శుక్రవారం, డిసెంబర్ 29, 2006

తెలుగు పరిమళ వ్యాప్తి



గత అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయం -సాకారం దాల్చిందని తెలియ చెప్పటానికి సంతోషిస్తున్నాను. తెలుగు పరిమళ వ్యాప్తి కై, మొదట 1000 పుస్తకాలు వేద్దామనుకున్నపటికీ, ఎక్కువమందికి ఈ సమాచారం అందిచాలన్న ఉద్దేశ్యంతో, అంచనా వ్యయం పెరిగినా, 2000 కాపీలు ముద్రించాలని మలి నిర్ణయం తీసుకున్నాము. తెలుగు వారి సమావేశాల్లో ఉచితంగా పంచిపెట్టే ఈ పుస్తకాలలో ఈ అంశాలు ఉన్నాయి.

1. వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
2. తెలుగు బ్లాగు
3. కంప్యూటరుకు తెలుగు నేర్పడమెలా?

ఈ పుస్తకం ఎలా వుందో చూడాలనే కుతూహలం మీలో ఉండటం సహజం. మీ కోసం ఈ పుస్తకం ఈ కింద ఇవ్వబడిన లింక్ లో లభ్యం అవుతుంది. ఈ అపరూప కానుకను అందుకోండి.

http://www.bitingsparrow.com/biosymphony/computerlo_telugu.pdf

ఈ పుస్తకం మీరు కూడా ముద్రించి మీ మీ పట్టణాల్లో జరిగే తెలుగు వారి సభలలో పంచి పెట్టి తెలుగు పరిమళ వ్యాప్తి చెయ్యండి. ఈ పుస్తకం పై మీ అభిప్రాయాలు రాయండి. వ్యాసాల అభివృద్ధి కి మీ సలహాలు తదుపరి ముద్రణలో స్వీకరించబడగలవు.

గురువారం, డిసెంబర్ 28, 2006

పొద్దు - పొడిచింది

Poddu

పొద్దు (http://poddu.net) - కొత్త ప్రయోగం బాగుంది. మొదటి సారి చక్కగా చదివిస్తుంది. జబ్బ పుష్టి ఉన్న సంపాదకీయాలు, వ్యాసాలు మనల్ని అలరిస్తాయి. రెండవసారి చదువుదామంటే ఇది ఎప్పుడు, ఎలా పొడుస్తోందో తెలియరాదు. Update అయిన అంశాలకు మన తెలుగు బ్లాగ్ గుంపులో సందేశం ఉండదు. ఏ అంశం ఎప్పుడు మారుతుందో తెలుసుకోవటానికి పరిశోధన చెయ్యాలి. ఏ వ్యాసం ఎవరు రాశారో (ఉదాహరణకు కబుర్లు) అని కూడా భవిష్యత్లో చరిత్రకారులు పరిశోధన చెయ్యటానికి మంచి అంశం అందించారు సంపాదకులు. ఆ వ్యాస రచయిత ఎవరు, ఆ పత్రిక సంపాదకులు ఎవరు అనే అంశం పై భవిష్యత్లో ఎవరైన పరిశోధించి డాక్టరేట్ సంపాదించే అవకాశం ఉంది. కవయిత్రి మొల్ల మా జిల్లా మనిషని నెల్లూరు వారంటుంటే కాదు మా జిల్లా అని కడప వారు వాదించుకునేలా ఈ పత్రిక యాజమాన్యం గురించి చక్కటి చర్చ రచ్చబండలో రా వొచ్చు. సూచనలు - పొద్దు -1, పొద్దు -2, పొద్దు -3 , పొద్దు -4 అంటూ ఇలా సంచికలుగా వస్తే పాఠకులు తాము ఏది చదివామో, చదవలేదో సులభంగా గుర్తు పెట్టుకుంటారు. సంచిక కూ సంచికకూ మధ్య ఎడమును పొద్దు సంపాదకులు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కొత్త సంచిక వెలువడ్డాక తెలుగుబ్లాగ్ గుంపుకు సందేశం పంపాలి. రచనల చివర రచయిత పేరు ఇవ్వటం సత్సాంప్రదాయం. పొద్దు సంపాదకులు, యాజమాన్యం గురించి పత్రిక లో రాయాలి. గోప్యంగా ఉంచటంలో ఏ ప్రయోజనం ఉందో అంతుపట్టడం లేదు.

గురువారం, డిసెంబర్ 21, 2006

హైదరాబాదు తెలుగు బ్లాగరుల ప్రత్యేక సమావేశం

Muralidhar & Veeven
Muralidhar and Veeven

Dec 10 న తెలుగు బ్లాగరుల సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను సభ్యులకు వివరించటానికై Dec 17న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ్యులకు వివరించటం జరిగింది. తెలుగు బ్లాగరుల సంఘం ఎందుకు, ఎలా, ఎప్పుడు అనే ప్రశ్నలకు వివరణ ఇవ్వటం జరిగింది. హైదరబాదు లోని తెలుగు ప్రేమికుల కార్యక్రమాలు మీకు ఆసక్తికరంగా ఉండవచ్చని తోచి ఆ విశేషాలు మీ ముందు ఉంచుతున్నాను.
Text:cbrao Photos: cbrao

తెలుగు బ్లాగరుల* తరపున ఒక కరదీపికను , అత్యుత్తమ బ్లాగుటపాలను ప్రచురించాలని ఈ నెల పదవ తేదీన జరిగిన బ్లాగరుల సమావేశంలో నిర్ణయించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. రావుగారు ఆ పుస్తకాల ముద్రణ కయ్యే ఖర్చులు, పుస్తకపంపిణీలో ఎదురయ్యే సాధకబాధకాలు , తదితర విషయాలను వివరించడానికి తన ఇంట్లో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ హేతువాది , ప్రచురణారంగంలో 3 దశాబ్దాల అనుభవం ఉన్న మురళీధర్ ఈ వివరాలనందించడానికి ఈ సమావేశానికి వచ్చారు . ఈ సమావేశం నిన్న ఉదయాన్నే ఖరారు కావడం వల్ల ముందుగా తెలుపడానికి వీలు లేకపోయింది . అయినా సమాచారాన్ని అందుకున్న చదువరి , వీవెన్ , సుధాకర్, నేను కాస్త ముందూ వెనుకగా ఆ సమావేశానికి హాజరయ్యాం.

Sudhakr & Veeven
Sudhakar and Veeven

1. ఎలాంటి రంగులు, హంగులు లేకుండా 16 పేజీల కరదీపికను పిన్నింగ్ పద్ధతిలో 1000 కాపీలు ముద్రించడానికి 4500 అవుతుందని మురళీధర్ తెలిపారు. హైదరాబాదు తెలుగు బ్లాగరు*లైన చదువరి, చావా కిరణ్, త్రివిక్రమ్ , సుధాకర్ , సిబిరావు, కశ్యప్, శ్రీహర్ష, యు .వి .రమణ, వీవెన్ లు ఈ ఖర్చును భరిస్తారు.

దీన్ని వీలైనన్ని కాపీలు ముద్రించి ఉచితంగా పంపిణీ చెయ్యాలని ఆలోచన. ఈ పుస్తకాన్ని ఎవరైనా తమకు వీలైనన్ని కాపీలు ముద్రించి ఉచితంగా పంచదలచుకుంటే నిరభ్యంతరంగా పంచవచ్చని , దానికి ఎలాంటి ముందస్తు అనుమతీ అక్ఖర్లేదని పుస్తకంలో మనమాటగా పేర్కొంటాం . అలాగే ఆ పుస్తకం చూసినవారెవరికైనా మన కార్యకలాపాలు నచ్చి తెలుగుబ్లాగరులకు విరాళాల ద్వారాగానీ , ఇతరత్రాగానీ సహకారమందించదలిస్తే తమ వివరాలను తెలుపవలసిందని, బ్లాగరుల సంఘం ఏర్పాటయ్యాక మేమే సంప్రదించగలమని ఆ కరదీపికలో పేర్కొంటాం . ఈ వివరాలను మనలో ఒకరు తమ దగ్గర సేకరించి పెట్టుకోవాలి. వారి చిరునామా , ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఆ కరదీపికలో పేర్కొంటాం.

మొదటి ప్రయత్నంగా ఆ కరదీపికను డిసెంబరు 31-జనవరి 1 తేదీల్లో హైదరాబాదులో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పంపిణీ చెయ్యదలిచాం . నిర్వాహకులు అనుమతిస్తే సభాప్రాంగణంలో ఒక బ్యానరును , ఒక కియోస్క్ లో ఒకటి -రెండు ల్యాప్ -టాప్ ల ద్వారా కంప్యూటరుకు తెలుగు నేర్పడం , ఇంటర్నెట్ లో తెలుగు వెలుగుల గురించి ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది . (తాజా సమాచారం: నిన్న (సోమవారం) సాయంత్రం నేను శాయి గారిని అడిగి కనుక్కున్నాను. పుస్తకాన్ని పంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ బ్యానర్లు, కియోస్కులను మాత్రం అనుమతించరని తెలిపారు.)



2. ఇక 120 పేజీల పుస్తకాన్ని ముద్రించడానికి కనీసం 25,000 ఖర్చవుతుందని మురళీధర్ తెలిపారు. మురళీధర్, వీవెన్, చదువరి వెళ్ళిపోయిన తర్వాత రావుగారు బ్లాగరుల సంఘం ఆవశ్యకతను గురించి చాలా విపులంగా మాట్లాడారు. దీనికి అందరూ సుముఖంగానే ఉన్నందున ఇక కార్యాచరణలోకి దిగడమే తరువాయి.

*బ్లాగరులంటే బ్లాగరులు మరియు వికీపీడియనులు అని అర్థం చేసుకోగలరు.

P.S. కంటెంటు:
కంప్యూటరుకు తెలుగు నేర్పడం ఎలా? ఈ వ్యాసాన్ని రమణ ఈ శనివారానికి పూర్తిచేస్తాడు.
వికీపీడియా గురించి చదువరి రాస్తారు.
బ్లాగుల గురించి: ఉన్న వ్యాసంలో అవసరమైన మార్పులు ఎవరైనా చేయవచ్చు.


Text: Trivikram

Trivikram, chaduvari
Trivikram and Chaduvari

date Dec 17, 2006 10:57 PM
subject నెట్లో తెలుగు -ఓ ఉచిత పుస్తకం
mailed-by gmail.com

sudhakar@gmail.com,
త్రివిక్రమ్ ,
cbraoin@gmail.com,
"Veeven (వీవెన్)" ,
kashyap.karthik@gmail.com,
harsha.pvss@gmail.com,
uvramana@gmail.com,
Kiran Kumar Chava

నెట్లో తెలుగు -ఓ ఉచిత పుస్తకం
డిసెంబరు 10 న జరిగిన బ్లాగరుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో నెట్లో తెలుగు గురించి ఓ చిన్న పుస్తకాన్ని ముద్రించి ఉచితంగా పంచాలనేది ఒకటి. (అత్యుత్తమ బ్లాగులు ఓ యాభయ్యో అరవయ్యో ఏరి ఓ పుస్తకంగా వేద్దామనుకున్నదీ ఇదీ వేరు వేరని గమనించగలరు) ఈ పని చేసేందుకు డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో త్యాగరాయ గానసభలో జరగనున్న ప్రపంచ తెలుగు సాహితీ సభల రూపంలో మనకో చక్కటి అవకాశం వచ్చింది. వంగూరి ఫౌండేషను ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభల్లో మనమనుకున్న ఈ పుస్తకాన్ని ఉచితంగా పంచితే బాగుంటుందని తలచాం.

దీని గురించి చర్చించేందుకు డిసెంబరు 17 ఆదివారాన, సీబీరావు గారి పనుపున ఆయన, వీవెన్, సుధాకర్, త్రివిక్రమ్, నేనూ రావుగారి ఇంటి దగ్గర కలిసాం. ఈ సభల నాటికి పుస్తకాన్ని ముద్రించి, ఉచితంగా పంచాలని నిర్ణయించాం. పుస్తకం 1/8 డెమ్మీ సైజులో, ఓ పదీ పన్నేండు పేజీలుండేలా, ఆర్భాటాలేమీ లేకుండా చేద్దామని కూడా నిర్ణయించాం. మొత్తం వెయ్యి ప్రతులు వేద్దామని అనుకున్నాం. పుస్తకంలో మూడు ముఖ్యమైన భాగాలుంటాయి.

1. కంప్యూటరుకు తెలుగు నేర్పడమెలా?
2. వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
3. బ్లాగు

అలాగే సభా నిర్వాహకులు ఒప్పుకుంటే సభా ప్రాంగణంలో లాపుటాపుల్తో ప్రదర్శన చెయ్యడం, బ్యానరు కట్టించడం వంటివి కూడా చేద్దామని అనుకున్నాం. పుస్తకం కోసం మనం ముఖ్యంగా చెయ్యవలసిన పనులు రెండున్నాయి:

1. పుస్తకానికి అవసరమైన కంటెంటును సమకూర్చడం. మనందరం పూనుకుని ఈ పని చెయ్యాలి. ఇప్పటికే కొంత విషయం http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81:%E0%B0%9A%E0%B0%A6%E0%B1%81%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF/%E0%B0%87%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B0%AA%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8612 పేజీలో రాసి ఉంది. దీన్ని మెరుగుపరచి గానీ, పూర్తిగా ఎత్తి రాసి గానీ మనమీ కంటెంటును తయారు చెయ్యవచ్చు.
2. ఇక రెండోది - డబ్బు. పుస్తకం ప్రచురించడానికి సుమారు 4,500 లోపు కావచ్చని అంచనా వేసాం. మన తొమ్మిది మందిమీ ఈ బాధ్యతను భుజాన వేసుకుంటే సరిపోతుందని అనుకున్నాం. తలా ఐదొందలు వేసుకుంటే పనయిపోద్ది. డబ్బును ఈ వచ్చే శుక్రవారం లోపు రావు గారికి అందజేస్తే సరిపోతుంది. ఖర్చులకు పోగా డబ్బు మిగిలితే ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచించవచ్చు.

రావుగారి స్నేహితుడు - మురళీధర్ గారు కూడా అక్కడకు వచ్చారు. ఆయన హేతువాది, ముద్రణా రంగంలో ఉన్నారు. ముద్రణ విషయమై ఆయన సలహాలు ఇచ్చారు. తానే ముద్రించి ఇస్తానని కూడా చెప్పారు.

మీమీ అభిప్రాయాలతో ఈ మెయిలుకు జవాబు - అందరికీ (Group) -పంపండి.

ఉంటాను.
Text: Chaduvari

Manav & Veeven
Manav , web architect from Ann Arbor(MI) and Veeven

సోమవారం, డిసెంబర్ 18, 2006

HSBC Hyderabad Bird Race

photo2
Participants registering at the end of birdrace

HSBC should be congratulated for supporting an event that spreads the joy of and popularises birding - through the Bird Races they sponsor. All the more as they have spread the Bird Race beyond Mumbai to several other Indian cities this year. The first such was held in Hyderabad on 26 November 2006 and was locally coordinated by the 26-year-old Birdwatcher's Society of Andhra Pradesh.
In all, ninteen teams participated in the dawn-to-dusk event, spotting 178 species. Being a fun event, the participants comprised of people from all walks of life and included 38 men, 26 women and 14 children. The youngest was six year old Jahnavi Kapadia. Several people, completely new to birding, read about it in the local media and telephoned to join the race. There was a team comprising entirely of women, all new to birding. They accompanied another car that had at least one experienced birdwatcher.
Prizes for three teams that chalked up the most number of species (110, 104 and 98) were given away by animal activist Amala Akkineni. She also awarded prizes for 'bird of the day', 'dip of the day' (a species that is conspicuous by its absence - given to a team that named the Tailor Bird), and youngest participant.
Amala, who heads Blue Cross, promised to work with BSAP for popularising birding among children. A sumptuous dinner culminated an eventful day.
Sunjoy Monga, who's brainchild the bird race is, deserves our thanks for bringing this joyous event to Hyderabad.

-Aasheesh Pittie


The news that the Birdwatcher’s Society for Andhra Pradesh (BSAP) was organising a Bird Race in Hyderabad drew quite a few puzzled frowns. “You guys are going to race pigeons?” we were asked, “or falcons?” BSAP members hastily disclaimed and explained: the racing would be done exclusively by humans.

The idea was simple: to form teams of four or five persons and try to see as many bird species as teams possibly could in twelve hours from dawn to dusk. The area outlined was a 60 km radius around Hyderabad. Teams could choose their own route and allocate whatever time they saw fit to any location as long as they reported at 6.30 pm at Hotel Green Park.

