శనివారం, జూన్ 28, 2008

అంతర్జాల వీక్షణం -3



నమ్మ బెంగలూరు
http://avee-ivee.blogspot.com/2008/06/blog-post_11.html

ಮಹಾ ಯೋಗಿ ವೇಮನ ರಸ್ತೆ - ఎందుకు ఏఁవిటీ ఎలా
http://andam.blogspot.com/2008/06/blog-post_27.html

మీరు మన బెంగలూరు లో బస్ ప్రయాణం చేసారా? లేకుంటే ఒక సారి పయనించి చూడండి. అక్కడి బస్ లో ప్రయాణం, తన బ్లాగు చదవటమూ గొప్ప education అని సెలవిస్తున్నారు త్రివిక్రం. మీకు స్వయంచాలిత బాగిలు అంటే తెలుసా? ఈ టపా చదివితే మీకు గొప్ప జీవన తత్వం నడువె అంతరవిరళి అఫవాతక్కి అవసరవే కారణ అనే మాటలలో గోచరమవుతుంది. కన్నడలో ఉంది, ఇది ఎలా అర్థమవుతుంది అని బెంబేలు పడవద్దు. మీకు తెలుసా నమ్మ బెంగలూరు లో పూలు, పాలు ఇంకా పళ్లు లభ్యం కావని? నమ్మశక్యం కాని ఈ విషయానికి కారణ మేమిటో తెలుసా? త్రివిక్రం మార్గసారధై మనకు వాటి మతలబు, హాస్యభరితంగా వివరిస్తారు. కొరమంగలం లో ఉన్న మహాయోగి వేమన రస్తే గురించి, ఆ పేరెలా వచ్చిందో వగైరా కథా కమామిషు నమ్మ రాకేశ్వర మాటలలో తెలుసుకోండి. ఆసక్తికరమైన కథనం.

తెలుపు_నలుపు
http://sbmurali2007.wordpress.com/2007/12/05/problem/

ఆస్ట్రేలియాలో అడవులకంటే ఎడారి ప్రాంతమే అధికం. భూ విస్తీర్ణ తో పోలిస్తే, జనాభా సంఖ్య తక్కువ. "సాధారణంగా మనం ప్రకృతి అందమంతా గల గలా పారే నదుల్లోనూ, పచ్చని చేలల్లోనూ వుందని అనుకుంటాం. “అక్కడేముంది, నా మొహం, ఉత్త ఎడారి ప్రాంతం”, అని మనం చాలా సార్లు చప్పరించేస్తాం కూడా. కానీ ఆస్ట్రేలియా ఖండాన్ని చూసిన తరువాత మనకనిపిస్తుంది, ఇంత ఎర్రటి ఎడారి కూడా ఎవరో చిత్రకారుడు ప్రశాంతమైన మనసుతో కుదురుగా కూర్చుని గీసిన బొమ్మలా ఎంత అందంగా వుందని." అంటారు అడిలైడ్ నగరంలో నివసించే శారద. ఆస్ట్రేలియా దేశం లోని Great Barrier Reef, 12 Apostles, Kangaroo island మొదలగు సుందర ప్రాంతాల గురించి వివరిస్తున్నారీ వ్యాసంలో. మీ పడక్కుర్చీలో కూర్చుని, ఆస్ట్రేలియా చుట్టిరండి.


మారెప్పోపాఖ్యానం
http://anilroyal.blogspot.com/2008/05/blog-post_06.html

లీలామోహనం : చిరంజీవిపై మారెప్ప దాడి
http://vijayamohan59.blogspot.com/2008/06/blog-post_24.html

రాజకీయాలు మురికివన్న అపప్రధ ఊరికే రాలేదు. ఎంతసేపూ అవతల వారిని ఆడిపోసుకుని పైకి రావాలన్న దుగ్ధ ఎక్కువగా కనిపిస్తుంది. మంత్రి మారెప్ప లీలలు చూశారా అంటూ అబ్రకదబ్ర, విజయమోహన్ లు చెప్తున్న కబుర్లు విన్నారా? చిరంజీవిని రక్తవ్యాపారి అంటూ తాజాగా వార్తలలోకి ఎక్కిన మారెప్ప పై విశ్లేషణలే ఈ వ్యాసాలు..

అమెరికాలో వస్త్రధారణ
http://www.apweekly.com/sahitya/sahi.asp?ID=AWA20051011033557&Title=Literature+-+Miscellaneous&lTitle=&Topic=0&Author_Id=0&spart=0&scat=0&ndate=10/11/2005

మీరేదైన కొత్త వ్యక్తుల గుంపులోకి వెళితే, వారు మొదటగా గమనించిందేమిటో తెలుసా? మీ ఆహార్యాన్ని. మీ దుస్తుల బట్టి మీకు గౌరవం లభిస్తుంది. పరిచయం అయ్యాక, మీ గురించి తెలిసాక మీ వ్యక్తిత్వం బట్టి మీకు గౌరవం లభిస్తుంది. ఎక్కువ విని, తక్కువ మాట్లాడే వారికి ఎక్కువ గౌరవం లభించటం చూస్తుంటాము. అమెరికా లో కూడా, మీరు వేసుకునే దుస్తుల బట్టి మీకు గుర్తింపు రావటమో, లేక గుర్తింపు లేక పోవటమో వుంటుంది. వస్త్రధారణ బట్టి, వ్యక్తులను పాప్యులర్, జాక్స్‌, ప్రెప్పీస్,పంక్‌,గాత్,గీక్‌,నెర్డ్‌,నార్మల్‌ ఇంకా గేమర్స్ అని వ్యవహరిస్తారు. మరి వస్త్రధారణ ప్రకారం మీరు ఏ group నకు చెందుతారు? వస్త్రధారణ పై సురేంద్ర కె. దారా విశ్లేషణ చూడండి.

