్నపటికీ, ఎక్కువమందికి ఈ సమాచారం అందిచాలన్న ఉద్దేశ్యంతో, అంచనా వ్యయం పెరిగినా, 2000 కాపీలు ముద్రించాలని మలి నిర్ణయం తీసుకున్నాము. తెలుగు వారి సమావేశాల్లో ఉచితంగా పంచిపెట్టే ఈ పుస్తకాలలో ఈ అంశాలు ఉన్నాయి.

1. వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
2. తెలుగు బ్లాగు
3. కంప్యూటరుకు తెలుగు నేర్పడమెలా?

ఈ పుస్తకం ఎలా వుందో చూడాలనే కుతూహలం మీలో ఉండటం సహజం. మీ కోసం ఈ పుస్తకం ఈ కింద ఇవ్వబడిన లింక్ లో లభ్యం అవుతుంది. ఈ అపరూప కానుకను అందుకోండి.

http://www.bitingsparrow.com/biosymphony/computerlo_telugu.pdf

ఈ పుస్తకం మీరు కూడా ముద్రించి మీ మీ పట్టణాల్లో జరిగే తెలుగు వారి సభలలో పంచి పెట్టి తెలుగు పరిమళ వ్యాప్తి చెయ్యండి. ఈ పుస్తకం పై మీ అభిప్రాయాలు రాయండి. వ్యాసాల అభివృద్ధి కి మీ సలహాలు తదుపరి ముద్రణలో స్వీకరించబడగలవు.

గురువారం, డిసెంబర్ 28, 2006

పొద్దు - పొడిచింది

Poddu

పొద్దు (http://poddu.net) - కొత్త ప్రయోగం బాగుంది. మొదటి సారి చక్కగా చదివిస్తుంది. జబ్బ పుష్టి ఉన్న సంపాదకీయాలు, వ్యాసాలు మనల్ని అలరిస్తాయి. రెండవసారి చదువుదామంటే ఇది ఎప్పుడు, ఎలా పొడుస్తోందో తెలియరాదు. Update అయిన అంశాలకు మన తెలుగు బ్లాగ్ గుంపులో సందేశం ఉండదు. ఏ అంశం ఎప్పుడు మారుతుందో తెలుసుకోవటానికి పరిశోధన చెయ్యాలి. ఏ వ్యాసం ఎవరు రాశారో (ఉదాహరణకు కబుర్లు) అని కూడా భవిష్యత్లో చరిత్రకారులు పరిశోధన చెయ్యటానికి మంచి అంశం అందించారు సంపాదకులు. ఆ వ్యాస రచయిత ఎవరు, ఆ పత్రిక సంపాదకులు ఎవరు అనే అంశం పై భవిష్యత్లో ఎవరైన పరిశోధించి డాక్టరేట్ సంపాదించే అవకాశం ఉంది. కవయిత్రి మొల్ల మా జిల్లా మనిషని నెల్లూరు వారంటుంటే కాదు మా జిల్లా అని కడప వారు వాదించుకునేలా ఈ పత్రిక యాజమాన్యం గురించి చక్కటి చర్చ రచ్చబండలో రా వొచ్చు. సూచనలు - పొద్దు -1, పొద్దు -2, పొద్దు -3 , పొద్దు -4 అంటూ ఇలా సంచికలుగా వస్తే పాఠకులు తాము ఏది చదివామో, చదవలేదో సులభంగా గుర్తు పెట్టుకుంటారు. సంచిక కూ సంచికకూ మధ్య ఎడమును పొద్దు సంపాదకులు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కొత్త సంచిక వెలువడ్డాక తెలుగుబ్లాగ్ గుంపుకు సందేశం పంపాలి. రచనల చివర రచయిత పేరు ఇవ్వటం సత్సాంప్రదాయం. పొద్దు సంపాదకులు, యాజమాన్యం గురించి పత్రిక లో రాయాలి. గోప్యంగా ఉంచటంలో ఏ ప్రయోజనం ఉందో అంతుపట్టడం లేదు.

గురువారం, డిసెంబర్ 21, 2006

హైదరాబాదు తెలుగు బ్లాగరుల ప్రత్యేక సమావేశం

Muralidhar & Veeven
Muralidhar and Veeven

Dec 10 న తెలుగు బ్లాగరుల సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను సభ్యులకు వివరించటానికై Dec 17న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ్యులకు వివరించటం జరిగింది. తెలుగు బ్లాగరుల సంఘం ఎందుకు, ఎలా, ఎప్పుడు అనే ప్రశ్నలకు వివరణ ఇవ్వటం జరిగింది. హైదరబాదు లోని తెలుగు ప్రేమికుల కార్యక్రమాలు మీకు ఆసక్తికరంగా ఉండవచ్చని తోచి ఆ విశేషాలు మీ ముందు ఉంచుతున్నాను.
Text:cbrao Photos: cbrao