Registrations poured in, and on the day, there were close to 65 participants making up 15 teams. The turn up was motley, ranging from the pros and birders with more enthusiasm than experience, to absolute newcomers. Briefings were made, team names were allotted, T-shirts and breakfast hampers distributed and at 6.30 am, the HSBC Hyderabad Bird Race began.

There are many popular birding spots around Hyderabad but there is one campus that is a positive bonanza: ICRISAT campus. Sprawling several unending acres, with a variety of habitat, this campus offers easy pickings. Many teams started here and almost all made it a point to spend at least a few hours here. Teams reported that it wasn’t a ‘good day’ by ICRISAT standards, but that may just have been impatience talking, for apart from the usual suspects, Indian Coursers were seen here, as well as Marsh Harriers, Yellow-wattled Lapwings and a River Tern. ICRISAT also yielded a parliament of eagles and several pipits.

However, it was not at ICRISAT that the Bird of the Day was seen. That privilege went to Narsapur forest, a lovely reserve that is a favourite with Hyderabadi birders. The bird in question was the rare and exquisite Grey-headed Canary Flycatcher. Narsapur forest, predictably, plumped up numbers to the satisfaction of teams.

Another popular spot was the much-wooded campus of the Hyderabad Central University (HCU). Highlights here were the Bronze-winged Jacana, the Brown Flycatcher, and Peafowl, a species that would have been a shame not to see. Water bodies like Manjira Barrage and nearby lakes disappointed birders. The usually vast numbers had disappeared on the day and the unusual heat of the day only added to the frustration.

photo1
Aasheesh Pittie welcoming the guests

And so it was that exhausted birders winded their way at 6.30 pm into Green Park Hotel in Begumpet and turned in their log books. Refreshments were thankfully consumed and it was then to wait for referees Mr Siraj Taher and Mr Aasheesh Pittie to do their bit and announce the final tallies. The winners were Team Geese headed by Rajeev Mathew, who totted up an enviable 110 birds, followed by the Falcons, captained by Humayun Taher, who saw 104. Sachin’s Bulbuls won the third prize with a tally of 98 species.

Teams spoke of their experiences. Enthusiasm was high in spite of a gruelling day and it was heartening to see many new converts to birding. BSAP members were happy to be introduced to Mr Sunjoy Monga, the man and force behind the Bird Race, who has already conducted it twice in Mumbai and intends to carry it to several more Indian cities.

photo3
Guest of Honour Amala Akkineni

Also present were representatives of HSBC Bank, who deserve BSAP’s fervent thanks for sponsoring the race and making it possible to spread both the concept and the joy of birding. Guest of Honour was animal lover and activist Amala Akkineni, who manages to lend grace to any proceedings she is part of.

photo4
A section of the audience

In the final analysis, it was an immense success for such a fledgling venture. Happily, it seems as if the Hyderabad Bird Race is going to be an annual affair.

- Sheetal Vyas
Photos: Kulkarni

సోమవారం, డిసెంబర్ 11, 2006

తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం డిసెంబరు 2006

త్రివిక్రమార్కీయం
Topic of the meet: అత్యుత్తమ బ్లాగు టపాలను పుస్తకరూపంలో ప్రచురించడం.

BE1
Trivikram at entrance: ‘Hello Veeven’

ముందు నిర్ణయించినట్లుగానే హైదరాబాదు పుస్తకమేళా ప్రవేశద్వారం దగ్గర కలుసుకున్నాం. నాలుగ్గంటల వరకు ఎదురుచూసినా కొత్త సభ్యులెవరూ రాలేదు. సరిగ్గా అపుడే వీవెన్ ఫోన్ చేసి రాలేకపోతున్నానని తెలపడంతో అక్కడి నుంచి బయలుదేరి ఈట్స్ట్రీట్కెళ్ళాం.. చావా కిరణ్ పోస్టర్లు ప్రింటు చేశాడట కానీ తన పెళ్ళిపనులతో తీరిక లేకపోవడం వల్ల వాటిని సమావేశస్థలికి చేర్చలేకపోయాడు. సుధాకర్ ఇచ్చిన "వందటపాల పార్టీ" తీసుకుని మాటల్లో పడ్డాం.

హర్ష "ఏ దేశమేగినా ఎందు కాలిడినా" మనకు మొదట గుర్తింపునిచ్చేది భాషేనని, మాతృభాషను నిర్లక్ష్యం చెయ్యడమంటే మన గుర్తింపును (identity) కోల్పోవడమేనని అన్నాడు. పుస్తకమేళాలో కొన్ని "బయటివనరులు" సేకరించిన హర్ష వాటిలోని సమాచారాన్ని త్వరలో వికీపీడియాలోకి ఎక్కించగలడని ఆశించవచ్చు. వికీపీడియా విశ్వసనీయత గురించి సుధాకర్ "వికీపీడియా బలమే దాని బలహీనత" అని అభిప్రాయపడ్డాడు. రక్షిత వ్యాసాల్లో తప్ప మిగిలిన వ్యాసాల్లో ఎవరుపడితే వారు ఏ మార్పులైనా చెయ్యగలిగే వెసులుబాటు ఉండడం వల్ల నిర్వాహకులు నిరంతరం అత్యంత జాగరూకులై ఉండవలసి వస్తోందని, వారు ఏ మాత్రం ప్రమత్తులైనా తప్పుదోవపట్టించే/తప్పుడు సమాచారం చలామణీ అయ్యే ప్రమాదముందని అభిప్రాయపడ్డాడు. ఎవరైనా వికీపీడియాలోకి లాగిన్ అయితే తప్ప మార్పులు చేసే అవకాశం లేకుండా ఉంటే బాగుంటుందేమో?
భాస్కరరావు గారిలాంటి ఉత్సాహవంతులు, సుధాకర్ లాంటి కాకలుతీరిన బ్లాగరులు సైతం చురుగ్గా తెవికీలో ఎందుకు రాయలేకపోతున్నారు? అనే ప్రశ్నకు సుధాకర్ WYSiWYG కు అలవాటుపడిన వారికి వికీపీడియా గందరగోళంగానే ఉంటుందని, వికీ ఫార్మాటుకు అలవాటుపడడం కొద్దిగా కష్టమేనని అన్నాడు. సుధాకర్ వేసిన అనుబంధప్రశ్న: తెవికీలో యాధృచ్చిక పేజీ నిజంగానే యాధృచ్చికమేనా? అని. ఎందుకంటే ఎప్పుడు యాధృచ్చికపేజీని నొక్కినా ఏదో ఒక గ్రామానికే వెళ్తోంది. అది ఏదో ఒక గ్రామానికో, పల్లెలు బోరు కొడితే సినిమాకో వెళ్ళడం ఆశ్చర్యమేమీ కాదని, ఎందుకంటే తెవికీలో అత్యధిక వ్యాసాలు వీటి గురించే ఉన్నాయని రమణ, హర్షలు వివరించారు.

ఇక అతి ప్రధాన అంశం అత్యుత్తమ బ్లాగు టపాలను ప్రచురించడం: విహారి చెప్పిన మాసపత్రిక ఆలోచన ఆచరణయోగ్యం కాకపోయినా సంవత్సరానికి ఒకసారి అత్యుత్తమ బ్లాగుటపాలను ఏర్చికూర్చి ఒక పుస్తకం తీసుకురావడం మంచిదనే ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దీనికి స్పాన్సరర్ల కోసం ప్రయత్నిస్తామని సమావేశ వివరాలు ఫోన్ ద్వారా తెలుసుకున్న చావా కిరణ్, చదువరి తెలిపారు. ఐతే దానికంటే ముందు కంప్యూటరుకు తెలుగు నేర్పడం గురించి, తెలుగువికీపీడియా గురించి, తెవికీలో ప్రతి ఒక్కరూ రాయవలసిన ఆవశ్యకతను గురించి, తెలుగుబ్లాగుల గురించి పరిచయవ్యాసాలనే ఒక చిన్న కరదీపిక లాగ ప్రచురించి వీలైనంత ఎక్కువమందికి - అన్ని వర్గాల పాఠకులకు, విద్యార్థులకు, విశ్వవిద్యాలయాలకు చేర్చడం - అవసరమని భావించాం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను రావుగారు తెలియజేస్తారు.
ప్రచురణార్హమైన బ్లాగుటపాల ఎంపిక: ప్రతి తెలుగుబ్లాగరిని తన బ్లాగుల్లో నుంచి అత్యుత్తమైనవని తాను భావించిన టపాలను (తన స్వంత రచనలై ఉండి, ప్రచురించడానికి అభ్యతంతరం లేనివి) ఐదుకు మించకుండా ఎంపిక చేసుకోమనడం, అలా వచ్చిన టపాలను ఓటింగుకు పెట్టడం ద్వారా తుది ఎంపిక చేయడం ఒక మార్గం.
మీ మీ సలహాలు, సూచనలు తెలుపగలరు.
ఇతర విషయాలు అనేకం మాటల్లో చోటుచేసుకున్నాయి. తెలంగాణా గురించి, ప్రజాస్వామ్యం గురించి, అమల్లో కొనసాగుతున్న కాలం చెల్లిన, అర్థరహితమైన చట్టాల గురించి, హైదరాబాద్ పక్షిప్రేమికుల పక్షివీక్షణ పోటీ గురించి, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ల గైడెడ్ టూర్ల గురించి, స్థాయి తగ్గిన 'రచన' గురించి, ఇలా...
Text: Trivikram Photos: cbrao

రాయని భాస్కరుడు
తెలుగు పరిమళ వ్యాప్తికై చర్యలు

ES
Eat Street-Subway- ఎడమనుంచి కుడివైపుకు త్రివిక్రం, సుధాకర్, హర్ష, రమణ.


Hyderabad Necklace Road లోని Eat Street Food Joint ఎప్పటిలానే కోలహలంగా ఉంది ఈ ఆదివారం. తెలుగు బ్లాగరు మిత్రులం Sub Way లో కూర్చుని Hot Capucchinoa Coffee తాగుతూ ఆలుగడ్డ chips తింటూ చెయ్యాలనుకుని, చెయ్యలేకపోతున్న విషయాలపై ద్రిష్టి పెట్టాము. ముఖ్యంగా ఒక ఉచిత, చిరు పుస్తకం సుమారు 15-20 పేజీలలో వెలువరించాలని లక్ష్యం. ఇందులోని విషయాలు 1) మీ కంప్యూటర్ కు తెలుగు నేర్పడం ఎలా? - ఇందులో విన్ 98, విన్ 2000 ఇంకా Windows XP వాడే వారు తెలుగు ఫాంట్ల వ్యవస్థీకరణ (Installation) చెయ్యటం, తెలుగు Key Board వగైరా ఉంటాయ్. 2) తెలుగు వికి - ఇందులో తెలుగు వికి పరిచయం, వికి లో వ్యాసం రాయండి, వికి గురించిన అనుబంధ సమాచారం ఈ వ్యాసంలో ఉంటాయి. 3) తెలుగు బ్లాగులు - ఇందులో తెలుగు బ్లాగుల పరిచయం, తెలుగులో బ్లాగు ఎలా రాయాలి, సహాయాం కోసం ఎవర్ని, ఎప్పుడు, ఎక్కడ అడగాలి, లేఖిని మరియు కూడలి పరిచయం ఉంటాయి. తెలుగు సమావేశాలలో, యూనివర్సిటి, కాలేజ్ తెలుగు శాఖలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పంపిణి చెయ్యాలని తెలుగు బ్లాగరుల ఆకాంష. మన కార్యక్రమాలలో ఇది ప్రధమ దశ.

రెండవ దశ కార్యక్రమాలు

తెలుగు బ్లాగరుల ఎంపిక చేసిన బ్లాగులు పుస్తక రూపేణా సంవత్సరమునకోసారి ప్రచురించి, పుస్తక విక్రేతల ద్వారా పంపిణి చెయ్యటం. పుస్తకాలను తక్కువ లాభాలకు అమ్మి, వచ్చిన డబ్బు మరుసటి సంవత్సర ప్రచురణలకు వినియోగించాలని ఆలోచన. ఈ పుస్తకాలను సమీక్షకై పలు పత్రికలకు పంపే యోచన కలదు.

ఈ ప్రధమ, రెండవ దశ కార్యక్రమాలకు కావలసిన ఆర్థిక వనరుల సమీకరణ మరియు నిర్వహణ

Sponsors ద్వారా, తెలుగు బ్లాగరు మిత్రుల ఆర్థిక సహాయముతో కార్యొన్ముఖలం కావాలని యోచన. Telugu Bloggers Association స్థాపించి, Register గావించి, Bank ఖాతా తెరచుట, Non-Profit association గా లక్ష్యముండి Executive Committee ఎంపిక చేసుకుని ఆదాయపన్ను శాఖ నుంచి పన్ను మినహాయింపుకై దరఖాస్తు చెయ్యాలని తలంపు. లక్ష రూపాయల ప్రారంభ నిధులుండవలెనని అంచనా. Microsoft ఇంకా అలాంటి సంస్థల (ఊదాహరణకు తెలుగు యూనివర్సిటి), తెలుగు ప్రేమికుల సహకారంతో ఈ బృహత్కార్యం ఆవిష్కరించబడాలని సంకల్పం. January మాసపు సమావేశంలో కార్యనిర్వాహక సభ్యుల ఎంపిక, తదుపరి కార్యక్రమ ప్రణాళిక నిర్ణయించటం జరుగుతుంది. మీ నుంచి అందిన సూచనలను ఈ సమావేశంలో పరిశీలిస్తారు.

తదుపరి సమావేశం

హుస్సేన్ సాగర్ తటాకమధ్యమున గల బుద్ధ భగవానుని సమక్షంలో, జనవరి 2007 లో.


పుస్తక ప్రదర్శన

IBE
ఎడమనుంచి కుడివైపుకు సిబిరావు, త్రివిక్రం, రమణ.


సమావేశం ముగిశాక మిగిలిన ముగ్గురం (రమణ, త్రివిక్రమ్, సిబిరావులు) పుస్తకమేళా మీద పడ్డాం. నేపథ్యంలో సినారె, మృణాళిని, తదితరుల ఉపన్యాసాలు వినిపిస్తూండగా పుస్తకాలు కొనుగోలు చేశాం. ఉపన్యాసాలు ముగిశాక సినారె, వరవరరావు తదితరులు మేమున్న దరిదాపుకే వచ్చారు. ఈ సారి పుస్తకాల Stalls ఎక్కువగానే ఉన్నాయి. తెలుగులో ఎన్నో వైవిధ్యభరితమైన పుస్తకాలను పుస్తకప్రియులు ఎంతో ఆసక్తిగా చూసి కొన్నారు. జనం సందడి కూడ ఎక్కువగా ఉండి పుస్తకాలకు ఆదరణ తగ్గలేదని నిరూపించారు అభిమానులు. Credit cards చాలా చోట్ల స్వీకరించే సౌకర్యం లేక పుస్తక అభిమానులు తాము కొనాలనుకున్న పుస్తకాలు కొనలేక నిరాశకు గురయ్యారు.

Text and Photos: cbrao

శనివారం, డిసెంబర్ 02, 2006

నా నెల్లూరు పర్యటన -7


Photo: cbrao River & Sea

కృష్ణ పట్నం చూడర బాబు

రామ కృష్ణ గారు తనను తాను పోర్ట్ అధికారులకు ఫోన్లో పరిచయం చేసుకుని పోర్ట్ చూడటానికి అనుమతి తీసుకున్నారు. పోర్ట్ లో రేవుని లోతు చేసే కార్యక్రమంలో చాలా యంత్రాలు నిమగ్నమై ఉన్నాయి. ఆ ప్రదేశం దాటి ఇంకొంచం ముందుకెళితే ఒక బంగళా వచ్చింది. రహదారి కూడా ఆగింది. ఒక మట్టి రోడ్డు అక్కడి నుంచి లైట్ హౌస్ ను కలుపుతుంది. మేము పయనిస్తున్న వాహనములోనే లైట్ హౌస్ కి వెళ్ళాము. లైట్ హౌస్ సంరక్షిత ఆవరణలో ఉంది. అక్కడ పని చేసే ఉద్యోగుల కార్యాలయం, వారి నివాస భవనాలు అదే ఆవరణ లో ఉన్నాయి. దర్శించటానికి ప్రవేశ రుసుము ఉంది. కందలేరు నది ఒడ్డున దీన్ని కట్టారు. నడి సముద్రంలో 2 కి.మీ. దూరంలో ఉన్న నౌకలకు చిన్న పడవల ద్వార సరుకు రవాణా చెయ్యబడుతుంది. లైట్ హౌస్ ని చాయా చిత్రాలు తీయరాదని అక్కడ ప్రకటన ఉన్నది. గూగుల్ (ఉపగ్రహం) ద్వారా నేల మేద ఉన్న ప్రతి కట్టడాన్ని అంతరిక్షం నుంచి చాయగ్రహణం చేసే వీలున్న ఈ రోజుల్లొ ఇది కొంచం అతిగా ఉందనిపిస్తోంది. బహుశా వారు ఇంకా బ్రిటిష్ వారి నిబంధనలనే పాటిస్తున్నట్లున్నారు. దీన్ని 1940లో కట్టారు కాని అది పాడవటం వలన కొత్త లైట్ హౌస్ ని 1978లో కట్టడం జరిగింది. దీని ఎత్తు 98 అడుగులు. ప్రతి 15 సెకనులకు ఒక సారి మూడు ప్రకాశవంతమైన కాంతి పుంజాలను (289 kHz) వెదజల్లుతూ 18 నాటికల్ మైళ్ల దూరం దాకా నౌకలకు దిశా నిర్దేశనం కావిస్తుంది. లైట్ హౌస్ పైకి వెళ్ళటానికి మెట్లున్నాయి. పైకి వెళ్ళి చూసినప్పుడు నది ఒడ్డు , దూరంగా సముద్రపు అలలు సుందరంగా కనిపించాయి. పైన గదిలో కాంతి పుంజాలు వెద జల్లే యంత్ర సామాగ్రి ఉంది. 1960ల దాక ఈ ఓడ రేవు చురుగ్గా ఉండేది. అక్కడ నుండి బయలుదేరి మరలా బంగళా దగ్గరకి చేరుకున్నాము.