యాహూ మెయిల్‌లో తెలుగు!
http://veeven.wordpress.com/2007/09/16/telugu-in-yahoo-mail/

ఉత్తరాలలో ఎక్కువమంది తెలుగు వాడరు కారణమేమంటే ఉత్తరం అందుకునే వారిలో ఎక్కువమందికి యాహూ మైల్ ఉండటమే. శోధన బ్లాగు సమీక్షింపదలచి సుధాకర్ కు జులై 2006 లో, నేను రాసిన జాబుకు తన జవాబు నా యహూ పెట్టెలోకి వచ్చింది. తెరిచి చూస్తే అంతా గ్రీక్, లాటిన్. ఉత్తరం అర్థం కావటం లేదని నేను, మరలా జవాబు పంపానని సుధాకర్, ఇలా ఇద్దరి మధ్య 17 ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. మధ్య కొన్ని ఉత్తరాలలో, తెలుగు కుదరక పోతే పరవాలేదనీ, జవాబు ఇంగ్లీషు లో పంపమని కూడా రాయటం జరిగింది. జవాబు, తెలుగులోనే రాయాలన్న సుధాకర్ కుతూహలంతో, చివరకు తన ఉత్తరాలు నేను చదవలేకపోవటము, శోధన బ్లాగు నేను సమీక్షకుండానే మిగిలిపోవటమూ జరిగింది.
వీవెన్ తెచ్చారు శుభవార్త. ఇప్పుడు మీరు జి-మైల్ నుంచి యాహూ కి పంపే తెలుగు ఉత్తరాలు, ఎలా పంపాలో సులభంగా వివరిస్తున్నారు.


Bhumika magazine

ఉద్వేగంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవం
http://bhumika.org/archives/479


స్త్రీవాద పత్రికగా `భూమిక’ ప్రాచుర్యం పొందింది. గత 15 ఏళ్లుగా ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఈ పత్రిక నడుపుతున్నారు కొండవీటి సత్యవతి. ఇలాంటి పత్రికలు ఆర్థిక పరంగా, స్వయంగా నిభాయించుకు రావటం కష్టం. కారణం ప్రకటనలు రాక పోవటం, చాలినన్ని ఆర్థిక వనరులు లేక పోవటమూ. గత 2008 మార్చ్ నెల లో, ఆర్థిక భారం వలన పత్రిక వెలువరించ లేక పోతున్నట్లుగా తెలిపారు. ఈ కారణంగా, పత్రిక నిర్వహించిన, కథల పోటీ బహుమతి ప్రదాన సభలో, బహుమతి గ్రహీతలు, బహుమతి సొమ్మును, భూమిక పత్రికకు ఇవ్వటాన్ని లైలా యెర్నేని తప్పు పట్టి, అసలు ఇలాంటి ఆడ పత్రికలు గిట్టితే మటుకు నష్టేమేమిటి అన్న అభిప్రాయం వెలిబుచ్చారు. ఇది ఎన్నో కొత్త ప్రశ్నలకు తావిచ్చింది. ఆడవారి కోసం ప్రత్యేక పత్రికలు అవసరమా? దీని పై చర్చను చూడండీ టపాలో.

సోమవారం, జూన్ 23, 2008

అంతర్జాల వీక్షణం -2

జీవిత పరమార్ధం ఏవిటి?
http://kottapali.blogspot.com/2008/04/blog-post_05.html
అంతర్ముఖం
http://gireesh-k.blogspot.com/2008/06/blog-post_18.html

మనము చేసే ప్రతి పనికి కర్త, కర్మ ఇంకా క్రియ దేవుడయితే, మనము ఏమి చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? మరి దీన్నెలా నమ్మడమూ అంటే, అంతా ఆయనే చేస్తాడు కనుక, మనం నమ్మడమూ నమ్మకపోవడమూ... అంతా ఆయన పనే. ఇంకోలా చెప్పాలంటే, ఇది వాస్తవం కనుక, మనం ఒప్పుకోవడమూ, ఒప్పుకోకపోవడమూ అన్నది అర్ధరహితము. నీవు చేసే పని విజయమో/ అపజయమో నీ చేతుల్లో లేదు. అంతా కర్మ అని సరిపెట్టుకొంటే జీవితంలో ముందుకు సాగేది ఎట్లా? ఈ విషయం పై కొత్తపాళి, గిరీష్ ల విచారధార చూడండి.


తెలుగు లిపికి CAPITAL LETTERS
http://www.telugupeople.com/discussion/article.asp?id=24379


“తెలుగు కూడు పెట్టదు కాని తెలుగు లేకుండా మనము ఉండలేము. కోటి విద్యలు కూటి కొరకే? అందుకె మన పిల్లలను ఇంగ్లీషు మీడియమ్‌ లో చదివించాము సంస్కృతము తీసుకుంటే ఎక్కువ మార్కులు వచ్చేయి, భవిష్యత్తు బాగుపడింది. ఇప్పుడు తెలుగు భాష కొరకు మనసు లాగింది, తెలుగు మాట విన్నప్పుడు ప్రాణము లేచొచ్చింది ప్రవాసాంద్రులకు. మన పిల్లలు తెలుగు మాట్లాడతారు కాని చదవటమే రాదు మనం నేర్పబోతే లిపి చాలా కష్టముగా వుంది, ఇంగ్లీషు లిపిలా వుంటే బాగుండును కదా?” - ఆకుల నాగేశ్వర రావు

తెలుగురాని ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు నేర్పటం ఎట్లా? హల్లులు, తలకట్టులు కలిపి 396 అక్షరాలను పిల్లలకు నేర్పటం కష్టం. ఈ సంఖ్యను 45 కు తగ్గిస్తే, 351 అక్షరములు తగ్గుతాయి. తక్కువ అక్షరాలతో తెలుగు నేర్పటం ఒక్కటే, భవిష్యత్లో, పిల్లలకు నేర్పించే మార్గమవుతుందేమో.