తెలుగు బ్లాగరుల* తరపున ఒక కరదీపికను , అత్యుత్తమ బ్లాగుటపాలను ప్రచురించాలని ఈ నెల పదవ తేదీన జరిగిన బ్లాగరుల సమావేశంలో నిర్ణయించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. రావుగారు ఆ పుస్తకాల ముద్రణ కయ్యే ఖర్చులు, పుస్తకపంపిణీలో ఎదురయ్యే సాధకబాధకాలు , తదితర విషయాలను వివరించడానికి తన ఇంట్లో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ హేతువాది , ప్రచురణారంగంలో 3 దశాబ్దాల అనుభవం ఉన్న మురళీధర్ ఈ వివరాలనందించడానికి ఈ సమావేశానికి వచ్చారు . ఈ సమావేశం నిన్న ఉదయాన్నే ఖరారు కావడం వల్ల ముందుగా తెలుపడానికి వీలు లేకపోయింది . అయినా సమాచారాన్ని అందుకున్న చదువరి , వీవెన్ , సుధాకర్, నేను కాస్త ముందూ వెనుకగా ఆ సమావేశానికి హాజరయ్యాం.

Sudhakr & Veeven
Sudhakar and Veeven

1. ఎలాంటి రంగులు, హంగులు లేకుండా 16 పేజీల కరదీపికను పిన్నింగ్ పద్ధతిలో 1000 కాపీలు ముద్రించడానికి 4500 అవుతుందని మురళీధర్ తెలిపారు. హైదరాబాదు తెలుగు బ్లాగరు*లైన చదువరి, చావా కిరణ్, త్రివిక్రమ్ , సుధాకర్ , సిబిరావు, కశ్యప్, శ్రీహర్ష, యు .వి .రమణ, వీవెన్ లు ఈ ఖర్చును భరిస్తారు.

దీన్ని వీలైనన్ని కాపీలు ముద్రించి ఉచితంగా పంపిణీ చెయ్యాలని ఆలోచన. ఈ పుస్తకాన్ని ఎవరైనా తమకు వీలైనన్ని కాపీలు ముద్రించి ఉచితంగా పంచదలచుకుంటే నిరభ్యంతరంగా పంచవచ్చని , దానికి ఎలాంటి ముందస్తు అనుమతీ అక్ఖర్లేదని పుస్తకంలో మనమాటగా పేర్కొంటాం . అలాగే ఆ పుస్తకం చూసినవారెవరికైనా మన కార్యకలాపాలు నచ్చి తెలుగుబ్లాగరులకు విరాళాల ద్వారాగానీ , ఇతరత్రాగానీ సహకారమందించదలిస్తే తమ వివరాలను తెలుపవలసిందని, బ్లాగరుల సంఘం ఏర్పాటయ్యాక మేమే సంప్రదించగలమని ఆ కరదీపికలో పేర్కొంటాం . ఈ వివరాలను మనలో ఒకరు తమ దగ్గర సేకరించి పెట్టుకోవాలి. వారి చిరునామా , ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఆ కరదీపికలో పేర్కొంటాం.

మొదటి ప్రయత్నంగా ఆ కరదీపికను డిసెంబరు 31-జనవరి 1 తేదీల్లో హైదరాబాదులో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పంపిణీ చెయ్యదలిచాం . నిర్వాహకులు అనుమతిస్తే సభాప్రాంగణంలో ఒక బ్యానరును , ఒక కియోస్క్ లో ఒకటి -రెండు ల్యాప్ -టాప్ ల ద్వారా కంప్యూటరుకు తెలుగు నేర్పడం , ఇంటర్నెట్ లో తెలుగు వెలుగుల గురించి ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది . (తాజా సమాచారం: నిన్న (సోమవారం) సాయంత్రం నేను శాయి గారిని అడిగి కనుక్కున్నాను. పుస్తకాన్ని పంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ బ్యానర్లు, కియోస్కులను మాత్రం అనుమతించరని తెలిపారు.)



2. ఇక 120 పేజీల పుస్తకాన్ని ముద్రించడానికి కనీసం 25,000 ఖర్చవుతుందని మురళీధర్ తెలిపారు. మురళీధర్, వీవెన్, చదువరి వెళ్ళిపోయిన తర్వాత రావుగారు బ్లాగరుల సంఘం ఆవశ్యకతను గురించి చాలా విపులంగా మాట్లాడారు. దీనికి అందరూ సుముఖంగానే ఉన్నందున ఇక కార్యాచరణలోకి దిగడమే తరువాయి.

*బ్లాగరులంటే బ్లాగరులు మరియు వికీపీడియనులు అని అర్థం చేసుకోగలరు.

P.S. కంటెంటు:
కంప్యూటరుకు తెలుగు నేర్పడం ఎలా? ఈ వ్యాసాన్ని రమణ ఈ శనివారానికి పూర్తిచేస్తాడు.
వికీపీడియా గురించి చదువరి రాస్తారు.
బ్లాగుల గురించి: ఉన్న వ్యాసంలో అవసరమైన మార్పులు ఎవరైనా చేయవచ్చు.