Photo:cbrao River Kandaleru

ఈ బంగళా వెనుకనుంచి కందలేరు నది ప్రవహిస్తోంది. ఈ నది ఒక పక్క బంగాళా ఖాతం తోనూ మరో పక్క బకింగ్ హాం కాలువతోను కలిసివుండి సరకులను మదరాసు కు రవాణా చేసేందుకు వీలుగా ఉంది. కృష్ణ పట్నం ఒక బెస్తవారి పల్లి కావటం వలన బంగళా వెనుకనించి పడవలు వెళ్తూంటవి. మురళీధర్ గారి ఉద్దేశ మేమంటే బంగళా వెనుక పడవలోంచి మమ్ములను సముద్రంలోకి వెళ్ళి విహరించి రమ్మనమని. కాని నదిలో లోతు తీసే పనులు జరుగుతున్నవి కావున తాత్కాలికంగా అక్కడ పడవ సదుపాయాన్ని నిలిపి వేశారు. ఈ జంఝాటం వలన సముద్రంలో విహరించాలనే మా కోరిక తీర లేదు. కృష్ణ పట్నం సహజ సిద్ధమైన లోతైన ఓడ రేవు. బంగాళా ఖాతంలో తుఫానులు ఎక్కువే అయినప్పటికీ కృష్ణ పట్నంలో తుఫానులు చాలా అరుదు. అందువలన నౌకలకు ఇది సురక్షితం. 30 ఓడలు నిలిచే సౌకర్యంతో, జూన్ 2008లో, 8000 మిలియన్ రూపాయల అంచనా వ్యయంతో దీని ప్రధమ దశ నిర్మాణ పనులు పూర్తికావచ్చని అంచనా. ఇక్కడనుంచి ఇనుప ఖనిజాలు, గ్రానైట్ రాళ్ళు,బొగ్గు, పెట్రో రసాయనాలు, పెట్టిలో పంపెడి సరుకులు (Container cargo) జపాన్, చైనా వగైరా దేశాలకు ఎగుమతులు అవగలవు.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల్ని స్థాపించనున్నారు. http://www.apgenco.com/inner.asp?frm=jvslink1 వీటికి super critical thermal station స్థాయి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి స్థాపనకి రూ.2000కోట్లు ఖర్చుపెట్టనున్నారు. వీటిని Andhra Pradesh Power Development Company Limited (APPDCL), a Joint Venture Company of APGENCO and ILFS each with 50% equity నిర్మించనుంది. ఇప్పటికే రూ.15,000 కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న 4,000 మెగావాట్ల కృష్ణపట్నం థెర్మల్ పవర్‌ప్లాంటుకి ఈ రెండూ అదనం. ఇవి పూర్తయితే మరో 600 మెగావాట్ల విద్యుత్‌కేంద్రం కూడా కృష్ణపట్నంలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అప్పుడు కృష్ణపట్నం కర్మాగారాల స్థాపిత శక్తి 6200 మెగావాట్లకి చేరుకోగలదు. వీటిల్లో ఒక్కొక్క చిరు కర్మాగారానికి 500 ఎకరాల స్థలం అవసరం.ఈ కొత్త కర్మాగారాల నిమిత్తం ప్రస్తుతం అయిదో నెంబరు జాతీయ రహదారినీ కృష్ణపట్నం పోర్టుని అనుసంధానం చేస్తున్న రెండు వరసల రోడ్డుని 2007 మధ్య నాటికి నాలుగు వరసల రోడ్డు స్థాయికి పెంచడం పూర్తవుతుంది. కృష్ణపట్నం అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అన్ని దేశాల కార్పొరేట్ దిగ్గజాలూ అహమహమికతో పోటీపడుతున్నాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ కాంట్రాక్టుల విషయాలు చూసుకుంటోంది. కృష్ణ పట్నం ను ఈ మెగా ప్రాజెక్ట్స్ కు అనువైందిగా నిపుణులు గుర్తించటానికి మరొక కారణ మేమంటే ఈ పోర్ట్ 125000 టన్నుల బొగ్గును ఒకే సారి దిగుమతి చేసుకునే సామర్థ్యం కలిగి ఉండటం. APGENCO కు యూనిట్ ఉత్పాదన ధర 2 రూపాయలే. రెండో నిర్మాణ దశలో మరో 4000 మెగా వాట్ల విద్యుతుద్పాదన కేంద్ర స్థాపనకు అవకాశం ఉంది.
టెండర్ల పని అవుతూనే, ఏప్రిల్ 2007 లో ఈ కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభం కాబోతుంది. మన అవసరాన్ని మించి విద్యుత్ ఉత్పాదన ఉండగలదని అంచనా. కృష్ణ పట్నం లో కందలేరు (ఉప్పుటేరు)ను, సముద్రాన్ని, దూరంగా సుందరమైన అలల్నీ చూశాక కృష్ణ పట్నం గ్రామం చూడటానికి బయలుదేరాము.


Photo:cbrao Siddheswara Sivalayam

కృష్ణ పట్నం గ్రామంలో

ఇది చాలా చిన్న ఊరు. మేము అక్కడకు చేరేసరికి ఇంకా వెలుతురు ఉండటం వలన అక్కడి సిద్ధేశ్వర శివాలయం లోని ప్రాచీన శిల్పాలు చూసే అదృష్టం కలిగింది. శృంగార కవి శ్రీనాధుడు ఇక్కడ నివసించినట్లు దేవాలయం కుడ్యంపై ఉన్న ఆయన చాటు పద్యాలు చెబుతున్నాయి. నెల్లూరి నెరజాణ అనే పదం శ్రీనాధుడి సృష్టేనని ఇక్కడి వారంటారు. శ్రీనాథుడి పద్యం చదవాలనే ప్రయత్నం చేశాము కాని దానిపై సున్నం వెయ్యటం వలన వీలు కాలేదు. ప్రాచీన రాతి శిల్పాలను ఎలాంటి రంగులు వెయ్యకుండా వదిలేస్తేనే వాటి అసలు సౌందర్యం మనము చూడగలము. దేవాలయ నిర్వహణాధికారులు వాటి నిర్వహణ పై మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. దేవాలయ చరిత్రను చెప్పే ఒక శిలాశాసనం కూడా ప్రాచీన తెలుగులో రాయబడి ఉంది. శ్రీనాధుడు 1350-1500 AD మధ్య కాలం నాటివాడని తెలుస్తూంది.

Apsara
Photo: cbrao Apsara

బుధవారం, నవంబర్ 22, 2006

నా నెల్లూరు పర్యటన -6

ఆధ్యాత్మిక వాదులు: భౌతిక వాదులు

వీరి మధ్య చార్వాకుల కాలం నుంచీ ఆసక్తికరమమైన చర్చ జరుగుతూనే ఉంది. 'అద్వితీయ శక్తులున్న భగవంతుడున్నారనే వాళ్ళందరూ ఒక వుదాహరణ తప్పకుండా చూపుతారు. దేవుడే లేకుంటే ఈ భూమి క్రమం తప్పకుండా ఎలా తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది? ఇన్ని గ్రహాలు, నక్షత్ర మండలాలూ దేవుడి నిర్దేశం లేకపోతే ఎలా తమ తమ కక్ష్యల్లో అంత క్రమంగా తిరుగుతాయి?' http://www.charasala.com/blog/?p=116

మొదట్లో మానవ పరిణామ క్రమంలో మనిషికి ప్రక్రుతిలోని సహజ సిద్ధమైన అగ్ని,
వర్షం, స్త్రీ గర్భం దాల్చి శిశువును కనటం లాంటివన్నీ ఎంతో వింతగా సంభ్రమాచ్యారాలు కలిగించేవిగా ఉన్నాయి. తనకు అర్థం కాని ఈ విషయలన్నింటినీ తనకు తెలియని ఎదో శక్తి నడిపిస్తోందనీ. ఆ శక్తే దైవమని నమ్మాడు. ఈ క్రమంలో అగ్ని దేవుడు, వరుణ దేవుడు,ఆది శక్తి జనించారు. భూగొళానికి వెలుగునిచ్చే సూర్యుని, చంద్రుడిని దేవుళ్లన్నాడు. గ్రహణాలకు అచ్చెరువొంది రాహు, కేతులు సూర్య చంద్రులను మింగేంస్తున్నారని అపోహపడ్డాడు. ఇంకా కాలక్రమంలో గ్రామ దేవతలు, ముక్కోటి దేవుళ్ళు వెలిశారు. విజ్ఞాన శాస్త్రవేత్తలు అగ్ని, వర్షం ఇంకా సృష్టి రహస్యాలు కనుక్కుంటున్న ఈ తరుణంలో ఆదిమ మానవుడి ఎన్నో సందేహాలకు , భయాలకు సమాధానం లభించింది. Darwin’s theory of evolution ను God's intelligent design గా మార్చి తమదే పైచేయి అందామనుకున్న మత చాందసులకు ఈ నూతన శాస్త్ర పరిశోధనలు మింగుడు పడటం లేదు.



చంద్రుడిపై మానవుడు కాలు మోపటం అబద్దమని, దాన్ని విశ్వసించవొద్దనీ ఈ చాందసవాదులు చెప్తున్నారు. ‘ఎదీ శూన్యం లోంచి రాదు‘ అని భౌతికవాదులు నమ్ముతారు. అట్లా వస్తే అది మాయా, మహిమా కాదు కనికట్టు అంటారు హేతువాదులు. శాస్త్రవేత్తలు గ్రహాలు,పాలపుంతలను దాటి మన ఊహకు అందని దూరంలో ఉన్న విశ్వ రహస్యాల ఆవిష్కరణకై నిరంతరం శ్రమిస్తున్నారు. మనకు ఒక విషయం తెలియనప్పుడు అది ఎంతో జటిలంగా కనపడుతుంది. ఆది మానవుడి ఊహకు అగ్ని, వర్షం పెద్ద పరీక్షే. ఈ రోజుకీ అంతుపట్టని విషయాలు ఇంకా ఉన్నాయి. ఒక దాని వెంబడి మరొకటిగా అన్ని చిక్కు ముడులూ విడుతున్నాయి.

ప్రశాంతి తను అప్పుడప్పుడూ వెంకయ్య స్వామితో మాట్లాడుతుందని నేను గతంలో రాసినదానిని కొంతమంది పాఠకులు తాము విశ్వసించజాలమని నాకు తెలిపారు. వెశేషమేమంటే ఇలా చెప్పినవారిలో ఆస్తికులు, నాస్తికులిరువురూ ఉన్నారు. దేవుడున్నడా లేడా అనే దానిపై చాలా చర్చ జరిగింది. ఉంటే దానికి నిదర్శన మేది అని హేతువాదుల ప్రశ్న. కంటికి కనిపించేదే సత్యమనీ, శాస్త్ర పరీక్షకు నిలిచేదే వాస్తవమనీ నమ్ముతారు వీరు. గాలి కనిపిస్తొందా - అయినా అది ఉంది కదా, అలాగే దేవుడున్నాడు కాని కనిపించడు అని ఆస్తికుల వాదన. దేవుడిని విశ్వసించేవారికే దేవుడు కనపడతాడు, మిగతా వారికి దేవుడు కనపడడని ఆస్తికుల వాదన. నిప్పు ఆస్తికులనూ , నాస్తికులనూ సమానముగా దహిస్తుంది. అట్లాగే దేవుడూ తను ఉంటే ఆస్తికులు,నాస్తికులిరువిరికీ ఇవ్వాలి దర్శనం అంటారు భౌతికవాదులు. ఈ వాద ప్రతివాదాలు అన్నీ వింటే దైవం వ్యక్తిగతమనీ, వస్తుగతం కాదనీ అవగతమౌతుంది. ఇంకాస్త ముందుకు వెళితే దేవునితో మాటలాడటం Schizophrenia అనే మానసిక స్థితి అని మానసిక శాస్త్రవేత్తల విశ్లేషణ. మానవ మెదడులో ఎన్నో రసాయనాలుంటాయనీ, Dopamine అనే రసాయన లోపం వలన మెదడులోని Neurotransmission వ్యవస్థ సరిగా నియంత్రించ బడక Schizophrenia అనే స్థితికి కారకమౌతుందని Psychiatrists చెపుతారు. కొంతమంది బాబాలు తాము దేవునితో మాట్లాడుతాం అనే భ్రాంతిలో ఉండి, భక్తులనూ నమ్మిస్తారు. భక్తుల నమ్మికే ఈ బాబాలకు కొండంత అండ. విత్తు ముందా, చెట్టు ముందా లాంటి చర్చలకు ముగింపు ఉండదు. నెల్లూరు పయనిస్తున్న మా వాహనం గమ్యస్థానం చేరింది.


కృష్ణ పట్నం

అప్పటికే రామకృష్ణ గారు వారి కార్యాలయం నుంచి ఇంటికి వచ్చియున్నారు. మధ్యాహ్న భొజనమయ్యాక అందరం కృష్ణ పట్నం వెళ్దానుకున్నాము. ఒక Tourist car లో బయలుదేరాము. విశేషమేమంటే చాల కాలంగా నెల్లూరులో ఉంటున్న రామ కృష్ణగారు గాని, అక్కడే పుట్టి పెరిగిన ప్రశాంతిగాని అంతవరకూ కృష్ణ పట్నం చూడనే లేదు. కృష్ణ పట్నం సహజ సిద్ధమైన లోతైన ఓడ రేవు. ఆంధ్ర దేశానికి ఇది కాబొయే మరో విశాఖ పట్నం. నెల్లూరునుంచి సుమారు 25 K.M. ల దూరంలో ఉంది. ఇక్కడనుంచి ఓడ రేవు దాకా Double lane road ఉంది. భవిష్యత్లో ఇది నాలుగు సందుల రహదారి కాబోతుంది. బెళ్ళారి నుంచి ఎగుమతయ్యే ఇనుప ఖనిజానికి ఈ రేవు చాల దగ్గరగా ఉంటుంది. 2007-2008 నుంచి చెన్న పట్నం నుంచి ఇనుప ఖనిజ ఎగుమతులు ఆపివెయనున్నారు కావున కృష్ణ పట్నంకు చాలినంత పనిఉండగలదు. కృష్న పట్నం నుంచి ఓబులవారిపల్లె (గుత్తి -రేణుగుంట స్టేషన్ల మధ్య) దాకా కొత్త రైల్వే లైన్ 114 కి.మీ. వేయటానికి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. కడప జిల్లాలోని ఓబులవారిపల్లె నుంచి కొండలు, లోయలు లోంచి పలు Ghat Lines తో Eastern Ghats మీదుగా ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణం గావించ బడుతున్నది. 580 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని Krishnapatnam Rail Road Company Ltd నిర్మాణం గావించబోతున్నది.


Photo:cbrao ఉప్పు సేద్యం

కృష్ణ పట్నం కు వెళ్ళే దారిలో, రహదారి పక్కనే చాలా చేపల, రొయ్యల చెరువులున్నాయి. వీటినుంచి వచ్చే దుర్గంధము ముక్కుపుటాలదిరేలా ఉంది. అంతే కాక ఈ చెరువులు, కాలుష్య కారకులై సమీప గ్రామాల లోని ప్రజలకు తాగే నీరు లేకుండా చేస్తున్నాయి. దారిలో మాకు ఉప్పు మడులు కూడా కనిపించాయి. పొలాలలో గట్లు కట్టి సముద్రపు నీరు ఎండ బెట్టి ఉప్పు సేద్యం చేస్తున్నారిక్కడి రైతులు. ఇంకాస్త ముందు కెళితే మాకు బకింగ్ హాం కాలువ కనిపించింది. బ్రిటిష్ వారి హయాంలో ఇది ఒక వెలుగు వెలిగి ఇప్పటి పాలకుల నిర్లక్ష్యంతో పెద్దగా ఉపయోగించబడకుండా ఉంది.