ప్రమదావనం లో కిరణాల వెల్లువ…
http://jyothivalaboju.blogspot.com/2008/06/blog-post_17.html

ప్రమదావనం క్రికెట్ లో Yup me వేసిన బంతికి జ్యోతక్క క్లీన్ బౌల్ అయి, పిల్ల కాకి అయిన, సన్నివేశం చూసి, మీరు అవాక్కవుతారు. Yup me వేసిన ప్రశ్నలు, లేవనెత్తిన అంశాలు ఆలోచింపచేస్తాయి. "ఈ బ్లాగులెంతకాలం ఉంటాయో, మీరు ఎంతకాలం జ్యోతక్కగా ఉంటారో ఎవరూ చెప్పలేరు. " - ఆమాటకొస్తే, ఏదీ ఎవరమూ చెప్పలేము. Yup me ఉద్యోగం ఒక వారం తరువాత వుంటుందో లేదో చెప్పగలమా? భూకంపం ఎప్పుడొస్తుందో, కనీసం వాన ఖచ్ఛితంగా ఎప్పుడొస్తుందో ఎవరైన చెప్ప గలరా?
పాఠకులు జ్యోతక్క అనగానే మురిసిపోవటం కాదు అంటూనే Yup me చురకలు, వ్యంగాస్త్ర బాణాలు సంధించారు. యప్ మి చెప్పిన విషయాలలో వాస్తవముండొచ్చు కాని వాటిని అవతలవారు బాధ పడేలా చెప్పనవసరం లేదు. నొప్పింపకనే చక్కగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసుండాల్సింది. అక్కకు ఎవ్వరూ తోడు రాక, ఒంటరిని చేయటం విచారకరం. ఐ.డి దొంగతనం అనేది సర్వ సామాన్యం అంటున్న యప్ మి అవి ఎలా జరుగుతాయో, దొంగిలించిన వారు ఈ ఐ.డి లను ఎలా దుర్వినియోగం చేస్తారో, నివారణ చర్యలు, దొంగతనం కు గురికాబడిన తరువాత ఏమి చెయ్యాలి వగైరాలు వివరించి ఉండాల్సింది.

కరుణశ్రీ కవిత్వం
http://www.aavakaaya.com/showArticle.aspx?a=liarticleId=437

ఆవకాయలో సాహిత్యం చూశారా? ఇందులో కరుణశ్రీ కవిత్వంలోని, పోతనలోని పద్యం పై, సతీష్ టి. యస్, విశ్లేషణ చూడండి.

మనసైన తన కన్నీరు...
http://oohalanni-oosulai.blogspot.com/2008/06/blog-post_20.html

అత్తా కోడళ్ల మధ్య సంబంధం సున్నితమైనది. ఒకే హృదయం కోసం ఇరువురూ తపన పడుతూ,కొండొకచోట ఘర్షణ పడూతూ కనిపిస్తారు. అత్త కోడళ్లు తల్లీ కూతుళ్లలా వుంటే జీవితం ఎంత మధురంగా ఉంటుంది? కాని దురదృష్టం -అత్తా కోడళ్ల మధ్య పొరపొచ్చాలు ఒక్కోసారి జీవితాన్ని దుర్భరం చేస్తాయి, అగ్నితో స్నానం చేయటానికి కోడలిను పురికొల్పుతాయి. ఈ కధలో ఒక భార్య, తన భర్త తో వినిపించే మనో సంవేదన చదవండి."ఎట్టి పరిస్థితుల్లోనూ "నీకు మీ అమ్మకావాలా? నేను కావాలా?" అన్న సమస్య ఇవ్వలేను. ఆ ఆలోచన కూడా నీకు రానివ్వకూడదనే నా తాపత్రయం. భోంచేసేటప్పుడు "జాంగిరీ కావాలా?? జిలేబీ కావాలా" అని అడగచ్చు కానీ, అన్నం కావాలా? కూర కావాలా? అని ఎవ్వరూ అడగరు. We both aren't options for you, we are absolute necessities for your life. ఆవిడ జీవితం ఇస్తే.. నేను దాన్ని పంచుకుంటున్నాను. ఆవిడ నిన్ను తయారు చేస్తే.. నిన్ను కాపాడుకుంటుంది నేను. నీ వల్ల ఆవిడా, నేనూ కూడా సంపూర్ణమైయ్యాము. అందుకే నీకు కష్టం కలగకూడదనే మా వేదన. అన్ని బంధాల్లానే మాకు కొంచెం సమయం కావాలి, ఒకరినొకరం అర్ధం చేసుకోవడానికి."
ఇది పూర్ణిమ తొలి కధ అయినా, కధ చెప్పిన తీరు అట్లా అనిపించదు. పాఠకుల మన్నలను పొందినదీ కధ.