Text: Trivikram

Trivikram, chaduvari
Trivikram and Chaduvari

date Dec 17, 2006 10:57 PM
subject నెట్లో తెలుగు -ఓ ఉచిత పుస్తకం
mailed-by gmail.com

sudhakar@gmail.com,
త్రివిక్రమ్ ,
cbraoin@gmail.com,
"Veeven (వీవెన్)" ,
kashyap.karthik@gmail.com,
harsha.pvss@gmail.com,
uvramana@gmail.com,
Kiran Kumar Chava

నెట్లో తెలుగు -ఓ ఉచిత పుస్తకం
డిసెంబరు 10 న జరిగిన బ్లాగరుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో నెట్లో తెలుగు గురించి ఓ చిన్న పుస్తకాన్ని ముద్రించి ఉచితంగా పంచాలనేది ఒకటి. (అత్యుత్తమ బ్లాగులు ఓ యాభయ్యో అరవయ్యో ఏరి ఓ పుస్తకంగా వేద్దామనుకున్నదీ ఇదీ వేరు వేరని గమనించగలరు) ఈ పని చేసేందుకు డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో త్యాగరాయ గానసభలో జరగనున్న ప్రపంచ తెలుగు సాహితీ సభల రూపంలో మనకో చక్కటి అవకాశం వచ్చింది. వంగూరి ఫౌండేషను ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభల్లో మనమనుకున్న ఈ పుస్తకాన్ని ఉచితంగా పంచితే బాగుంటుందని తలచాం.

దీని గురించి చర్చించేందుకు డిసెంబరు 17 ఆదివారాన, సీబీరావు గారి పనుపున ఆయన, వీవెన్, సుధాకర్, త్రివిక్రమ్, నేనూ రావుగారి ఇంటి దగ్గర కలిసాం. ఈ సభల నాటికి పుస్తకాన్ని ముద్రించి, ఉచితంగా పంచాలని నిర్ణయించాం. పుస్తకం 1/8 డెమ్మీ సైజులో, ఓ పదీ పన్నేండు పేజీలుండేలా, ఆర్భాటాలేమీ లేకుండా చేద్దామని కూడా నిర్ణయించాం. మొత్తం వెయ్యి ప్రతులు వేద్దామని అనుకున్నాం. పుస్తకంలో మూడు ముఖ్యమైన భాగాలుంటాయి.

1. కంప్యూటరుకు తెలుగు నేర్పడమెలా?
2. వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
3. బ్లాగు

అలాగే సభా నిర్వాహకులు ఒప్పుకుంటే సభా ప్రాంగణంలో లాపుటాపుల్తో ప్రదర్శన చెయ్యడం, బ్యానరు కట్టించడం వంటివి కూడా చేద్దామని అనుకున్నాం. పుస్తకం కోసం మనం ముఖ్యంగా చెయ్యవలసిన పనులు రెండున్నాయి:

1. పుస్తకానికి అవసరమైన కంటెంటును సమకూర్చడం. మనందరం పూనుకుని ఈ పని చెయ్యాలి. ఇప్పటికే కొంత విషయం http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81:%E0%B0%9A%E0%B0%A6%E0%B1%81%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF/%E0%B0%87%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B0%AA%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8612 పేజీలో రాసి ఉంది. దీన్ని మెరుగుపరచి గానీ, పూర్తిగా ఎత్తి రాసి గానీ మనమీ కంటెంటును తయారు చెయ్యవచ్చు.
2. ఇక రెండోది - డబ్బు. పుస్తకం ప్రచురించడానికి సుమారు 4,500 లోపు కావచ్చని అంచనా వేసాం. మన తొమ్మిది మందిమీ ఈ బాధ్యతను భుజాన వేసుకుంటే సరిపోతుందని అనుకున్నాం. తలా ఐదొందలు వేసుకుంటే పనయిపోద్ది. డబ్బును ఈ వచ్చే శుక్రవారం లోపు రావు గారికి అందజేస్తే సరిపోతుంది. ఖర్చులకు పోగా డబ్బు మిగిలితే ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచించవచ్చు.

రావుగారి స్నేహితుడు - మురళీధర్ గారు కూడా అక్కడకు వచ్చారు. ఆయన హేతువాది, ముద్రణా రంగంలో ఉన్నారు. ముద్రణ విషయమై ఆయన సలహాలు ఇచ్చారు. తానే ముద్రించి ఇస్తానని కూడా చెప్పారు.

మీమీ అభిప్రాయాలతో ఈ మెయిలుకు జవాబు - అందరికీ (Group) -పంపండి.

ఉంటాను.
Text: Chaduvari

Manav & Veeven
Manav , web architect from Ann Arbor(MI) and Veeven

సోమవారం, డిసెంబర్ 18, 2006

HSBC Hyderabad Bird Race

photo2
Participants registering at the end of birdrace

HSBC should be congratulated for supporting an event that spreads the joy of and popularises birding - through the Bird Races they sponsor. All the more as they have spread the Bird Race beyond Mumbai to several other Indian cities this year. The first such was held in Hyderabad on 26 November 2006 and was locally coordinated by the 26-year-old Birdwatcher's Society of Andhra Pradesh.
In all, ninteen teams participated in the dawn-to-dusk event, spotting 178 species. Being a fun event, the participants comprised of people from all walks of life and included 38 men, 26 women and 14 children. The youngest was six year old Jahnavi Kapadia. Several people, completely new to birding, read about it in the local media and telephoned to join the race. There was a team comprising entirely of women, all new to birding. They accompanied another car that had at least one experienced birdwatcher.
Prizes for three teams that chalked up the most number of species (110, 104 and 98) were given away by animal activist Amala Akkineni. She also awarded prizes for 'bird of the day', 'dip of the day' (a species that is conspicuous by its absence - given to a team that named the Tailor Bird), and youngest participant.
Amala, who heads Blue Cross, promised to work with BSAP for popularising birding among children. A sumptuous dinner culminated an eventful day.
Sunjoy Monga, who's brainchild the bird race is, deserves our thanks for bringing this joyous event to Hyderabad.