Photo:cbrao బకింగ్ హాం కెనాల్

1806 లో బకింగ్ హాం కెనాల్ నిర్మాణం ప్రారంభించబడినది. తమిళ నాడు లోని మరక్కాణం నుంచి ఆంధ్ర ప్రదేష్ లోని క్రిష్ణా జిల్లా లోని పెద్దగంజాం దాక ఇది ఉంది. దక్షిణాన చెన్నై నుంచి మరక్కాణం (పాండిచెర్రికి ఉత్తరాన ఉంది)దాకా 163 కి.మీ ఉంది. ఆంధ్ర ప్రదేష్ లో ఈ కాలువ 257 కి.మీ. పొడుగుంది. 1876 మరియు 1878 లో కరువు కోరల్లో చిక్కుకున్న దక్షిణ భారతావనిని ఇది కాపాడింది. 1880 నుంచి 1940 దాక, తక్కువ ఖర్చులో ఇది ప్రజల మరియు సరకుల రవాణా సౌకర్యానికై బాగా ఉపయోగ పడింది. 1947 నుంచి దీన్ని ఉపయోగించటం తగ్గింది.1965 తుఫానుతో కాలువ దెబ్బతినింది. 2004 సునామి సందర్భంలో ఈ కాలువ సముద్రపు నీటికి అడ్డుకట్టై నిలిచి ఎందరో బెస్తవారిని, చాలా గ్రామాలను రక్షించింది. సముద్రానికి 1 కి.మీ. దూరంలో ఈ కాలువ కోస్తా తీరంలో ఉంది. అందమైన ఈ కాలువను కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో పూర్వ వైభవానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది.

నెల్లూరు వెళ్తున్నానని హైదరాబాదులోని మిత్రులు మురళీ ధర్ కు చెప్పినప్పుడు కృష్ణ పట్నం గ్రామము నుంచి ఓడరేవుదాకా బకింగ్ హాం కెనాల్లో పడవలో వెళ్ళమని అది సరదాగా ఉంటుందనీ సిఫారసు చేసినారు. అదే విషయాన్ని రామకృష్ణగారికి చెప్పాను. మా కారు కొత్తగా వేసిన తారు దారిపై వెగంగా వెళ్తూ, కాపలా దారు సంజ్ఞతో హటాత్తుగా ఆగింది. కారు ముందు అద్దం లోంచి కృస్ణ పట్నం పొర్ట్ అని పెద్ద Board కనిపించింది. అంటే గ్రామానికి వెళ్ళి పడవలో ఇక్కడకు రావాలిసిన వాళ్ళం తిన్నగా ఇక్కడికే కారులో వచ్చామన్నమాట. Port లో పనులు జరుగుతున్నవి కావున ముందుకు వెళ్ళరాదనీ అక్కడే వెను తిరగాలనీ సూచించాడు. రామకృష్ణ గారికీ ఈ దారి కొత్త కనుక మా driver ఎటు తీసుకు పొతున్నాడో తనూ గమనించలేక పోయారు.

శనివారం, నవంబర్ 18, 2006

తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం, నవంబరు 2006

ఈ సారి సమావేశం విశాలమైన University of Hyderabad Campus లో జరిగింది. పచ్చటి చెట్లు, చిన్న చిన్న నీటి కాసారాలతో, రమణీయ ప్రకృతిలో ఓలలాడుతుందీ ప్రాంగణం. ఈ సమావేశం విజయవంతంగా జరిగింది. ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో హాజరయ్యారు. కొత్తగా వచ్చిన మిత్రులు. 1) P.Bhargava Ram వీరు కశ్యప్ సోదరులు. కలం పేరు 'నలుగురిలో నారాయణా. వీరి రచనలు telugupeople.com లో కనిపిస్తాయి. ఈ భార్గవ రాముడు University of Hyderabad లో M.A. -Drama, performing arts Course చదివే విద్యార్థి. కశ్యప్ 'గుంపులో గోవిందం' అనే పేరుతో రచనలు చేస్తారు. ఈ సమావేశానికి వచ్చిన మరో కొత్త మిత్రుడు రొహిణీ కుమార్. చావా కిరణ్, వెంకట రమణ, సుధాకర్ ఇంకా ఈ రొహిణీ కుమార్ అంతా గచ్చిబౌలి (Hyderabad) లోని ఒక M.N.C లో software development లో ఉన్నారు. రొహిణి కు ఇంకా ఎలాంటి బ్లాగు లేదు. బ్లాగులంటే ఇష్టం ఉంది.

సమావేశపు విశేషాలు కోసం ఇక్కడ చూడండి:
http://telugu.wordpress.com/2006/11/13/hyd-meet-nov2006/


మీ కోసం సమావేశ చాయా చిత్రాలు కొన్ని జత పరుస్తున్నా. మీ అభిరుచి ప్రకారం రాబోయే సభా కార్యక్రమ నివేదికలలో Photos ఉంచాలా వద్దా అనే నిర్ణయం జరుగుతుంది.



From left to right Veeven (Standing), Bhargava ram, cbrao, Venkata Ramana, Trivikram and Sudhakar.



From left to right Chava Kiran, Srinivasa Raju and Sri Harsha.



From left to right Kasyap, Veeven, Trivikram and Sudhakar.



From left to right Front row 1 Srinivasa Raju and Kasyap
Row2 cbrao
Row 3 Chaduvari and Veeven
Row 4 Venkata Ramana, Trivikram,
SriHarsha,Chava Kiran,Sudhakar and
Rohini Kumar

సోమవారం, నవంబర్ 13, 2006

తెలుగు వికితో తిప్పలు




కొన్ని నెలల క్రితం వికిలో సభ్యత్వం నమోదు చేసుకొన్నా. మరిచిపోయా. చేసిన పని = 0 చెయ్యల్సింది = చాలా
నాలాగా ఎందరో అని తృప్తి పడాలా? అసలు వికిలో ఏం జరుగుతుంది? నాకు తెలియాలి. సభ్యత్వం తీసుకొన్నాక ఒక సభ్యుడికి క్రియా నిర్దేశిక సూత్రాలు ఎలా అంద చేయాలి? ఎలా చేస్తే కొత్త సభ్యులు వికిని మరువక తాము చెయ్యగలిగిన పనిని చేస్తారు అన్న విధంగా మన BUREAUCRATS అలోచిస్తున్నారా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది.

తెలుగు వికి పటిష్టం కావటానికి మరి ఏమి చెయ్యాలి?
Bureacrats, Administrators కొత్తగా చేరిన సభ్యుల Data Base సమర్ధంగా ఉంచాలి. ఈ Data Base సహాయతం తో కొత్త సభ్యుల e-mail చిరునామాలకు స్వాగత సందేశాలు పంపాలి. కొత్త సభ్యుల Academic Qualifications ఇంకా వారి ప్రత్యెక నిపుణతలు, అభిరుచులు తెలుపమని కోరాలి. ఇలా సేకరించిన విషయాలు మరలా Data Base కి ఎక్కించే ఏర్పాటు చేసుకోవాలి. తెలుగు వికిని Navigation ఎలా చెయ్యాలో చెప్పాలి. వికిలొని Administrative hierarchy గురించి వివరించాలి. వ్యాసాలు ఎలా మొదలుపెట్టాలో కొన్ని ఉదాహరణలు ఇవ్వాలి. కొత్త సభ్యుల సందేహాలకు ఎవరిని సంప్రదించాలో చెప్పాలి. ఇదంతా e-mail రూపంలో జరగాలి. e-mail ఎందుకు అంతా వికిలో చెప్తాం అంటే కొత్త సభ్యుడికి అక్కడ ఆ సాలెగూడులో వెతుక్కునే ఓపిక, సమయంలేక ఎందుకొచ్చిన గొడవని వెరే సాలెగూట్లోకి వెళ్లే అవకాశం ఎక్కువుంటుంది.

సభ్యత్వం తీసుకున్న ఒక నెల తర్వాత సభ్యుడుని పరామర్శిస్తూ మరో జాబు రాయాలి. ఈ జాబులో వికి navigation గాని మరేదైనా ఇబ్బందులు సభ్యులు ఎదుర్కొంటున్నారేమో అని వాకబు చెయ్యాలి. తెలుగు వికి సభ్యులకు ఒక గుంపు ఉందనీ అక్కడ వారు తమ సమస్యలు రాయవచ్చనీ తెలియ చెయ్యాలి. ఒక తెలుగు బ్లాగు ప్రారంభించటానికిముందు చాలా మంది చావా కిరణ్ రాసిన పెద్ద బ్లాగు శిక్ష చదివినంత సులభంగా - తెలుగు వికి లో వ్యాసం రాయండిలా అన్న పెద్ద వికి శిక్ష మార్గ నిర్దేశనం చెయ్యాలి. పెద్ద వికి శిక్ష ను e-mail గా కొత్త సభ్యులకు పంపాలి. మీరు వ్యాసం ప్రారంభించండి, మీ వెంటే మేముంటాము, సహాయం చేస్తాము అనే భరొసా కొత్త సభ్యులకివ్వగలగాలి.

శనివారం, నవంబర్ 11, 2006

నా నెల్లూరు పర్యటన -5

సుకుమార రెడ్ది గారు సాంఘిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా ఉంటారు. రెడ్డి గారు మనుషుల మీదే కాదండోయ్, జంతువుల మీద కూడా అపారప్రేమ కురిపిస్తారు. నెల్లూరు జీవకారుణ్య సంఘం కార్యక్రమాలలో కూడా తమవంతు సేవలందిస్తారు. కులాసా కబుర్లయ్యాక, రెడ్డి గారికి నా అభినందనలు అందచేసాక, వారి పనుల గురించి వారి ముఖతా విన్నాను. ఆదివారం సభా కార్యక్రమ కరపత్రికలు వారికి రామకృష్ణగారు అందచేసారు. సభలో కలుస్తానని వారు వెళ్ళారు.

రామకృష్ణగారి కుటుంబం చిన్నది. వారి శ్రీమతి సుజనారామం అధ్యాపక వృత్తిలో ఉండి, ఆరోజు అధ్యాపకుల శిక్షణా తరగతులకు వెళ్ళారు. రామకృష్ణగారి మాతృమూర్తి కమలమ్మగారు. చాలా ఆప్యాయంగా ఉంటారు. రామకృష్ణ గారికి ఇద్దరు ఆడపిల్లలు. ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నారు. ఉదయం అల్పాహారం అయ్యాక కార్యాలయంలో ఏదో ముఖ్యమైన పని ఉందని రామకృష్ణగారు వెళ్ళారు. ప్రశాంతి తను గొలగమూడిలో ఉన్న అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించటానికి వెళ్లాలని, నాకు వేరే కార్యక్రమం లేనందువలన నన్ను కూడా రమ్మన్న ఆహ్వానంపై ఇరువురమూ గొలగమూడి ప్రయాణమయ్యాము.


Photo:cbrao

శ్రీ వెంకయ్య స్వామి, గొలగమూడి

గొలగమూడి ఒక కుగ్రామం.నెల్లూరుకు సుమారు 10 కి.మీ ల దూరంలో ఉంది. హైదరాబాదులో చిల్కూరుకు ఎంత ప్రాచుర్యం ఉందో నెల్లూరులో గొలగమూడికీ అంతే ప్రాచుర్యముంది. నెల్లూరు నుంచి మంచి రవాణా సదుపాయముంది. వెంకయ్యస్వామి మొదట్లో పిచ్చివాడు.12 సంవత్సరములు ఎక్కడ తిరిగాడో తెలియదు. గొలగమూడి చేరాడు. వేలిముద్రలు వేసిన కాగితాలు ఇచ్చాడు. దారాలు ఇచ్చాడు. ఆ తరువాత వాక్కు చెప్పాడు. సత్యంగల నాయన అని పేరు పొందారు. తన వద్దకు వచ్చిన, భక్తుల నుద్దేశించి, వారికోసం తన సందేశాలను, తన సేవకులచేత కాగితంపై రాయించి, వారికి అందచేసేవారు, స్వహస్తాలతో. వీటిని సృష్టి చీటీలనేవారు. భక్తులు వీరిని షిర్డి సాయి అవతారముగా భావిస్తారు. ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు వీరిని అవధూతగా కొలుస్తారు. మరికొందరు వెంకయ్య స్వామిని దత్తావతారమని తలుస్తారు. పలువురు వారి కష్టాలను వెంకయ్య స్వామే తీరుస్తాడనే నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. చిల్కూరులో బాలాజీ చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసినట్లుగా, ఇక్కడా అవధూత దెవాలయం చుట్టూ 108 సార్లు భక్తుల ప్రదక్షిణలున్నాయి. ఈ దేవాలయ అభివృద్ధికి హీరో చిరంజీవి విరాళం తోడ్పడిందని చెప్తారిక్కడివారు. దేవాలయ ప్రాంగణం అనేక వ్యాపార దుకాణాలతో నిండి ఉంది. షిర్డి గ్రామం సాయినాధుడు లేకుండా మనజాలదు. గొలగమూడి గుడి కూడా అట్లే, ఎటుచూసినా అన్ని దుకాణాలు, వెంకయ్య పేరుపైనే ఉంటాయి. వ్యాపారం, ఆధ్యాత్మికత రెండూ పెనవేసుకుపోయాయీ ఊళ్ళో.


Photo:cbrao

సశరీరంతో ఉండి ఎన్ని పనులు చెయ్యగలరో అశరీరంతో కూడా అన్నే పనులు చెయ్యగల మహిమాన్వితులను అవధూతలంటారు. వారు భక్తుల కొంగుబంగారమై నిరంతరమూ వారికి రక్షగా ఉంటారు. ఎన్ని సమస్యలు, రుగ్మతలున్నప్పటికీ, అవధూత సాన్నిహిత్యంలో భక్తులు ఎంతో మానసిక ప్రశాంతత పొందుతారు. వారికి ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ప్రశాంతికి ఈ స్వామిపై గురి మెండు. గుడిలోకి వెళుతూనే అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణం గావించాము. ఇక్కడ అహర్నిశమూ అగ్ని వెలుగుతూనే ఉంటుంది. తదుపరి దేవాలయము చుట్టూ ఒక ప్రదక్షిణ గావించి వెంకయ్యస్వామి దర్శనం చేసుకున్నాం. గుడి లోపల చాలామంది స్త్రీలు పుష్పాలను మాలలు కడుతున్నారు. భక్తులెవరైనా లోపలకు వెళ్ళి మాలలు కట్టవచ్చని ప్రశాంతి చెప్పారు. తను దేవుని చుట్టూ ప్రదక్షిణలు గావించవలసి ఉన్నందున, నన్ను ఆ పూలవాటిక దగ్గర నిరీక్షించమని చెప్పారు. నిరీక్షిస్తూ చుట్టూ పరికించి చూశాను. దేవాలయ కుడ్యాలపై రాసిన వెంకయ్యస్వామి చెప్పిన సూక్తులు నన్నాకర్షించాయి. మీరూ చదవండి.

1) ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా.

2) వాళ్ళుండే దాన్నిబట్టి గదయ్యా మనముండేది.

3) అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో.

4) అందరికీ పంట పండించాను. దాన్ని దొంగలుపడి దోచుకోకుండా చూసుకోండయ్యా.

5) ఒకరిని పొమ్మనేదాన్ని కంటే మనమే పోవటం మంచిదయ్యా.

6) సన్యాసులుగా ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా. సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప.

7) వెయ్యి గొర్రెలలో ఉన్నా, మన గొర్రెను కాలు పట్టి లాక్కు రావచ్చు.

8) మంత్ర మెక్కడుంది? తంత్రమెక్కడుంది? చూచుకొంటూ పొయ్యేది గదయ్యా.

9) సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడ కొచ్చి ఏదనుకొంటే అదయ్యేదే గదయ్యా.

10) నీవు నన్ను విడిచినా, నేను నిన్ను విడువను.

11) మహారాజుని చూస్తే ఏమొస్తుంది? నీ కేముందో అదే నీకు మిగులు కదయ్యా.

12) అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు, నీవు దేవుడిని చూడగలవు కదయ్యా.

13) నా ఎడల నీ విశ్వాసమే నన్ను కదిలిస్తుంది కదయ్యా.
14) కూలివానికి, అతని చెమటారకముందే, కూలి ఇవ్వటం మంచిది కదయ్యా.