క్ష్ క్ష్ క్ష్ క్ష్ క్ష్ గప్ చుప్...... ఇది రహస్యం
http://chinuku.blogspot.com/2008/04/shhhh-its-secret.html


ఐదేళ్ల సమీరా (ముద్దు పేరు సమ్మి ) స్కూల్ లో ఒక రహస్య కార్యక్రమంలో వుంది. కిరణ్ (తండ్రి) ఫోన్ చేసినప్పుడు, చిన్న గొంతుతో, రహస్యం చెప్తున్నట్లుగా, గుస గుస లాడింది. ఆ కార్యక్రమమేమిటి? దానిని రహస్యంగా ఉంచవలసిన అవసరమేమిటి? తెలుగమ్మాయి అపర్ణ (సమీరా తల్లి) ఆ రహస్యం ఛేదించగలిగింది. ఇంతకూ ఏమిటా రహస్యం? చినుకు బ్లాగు టపాలో తెలుసుకోండి. ఈ బ్లాగ్ Tagline: About Bringing up Baby

శుక్రవారం, జూన్ 20, 2008

హైదరాబాదులో టాక్సీ సేవలు


Pic courtesy: Techgadgets

భారత దేశం లోని ఇతర ప్రాంతాలు, విదేశాల నుంచి హైదరాబాదు వచ్చే మిత్రుల సౌలభ్యాని కై, ఇక్కడి టాక్సీ మీటర్ రేట్ల గురించిన వివరాలు ఇస్తున్నా. హైదరాబాదు వస్తున్నప్పుడు అవసరం కనుక, ఇది ప్రింట్ చేసుకుని, మీతో తెచ్చుకోగలరు. మీ మిత్రులు హైదరాబాదు వస్తుంటే, వారికి ఈ బ్లాగ్ లింక్ పంపండి. వారే ప్రింట్ చేసుకొని, తమతో ఈ వివరాలు తెచ్చుకోగలరు.
ఇలాంటి విషయాలు, బ్లాగులో ఉండనక్కరలేదని, మీకు తెలుసని, మీరు భావిస్తే, ఆ విషయం తెలుపగలరు.

Operators offering metered taxis (not all below are reliable and not all of them are prompt) at Rs 10 per km in alphabetical order:

* Apple Cabs, +91-40-6599-2225/2226

* C Cab, +91-40-2400-2345/+91-93-473-93474

* Call Cab, +91-40-6625-1313/1414

* Call Taxi, +91-40-2790-1111/1122

* Cel Cabs, +91-40-2324-2526

* City Cab, +91-40-2776-0000/6631-6000/6631-6001

* Euro Cabs, +91-40-2351-1888/6673-8882

* Fast Track, +91-40-2888-9999/2760-2760

* Green Cab, +91-40-6664-4444

* Hyderabad Cabs, +91-40-2330-3324/3245-5055

* Metro Cab, +91-40-6610-0676/0677

* Orange Cab, +91-40-6631-5555

Operators offering Air conditioned metered taxis at Rs 15 per km:

* Dot Cabs, +91-40-2424-2424 - They offer Toyota Innova

* Easy Cabs, +91-40-4343-4343 - They offer Mahindra Renault Logan

* Meru Cabs, +91-40-4422-4422 - They offer Mahindra Renault Logan and have GPS
More info at http://hydzone.blogspot.com/2008/04/meru-cabs.html
http://www.techgadgets.in/features/2007/29/meru-taxis-a-safer-and-convenient-mode-of-transport/

* Orange Radio Cabs, +91-40-4445-4647 - They offer Toyota Innova and Maruti Versa and Tata Indigo Marina

* Select Cabs, +91-40-4415-1515 - They offer Maruti Versa and tata Indigo Marina

* Taxee!, +91-40-2790-7111/+91-99-592-2200 - They offer Toyota Innova and Toyota Corolla (at higher rate) but are unmetered and follow the odometer

All rates are subject to change. Check for latest rates, in local dailies or City Magazines.

అంతర్జాల వీక్షణం -1

అంబేద్కర్ ను ఎలా అర్థం చేసుకోవాలి!
http://naprapamcham.blogspot.com/2008/05/blog-post_29.html

బుద్ధ రామాయణం ప్రకారం సీత రాముడి సోదరి. కనుక యీ యిరువురి పెళ్ళి ఆదర్శం కాదు. రాముడు ఏకపత్నీవ్రతుడూ కాదు. వాల్మీకి రామాయణాన్ని బట్టి కూడా రాముడికి చాలామంది భార్యలున్నారు. (అయోధ్యకాండ 8వ సర్గ 12వ శ్లోకం) ఇంకా ఉంపుడుకత్తెలు కూడా వున్నారు. రాముడిని దేవుడిగా చూచేవారు ఈ విషయాలు పరిగణనలోకి తీసుకోవాలని అంబేద్కర్ అన్నారు.
గాంధీజీకి అంటరానివారిపట్ల చిత్తశుద్ధి లేదనడానికి అంబేద్కర్ ఎన్నో ఉదాహరణలు చూపారు. అంబేడ్కర్ తత్వాన్ని అద్దం పట్టి చూపే, ఇన్నయ్యగారి ఈ వ్యాసం చదవతగ్గది.

మార్పు
http://www.eemaata.com/em/issues/200301/219.html

50 ఏళ్ల క్రితం స్త్రీల స్థితిగతులకూ నేటి మహిళకూ ఏమిటి మార్పు అని ప్రశ్నిస్తుందీ కథ? అప్పుడు భార్య వంట చేస్తుంటే, భర్త పడక్కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ కనిపించే దృశ్యమే, ఈనాడూ గోచరిస్తుంది. ఈ కాలంలో స్త్రీ విద్యావతి ఐనా,ఉద్యోగవంతురాలైనా,అమెరికా లో ఇట్లా, అట్లా అంటూ కబుర్లు చెప్పే పురుషులు ఇంట్లో ఉన్నా, అదే దృశ్యం. మార్పు లేకపోవటమే మార్పా? విప్లవ్ కథ మార్పు అప్పటి, ఇప్పటి, అమెరికా, భారత దేశాల పరిస్థితులను, భర్తల మనస్తత్వాలను తేటతెల్లం చేస్తుంది.