-Aasheesh Pittie


The news that the Birdwatcher’s Society for Andhra Pradesh (BSAP) was organising a Bird Race in Hyderabad drew quite a few puzzled frowns. “You guys are going to race pigeons?” we were asked, “or falcons?” BSAP members hastily disclaimed and explained: the racing would be done exclusively by humans.

The idea was simple: to form teams of four or five persons and try to see as many bird species as teams possibly could in twelve hours from dawn to dusk. The area outlined was a 60 km radius around Hyderabad. Teams could choose their own route and allocate whatever time they saw fit to any location as long as they reported at 6.30 pm at Hotel Green Park.

Registrations poured in, and on the day, there were close to 65 participants making up 15 teams. The turn up was motley, ranging from the pros and birders with more enthusiasm than experience, to absolute newcomers. Briefings were made, team names were allotted, T-shirts and breakfast hampers distributed and at 6.30 am, the HSBC Hyderabad Bird Race began.

There are many popular birding spots around Hyderabad but there is one campus that is a positive bonanza: ICRISAT campus. Sprawling several unending acres, with a variety of habitat, this campus offers easy pickings. Many teams started here and almost all made it a point to spend at least a few hours here. Teams reported that it wasn’t a ‘good day’ by ICRISAT standards, but that may just have been impatience talking, for apart from the usual suspects, Indian Coursers were seen here, as well as Marsh Harriers, Yellow-wattled Lapwings and a River Tern. ICRISAT also yielded a parliament of eagles and several pipits.

However, it was not at ICRISAT that the Bird of the Day was seen. That privilege went to Narsapur forest, a lovely reserve that is a favourite with Hyderabadi birders. The bird in question was the rare and exquisite Grey-headed Canary Flycatcher. Narsapur forest, predictably, plumped up numbers to the satisfaction of teams.

Another popular spot was the much-wooded campus of the Hyderabad Central University (HCU). Highlights here were the Bronze-winged Jacana, the Brown Flycatcher, and Peafowl, a species that would have been a shame not to see. Water bodies like Manjira Barrage and nearby lakes disappointed birders. The usually vast numbers had disappeared on the day and the unusual heat of the day only added to the frustration.

photo1
Aasheesh Pittie welcoming the guests

And so it was that exhausted birders winded their way at 6.30 pm into Green Park Hotel in Begumpet and turned in their log books. Refreshments were thankfully consumed and it was then to wait for referees Mr Siraj Taher and Mr Aasheesh Pittie to do their bit and announce the final tallies. The winners were Team Geese headed by Rajeev Mathew, who totted up an enviable 110 birds, followed by the Falcons, captained by Humayun Taher, who saw 104. Sachin’s Bulbuls won the third prize with a tally of 98 species.

Teams spoke of their experiences. Enthusiasm was high in spite of a gruelling day and it was heartening to see many new converts to birding. BSAP members were happy to be introduced to Mr Sunjoy Monga, the man and force behind the Bird Race, who has already conducted it twice in Mumbai and intends to carry it to several more Indian cities.

photo3
Guest of Honour Amala Akkineni

Also present were representatives of HSBC Bank, who deserve BSAP’s fervent thanks for sponsoring the race and making it possible to spread both the concept and the joy of birding. Guest of Honour was animal lover and activist Amala Akkineni, who manages to lend grace to any proceedings she is part of.

photo4
A section of the audience

In the final analysis, it was an immense success for such a fledgling venture. Happily, it seems as if the Hyderabad Bird Race is going to be an annual affair.

- Sheetal Vyas
Photos: Kulkarni

సోమవారం, డిసెంబర్ 11, 2006

తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం డిసెంబరు 2006

త్రివిక్రమార్కీయం
Topic of the meet: అత్యుత్తమ బ్లాగు టపాలను పుస్తకరూపంలో ప్రచురించడం.

BE1
Trivikram at entrance: ‘Hello Veeven’

ముందు నిర్ణయించినట్లుగానే హైదరాబాదు పుస్తకమేళా ప్రవేశద్వారం దగ్గర కలుసుకున్నాం. నాలుగ్గంటల వరకు ఎదురుచూసినా కొత్త సభ్యులెవరూ రాలేదు. సరిగ్గా అపుడే వీవెన్ ఫోన్ చేసి రాలేకపోతున్నానని తెలపడంతో అక్కడి నుంచి బయలుదేరి ఈట్స్ట్రీట్కెళ్ళాం.. చావా కిరణ్ పోస్టర్లు ప్రింటు చేశాడట కానీ తన పెళ్ళిపనులతో తీరిక లేకపోవడం వల్ల వాటిని సమావేశస్థలికి చేర్చలేకపోయాడు. సుధాకర్ ఇచ్చిన "వందటపాల పార్టీ" తీసుకుని మాటల్లో పడ్డాం.