15) ఇతరులకు డబ్బు వడ్డీకి ఇచ్చే సమయంలో కూడా ధర్మాన్ని వీడరాదయ్యా.

16) పావలా దొంగిలిస్తే, పదిరూకల నష్టం వస్తుంది గదయ్యా.

17) లాభం కోసం కక్కుర్తి పడితే, ఆ పాపంలో భాగం పంచుకోవాలి గదయ్యా.

18) దారం తెగకుండా చూసుకో. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను గదయ్యా.

19) అత్యాశ వదులుకుంటే, అన్నీ వదులుకున్నట్లే.

20) మర్యాదలు పాటిస్తూ, సాధారణ జీవితం గడుపుతూ, సద్గురులకు సేవ చెయ్యటం నేర్చుకోవటం మంచిది గదయ్యా.



వెంకయ్యస్వామి ఆలోచనాధారతో, ఊర్ధ్వ లోకాలలో విహరిస్తున్న నా మనస్సును, వెళ్దామా అన్న ప్రశాంతి పిలుపు, ఇహలోకంలోకి తెచ్చింది. గుడి పక్కనే ఉన్న శిష్యుల సమాధులను దర్శించి, స్వామి వారి కుటీరం చూడటానికి వెళ్ళాము. స్వామి వారి చిన్న ఆవాసాన్ని అలాగే ఉంచి దానిపై నూతన భవన నిర్మాణం చేశారు. ఇక్కడే మేము స్వామివారి శిష్యులు గురవయ్య స్వామివారిని దర్శించాము. మరలా గుడి ప్రాంగణంకి వచ్చి పాదరక్షలు సేకరించుకుని వస్తూ అక్కడే వున్న పుస్తకాల దుకాణంలో వున్న పలు పత్రికలు, స్వామిపై ఎక్కిరాల భరద్వాజగారు రాసిన పుస్తకం చూశాము. వెంకయ్య స్వామిపై వెలువడుతున్న సద్గురు కృప అనే ఆధ్యాత్మిక మాస పత్రిక కూడా అక్కడే చూశాము. శ్రీ వెంకయ్య స్వామివారి చరిత్ర మరియు లీలల వివరాలకై చూడండి...
http://www.saimastersevatrust.org/Books/Pdfbooks.html

ఆ రోజు శనివారము అవటము వలన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులకు అక్కడే ఉచిత భోజన సౌకర్యమున్నప్పటికీ, రామకృష్ణగారు మాకై నెల్లూరులో వేచిఉన్నారు కావున, అక్కడ భోజనం చెయ్యకుండానే తిరుగు ప్రయాణమయ్యాము. ఆ ప్రయాణ సమయంలో ప్రశాంతి తాను వెంకయ్య స్వామితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటానని చెప్పి, నన్ను ఆశ్చర్యానికి గురిచేశారు.

శుక్రవారం, నవంబర్ 03, 2006

నా నెల్లూరు పర్యటన -4



గాంధీ బాటలో ఉద్యమకారుడు సుకుమార్ రెడ్డి - 2

పొగాకు శతకము

ఆంధ్ర దేశాన ధూమపానప్రియులధికం. పొగచుట్ట, బీడీలు, పొగాకు, నశ్యం, సిగరెట్ల రూపంలో ధూమపానం గోచరిస్తుంది. పొగచుట్ట గురించి చిరుమర్రి నరసింహ కవి గారు రాసిన ఒక పద్యం ఇది
ప్రొద్దున లేచి
ధూమ్రదళపుంజము
కన్నులకద్దుకొని దా
ముద్దుగ చుట్టదీర్చి తన
మోము పయిం ఘటియించి
మీసముల్
దిద్ది పొగాకువేడియును
ధీజనకోటికి మోదమిచ్చి తా
పెద్దలపేరు జెప్పి
పొగబీల్చినవాడు
కృతార్ధుడిమ్మహిన్


గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలోని గిరీశం ఐతే పొగతాగని వాడు దున్నపోతయి పుట్టున్ అంటూ తీర్మానించేశాడు. ఒక సినీ కవిగారైతే సరదా సరదా సిగరెట్టు, ఇది ఆలోచలను రేగొట్టు అంటూ సిగరెట్టు మనల్ని చైతన్యవంతులుగా చేస్తుందని వాక్రుచ్చారు.

సుకుమార్‌గారి ఆలోచనల ధారా పుస్తకం పొగాకు శతకం. ధూమపానము మొదట సరదాగా మొదలై, విషాదంగా ముగుస్తుందనీ అందుకు అకాల మృత్యువాతపడిన తన తండ్రిగారే పెద్ద ఉదాహరణ అంటారు.
1995లో లయన్స్‌క్లబ్ వారు నిర్వహించిన ధూమపాన వ్యతిరేక నినాదాల పొటేలో సుకుమార్ గారి ' పొగచుట్టలు ప్రజలపాలిటి కొరివికట్టెలు ' నినాదం, ఉత్తమమైందిగా ఎంపికైంది. వీరి శతకంలోంచి కొన్ని ఆలోచల్ని మీముందుంచుతాను.
అంతుబట్టని విషయం
చాలా మంది బస్సుల్లో, రైళ్ళలో,స్త్రీ, బాల, వృద్ధుల మధ్య, మొదలైన చోట్ల పొగదాగుతావుంటారు. వీళ్ళని గాడిదనాల్నో, పందుల్తో బోల్చాల్నో, దున్నపోతులని తిట్టాల్నో అర్థం కాదు.నిజానికియ్యేవి పొగత్రాగవు. అటువంటప్పుడు వాళ్ళని వీటితో పోల్చటం ఈ జంతువుల్ని అవమానించటమే ఔతది. ఐతే, ఇంక దేంతో బోల్చాలా? అది అంతుబట్టని విషయమే.

పొగాకు తినేవాళ్ళకి

తిన్నదాన్ని విసర్జించటానికి అందరికీ ఒక అవయవముంటే, పొగాకుదినేవాళ్ళకి రొండుంటాయి. ఆ రెండో అవయవం పేరు - నోరు.

ధూమపానం మాన్పించటానికి అనేక చిట్కాలు చెప్తారు రచయిత పొగాకు శతకంలో.
చిట్కా
మీ పక్కనెవరైన పొగదాగతుంటే - వాళ్ళ దృష్టినాకర్షించేరకంగా మొఖం వికారంగాబెట్టి, చేతిగుడ్డతో ముక్కు మూసుకోండి. ఈ సందర్భంలో మీరు వాళ్ళ మొఖంలోకి జూడాల్సిన పన్లేదు. సామాన్యంగా ఈ చిట్కా బాగా పంజేసి, వాళ్ళు మీ పక్కనుంచి దూరంగా బొయ్యేట్లు జేస్తది. ఒక్కొసారి - వాళ్ళు తమ పొగదాగుడ్ని అప్పటికి ముగించినా ముగించొచ్చు.

పలు సభలలో ధూమపానానికి వ్యతిరేకంగా ఉపన్యసించారు. కొంతమంది వారి మాటలతో ప్రభావితులై ధూమపానం మానివేశామని సుకుమార్ గారికి తెలియ చెప్పినప్పుడు వారికి కలిగే ఆనందం మాటల్లో చెప్పనలివికాదు.
అహింసా మార్గంలో నిరసన

సుకుమార్‌గారు ఏమి చేసిన కొంత నూతనంగానే తమదైన పద్ధతిలో ప్రచారోద్యమం గాని నిరసనగాని ఉంటాయి. వారింటిముందున్న నల్ల పలుకపై నినాదాలుగాని, నిరసనోద్యమ వార్తలుగాని రాసి ప్రజల దృష్టినాకర్షించి వారి మద్ధతు పొందుతారు.

2000 సంవత్సరం తెలుగుదేశం హయాములో అకస్మాత్తుగ పెరిగిన విద్యుత్ చార్జీల పెంపుపై తమ నిరసనగా ప్రతిరోజూ రాత్రి 7.30 నుంచి 8.30 దాక వారింటిలో విద్యుత్ వాడకాన్ని ఆపివేస్తున్నట్లుగా నల్ల పలుకపై ప్రకటించి దాన్ని నిరాఘంటంగా 3 సంవత్సరముల 11 నెలల 2 రోజులు అమలుపరిచినారు. తెలుగుదేశం పార్టి ఓడిన తదుపరి ఈ దీక్ష విరమించినారు.

ఈ నిరసన కార్యక్రమాన్ని పలు కష్ట నష్టాలకోర్చి చెయ్యటం జరిగింది.మధ్య కాలంలో సుకుమార్‌గారి తల్లి గారు (71 Years) చీకటిలో పడిపోవటము, వీరి ధర్మపత్ని కి ఒక పర్యాయం 'చిన్న ఆపరేషను ', మరో మారి ' పెద్ద ఆపరేషను ' జరగటం వలన విపరీతంగా చెమటలు పట్టేవి. అయినా కష్టాలకోర్చి నిరసన కొనసాగించారు.

వీరి నిరసన కార్యక్రమాలు Media దృష్టిని ఆకర్షించాయి.సింహపురి రైతు, ప్రజాశక్తి పత్రికలు, విస్సా టెలివజన్ వారు ఈ నిరసన గురించి విపులంగా రాశారు/చూపారు. భారత స్వాతంత్ర పోరాటంనాటి నూలు వడకటం, ఖద్దరు ధారణ, విదేశీవస్తు బహిష్కరణ, ఉప్పు తయారీ వంటి - ఎవరైనా అమలుపరచగలిగిన తరహా కార్యక్రమాలుగా ఈ నిరసనను సుకుమార్‌గారు భావించారు. సుకుమార్‌గారి మాటల్లో చెప్పాలంటే ' మా నిరసన నిర్ణయం, ఆ నిర్ణయంవెనకున్న మా అవగాహన, మా ఆచరణ , మా అనుభవాలు - ప్రజా ఉద్యమాలకి స్పూర్తిగా నిలువగలవనే ప్రగాఢ విశ్వాస భావనతో ఉన్నాము.'

Pinakini Body Donors Organisation

వైద్య విధ్యార్థులు శరీరశాస్త్ర నిర్మాణ రహస్యాలు తెల్సుకోవటానికై మృతదెహాలపై శస్త్రములతోటి ఖేదించి శల్యశాస్త్ర మర్మాలు నేర్వవలసియున్నది కాని మృతదేహముల కొరత మిక్కుటముగాయున్నది. దీనిని గుర్తించి సుకుమార్‌గారు Pinakini Body Donors Organisation స్థాపించినారు. అప్పటికి నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఇంకా రాలేదు. ఇలాంటి ఆలోచన ఆరోజుల్లో చాల కొత్త. ప్రజలలో దేహదానంపై వీరి ప్రయత్నాలు మంచి అవగాహన కలుగచేశాయి. ప్రస్తుతము నెల్లూరులోనే మెడికల్ కాలేజ్ ఉన్నది.

సుకుమార్‌గారు రచయిత కూడ అవటంతో రక్త, నేత్ర దానాలపై కొన్ని రచనలు చేశారు. అవి అముదిత్రములు. సుకుమార్‌గారు 1992 ఆగస్ట్‌లో ఏర్పడ్డ సారా వ్యతిరేకోద్యమ సమన్వయ సమితితో కలిసి పనిచేసి ఆ ఉద్యమానికి చేయూత నిచ్చారు.

ప్రస్తుత ప్రభుత్వమువారు విద్యుత్ ను Private పరం చేస్తున్నట్లు, ప్రపంచ బాంక్ ఆదేశాలపై విద్యుత్ శాఖలో మార్పులు చేసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో నెల్లూరులో మరో ఉద్యమం వస్తుందా? అనేక ఊద్యమాలకు నాంది పలికిన నెల్లూరు నుంచి ఏమి కొత్త ఉద్యమాలు రానున్నాయో?

P.S. ఈ వ్యాసం చదివాక మీ అభినందనలు సుకుమార్ రెడ్డి గారికి తెలియ చేయాలని ఉందా? వారి సేవా కార్యక్రమాలలో మీకు కూడ పాల్గొనలాని ఉందా? అయితే వారికి రాయండో ఉత్తరం.

Sri Thikkavarapu Sukumar Reddy
223rd House, K.A.C. Avenue,
Opp to Park, Stone House Peta,
Nellore 524 002
Andhra Pradesh
India.

ఉత్తరం రాయటం కష్టమనిపిస్తే, నాకు e-mail చెయ్యండి. మీ స్పందనను నేను వారికి పంపిస్తాను. నా e-mail: cbraoin at gmail.com

సోమవారం, అక్టోబర్ 30, 2006

నా నెల్లూరు పర్యటన -3


Photo: cbrao

గాంధీ బాటలో ఉద్యమకారుడు సుకుమార్ రెడ్డి

దేశభక్తి ఉద్యమం గానివ్వండి, ప్రత్యెక రాష్ట్ర ఉద్యమం గానివ్వండి లేక ఎదైనా సేవా ఉద్యమం గానివ్వండి నెల్లూరు ప్రజలలో వీటిగురించిన అవగాహన, చైతన్యం ఎక్కువే. ఆంధ్ర రాష్ట్రానికై ప్రాణాలివ్వటానికి పొట్ట్ శ్రీరాములు వెనుకడుగు వెయ్యలేదు. మధ్యపాన వ్యతిరేకోద్యమం చూడండి. దూబగుంట లో మొదలైన మద్యం వ్యతిరేక ఐక్య వేదిక టెక్కలి నుంచి తెలంగాణ దాక తమ ప్రణాళిక అమలు చెయ్యటంతో, అప్పటి ముఖ్య మంత్రి ఎన్.టి.ఆర్. , సారా నిషేధం, అధికారికంగా చెయ్యక తప్పింది కాదు. అది నెల్లూరు ప్రజల సాంఘిక చైతన్యానికి ఒక సోదాహరణగా నిలిచింది.

ఇక సేవా కార్యక్రమాలకొస్తే, అవి, మన భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఉండి, పలువురికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాయి. నెల్లూరులో సాంఘికసేవా కార్యకర్తలకు కొదవలేదు. వారిలోని ఒక విశిష్ట వ్యక్తి తిక్కవరపు సుకుమార్ రెడ్డి. చూడటానికి వీరు పేరుకు తగ్గట్టే సౌమ్యంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాలలో తీరికలేకుండ పనిచేస్తూ పెరిగిన గడ్డంతో కనిపిస్తుంటారు. చూడగానే మన దృష్టిని ఆకర్షించేవి వారి చొక్కాపై ఉన్న రక రకాల బాడ్జీలు (అంగీకి తగిలించే బిళ్ళ బొమ్మలు). ఆ బిళ్ళలు పెట్టడం వెనుక గూడా ఒక సేవాతత్పరత కనిపిస్తొంది. ఆ Badges చూసిన వారు అవి ఏమిటని అడగటమూ, వాటి గురించి వారి వివరణా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ బిళ్ళలపై రక్తదాన, నేత్రదానాల అనుకూల నినాదాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదాలుంటాయి.

సింహపురి స్వచ్చంద రక్తదాతల సంస్థ

మన దేశంలో అనేక వినియోగదారుల సంఘాలున్నాయి. రక్త, నేత్ర బాంకులున్నాయి. అయితే దాతలు సేవ చెయ్యటానికై పొటీపడి స్థాపించిన భారతదెశపు తొలి రక్త సహాయకుల సంస్థ, సింహపురి స్వచ్చంద రక్తదాతల సంస్థ 1979 లో నెల్లూరులో స్థాపింపబడింది. 1987 లో భారతదేశపు తొలి నేత్ర దాతల సంస్థ స్థాపించబడీంది. ఈ రెండు సంస్థలకూ వ్యవస్థాపకుదూ, కార్యదర్శి తిక్కవరపు సుకుమార రెడ్డి.

ఇక రక్తదాన విషయంలో ప్రజలకున్న అజ్ఞానం అపారం. ‘సందిగ్ధం’ కథ లో డాక్టర్ సోమిరెడ్డి జయప్రద చెప్తారు - భార్య ఎంతో అపాయకర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా భర్త రక్తదానానికి వెనుకంజ వెయ్యటం, ఆఖరికి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టిసలాడుతున్న భార్య - వారు ఉద్యోగం చేసే వారు కదా- రక్తం ఇస్తే Job ఎలా చేస్తారు అంటూ డాక్టరును ప్రశ్నిస్తుంది. రక్తదానంపై ప్రజలకున్న అపోహల్ని తొలగించటానికై Nellore V.R.College, Town Hall లలో వేదిక పై రక్తదానాన్ని ఇవ్వటం ఎలాగో demonstration చేసి చూపారు. వీరి బ్లడ్ గ్రూపు అరుదైంది కావటంతో 40+ సార్లు రక్తదానం స్వయంగా చేశారు. రోగికెప్పుడవసరమైతే అప్పుడు రక్తాన్నందజేసే - తక్షణ రక్త మార్పిడీ విధానం (Direct blood transfusion method) లో కూడా పలు రక్తదానాలు, వీరి నేతృ త్వంలో జరిగాయి. మొత్తంగా కొన్ని వేల రక్తదానాలు జరిపించారు సుకుమార్ రెడ్డి. వీరి రక్తదాన సంస్థ అలాంటి మరో 10 సంస్థలు రావటానికి స్పూర్తికారకమైంది.