శ్రీవారికి ప్రేమలేఖ
http://nishigandha-poetry.blogspot.com/2008/02/blog-post_13.html

రెండు భిన్న హృదయాలను విచిత్రంగా కలుపుతుంది వివాహం. ఎన్నో సర్దుకుపోవటాలు, అలకలు, మరల తెలుపవా ప్రియా అంటూ నిశ్శబ్ద ప్రేమ గీతాలు వైవాహిక జీవితాన్ని నింపేస్తాయి. పెళ్లైన కొత్తలో ఎవో కారణాలవలన భార్యా భర్తలు దూరంగా ఉండటం జరుగుతుంది. ఈ దూరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకొందుకు ఉపయోగ పడుతుంది. ఒకరి ఉత్తరానికై మరొకరి ఎదురుచూపులు ఉంటాయి. ఉత్తరం రాసే సమయాన, జవాబు అందుకొన్న సమయాన, మనసున మల్లెలు మాలలూగుతాయి.విరహం నిమిషాలను గంటలుగా,రోజులను యుగాలుగా మారుస్తుంది. సంగమం మనసుని మధురమైన ఊహలతో నింపి, నవ వధువును భీత హరిణిలా మార్చి, కళ్లను సిగ్గుతో కిందకు వాల్చేలా చేస్తాయి.ఆ పై ఆషాఢం తెస్తుంది మరో మధురమైన విరహ తాపం.మేఘసందెశం బదులుగా ఇప్పుడు e-mail రెక్కలు కట్టుకుని ప్రియ సఖునకు చేరుస్తుంది, అంతరంగాన్ని. శ్రీవారికి రాసే ప్రేమ లేఖ ఎన్ని మధురిమలను నింపుకుంటుందో తెలుసుకోవాలంటే నిషీగంధ రచన శ్రీవారికి ప్రేమ లేఖ చదివాల్సిందే.

కవితా! ఓ! కవితా!
http://video.google.com/videoplay?docid=-6066875310479125945&hl=en

మీరు శ్రీశ్రీ కవితాభిమానులా? అయితే, వీక్షణం మాసపత్రిక సంపాదకుడు ఆలపించిన ఈ కవితా, ఓ కవితా గేయం విని, ఆ ప్రవాహ వొరవడిని, ఆస్వాదించండి.

నేనూ గొప్ప చిత్రకారిణినే.......
http://meenakshir.blogspot.com/2008/06/blog-post_7456.html

మీ ఇంట్లో టార్టాయిస్ కాయిల్స్ ఉంటే కాస్త వాటిని చూస్తు..చూస్తూ మీ స్కూల్ ఫ్లాష్ బాక్ లో కి వెళ్తే ఎలా వుంటుంది ? ఓరుగల్లు మీనాక్షి మధురంగా రాస్తున్న స్కూల్ కబుర్లు చదివి, అందులోని హాస్యానికి పోరగాళ్లు పడిపోతున్నారంటే నమ్మండి.Spark ఉందీమె రచనలలో.మరి మీరూ మీనాక్షి స్కూల్ కెళ్లొస్తారా?

తెలుగుపాటల అసలు సిసలు పాటలు
http://gorablog.blogspot.com/2008/06/trivia-few-tollywood-songs-copied-from.html

ఛత్రపతి టైటిల్ సాంగ్, పోకిరీ సినిమా లోని దేవ దేవ దేవుడా ఇంకా మంత్ర లోని మహా మహా పాటల ఒరిజనల్ పాటలు వినండి, నకళ్లతో పాటుగా.

లోకలు వార్మింగు
http://chaduvari.blogspot.com/2008/06/blog-post_17.html

గ్లోబల్ వార్మింగ్ తెలుసు కాని ఈ లోకలు వార్మింగు ఏమిటి అనుకుంటున్నారా? అయితే మీరు చదువరి రాసిన ఈ హాస్య వ్యంగ భరిత రచన చదవ వలసినదే. చదువరి హాస్యం కూడా రాస్తారా అని అబ్బురపడేవారికి ఇది చూపండి.

జీవశాస్త్ర విజ్ఞాన సర్వస్వము
http://www.eol.org

భూమిపై గల జీవరాశులగురించి తెలియ చెప్పే ప్రయత్నం ఈ విజ్ఞానసర్వస్వం చేస్తుంది. మీ పిల్లలు స్కూల్ ప్రాజెక్ట్ పని చేసే సమయంలో, ఇది ఎంతో సహాయకారిగా ఉండగలదు. ఈ విజ్ఞాన సర్వస్వం గురించిన మరింత సమాచారానికై ఈ కింద ఇచ్చిన లింక్ లో గల వీడియో చూడగలరు.
http://www.eol.org/screencasts

గురువారం, జూన్ 19, 2008

ట్రెడ్‌మిల్ పై కసరత్తులు

ఆరోగ్యం కోసం ట్రెడ్‌మిల్ పై కసరత్తులు మామూలయిపోయింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి, బరువు తగ్గించుకోవటం అవసరమే మరి. ఈ వీడియో లో ప్రత్యేకత ఏమంటే, మీరేనా ఏమిటి, మేమూ చేస్తాము ట్రెడ్‌మిల్ పై కసరత్తులు అంటున్నాయీ పిల్లులు. వాటికీ శరీరాకృతి పై చేతన (figure consciousness) కలిగినట్లుంది. ఈ వీడియోను ఆనందించండి.