హర్ష "ఏ దేశమేగినా ఎందు కాలిడినా" మనకు మొదట గుర్తింపునిచ్చేది భాషేనని, మాతృభాషను నిర్లక్ష్యం చెయ్యడమంటే మన గుర్తింపును (identity) కోల్పోవడమేనని అన్నాడు. పుస్తకమేళాలో కొన్ని "బయటివనరులు" సేకరించిన హర్ష వాటిలోని సమాచారాన్ని త్వరలో వికీపీడియాలోకి ఎక్కించగలడని ఆశించవచ్చు. వికీపీడియా విశ్వసనీయత గురించి సుధాకర్ "వికీపీడియా బలమే దాని బలహీనత" అని అభిప్రాయపడ్డాడు. రక్షిత వ్యాసాల్లో తప్ప మిగిలిన వ్యాసాల్లో ఎవరుపడితే వారు ఏ మార్పులైనా చెయ్యగలిగే వెసులుబాటు ఉండడం వల్ల నిర్వాహకులు నిరంతరం అత్యంత జాగరూకులై ఉండవలసి వస్తోందని, వారు ఏ మాత్రం ప్రమత్తులైనా తప్పుదోవపట్టించే/తప్పుడు సమాచారం చలామణీ అయ్యే ప్రమాదముందని అభిప్రాయపడ్డాడు. ఎవరైనా వికీపీడియాలోకి లాగిన్ అయితే తప్ప మార్పులు చేసే అవకాశం లేకుండా ఉంటే బాగుంటుందేమో?
భాస్కరరావు గారిలాంటి ఉత్సాహవంతులు, సుధాకర్ లాంటి కాకలుతీరిన బ్లాగరులు సైతం చురుగ్గా తెవికీలో ఎందుకు రాయలేకపోతున్నారు? అనే ప్రశ్నకు సుధాకర్ WYSiWYG కు అలవాటుపడిన వారికి వికీపీడియా గందరగోళంగానే ఉంటుందని, వికీ ఫార్మాటుకు అలవాటుపడడం కొద్దిగా కష్టమేనని అన్నాడు. సుధాకర్ వేసిన అనుబంధప్రశ్న: తెవికీలో యాధృచ్చిక పేజీ నిజంగానే యాధృచ్చికమేనా? అని. ఎందుకంటే ఎప్పుడు యాధృచ్చికపేజీని నొక్కినా ఏదో ఒక గ్రామానికే వెళ్తోంది. అది ఏదో ఒక గ్రామానికో, పల్లెలు బోరు కొడితే సినిమాకో వెళ్ళడం ఆశ్చర్యమేమీ కాదని, ఎందుకంటే తెవికీలో అత్యధిక వ్యాసాలు వీటి గురించే ఉన్నాయని రమణ, హర్షలు వివరించారు.

ఇక అతి ప్రధాన అంశం అత్యుత్తమ బ్లాగు టపాలను ప్రచురించడం: విహారి చెప్పిన మాసపత్రిక ఆలోచన ఆచరణయోగ్యం కాకపోయినా సంవత్సరానికి ఒకసారి అత్యుత్తమ బ్లాగుటపాలను ఏర్చికూర్చి ఒక పుస్తకం తీసుకురావడం మంచిదనే ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దీనికి స్పాన్సరర్ల కోసం ప్రయత్నిస్తామని సమావేశ వివరాలు ఫోన్ ద్వారా తెలుసుకున్న చావా కిరణ్, చదువరి తెలిపారు. ఐతే దానికంటే ముందు కంప్యూటరుకు తెలుగు నేర్పడం గురించి, తెలుగువికీపీడియా గురించి, తెవికీలో ప్రతి ఒక్కరూ రాయవలసిన ఆవశ్యకతను గురించి, తెలుగుబ్లాగుల గురించి పరిచయవ్యాసాలనే ఒక చిన్న కరదీపిక లాగ ప్రచురించి వీలైనంత ఎక్కువమందికి - అన్ని వర్గాల పాఠకులకు, విద్యార్థులకు, విశ్వవిద్యాలయాలకు చేర్చడం - అవసరమని భావించాం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను రావుగారు తెలియజేస్తారు.
ప్రచురణార్హమైన బ్లాగుటపాల ఎంపిక: ప్రతి తెలుగుబ్లాగరిని తన బ్లాగుల్లో నుంచి అత్యుత్తమైనవని తాను భావించిన టపాలను (తన స్వంత రచనలై ఉండి, ప్రచురించడానికి అభ్యతంతరం లేనివి) ఐదుకు మించకుండా ఎంపిక చేసుకోమనడం, అలా వచ్చిన టపాలను ఓటింగుకు పెట్టడం ద్వారా తుది ఎంపిక చేయడం ఒక మార్గం.
మీ మీ సలహాలు, సూచనలు తెలుపగలరు.
ఇతర విషయాలు అనేకం మాటల్లో చోటుచేసుకున్నాయి. తెలంగాణా గురించి, ప్రజాస్వామ్యం గురించి, అమల్లో కొనసాగుతున్న కాలం చెల్లిన, అర్థరహితమైన చట్టాల గురించి, హైదరాబాద్ పక్షిప్రేమికుల పక్షివీక్షణ పోటీ గురించి, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ల గైడెడ్ టూర్ల గురించి, స్థాయి తగ్గిన 'రచన' గురించి, ఇలా...
Text: Trivikram Photos: cbrao

రాయని భాస్కరుడు
తెలుగు పరిమళ వ్యాప్తికై చర్యలు

ES
Eat Street-Subway- ఎడమనుంచి కుడివైపుకు త్రివిక్రం, సుధాకర్, హర్ష, రమణ.