Nellore Eye Donors Organisation

రక్తదానంలో ముందుండిన సుకుమార్ గారు నేత్రదానంలో వెనకుంటారా? బాంక్ ఉద్యొగి ఆనందరాం సింగ్ గారితో కలసి NEDO (Nellore Eye Donors Organisation) స్థాపించారు. వారి తండ్రి గారి నేత్రాలను దానం చేసి మిగతావారికి స్పూర్తినిచ్చారు. నేత్రాల సేకరణ చాల కఠినమైన ప్రక్రియ. గ్రామా లకు వెళ్ళి నేత్రదానం గురించి గ్రామస్తులకు విశదీకరించి, దాత చనిపొయిన 8 గంటలలోపు కంటి పాపను సేకరించి, చెన్నై లోని ఎగ్మోర్ కంటి బాంక్ కు సకాలంలో అందచేయటం ఒక పెద్ద సవాల్‌గా నిలుస్తోంది. కంటి సేకరణలో గ్రామాలలో సరైన డాక్టర్ అందుబాటలో ఉండరు కావున తానే స్వయంగా కంటి పాపను సేకరించి, నేత్రాలను థర్మాస్ ఫ్లాస్కులో ఉంచి ఎగ్మోర్ నేత్ర బాంక్‌కు పంపేవారు. ఎన్నో కష్టాలకోర్చి ఇంతవరకూ సుమారుగా 150 నేత్రాలను సేకరించి ఎగ్మోర్ బాంక్ కు పంపినారు.

తొక్కుడు బండి Bicycle

సుకుమార్‌గారు హేతువాది, సంఘసేవకుడు ఇంకా కవి. నా దృష్టికి వీరు రాసిన రెండు కవితలు అ) తొక్కుడు బండి ఆ) పొగాకు శతకము వచ్చాయి. ఇవి కూడ ఒక సామాజిక ప్రయోజనాన్ని దృష్టి లో పెట్టుకుని రాసినవే. సామాన్యుడు వాడే బైసికిల్ కూడా వీరి దృష్టిలో సామ్రాజ్యవాదాన్ని ఎదురించగల సత్తా ఉన్న ఆయుధమని వీరి నమ్మకం. Bicycleను వీరు తొక్కుడుబండి అంటారు. మోటార్ వాహనం నడపటమంటే ముడి చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న దేశాల సామ్రాజ్యవాదానికి మనము చేయూత నిచ్చినట్టేనని వీరి భావన. బైసికిల్‌పై నాలుగు పేజీల దీర్ఘ కవిత రాశారు.

అది జనచైనా వాహనం
అది భారత జన వాహనం
తొక్కుడుబండి అలనాటి పుచ్చలపల్లి సుందరయ్య వాహనం
ఇలనేటి గండవరం సేతురామయ్య, దాన్ని తొక్కి, తొక్కుడుబండి ప్రయాణ
షష్టి పూర్తి వేడుక జరుపుకొన్నారు

తొక్కుడుబండి తొక్కటం మనిషి ఆరొగ్యాన్ని, శక్తిని తెలియచేస్తుందనీ అంటూ ఈ వాహనం
పర్యావరణ కాలుష్యాన్ని పరిరక్షిస్తుందంటారు. మన దేశపుయొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు అదుపుతో ఖర్చవటానికి తోడ్పడుతుందనీ కావున తొక్కుడుబండి తొక్కటం అంటే మనకు దేశ భక్తి ఉన్నట్లే అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే తొక్కుడుబండి మనిషి ఆరొగ్యానికి, దేశ ఆర్ధిక అభివృద్ధికీ ఉపయోగపడుతుంది కావున అందరూ బైసికల్ వాడాలంటారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న మాట.

మంగళవారం, అక్టోబర్ 24, 2006

నా నెల్లూరు పర్యటన -2


Photo by cbrao

నెల్లూరు రాజకీయులూ, కవులూ, కళాకారులూ, నెరజాణలూ

మహాభారతం తెనిగించిన మహా కవి తిక్కన, ఆంధ్ర రాష్ట్రానికై అశువులు బాసిన పొట్టి శ్రీరాములు, Communist విప్లవ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య ఇక్కడి వారే. మన రాష్ట్రానికి ఇద్దరు ముఖ్య మంత్రులను ఇచ్చిందీ సింహపురి. వారు శ్రీయుతులు నేదురిమల్లి జనార్దనరెడ్డి,



కీ.శే. డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి. మరో రాజకీయ ప్రముఖులు ఎ.సి.సుబ్బారెడ్డి ఇక్కడివారే. నెల్లూరు జిల్లా ఎందరో ప్రతిభావంతులైన రచయితలకు, గాయకులకు, నటులకు జన్మనిచ్చింది.


కృషీవలుడు (The Tiller of the Land) -1919, ఫానశాల రచించిన కవి కోకిల దువ్వూరు రామిరెడ్డి, ఫిడేలు రాగాల పట్టాభి, నిదురించే తోటలొకి పాట ఒకటి వచ్చింది అంటూ మనల్ని నిద్రలేపిన గుంటూరు శేషేంద్ర శర్మ విక్రమ సింహపురివాసులే. రవీంద్రుని గీతాంజలిని తెనిగించిన సాహితీవేత్త, రాజకీయ నాయకుడు. మాజీ గవర్నరూ, కీర్తిశేషులు అయిన డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి, ఆచార్య ఆత్రేయ, పుష్పక్ మూకీ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, గాయకుడు బాలసుబ్రమణ్యం, వాణిశ్రీ, రాజనాల వంటి నటీ నటులకు నిలయమైందీ నెల్లూరు. . చిరంజీవి, పవన్ కల్యాణ్ బాల్యంలో ఇక్కడే విద్యనభ్యసించారు. రేగడి విత్తులు రచయిత్రి చంద్రలత,


పలు రచనలు చేసిన డాక్టర్ జయప్రద, పక్షి కథా రచయిత్రి ప్రతిమ ఇక్కడి వారే. ఇంక ఎందరో మహానుభావులు.......



నెల్లూరు పట్టణం

రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆటో లో రామకృష్ణగారింటికి ప్రయాణమయ్యాము. నా బాల్యంలో అంతగా ఊహ తెలియనప్పుడు ఈ ఊరు వచ్చాను. ఊహవొచ్చాక ఇదే నా ప్రధమ రాక. నెల్లూరు నేను ఊహించిన దానికన్నా చాలా పెద్ద ఊరు. విశాలంగా, సుందరంగా గోచరించింది. ఆంధ్ర కేసరి నగర్లో రామకృష్ణగారి నివాసం. దారిలో మాగుంట కాలనిలో ఎన్నో రమ్య భవనాలున్నాయి. అదే దారిలో మాకు రొట్టెల పండుగ జరిపే దర్గా, Audio cassette library and Braille centre for blind కనిపించాయి. రహదారిమీదే రామకృష్ణ గారు మాకు స్వాగతం పలికి వారి స్వగ్రుహానికి తీసుకెళ్ళారు.

పెరుగు రామకృష్ణ



నా నెల్లూరు ప్రయాణానికి ప్రేరణ, రామకృష్ణగారి ఫ్లెమింగో - విడిది పక్షుల దీర్ఘ కవిత. రామకృష్ణగారిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. వీరు రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖలో పని చేస్తున్నారు. మంచి హృదయమున్న కవి, రచయిత. పలు కవి సమ్మేళణాలలో పాల్గొన్నారు. ప్రతిష్టాకరమైన పలు
Photo: cbrao

అవార్డుల బహుమతి గ్రహీత. సభా కార్యక్రమాల నిర్వహణలో దిట్ట.

రామకృష్ణగారు
ప్రధాన కార్యదర్శి నెల్లూరు జిల్లా రచయితల సంఘం
ప్రాంతీయ కార్యదర్శి ఇండియన్ హైకూ క్లబ్
జాతీయ కార్యవర్గ సభ్యులు Indian Society of Authors, New Delhi
ఉపాధ్యక్షులు నెల్లూరు జిల్లా తెలుగు భాషోద్యమ సమితి గా ఉంటున్నారు.



ఆదిలో హంసపాదు

నెల్లూరు పట్టణానికి సుమారు 80 కిలో మీటర్ల దూరంలో నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం ఉంది. పక్షుల అధ్యయనం, వాటి ఛాయా చిత్రాలు తీయటంపై నాకు అనురక్తి. ఈ నెల్లూరు visitలో నేలపట్టు వెళ్ళాలని నా సంకల్పం. అయితే అక్కడ సంవృద్ధిగా నీరు చేరనందువలన ఇంకా వలస పక్షులు రాలేదని రామకృష్ణ గారు సమచారం అందచేసాక నా నేలపట్టు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను.

విశిష్ట వ్యక్తి

నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడే తిక్కవరపు సుకుమార రెద్ది గారి గురించి విని వున్నాను. వారిని చూడాలని ఉంది అని ప్రశాంతితో అన్న అర్థగంటకే వారే రామకృష్ణ గారింటికి వస్తున్నట్టుగా కబురందింది. వారిని కలవాలని నా మనసుత్సాహపడింది.

మంగళవారం, అక్టోబర్ 17, 2006

నా నెల్లూరు పర్యటన -1

నెల్లూరు రైలు ప్రయాణం ప్రశాంతి నుంచి e-mail 'దళారి పశ్చాత్తాపం' పుస్తకంపై seminar ఉన్నది - నెల్లూరు రావాలని. పెరుగు రామక్రిష్ణ గారి కవితా సంకలనం ఫ్లెమింగొ - విడిది పక్షుల దీర్ఘ కవిత సమీక్ష చేస్తూ ఉన్నాను. నెల్లూరు దగ్గరే నేలపట్టు ఉన్నది కావున అక్కడికి వెళ్ళి కొన్ని ఛాయా చిత్రాలు కూడ తీయాలని సంకల్పించాను. నేను వస్తున్నట్లు ప్రశాంతి కి కబురు పెట్టాను. 13 అక్టొబర్ 2006 రాత్రి సింహపురి ఎక్స్‌ప్రెస్ లో సికందరాబాద్ నుంచి ప్రయాణం. నేను స్టేషన్ కు వెళ్ళేసరికే ప్రశాంతి, ప్రశాంతి తండ్రిగారు రామప్రసాద్ నా కోసం నిరీక్షిస్తూ కనిపించారు. నేను వచ్చాను కనుక అప్పటిదాక ప్రశాంతి కి తోడుండిన రామప్రసాద్ గారు మాకు వీడ్కోలు చెప్పి వెళ్ళారు. ప్రశాంతి గురించి తెలియని వారి కోసం ఆమె గురించి నాలుగు మాటలు చెప్తాను. ప్రశాంతి M.Sc Computer Science చదివి Technical Writer గా ఒక MNC లో పనిచెస్తున్నారు. దయార్దహ్రుదయురాలు. To Make A Difference, Yahoo group ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. http://groups.yahoo.com/group/tomakeadifference/ 'దళారి పశ్చాత్తాపం’ పుస్తకం చదివి అందులోని భావాలు మిగతా వారికి కూడ అంద చేయాలనే తలంపుతో పలు సంస్థలు, మిత్రులకు TOMAD Group తరఫున ఈ పుస్తకాన్ని ఉచితంగా అంద చేసారు. నెల్లూరు జిల్లా రచయితల సంఘం తరఫున ఈ పుస్తకంపై గోష్టి కార్యక్రమానికి వారే నడుం కట్టారు. అనారోగ్యంతో ఉన్న ఒక తోటి ప్రయాణీకురాలకు వీడ్కోలు చెప్పటానికై స్టేషనకు వచ్చిన వారిలో ప్రశాంతి నెల్లూరు మిత్రులు కూడా ఉండటం కాకతాళీయం. సుమారు 62 సంవత్సరములున్న వీరు తీవ్ర అనారోగ్యాన్ని కూడ లెక్క చేయకుండా సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా క్రమం తప్పకుండా సెన్సార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సభ్యురాలిగా తనకున్న సౌకర్యాలు, ఒక మహిళా సభ్యురాలిగా సినిమా సెన్సారింగ్ లో గల సాధక బాధకాలు ఎంతో వివరంగా మాకు చెప్పారు. తాను ఇటీవల చూసిన ఒక చిత్రంలో బెడ్ రూం దృశ్యాలు, ఆ వెనువెంటనే బాత్ రూం దృశ్యాలు తనను ఎలా కలవరపెట్టాయో చెప్పారు. వ్యాపార దృక్పధంతో స్త్రీని నగ్నంగా చూపటానికి నిర్మాతల ఆరాటం, సెన్సార్ సర్తిఫికేట్ కోసమై సెన్సార్ బోర్డ్ సభ్యులను ప్రలోభపెట్టడానికి నిర్మాతల ప్రయత్నాలు వివరించారు. ఆ ఉద్యొగం కత్తి మీద సాము లాంటిదన్నారు. వారు ప్రస్తుతము ఇంకా సెన్సారు బోర్డ్ సభ్యులుగా ఉన్నారు కావున వారి పేరు వెళ్ళడించటము భావ్యము కాదు కనుక చెప్పటం లేదు. వీరికి తీరిక సమయం ఎక్కువ. హింది బాషలో మంచి పట్టు ఉంది కనుక మైథిలి శరణ్ గుప్త్ ‘సాకేత్’ (రామాయణంలో తక్కువ పాత్ర వున్న ఊర్మిళ పై రాసిన పద్య మాలిక ) , జయశంకర ప్రసాద్ పద్యకావ్యం, కామాయని ( మానవజాతి భావొద్వేగాలు, ఆలోచనలు, క్రియలను పౌరాణిక పాత్రల ద్వార ఇందులో ఆవిష్కరించారు), ప్రేమచంద్ గబన్ - The Stolen Jewels లాంటి కళాఖండాలను తెలుగులోకి అనువదించమన్న నా సలహాకు ఆమె ఆమోదాన్ని తెలిపారు. నెల్లూరులో వీరికి వీడ్కోలు చెప్పాక, నెల్లూరు స్టేషన్లో ప్రశాంతి మేనమామ శాయిక్రిష్ణ మాకు ఆహ్వానం పలికారు. .వారింటికి రమ్మన్న ఆహ్వానం ఉన్నప్పటికీ, రామక్రిష్ణ గారితో అనేక విషయాలు చర్చింపవలసిన ఆవశ్యకత వలన, నేను, ప్రశాంతి, రామక్రిష్ణ గారింటికే వెళ్ళాలని నిర్ణయించాము.

మంగళవారం, అక్టోబర్ 10, 2006

తెలుగు బ్లాగరుల సమావేశం అక్టోబర్ ‘06




Photo by cbrao ఎడమనుంచి కుడికి శ్రిహర్ష, శ్రీనివాసరాజు, చదువరి.

అక్టొబర్ నెల 8వ తారీకు సాయంత్రం వెంగళరావు నగర్ హంగ్రీజాక్స్ బేకరి వద్ద వీవెన్, చదువరి నాకోసం నిరీక్షిస్తూ కనిపించారు. వారిద్దరితొ బాటు ఒక నూతన వ్యక్తి కనిపించారు. ఎవరబ్బా అని అలోచిస్తుంటే వీవెన్ పరిచయం చేశారు త్రివిక్రం అని. త్రివిక్రం బ్లాగుపై నేను సమీక్ష రాసి ఉన్నాను. (చూడండి - https://paradarsi.wordpress.com). ఊహలకు భిన్నంగా త్రివిక్రం త్రివిక్రముడంతటివాడు కాడు, అట్లని వామనుడు కాదు. ఆలోచనలో, రాయటంలో పెద్ద కాని త్రివిక్రం ఉండటానికి మధ్యస్తంగా ఉన్నారు. మితభాషి.

ఇంతలో శ్రినివాస రాజు వచ్చారు. వీరి బ్లాగులు http://dsrinivasaraju.blogspot.com
http://harivillu.blogspot.com/index.html హరివిల్లు బ్లాగు బానర్ design స్వయంగా అందంగా చేశారు. స్వస్థలం విశాఖపట్టణం ఉద్యొగం హైదరాబాద్‌లో. శ్రినివాస రాజు ‘అందాల రాముడు’ అని, చూసే వారి feeling.