Treadmill Kittens

గురువారం, జూన్ 12, 2008

పాపినేని శివశంకర్ ‘చివరి పిచ్చుక’


Dr.Papineni Sivasankar Photo Courtesy: Dr Papineni

సాహిత్యం-మౌలిక భావనలు అనే అంశం పై పరిశోధన చేసిన డా. పాపినేని శివశంకర్, ప్రసిద్ధ కథకుడు, కవి. ఇప్పటివరకు సుమారుగా 150 కవితలు,30 చిన్న కథలు ఇంకా 100 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.వాసిరెడ్డి నవీన్ తో కలిసి 1990 నుంచి తెలుగు ఉత్తమ కథా సంకలనాలను కథా సాహితి పేరుతో 1990 నుంచి ప్రతి సంవత్సరమూ ప్రచురిస్తున్నారు.శివశంకర్ గారి కవితలు పలు సంకలనాలుగా (స్తబ్ధత - చలనం,ఒక సారాంశం కోసం, ఆకు పచ్చనిలొకంలో,ఒక ఖడ్గం - ఒక పుష్పం), కథలు మట్టి గుండె (1992) గా వెలువడ్డాయి. సాహిత్యం-మౌలిక భావనలు అనే అంశం పై చేసిన పరిశోధన 1996 లో పుస్తకంగా వెలువడింది. చినుకు,కథా సాహితి,విస్మృత కథ, రైతు కవిత, కవిత సంపుటాలకు సంపాదకత్వ బాధ్యత నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయము నుంచి, 2000 సంవత్సరములో, సాహితీ పురస్కారం పొందారు. తాడికొండ B.S.S.B.College లో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.

ఏది మంచి కథ? చక్కటి పొందిక , సహజ గుణాత్మకంగా ఉంటూ, జీవిత వాస్తవాలను ప్రతిబింబించేదే, కథ అవగలదని,కొడవటిగంటి కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజు అభిప్రాయపడ్డారు.శివశంకర్ గారి ప్రసిద్ధ కథ,‘చివరి పిచ్చుక’, కథ 2004 లో ప్రచురితమైనది. నిజమే, పట్టణాలలో పిచ్చుకలు కనుమరుగయ్యాయి. పర్యావరణ, వడ్లు నిలువ చేసుకునే పద్ధతులలో వచ్చిన తేడా వలన, పక్షుల స్థితిగతులలో కూడా మార్పులు వచ్చాయి. పక్షులు మన వాతావరణ ఆరోగ్యానికి గుర్తు. అవి తగ్గితే, మన పర్యావరణ నాణ్యత తగ్గిందని అర్థం. ఈ కథ పై, 2006 లో రచ్చబండ లో ప్రచురితమైన, ఆరి సీతారామయ్య గారి కథా విశ్లేషణ చదవండి.

చివరి పిచ్చుక



Sparrows Photo: cbrao

నేను ప్రాధమిక పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో సాయంకాలం బడినుంచి రాగానే ఒక్కోసారి
చేనికి పంపించేవాళ్ళు మావాళ్ళు. వడిసేలతో. పిట్టల్ని తరమటానికి. వూళ్ళో దాదాపు అందరు రైతులూ జొన్న వేసేవారు. అందరూ రెండు పూటలా జొన్న సంగటి తినే వారు. జొన్న సంగటి చింతకాయ
పచ్చడితో తింటుంటే ఎంత బాగుండేదో! జొన్న చేలల్లో కంకి పడుతున్నప్పుడు పిచ్చుకలూ, రకరకాల
పిట్టలూ గుంపులు గుంపులుగా వచ్చేవి. విత్తనాలు పాలు పోసుకుంటున్నప్పుడు మరీను. దోవలో కనపడ్డ చిన్న చిన్న రాళ్ళన్నీ ఏరుకోని చడ్డీ జేబుల్లో పోసుకోని చేనికి పోవటం, చేని మధ్యలో కట్టిన చిన్న పందిరి ఎక్కటం, అక్కడనుంచి వడిసేలతో పిట్టలు కనపడ్డ వైపు రాయి రువ్వటం, పిట్టలు ఎగిరిపోయి మరో వైపు వాలటం, అటువైపు నేనొక రాయి రువ్వటం, అవి మళ్ళా ఇంకోవైపు లేచిపోవటం ఇదీ కథ. ఒకటి రెండు గంటలతరవాత విసుగుపుట్టో, ఆకలయ్యో, చీకటిపడి పిట్టలు గూళ్ళకు పోతేనో, నేను కూడా ఇంటికి పొయ్యేవాణ్ణి. పాపినేని శివశంకర్ గారి చివరి పిచ్చిక ఆ రోజుల్ని గుర్తుకుతెచ్చింది.

ఆ రోజుల్లో తింటానికేగాదు, డబ్బుగా కూడా వాడేవారు జొన్నల్ని. పొలాల్లో
పనిచేసిన కూలీలకు సాయంత్రం జొన్నలు కూలికింద కొలిచేవారు. సంవత్సరం
పొడుగునా పనిచేసిన చాకలికీ, మంగలికీ కల్లాం దగ్గరే గింజలు ఇచ్చేవారు.
బాకీలు ఉన్నవారు తమ బాకీ కింద జొన్నలు తీసుకునేవారు. ఎప్పుడన్నా కోమటి
శెట్టి దగ్గర ఏదన్నా కొనుక్కోవాలంటే, అమ్మమ్మ నాక్కూడా ఒక రుమాల్లో జొన్నలు
పోసిచ్చేది.