Hyderabad Necklace Road లోని Eat Street Food Joint ఎప్పటిలానే కోలహలంగా ఉంది ఈ ఆదివారం. తెలుగు బ్లాగరు మిత్రులం Sub Way లో కూర్చుని Hot Capucchinoa Coffee తాగుతూ ఆలుగడ్డ chips తింటూ చెయ్యాలనుకుని, చెయ్యలేకపోతున్న విషయాలపై ద్రిష్టి పెట్టాము. ముఖ్యంగా ఒక ఉచిత, చిరు పుస్తకం సుమారు 15-20 పేజీలలో వెలువరించాలని లక్ష్యం. ఇందులోని విషయాలు 1) మీ కంప్యూటర్ కు తెలుగు నేర్పడం ఎలా? - ఇందులో విన్ 98, విన్ 2000 ఇంకా Windows XP వాడే వారు తెలుగు ఫాంట్ల వ్యవస్థీకరణ (Installation) చెయ్యటం, తెలుగు Key Board వగైరా ఉంటాయ్. 2) తెలుగు వికి - ఇందులో తెలుగు వికి పరిచయం, వికి లో వ్యాసం రాయండి, వికి గురించిన అనుబంధ సమాచారం ఈ వ్యాసంలో ఉంటాయి. 3) తెలుగు బ్లాగులు - ఇందులో తెలుగు బ్లాగుల పరిచయం, తెలుగులో బ్లాగు ఎలా రాయాలి, సహాయాం కోసం ఎవర్ని, ఎప్పుడు, ఎక్కడ అడగాలి, లేఖిని మరియు కూడలి పరిచయం ఉంటాయి. తెలుగు సమావేశాలలో, యూనివర్సిటి, కాలేజ్ తెలుగు శాఖలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పంపిణి చెయ్యాలని తెలుగు బ్లాగరుల ఆకాంష. మన కార్యక్రమాలలో ఇది ప్రధమ దశ.

రెండవ దశ కార్యక్రమాలు

తెలుగు బ్లాగరుల ఎంపిక చేసిన బ్లాగులు పుస్తక రూపేణా సంవత్సరమునకోసారి ప్రచురించి, పుస్తక విక్రేతల ద్వారా పంపిణి చెయ్యటం. పుస్తకాలను తక్కువ లాభాలకు అమ్మి, వచ్చిన డబ్బు మరుసటి సంవత్సర ప్రచురణలకు వినియోగించాలని ఆలోచన. ఈ పుస్తకాలను సమీక్షకై పలు పత్రికలకు పంపే యోచన కలదు.

ఈ ప్రధమ, రెండవ దశ కార్యక్రమాలకు కావలసిన ఆర్థిక వనరుల సమీకరణ మరియు నిర్వహణ

Sponsors ద్వారా, తెలుగు బ్లాగరు మిత్రుల ఆర్థిక సహాయముతో కార్యొన్ముఖలం కావాలని యోచన. Telugu Bloggers Association స్థాపించి, Register గావించి, Bank ఖాతా తెరచుట, Non-Profit association గా లక్ష్యముండి Executive Committee ఎంపిక చేసుకుని ఆదాయపన్ను శాఖ నుంచి పన్ను మినహాయింపుకై దరఖాస్తు చెయ్యాలని తలంపు. లక్ష రూపాయల ప్రారంభ నిధులుండవలెనని అంచనా. Microsoft ఇంకా అలాంటి సంస్థల (ఊదాహరణకు తెలుగు యూనివర్సిటి), తెలుగు ప్రేమికుల సహకారంతో ఈ బృహత్కార్యం ఆవిష్కరించబడాలని సంకల్పం. January మాసపు సమావేశంలో కార్యనిర్వాహక సభ్యుల ఎంపిక, తదుపరి కార్యక్రమ ప్రణాళిక నిర్ణయించటం జరుగుతుంది. మీ నుంచి అందిన సూచనలను ఈ సమావేశంలో పరిశీలిస్తారు.

తదుపరి సమావేశం

హుస్సేన్ సాగర్ తటాకమధ్యమున గల బుద్ధ భగవానుని సమక్షంలో, జనవరి 2007 లో.


పుస్తక ప్రదర్శన

IBE
ఎడమనుంచి కుడివైపుకు సిబిరావు, త్రివిక్రం, రమణ.