Photo by cbrao ఎడమనుంచి కుడికి సి.బి.రావు, వీవెన్, త్రివిక్రం.


వీవెన్ గురించిన పరిచయం Telugu Lover’s Meet on 24-09-‘06 http://deeptidhaara.blogspot.com లో రాసి ఉన్నాను. cbrao పరిచయంకూడ ఇదే వ్యాసంలో రాశాను. చదువరి ఊహించిన దానికన్నా స్ఫురద్రూపి. వీరి బ్లాగు http://chaduvari.blogspot.com/index.html
వీరి అసలు పేరు తుమ్మల శిరిష్ కుమార్. sirishtummala@gmail.com ఒక Software సంస్థలో యాజమాన్య బాధ్యతలో ఉన్నారు. తెలుగు బ్లాగరులు 'ఆకలి తొడేళ్ల బేకరి ' కి 0 నుంచి 3 కిలొమేటర్ల దూరంలో ఉంటే శిరిష్ ఒక్కరూ దూరంగా వివేకానందనగర్ కాలనిలో నివాసం. తెలుగు వికిపిడియ కార్యక్రమాల్లొ చురుగ్గా ఉంటారు. మిగతావారిని ప్రోత్సాహిస్తారు. వీరి స్వగ్రామం గుంటూరు జిల్లాలోని కావూరు.

సరే, కోరం ఉంది కదా! ఇక కార్యోన్ముఖులవుదామని వెంగళరావు నగర్ తోటకు వెళ్తే, అది తాళము వేసివుండుట వలన సిద్ధార్థ నగర్ తోటకు, చదువరి చతుష్చక్ర వాహనములో వెళ్లాము. ఇష్టా - గోష్టికి అనువైన బల్లలుపై కూర్చొనడమే తరువాయి, హర్ష నుంచి cell phone call వచ్చింది- హర్ష కొద్దిగా ఆలస్యం అవటంతో మమ్మల్ని miss అయ్యారు. ఎక్కడున్నారంటూ? అన్న ప్రశ్నకు వివరంగా బదులిచ్చి మేమున్న park కు రావటానికి కావలిసిన సూచనలిచ్చాను. అతను మన తెలుగుబ్లాగులో నూతన సభ్యుడట. ఇంతవరకూ ఎలంటి mails మన గుంపుకు పంపకపోవటంతో అతను అందరికీ కొత్తే. నేను రచ్చబండ లో రాసిన mails చూసి మన తెలుగుబ్లాగ్ గుంపు లో చేరినట్లుగా చెప్పారు. ఆశ్చర్యం ఏమంటే శ్రిహర్ష గుంపుకు కొత్త కాని కూడలికికి కాదు. శ్రిహర్ష బ్లాగు మీరు చూసే ఉంటారు. http://kinnerasani.blogspot.com/
హర్ష తీసిన ఈ చాయా చిత్రం చూడండి.




ఇందులో focal point నడిచే వ్యక్తి. స్థిర చిత్రంలో కూడా చలనం కనిపిస్తోంది. మంచి composition. harsha.pvss@gmail.com


మన బ్లాగర్ల సమావేశంలో ఎప్పుడూ నూతనంగా సమావేశంకు వచ్చినవారికి ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వటం అలవాటు. ఈ విధానంలో పరస్పర అవగాహనకు అవకాశం ఉంటుంది. ఈ నివేదికలో హర్షగురించి ఇంత రాయటానికి ఇదే కారణం. హర్ష స్నేహితుడు గ్రిద్దలూరు విజయకృష్ణ, గూగుల్, ఉత్తర అమెరికా లో పనిచేస్తున్నారు. చర్చ యునికోడ్‌పైన గూగుల్ అన్వేషణ
పైన మరలటంలో ఆశ్చర్యం లేదు. పలు పత్రికలు, కొన్ని తెలుగు వెబ్‌సైట్లు యునికోడ్‌ లో కాక ఇతర fonts వాడటం వలన పలు అంశాలు గూగుల్ అన్వేషణ లో రాలేక పోతున్నాయి.
తెలుగులో ఇంత సమాచారం లభ్యం అవుతున్నప్పుడు గూడా, అన్వేషణకు అందకపొవటమనే విచిత్ర పరిస్థిలో ఉన్నాం మనం. ఈ సందర్భంలో నాకు Samuel Taylor Coleridge రాసిన The Rime of the Ancient Mariner లోని కవిత గుర్తుకొచ్చింది.
"Water, water, everywhere,
And all the boards did shrink;
Water, water, everywhere,
Nor any drop to drink."

పడవ నడిసంద్రంలో నిలువడినప్పుడు ఒక నావికుని మనస్పందన, కాలరిడ్జ్ ఎంత చక్కగా చెప్పారో; సమాచార వెల్లువలో కొట్టుకపోతున్న మనకు ఈ సమాచార లేమి, నావికునికి మనకూ ఉన్న దగ్గర సామీప్యాన్ని చెప్పకనే చెప్తుంది. ఈ సందర్భంలో ఎంతో ముందుచూపుతో Unicode వ్యాప్తికై చావా కిరణ్ చేసిన, చేస్తున్న కృషిని అందరమూ అభినందించాము.

ఇష్టా గోష్టిలో పలు అంశాలు మా దృష్టిలోకి వచ్చాయి. http://www.archive.org/details/millionbooks
లో 2248 తెలుగు పుస్తకాలు లభ్యమౌతున్నాయి, ఉచితంగా. చూడండి. http://tinyurl.com/owpsz
పుస్తకాలకు www.amazon.com పెట్టింది పేరు. తెలుగులో కూడా అమజాన్ లాంటిది ఉంది తెలుసా? చూడండి - http://www.avkf.org ఇక్కడ ఎన్నో తెలుగు పుస్తకాల సమీక్షలు కూడా ఉన్నాయి. మీ అభిమాన రచయితల పుస్తకాలకై ఇక్కడ order చేసే సదుపాయం ఉంది. పుస్తక సమీక్షలన్నీ image .jpg లో వుండటం వలన search కి దొరకవు. అన్వేషణకి Unicode తప్పనిసరి అని మీకు తెలుసు. హర్ష ఈ avkf వారిని కలిసి Unicode గురించి చెపితే, వారు ఆసక్తి కనిపించారని చెప్పారు. మరి మనం ready యా?
http://eemaata.com/em ఈ-మాట electronic bi-monthly చూసారా? ఇది తెలుగులోని ఏకైక Unicode పత్రిక. తెలుగు బ్లాగరుల తరపున ఈ-మాట వారికి అభినందనలు తెలుపుదామా?
Unicodeలో లేని తెలుగు వెబ్సైట్లు, మాసపత్రికల విషయమై ఏమి చేద్దాము?

హర్ష ఆగమననికి ముందు చదువరి, సి.బి.రావు మధ్య తెలంగాణ విషయమై లఘు చర్చ జరిగింది. కొద్దిరొజులైనా తెలంగాణా ని పక్కకు పెట్టి వెరే విషయంపై చదువరి బ్లాగురాయటం అనే సక్రియ (మంచి పని) అభినందనలు అందుకొన్నాక సి.బి.రావు చర్చను కొనసాగిస్తూ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలనుట తప్పు. అసలు బాష ప్రాతిపదికపై రాష్ట్రం కావాలనుట ఒక చారిత్రాత్మక తప్పు. దేశము పరిపాలనా సౌలభ్యానికై, మాత్రమే విభజింపబడాలని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఈ నదీ జలాల పంపిణి గొడవలు, రాష్ట్రాల మధ్య సరిహద్దు తగాదాలు ఉండవన్నారు.

అసలు నాకైతే మానవజాతి విశ్వాన్ని, ఇట్లా దేశాలుగా విభజించుకొవటమే ఈ సరిహద్దు తగాదాలు, యుద్ధాలకు మూలకారణమనిపిస్తుంది. ఈ స్వార్థ పూరిత అభిమానాలు వదిలేసి , ఎప్పుడైతే మనం విశ్వ మానవులం అవుతామో అప్పుడే మనకు నిజమైన శాంతి దొరుకుతుందనే గట్టి భావన ఉంది. ఈ విశ్వశాంతి ఎప్పుడు సాధ్యపడేను?

సాయంత్రపు చీకటి మెల్ల మెల్లగా విస్తరిస్తూంది. చర్చలో పడితే పొద్దే తెలియదు. ఎంతటి మంచి విషయాలకైనా ముగింపు తప్పదు కదా! మరల వచ్చే నెల కలుద్దామంటూ, ఆనంద హ్రుదయాలతో - సమావేశం కంచికి -మనమింటికి.

శనివారం, అక్టోబర్ 07, 2006

పర్యావరణ సమతుల్యం : పక్షులు


Photo by cbrao

ప్రకృతిని, అందులోని జీవజాలాన్ని రక్షించడం ఎలా, ఏం చెయ్యాలి ? అంటే, వాటి జోలికెళ్ళక పోవటమే సరైన చర్య అంటే కొంత ఆశ్చర్యం కలుగక మానదు. వాస్తవం ఏమంటే, మనిషి తన స్వార్థానికై, అడవులను, కలప మరియు ఖనిజాలకై ఆక్రమించటంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతిని వృక్ష, జంతుజాలాల మనుగడకు తీరని విఘాతం కలుగుతుంది.


Jerdons Courser

ఉదాహరణకు కలివికోడి పక్షిసంగతి మాట్లాడు కొందాం. T.C. Jerdon అనే British Surgeon కడపజిల్లాలో కనుగొన్న ఈ పక్షి, ఈ మధ్య వార్తల లోకి వొచ్చింది . కనుమరుగైందనుకున్న కలివికోడిని, భరత్ భూషణి అనే పక్షి శాస్త్రజ్ఞుడు 86 ఏళ్ళ తరువాత మళ్ళ కనుక్కొవడం జరిగింది. బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ , Bird watchers Society of A.P. మరియు Department of Forest వారి కృషితో శ్రీలంకా మల్లేశ్వరం అభయారణ్యం ఏర్పడింది. అక్టోబరు 2005న తెలుగు గంగ కాలువపనులు ఈ అభయారణ్యం గుండా జరుపటానికి జరుగుతున్న ప్రయత్నాలు, భరత్ భూషణ్ గుర్తించి , సంబంధిత అటవీఅధికారులను సకాలంలో హెచ్చరించంటతో, కాలువనిర్మాణపనులను అటవీఅధికారులు ఆపివేసి, కలివికోడి ఆవాసాన్ని రక్షించారు. BNHS, BSAP, WWF ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చించి, కాలువ గతిని మార్చేప్రయత్నంలో కృతకృత్యులైనారు. మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు పక్షికేంద్రాన్ని దర్శిస్తే మనకు అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. BSAP సభ్యుడు మృత్యుంజయ రావు ఈ కేంద్రం అభివృద్ధికి చాలా కృషిచేసినారు. పక్షులను గ్రామస్తులు ఉపయోగ కరమైనవిగా గుర్తించటం వెనుక వీరి కృషి ఉంది. తొలుత పక్షులు రెట్టలు వేసి, చెరువు నీటిని పాడుచెయ్యడం వలన ఆ నీరు త్రాగడానికి పనికి రాకుండా పోయింది. స్నానం చేస్తే ఒళ్ళు దురదలు. గ్రామస్తులు కోపంతో, పక్షులకు ఆశ్రయమిస్తున్న చెరువులోని కొన్ని చెట్లను కొట్టివేసారు. దీనితో వలస పక్షులకు ఆవాసం కరువైంది. సంబంధిత అధికారులను కలసి, పక్షి కేంద్రం ఏర్పాటు అవసరాన్ని వివరించాక, ఇక్కడ పక్షి కేంద్రం స్థాపించారు. కాపలాదారునికూడా నియమించటం జరిగింది. పక్షులు వేసిన రెట్టలతో , సారవంతమైన నీరు , నేడు వ్యవసాయానికి ఉపయోగించి ఎక్కువ దిగుబడి పొందగలుగుతున్నారు రైతులు. సంబంధిత అధికారులు గ్రామస్తుల దైనందిక అవసరాలకు నీటి పంపిణి చెయ్యటంతో, పక్షుల మరియు గ్రామీణుల మధ్య ఘర్షణ తొలిగింది. ఇప్పుడు ఒకరికి ఒకరు మిత్రులైనారు.
ఒక ప్రదేశం యొక్క పరిసరాల స్వచ్ఛతను అక్కడి గాలి, నీరు మరియు అక్కడి జీవజాల పరిస్థితులను చూసి తెలుసుకోవచ్చు. కొంత కాలం క్రితం రసాయనాల రాకతో కలుషితమైన హుస్సేన్ సాగర్లో, చేపలు చనిపోవటం గమనించటం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంవారు సాగరజలాలను శుద్థి చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది మెచ్చుకోదగ్గ పరిణామం.

కొల్లేరు సరస్సులో మితిమీరిన ఆక్రమణల వలన, సరస్సు వైశాల్యం కుంచించుకుపోయి, 2005లో ఏలూరు తదితర ప్రాంతాలలో వరదలు వచ్చి, పంటపొలాలకు తీవ్రనష్టం కలిగింది. వలస పక్షులు సరైన వసతి, ఆహారం లేక ఈ సరస్సు నుంచి వేరే ప్రాంతాలను ఎంచుకొంటున్న తరుణంలో కొల్లేరు పునరుద్ధరుణ పనులు, ప్రకృతి సమతుల్యానికి ఎంతో ప్రాణమై నిలుస్తాయి. ప్రకృతిని ప్రేమించండి. పర్యావరణాన్ని కాలుష్యం భారినుండి కాపాడండి. ప్రకృతి పచ్చగా ఉన్నంతకాలం, మానవుడి మనుగడకి ఢోకాలేదు.
మీవంతు కృషిగా Bird watchers society of Andhra Pradesh, World Wildlife Fund వంటి సంస్థలలో సభ్యులుగా చేరి, ప్రకృతి సమతుల్య పరిరక్షణలో చేయూత నివ్వండి.
- - 25th July 2006 న ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం, ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్రసారమయ్యింది.

మంగళవారం, అక్టోబర్ 03, 2006

సామాజిక సేవ

మానవ సేవ మాధవ సేవ అని మీరు నమ్ముతారా? సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకునే ఆసక్తి ఉందా? అయితే ఈ గుంపులో సభ్యులు కావచ్చు.

http://groups.yahoo.com/group/tomakeadifference

సోమవారం, అక్టోబర్ 02, 2006

Telugu Lover’s Meet on 24-09-‘06

Kum. Lakshmi Prasanthi Uppalapati (known for her Dokku face4-http://geocities.com/dokkuface4/) an active member of Telugu Brains and MAD (To Make a difference Yahoo group) is a kind hearted lady. She is sympathetic to issues like child abuse, atrocities on woman and ambitious to help people, who need help. Recently, she conducted a Telugu lover’s meet at Ameerpet, Hyderabad, about which Sowmya wrote at http://www.telugupeople.com/discussion/MultiPageArticle.asp?id=45762&page=1

Allow me to present my account of the event.
The meeting was scheduled at 3 p.m. at Dr Sundar Raj’s clinic almost next to Sri Krishna Sweets. Dr Sundar is busy treating patients for diabetes etc ailments, in Ayurveda way. In Hyderabad you will see many medical shops attached to clinics. The difference here is a doctor almost attached to a sweet shop. Many enthusiastic Telugu lovers started pouring in to the clinic even before appointed time. The meeting started with introductions, as participants there belong to different groups like Telugupeople, Telugu Brains, Telugu blog and MAD people and didn’t know each other.

The meeting lasted for more than 3 hours. The entire atmosphere is charged with dynamic electricity and never there was a dull moment. The following members are present.

1) Phanindra
2) Hanokh Babu
3) Praveen
4) Siva Mangesh
5) Srinivas.Datla
6) Kashyap
7) Cbrao
8) Veeven
9 & 10) Chava Kiran & his friend
11) Lakshmi Prasanthi Uppalapati
12) Naresh
13) Dr.Sundar raj Perumal
14) Kavita
15) Suseela
16) Chandra Lakshmi
17) Sowmya
18) Poolavana Ravikiran
19) Swathi Ravikiran


Prasanthi: She started the deliberations; nay, introductions.

Phanindra is a very good singer and he adores Sirivennela Sitarama Sastry. He can speak hours on the lyrics of Sirivennela. He is in software development (DSP Engr) and works for a firm.

Hanok Babu: He is a native of Nellore. He is a good flute player. He is learning Piano as well. Alas he didn’t bring his flute to the meeting on that day. Better luck, next time.