ఆ రోజుల్లో కూడా తిండిగింజల పైర్లు వెయ్యగా ఇంకా పొలం ఉన్నవాళ్ళు వ్యాపార పంటలు వేసేవారు. ముఖ్యంగా పొగాకు. రాను రానూ, పొగాకు వెయ్యటం లాభంగా ఉందని గుర్తించిన సన్నకారు రైతులు కూడా తిండిగింజలు పండించే పొలాల్లో పొగాకు వెయ్యటం మొదలుపెట్టారు. అందరికీ అన్నం పెట్టే రైతు తన కుటుంబావసరాలకు తిండి గింజలు కొనుక్కోవటం మొదలుపెట్టాడు. పొగాకులో లాభం వచ్చినప్పుడు బాగానే ఉండేది. రానప్పుడు పెద్ద దెబ్బయ్యేది.

క్రమంగా పొగాకు పోయి అంతకంటే లాభసాటి అయిన పత్తి వచ్చింది. పత్తికి పెట్టుబడి ఎక్కువ. అంతా సక్రమంగా జరిగితే పొగాకుకంటే చాలా ఎక్కువ లాభం. కాలం కలిసిరాకపోతే ...ఈ కథ అందరికీ తెలిసిందే.

ఎటు చూసినా పంట పొలాలతో పచ్చగా కనిపించే వూళ్ళు మారిపోయాయి. ఇప్పుడు
వ్యాపార పంటలు ఎక్కువ. రైతులు తిండిగింజలు కొనుక్కుంటున్నారు. ఒకప్పుడు
గింజలకోసమూ, పైరుచేలల్లో సమృద్ధిగా దొరికే పురుగుల కోసమూ, గుంపులు గుంపులుగా పోతూ
కనిపించే పిచ్చికలు ఇప్పుడు అంతగా కనిపించటం లేదు.

ఇలాంటి వూళ్ళలో వచ్చిన పరిణామాలే శివశంకర్ గారి కథకు నేపధ్యం. కథను ఒక మగ పిచ్చిక
ద్వారా చెప్పిస్తాడు శివశంకర్. ఒక ఆడ పిచ్చిక ? పికిలి తో చెలిమి కుదిరి, గుడ్లు పెట్టుకోవటానికి వీలుగా ఒక ఇంటి చూరులో గూడు కడుతుంది పిచ్చిక. మూడు గుడ్లు పెడుతుంది పికిలి. ఇద్దరు పిల్లలు
బ్రతుకుతారు. ఒక రోజు మేతకోసం వెళ్ళిన పిచ్చికలు తిరిగొచ్చే లోగా, ఇంటి యజమాని పూరిల్లు
పీకేస్తాడు. డాబా కట్టుకుందామని. పిచ్చిక పిల్లలు రెండూ అందులో చచ్చిపోతాయి.

అక్కడా ఇక్కడా తిరిగి తిరిగీ కొన్నాళ్ళకు ఒక ఇంటి ముందున్న లోతైన బావిలో,
నీళ్ళకు కొంచెం పైగా ఉన్న ఒక సందులో, గూడు కట్టుకుంటాయి పిచ్చికలు. కథలో
ఈభాగం నాకు ఎంత నచ్చిందో! ఆ రోజుల్లో మా ఇంటికి దక్షిణం వైపు ఒక లోతైన బావి ఉండేది. దాంట్లో పిచ్చికలు గూడు కట్టుకుని ఉండేవి. శివ శంకర్ గారు రాసినట్లు నీళ్ళతో పైకొచ్చే బిందెలమీద సవారీ చేస్తూ పైకొచ్చేవి పిచ్చికలు. తీరా పైకొచ్చి ఎగిరిపోయేవి. ఉదయం ఎంతో మంది నీళ్ళకొచ్చేవారు. లోతైన బావి కావటం వల్ల నీళ్ళు చేదటం అంత సులభం కాదు. నీళ్ళ కోసం వచ్చిన ఆడ వాళ్ళూ, పిల్లలూ ఎవరైనా మగవాడొచ్చిందాకా ఆగే వారు. అతను నీళ్ళు చేది వాళ్ళ బిందెల్లో పోసేవాడు. ఎంత జాగ్రత్తగా పోసినా నీళ్ళు చిందేవి. ఇలా ఉదయం సాయంత్రం నీళ్ళ కొచ్చే సమయం లో బావి చుట్టూ మడుగులు ఏర్పడేవి. ఈ మడుగుల్లో పిచ్చికలు జలకాలాడుతుండేవి.

ఒక రోజు పిచ్చికలుంటున్న బావిలో మట్టి పడుతుంది. యజమాని బావి బూడ్పించి
అక్కడే ఒక బోర్ వెల్ తవ్విస్తాడు. పిచ్చికలు మళ్ళా గూడులేని ప్రాణులవుతాయి.

కథ చివర్లో పికిలికోసం మేతకెళ్ళిన మగ పిచ్చికకు మిరప, పత్తి తోటల్లో
చచ్చిన పురుగులు తప్ప మరేమీ దొరకవు. అవే తెచ్చి పికిలికివ్వటం, ఆ
పురుగులుతిని పికిలి చచ్చిపోవటం జరుగుతుంది. మగ పిచ్చుక మళ్ళా తోడులేని
ఏకాకి అవుతుంది.

పోయిన ఇరవై ముఫైయేళ్ళలో తెలుగు పల్లెటూళ్ళలో వచ్చిన వ్యవసాయ పైర్ల మార్పులూ,
ఈ మధ్య వచ్చిన కరువులూ, రైతుజీవితాల్లో వాటివల్ల కలిగిన బాధలూ, ఈ పిచ్చికల
జీవితాల్లో ప్రతిబింబిస్తాయి. రైతుకుటుంబాల మనుగడ ఎలా కష్టం అవుతుందో, పిచ్చికల జీవితాలూ
అలాగే అవుతాయి. పిచ్చికల బ్రతుకులను చాలా సమర్ధవంతంగా చిత్రిస్తాడు శివశంకర్.