సమావేశం ముగిశాక మిగిలిన ముగ్గురం (రమణ, త్రివిక్రమ్, సిబిరావులు) పుస్తకమేళా మీద పడ్డాం. నేపథ్యంలో సినారె, మృణాళిని, తదితరుల ఉపన్యాసాలు వినిపిస్తూండగా పుస్తకాలు కొనుగోలు చేశాం. ఉపన్యాసాలు ముగిశాక సినారె, వరవరరావు తదితరులు మేమున్న దరిదాపుకే వచ్చారు. ఈ సారి పుస్తకాల Stalls ఎక్కువగానే ఉన్నాయి. తెలుగులో ఎన్నో వైవిధ్యభరితమైన పుస్తకాలను పుస్తకప్రియులు ఎంతో ఆసక్తిగా చూసి కొన్నారు. జనం సందడి కూడ ఎక్కువగా ఉండి పుస్తకాలకు ఆదరణ తగ్గలేదని నిరూపించారు అభిమానులు. Credit cards చాలా చోట్ల స్వీకరించే సౌకర్యం లేక పుస్తక అభిమానులు తాము కొనాలనుకున్న పుస్తకాలు కొనలేక నిరాశకు గురయ్యారు.

Text and Photos: cbrao

శనివారం, డిసెంబర్ 02, 2006

నా నెల్లూరు పర్యటన -7


Photo: cbrao River & Sea

కృష్ణ పట్నం చూడర బాబు

రామ కృష్ణ గారు తనను తాను పోర్ట్ అధికారులకు ఫోన్లో పరిచయం చేసుకుని పోర్ట్ చూడటానికి అనుమతి తీసుకున్నారు. పోర్ట్ లో రేవుని లోతు చేసే కార్యక్రమంలో చాలా యంత్రాలు నిమగ్నమై ఉన్నాయి. ఆ ప్రదేశం దాటి ఇంకొంచం ముందుకెళితే ఒక బంగళా వచ్చింది. రహదారి కూడా ఆగింది. ఒక మట్టి రోడ్డు అక్కడి నుంచి లైట్ హౌస్ ను కలుపుతుంది. మేము పయనిస్తున్న వాహనములోనే లైట్ హౌస్ కి వెళ్ళాము. లైట్ హౌస్ సంరక్షిత ఆవరణలో ఉంది. అక్కడ పని చేసే ఉద్యోగుల కార్యాలయం, వారి నివాస భవనాలు అదే ఆవరణ లో ఉన్నాయి. దర్శించటానికి ప్రవేశ రుసుము ఉంది. కందలేరు నది ఒడ్డున దీన్ని కట్టారు. నడి సముద్రంలో 2 కి.మీ. దూరంలో ఉన్న నౌకలకు చిన్న పడవల ద్వార సరుకు రవాణా చెయ్యబడుతుంది. లైట్ హౌస్ ని చాయా చిత్రాలు తీయరాదని అక్కడ ప్రకటన ఉన్నది. గూగుల్ (ఉపగ్రహం) ద్వారా నేల మేద ఉన్న ప్రతి కట్టడాన్ని అంతరిక్షం నుంచి చాయగ్రహణం చేసే వీలున్న ఈ రోజుల్లొ ఇది కొంచం అతిగా ఉందనిపిస్తోంది. బహుశా వారు ఇంకా బ్రిటిష్ వారి నిబంధనలనే పాటిస్తున్నట్లున్నారు. దీన్ని 1940లో కట్టారు కాని అది పాడవటం వలన కొత్త లైట్ హౌస్ ని 1978లో కట్టడం జరిగింది. దీని ఎత్తు 98 అడుగులు. ప్రతి 15 సెకనులకు ఒక సారి మూడు ప్రకాశవంతమైన కాంతి పుంజాలను (289 kHz) వెదజల్లుతూ 18 నాటికల్ మైళ్ల దూరం దాకా నౌకలకు దిశా నిర్దేశనం కావిస్తుంది. లైట్ హౌస్ పైకి వెళ్ళటానికి మెట్లున్నాయి. పైకి వెళ్ళి చూసినప్పుడు నది ఒడ్డు , దూరంగా సముద్రపు అలలు సుందరంగా కనిపించాయి. పైన గదిలో కాంతి పుంజాలు వెద జల్లే యంత్ర సామాగ్రి ఉంది. 1960ల దాక ఈ ఓడ రేవు చురుగ్గా ఉండేది. అక్కడ నుండి బయలుదేరి మరలా బంగళా దగ్గరకి చేరుకున్నాము.