Praveen: He is in software development and writes to telugupeople.com

Siva Mangesh: He works for a financial data firm and had his blogs. He is a member of Telugublog. http://sivamangesh.wordpress.com 
http://teluguvaramandi.wordpress.com

Srinivasaraju datla He is a good looking guy, soft in nature and in software development.
He maintains a blog at http://dsrinivasaraju.blogspot.com/

KASYAP P: He is in software development. ‘ గుంపులో గోవిందయ్య ’ - గా టీపీ లో పిలవబడు కశ్యప్‌ గారి హాస్య చతురత తో అందరినీ నవ్వించారు. He is a regular contributor to www.telugupeople.com

Cbrao: He is fond of reviewing Telugu blogs and ambitious to bring popularity to Telugu blogs. His blog reviews are published in several Telugu groups. He introduced late Sanjivadev (http://tinyurl.com/jl4j8) who was an artiste, art critic, philosopher and writer of several books in English and Telugu on various topics, to the audience. More info about him at
http://groups.yahoo.com/group/biosymphony/
http://deeptidhaara.blogspot.com/
http://paradarsi.wordpress.com/

Veeven: He is known for Lekhini, which renders good Telugu transliteration. Most Telugu bloggers use this software for writing their blogs. He is also a Wikipedian and writes to Wikipedia, Telugu encyclopedia. Contrary to expectations he is very simple in nature and great for the contribution of popularity of Telugu blogs. Recently he developed Nikhile which transliterates Telugu to RTS. He talks less and works more in the background. His website Koodali, an amalgamation of all Telugu weblogs is popular among bloggers.
http://veeven.com/
It has links to his other websites
లేఖిని | కూడలి | శోధిని | 3D Logos
http://veeven.wordpress.com/

Chava Kiran’s friend: Details about Kiran’s friend are not available. Both appear to be colleagues in the same software firm, where they are working.

Chava Kiran: Sharp, reacts quickly to a problem and helpful in attitude. He did yeoman service for the promotion of Telugu on net and a pioneer in Telugu blogs. He works in a MNC as a software developer. Contribution to Wiki: Kiran is one of the seven moderators and is an active participant in Wikipedia. His total edits in Wiki are 919. He is a staunch promoter of Telugu Unicode. He moderates http://groups.google.com/group/telugublog
Kiran's Blog: http://oremuna.com/blog

Lakshmi Prasanthi Uppalapati: She is a native of Nellore and a good samaritan. Fond of the book ‘దళారి పశ్చాత్తాపం’ ‘Confessions of an Economic Hit Man’ written by John Perkins and arranges seminar to discuss the contents of this book. She is organizing a seminar on this book in Nellore on Oct 15, 4 pm to 7 pm. All book-lovers can attend this meet. She is on the look-out for volunteers for social service activities, for which she has several ideas. She writes good modern songs and reads them to her friends.
http://geocities.com/dokkuface4
prasanthi.uppalapati@gmail.com

Naresh: He is a neighbour of Dr. Sundar Raj. Though he says that he didn't read much, he knows many things. He is a good reader and good singer as well. He can sing old Hindi songs very well. He remembers the lyrics too.

Dr.Sundar raj Perumal: He is knowledgeable in Sanskrit, Ayurveda and Yoga. He conducts Yoga classes everyday in the morning at his clinic, free of charge. He entertained the audience with jokes in Sanskrit language. Though most participants do not know Sanskrit, most of us enjoyed because of his good rendition of Sanskrit coupled with good performance. We had a hearty laugh. Dr. Sundar Raj - 93924-91036.


Dr. Kavita: Friend of Dr.Sunder Raj

Suseela: Sister of Dr.Sunder Raj. She served fruit salad to all the participants.

Chandra Lakshmi: She is a doctor working in the clinic of Dr.Sundar Raj.

Sowmya: Bubbly and friendly in nature. A Tamilian who writes book reviews in Telugu language and a student of IIIT, in Hyderabad. It is needless to say that she loves to read books. Know more about her at http://www.bitingsparrow.com/biosymphony/Sowmyablogreview.pdf
Sowmya’s blog at http://vbsowmya.wordpress.com/
She participated actively in the discussions. She wrote F.I.R. about this meet at http://www.telugupeople.com/discussion/MultiPageArticle.asp?id=45762&page=1 She is a regular contributor to www.telugupeople.com. Recently she joined as a member of Telugublog.

Kotta Ravikiran: He is more popular as Poolavana Ravikiran. He always wonders at the beauty of Telugu script, different fonts and language. He is a lover of Telugu literature and nature. He likes trekking in the hills and drenching himself in the wild rain. He is a book lover and likes Osho philosophy. He works in an animation studio and naturally likes a work that is creative. To know more about him visit his website at http://www.poolavana.com/

Swathi Ravikiran: She is wife of Kotta Ravikiran and mother of Neha. She is a post graduate in management and at present using all her skills in managing house and Ravikiran.

As I wrote earlier, participants are not familiar with each other. Most of the time was spent in introductions. Prasanthi informed the gathering about the availability of funds/sources and invited volunteers to join her social service activities. The entire meeting went on with full of jokes on poems/poets and other topics. The meeting brought few lovers of Telugu to a common platform. Let us all wish that it is a beginning for a much more meaningful meetings in future.

ఆదివారం, సెప్టెంబర్ 17, 2006

పులిరాజుకి ఐడ్స్ AIDS వస్తుందా?





పులిరాజుకేమిటి వాడిబాబు కైనా వస్తుంది ఐడ్స్, సామాజిక కట్టుబాట్లు తప్పితే, తగిన జాగ్రత్తలు తీసుకొకబొతే. ఇంతకీ మన పులిరాజు ఏమయ్యాడు? చనిపొయాడు. ఎలా? కొంపదీసి AIDS వచ్చిగాని చనిపోలేదు గదా!

ఘనత వహించిన మన ప్రభుత్వం వారే పులిరాజును చంపేసారు. పర్యవసానం ఏమవుతుంది? అమెరికా లో ఆఫ్రికన్ - అమెరికన్ స్త్రీ పురుషులలో ప్రతి ముగ్గురిలో ఒకరికి మరణం ఈ భయంకరమైన ఐడ్స్ ద్వారా సంభవిస్తుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా 38.6 మిలియన్ ప్రజలు ఈ AIDS వ్యాధితో బాధ పడుతున్నారు. భారత దేశంలో 5.7 మిలియన్ ప్రజలు ఈ వ్యాధితో ఉన్నట్లు అంచన. ఇక రాష్ట్రాల విషయానికొస్తే AIDSలో ఆంధ్ర ప్రదేష్, గొవా, కర్నాటకా రాష్ట్రాలు దేశంలో ప్రధమ, ద్వితీయ మరియు త్రుతీయ స్థానాల్ని కలిగిఉన్నాయి. ప్రపంచ దేశాలకు AIDS మందులు ఎగుమతి చేసే భారతదేశంలో, బీదవారైన, ఈ వ్యాధిగ్రస్తులకు సరైన మందులు అందుబాటులో లేవు.

ఈ వ్యాధి గురించి ప్రజలకే గాదు, చట్టాలు చేసే సర్కారు శాఖలకూ సరైన అవగాహన ఉందా? మీకు తెలుసా? 1999 లో కర్నాటక పోలిస్ వ్యవస్థ లో కె.రమేష్‌రావు ఎంపిక అయినప్పటికి, 1994 లో చేసిన చట్టం వలన, తనకు AIDS ఉన్నందువలన ఉద్యోగార్హత కొల్పోయాడు. అయితే Karnataka Administrative Tribunal ఈ చట్టం చెల్లదని 2005లో తీర్పు చెప్పింది. పోలిస్ అధికారులు చట్టాన్ని గౌరవిస్తామని రమేష్ రావు కి ఉద్యొగం ఇస్తామని చెప్పారు.

ఈ వ్యాధి కి గురైన ఎంతోమంది ప్రజల అనాదరణకు గురౌతున్నారు. చికిత్సాలయా ల్లో కూడ ఈ రొగులపట్ల సరైన అవగాహన ఉన్నట్లు కనిపించదు. AIDS వ్యాధి సోకిన పిల్లలకు ప్రత్యేక అనాధ శర ణాలయాల్లొ ఆశ్రయమిస్తున్నారు. వీరికి విద్యాలయాలు ప్రవేశం నిరాకరిస్తున్నాయి. ప్రజల్లో ఈ వ్యాధిగ్రస్తులపట్ల ఎన్నో భయాందోళన లున్నాయి.



ఫ్రభుత్వం ఈ వ్యాధి చికిత్సకు, నివారణకు ఇంకా ప్రజల్లో AIDS గురించిన అవగాహన కలిగించే పనులు ఎన్నో చెయ్యల్సి ఉంది. మన తెలుగు సీరియల్స్‌లో, చనిపొయిన నాయకుడు, మరల బతికి వచ్చినట్లుగా, పులిరాజును మళ్లా ప్రజల్లోకి తీసుకు రావలసిన అవసరం కనిపిస్తోం ది. లేకుంటే ఈ వ్యాధి విశ్వరూపానికి జాతి నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది. పులిరాజా! నీకు స్వాగతం పలుకుతున్నాం.

శుక్రవారం, సెప్టెంబర్ 15, 2006

కవిరాజు త్రిపురనేని పురస్కారము


మిత్రులు, శ్రీ ఐ. మురళీధర్ కు ధర్మనిధి పురస్కార ప్రకటన వెలువడగానే నా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వారికి అభినందనలు తెలిపాను. పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం, హైదరాబాదు వారి 2005 ధర్మనిధి పురస్కారాల ప్రధానొత్సవం 13-09-20006 సాయంకాలం 6 గంటలకు. వేదిక: విశ్వవిద్యాలయ ఆడిటోరియం,పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాదు.

ఈ పురస్కారాలను విభిన్న రంగాలలో కృషి చేసిన పలువురు ప్రముఖలకు అందించబొతున్నారు. ప్రతి బహుమతినీ ఆయా రంగాలలో కృషి చేసి పేర్గాంచిన విశిష్ట వ్యక్తుల పేరు మేదుగా ఇవ్వబొతున్నారు. మిత్రులు మురళీధర్‌కు లభించబొతున్నది కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారకపురస్కారం. ఈ సందర్భంగా కవిరాజుగారి గురించి నాకు తెలిసింది రాస్తాను.

కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదర గారు హేతువాది, సంఘసంస్కర్త, మాత్రు దేశాభిమా ని, స్వతంత్ర సమర యోధుడు, అవధాని, కవి, రచయిత. కులాభిమానం వలదన్నారు. తన పేరు లోని చౌదరి తీసివేసి, అంటరానితనం తప్పన్నారు.
ఈ కులాలకు ప్రాచీన గ్రంధాలలో ఆధారాలు లేవని ఇవి కేవలం పురోహితవర్గాల కల్పనని వారిపై ధ్వజమెత్తారు. తెనాలి Municipal Chairman గా ఉన్నప్పుడు జంతుబలులు దురాచారమని ఆపించారు. ఈ కారణంగా Municipality లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపొయాక, ఎన్నికలలో మరల పోటీ చేసి గెలిచారు. గాంధిగారు తెనాలి వచ్చినప్పుదు పౌర సన్మానం చేసారు. ఉప్పుసత్యాగ్రహానికి తనవంతుగా ప్రొత్సాహాన్నిస్తూ బహుళ ప్రాచుర్యం పొందిన ఈ గేయం రాసారు.

వీరగంధము తెచ్చినారము
వీరుడెవ్వడొ తెల్పుడీ
పూసిపోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో

ప్రస్తుత వివాహక్రతువు ఖర్చుతో గూడినదని, దాన్ని సరళీకరిస్తూ వివాహ విధి అనే పుస్తకాన్ని రాయటమే కాక తనే స్వయంగా పౌరోహిత్యం వహిస్తూ ఎన్నో వివాహాలు ఆధునికంగా చేసారు. వీరి ముఖ్య రచన సూతపురాణము. ఆయన ఒక Iconoclast. విశ్వనాధ సత్యనారాయణ శంబూక వధను సమర్ధిస్తూ వేన రాజు రాస్తే, కవిరాజు దాన్ని వ్యతిరేకిస్తూ ఖూని రాసారు.
రామస్వామి న్యాయవాది. ఆయన తనకు జస్టిస్ పార్టి తో ఉన్న సంబంధంతో పెద్ద స్థాయి ఉద్యోగం పొందే అవకాశం ఉన్నప్పటికీ వలదన్నారు. రైతు,దీనజన పక్షపాతిగా వారి సేవ నే తన మార్గంగా ఎంచుకొన్నారు. మానవసేవే మాధవసేవ అని నమ్మారు. చూడండి...

మలమల మాడు పొట్ట , తెగమాసిన బట్ట ,కలంతపెట్టగా
విలవిల యేడ్చుచున్న నిఱుపేదకు జాలిని జూపకుండ, ను
త్తలపడిపోయి, జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్
పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల నిచ్చమెచ్చెదన్.

మా మతం గొప్పదంటే కాదు మా మతం గొప్పదని వాదులాడే మతొన్మక్తులను ఈసడిస్తూ ....


చం. ఒకరుడు 'వేదమే' భగవ దుక్తమటంచు నుపన్యసించు నిం
కొకరుడు 'బైబిలే' భగవదుక్తమటంచును వక్కణించు, వే
రొంకరుడు మా ' ఖొరాన్ ' భగవదుక్తమటంచును వాదులాడు, నీ
తికమక లేల పెట్టెదవు? తెల్పగరాదె నిజంబు నీశ్వరా.

కవిరాజుకు వారి సేవలకు గుర్తింపుగా, 1940లో గుడివాడ ప్రజానీకము గజారోహణ సన్మానము గావించిరి. వీరికి గోపిచంద్,గోకులచంద్ కుమారులు. వీరు కూడా సాహితీ రంగంలో పేర్గాంచినారు.
కవిరాజు జననం 15 జనవరి 1887.
1943 జనవరి 16న కీర్తిశేషులైనారు.

మరింత సమాచారానికై చూడండి...

http://andhrajyothy.com/editshow.asp?qry=/2006/jan/13edit3
http://tinyurl.com/pnu4l
http://www.freeindia.org/dynamic/modules.php?name=Contentpa=showpagepid=459
http://kaviraju.blogspot.com/


కవిరాజు త్రిపురనేని పురస్కార మహోత్సవము.
చిత్రంలో ఎడమనుండి సినిమా గేయ కవి వేటూరి,ఆర్థిక మంత్రి రోసయ్య, విశ్వవిద్యాలయ ఉపాద్యక్షులు మంజులత ,హేతువాది మురళీధర్. Photo by cbrao


మరి కవిరాజుపేరున సన్మాన గ్రహీత ఐన మిత్రులు మురళిధర్‌గురించి ఇప్పుడు చెప్తాను. 1977లో అబ్రహాం కొవ్వూర్ భారత పర్యటనతో ప్రభావితులై, హేతువాదిగా మారారు. కులం పెరుతో గుర్తించబడటం ఇష్టం లేక తన పేరు లోంచి ' రెడ్డి ' తీసివేశారు. తను నమ్మిన సిద్ధాంతాలకు, తండ్రి చనిపోయిన తరుణంలో జరుపవలసిన కార్యక్రమాలాకు మధ్య వైరుధ్యాలవలన, ఆ కర్మకాండను వారి చిన్నాన్న జరిపారు. వీరి రక్తం అరుదైంది కావటంతో (O -ve) హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తూనే రక్తదానానికై పరుగెడతారు. ఇంతవరకూ 23 సార్లు రక్తదానం చేశారు. వీరి తండ్రిగారి కండ్లను నేత్రదానం చేసారు. వీరి ఇంటిల్లిపాదీ నేత్రదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.


ఆర్ధిక మంత్రి రోసయ్యగారి చేతులమీదుగా సన్మానం. Photo by cbrao.

తెలుగులో హైకూలు రాశారు. పుస్తకాల ముద్రణలో నవ్యతను, అందాన్ని తెచ్చారు. సంజీవదేవ్, యెలవర్తి రోసయ్య ఇంకా ఎం .ఎన్ .రాయ్ చిత్తరువుల పుస్తకాలను ఎంతో అందంగా వెలువరించారు. Rationalist Voice మాస పత్రికకు ఏడు వత్సరాలుగా సహ సంపాదకుడిగా ఉన్నారు. FARA (Federation of Atheist, Rationalist and Humanist associations), CFII (Center for Inquiry India) తరఫున నవ్య మానవతావాద సిద్ధాంతాల ప్రాచుర్యానికై పలు సభలు నిర్వహించారు. హేతువాద పుస్తకాలు ప్రచురించారు. వ్యాపారంలో సమయాభావలేమి ఉన్నా, హేతువాద కార్యక్రమాలకు ఎలాగోలా వీలు చేసుకుంటారు.



సన్మాన పత్రం. Photo by cbrao.