Photo:cbrao River Kandaleru

ఈ బంగళా వెనుకనుంచి కందలేరు నది ప్రవహిస్తోంది. ఈ నది ఒక పక్క బంగాళా ఖాతం తోనూ మరో పక్క బకింగ్ హాం కాలువతోను కలిసివుండి సరకులను మదరాసు కు రవాణా చేసేందుకు వీలుగా ఉంది. కృష్ణ పట్నం ఒక బెస్తవారి పల్లి కావటం వలన బంగళా వెనుకనించి పడవలు వెళ్తూంటవి. మురళీధర్ గారి ఉద్దేశ మేమంటే బంగళా వెనుక పడవలోంచి మమ్ములను సముద్రంలోకి వెళ్ళి విహరించి రమ్మనమని. కాని నదిలో లోతు తీసే పనులు జరుగుతున్నవి కావున తాత్కాలికంగా అక్కడ పడవ సదుపాయాన్ని నిలిపి వేశారు. ఈ జంఝాటం వలన సముద్రంలో విహరించాలనే మా కోరిక తీర లేదు. కృష్ణ పట్నం సహజ సిద్ధమైన లోతైన ఓడ రేవు. బంగాళా ఖాతంలో తుఫానులు ఎక్కువే అయినప్పటికీ కృష్ణ పట్నంలో తుఫానులు చాలా అరుదు. అందువలన నౌకలకు ఇది సురక్షితం. 30 ఓడలు నిలిచే సౌకర్యంతో, జూన్ 2008లో, 8000 మిలియన్ రూపాయల అంచనా వ్యయంతో దీని ప్రధమ దశ నిర్మాణ పనులు పూర్తికావచ్చని అంచనా. ఇక్కడనుంచి ఇనుప ఖనిజాలు, గ్రానైట్ రాళ్ళు,బొగ్గు, పెట్రో రసాయనాలు, పెట్టిలో పంపెడి సరుకులు (Container cargo) జపాన్, చైనా వగైరా దేశాలకు ఎగుమతులు అవగలవు.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల్ని స్థాపించనున్నారు. http://www.apgenco.com/inner.asp?frm=jvslink1 వీటికి super critical thermal station స్థాయి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి స్థాపనకి రూ.2000కోట్లు ఖర్చుపెట్టనున్నారు. వీటిని Andhra Pradesh Power Development Company Limited (APPDCL), a Joint Venture Company of APGENCO and ILFS each with 50% equity నిర్మించనుంది. ఇప్పటికే రూ.15,000 కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న 4,000 మెగావాట్ల కృష్ణపట్నం థెర్మల్ పవర్‌ప్లాంటుకి ఈ రెండూ అదనం. ఇవి పూర్తయితే మరో 600 మెగావాట్ల విద్యుత్‌కేంద్రం కూడా కృష్ణపట్నంలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అప్పుడు కృష్ణపట్నం కర్మాగారాల స్థాపిత శక్తి 6200 మెగావాట్లకి చేరుకోగలదు. వీటిల్లో ఒక్కొక్క చిరు కర్మాగారానికి 500 ఎకరాల స్థలం అవసరం.ఈ కొత్త కర్మాగారాల నిమిత్తం ప్రస్తుతం అయిదో నెంబరు జాతీయ రహదారినీ కృష్ణపట్నం పోర్టుని అనుసంధానం చేస్తున్న రెండు వరసల రోడ్డుని 2007 మధ్య నాటికి నాలుగు వరసల రోడ్డు స్థాయికి పెంచడం పూర్తవుతుంది. కృష్ణపట్నం అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అన్ని దేశాల కార్పొరేట్ దిగ్గజాలూ అహమహమికతో పోటీపడుతున్నాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ కాంట్రాక్టుల విషయాలు చూసుకుంటోంది. కృష్ణ పట్నం ను ఈ మెగా ప్రాజెక్ట్స్ కు అనువైందిగా నిపుణులు గుర్తించటానికి మరొక కారణ మేమంటే ఈ పోర్ట్ 125000 టన్నుల బొగ్గును ఒకే సారి దిగుమతి చేసుకునే సామర్థ్యం కలిగి ఉండటం. APGENCO కు యూనిట్ ఉత్పాదన ధర 2 రూపాయలే. రెండో నిర్మాణ దశలో మరో 4000 మెగా వాట్ల విద్యుతుద్పాదన కేంద్ర స్థాపనకు అవకాశం ఉంది.
టెండర్ల పని అవుతూనే, ఏప్రిల్ 2007 లో ఈ కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభం కాబోతుంది. మన అవసరాన్ని మించి విద్యుత్ ఉత్పాదన ఉండగలదని అంచనా. కృష్ణ పట్నం లో కందలేరు (ఉప్పుటేరు)ను, సముద్రాన్ని, దూరంగా సుందరమైన అలల్నీ చూశాక కృష్ణ పట్నం గ్రామం చూడటానికి బయలుదేరాము.


Photo:cbrao Siddheswara Sivalayam

కృష్ణ పట్నం గ్రామంలో

ఇది చాలా చిన్న ఊరు. మేము అక్కడకు చేరేసరికి ఇంకా వెలుతురు ఉండటం వలన అక్కడి సిద్ధేశ్వర శివాలయం లోని ప్రాచీన శిల్పాలు చూసే అదృష్టం కలిగింది. శృంగార కవి శ్రీనాధుడు ఇక్కడ నివసించినట్లు దేవాలయం కుడ్యంపై ఉన్న ఆయన చాటు పద్యాలు చెబుతున్నాయి. నెల్లూరి నెరజాణ అనే పదం శ్రీనాధుడి సృష్టేనని ఇక్కడి వారంటారు. శ్రీనాథుడి పద్యం చదవాలనే ప్రయత్నం చేశాము కాని దానిపై సున్నం వెయ్యటం వలన వీలు కాలేదు. ప్రాచీన రాతి శిల్పాలను ఎలాంటి రంగులు వెయ్యకుండా వదిలేస్తేనే వాటి అసలు సౌందర్యం మనము చూడగలము. దేవాలయ నిర్వహణాధికారులు వాటి నిర్వహణ పై మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. దేవాలయ చరిత్రను చెప్పే ఒక శిలాశాసనం కూడా ప్రాచీన తెలుగులో రాయబడి ఉంది. శ్రీనాధుడు 1350-1500 AD మధ్య కాలం నాటివాడని తెలుస్తూంది.

Apsara
Photo: cbrao Apsara