ఈ కథలో నాకు ఒక లోపం కనిపించింది. ఇది పిచ్చిక దృష్టికోణం నుంచి చెప్పిన
కథ. కానీ కొన్ని చోట్ల రచయిత జోక్యం కనిపిస్తుంది. జాతుల అంతర్థానం
(extinction of species) మీద జరుగుతున్న సభలో మాట్లాడుతున్న మనుషుల
సంతాపం కపటం అంటుంది పిచ్చిక. నిజానికి ఈ జాతి ప్రపంచాన్ని
మోసగించటానికే మాటలు నేర్చింది అంటుంది. ఇలాంటి ఊహలూ ఆలోచనలూ పిచ్చిక
చైతన్యానితో సామ్యం లేనివి. అలాగే కథ చివర్లో పిచ్చిక అనంతాకాశం లో
కలిసిపోతూ రెండు చేతుల జాతి {మనుషులు} సమస్తాన్నీ ధ్వంసం చేస్తూ,
చివరికి తానే ధ్వంసమగునుగాక! అని శపిస్తుంది. ఇది పిచ్చిక శాపం లాగా
ఉండదు, శివశంకర్ గారి శాపం అనిపిస్తుంది. పిచ్చికచేత చెప్పించ దలచిన
కథను పూర్తిగా పిచ్చికకే వదిలేస్తే బాగుండేది.

Overall this is a wonderful story. Nice language, excellent observations of nature rarely found in Telugu stories and for the most part, good effort in presenting the recent changes in the Telugu countryside from the point of view of a small bird.

---------------------------------0000000000000----------------------------------------

కృతజ్ఞతలు: ఆరి సీతా రామయ్య, పాపినేని శివశంకర్, రచ్చబండ.
పెచ్చుపెరిగిపోతున్న భూతాపం వలన, కావలసిన పర్యావరణం పై అవగాహనకు, బత్తీబంద్ కార్యక్రమాలకు నా వంతుగా, ఈ జాబు దీప్తిధారలో ప్రచురణ.

శనివారం, జూన్ 07, 2008

పాతవి మరియు అరుదైన పుస్తకాలు


Old and Rare Books

పాతవి మరియు అరుదైన పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసా మీకు? ఇక్కడ చూడండి.

http://www.bookmine.com/about.php

గురువారం, జూన్ 05, 2008

శ్రీస్వరలయ తెలుగు మాస పత్రిక జూన్ 2008


Sriswaralaya June 2008 cover Page

కళలు,సారస్వతం ఇంకా తెలుగువారికి సంబంధించిన ఎన్నో విషయాలతో శ్రీస్వరలయ జూన్ సంచిక వెలువడింది. దిగువ ఇచ్చిన లింక్ లోంచి దిగుమతి చేసుకొనగలరు.

SwaralayaJune2008
SwaralayaJune2008....
Hosted by eSnips

బుధవారం, జూన్ 04, 2008

పుస్తకావిష్కరణ సభలు


దీప్తిధార ప్రచురణ e పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్ర మూర్తి

మీకు పుస్తకావిష్కరణ సభలకు వెళ్లే అలవాటు ఉందా? మన దురదృష్టం; ఇలాంటి సభలకు ఎక్కువమంది జనం రారు.కవితలు ప్రచురిస్తే,కొనేవారుండరు. స్నేహితులకు, బంధువులకు నూతన సంవత్సర శుభాకాంషలతో పాటుగా, ఇవి పోస్ట్ చెయ్యాల్సిందే. ఈ మధ్యనే ఒక పుస్తకావిష్కరణ విశేషాలను వివరిస్తూ,మిత్రులు కస్తూరి మురళీకృష్ణ అంటున్నారు " నేనో పుస్తకావిష్కరణ సభ చేస్తే పిలిచింది 300.వచ్చింది ముగ్గురు.అదీ మా అమ్మ,చెల్లి,భార్య!" తెలుగు నేలన పుస్తక పఠనం తగ్గింది. యాంత్రిక జీవనం. అంతా busy, busy.

ఇలాంటి పరిస్థితులలో ఒక e-book ఆవిష్కరణ సభ ఎలా వుంటుందో మీరు ఊహించుకోగలరు. మీ ఊహలకు భిన్నంగా పురాణ ప్రలాపం e పుస్తకావిష్కరణ సొమాజీగూడా ప్రెస్ క్లబ్ ఆవరణలో, ఎంతో ఉత్సాహవంతంగా జరిగింది. తెలుగు పత్రికలవారు, ఎలెక్ట్రానిక్ మీడియా, పుస్తకాభిమానుల కరతాళాల మధ్య జరిగింది. తెలుగుపత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇంకా సాక్షి పత్రికలు ఈ ఆవిష్కరణ సభ విశేషాలు ప్రచురించాయి. దురదృష్టవశాత్తూ, ఒక్క దినపత్రిక కూడా, అచ్చుతప్పులు లేకుండా, దీప్తిధారలోని e పుస్తకం డౌన్‌లోడ్ లింక్ ను సరిగా ప్రచురించలేక పోయింది. కరెక్ట్ లింక్ కింద ఇస్తున్నా.

http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_29.html

మీకోసం పత్రికలలో ప్రచురించిన విశేషాల మాల, దిగువున, ఇస్తున్నాను.

వక్తలు ఎడమ నుంచి;ఆంజనేయ రెడ్డి(వేమన ఫౌండేషన్),జె.లక్ష్మీ రెడ్డి, కె.రామచంద్రమూర్తి, C.L.N.గాంధి, ఎన్.ఇన్నయ్య



పురాణ ప్రలాపం 'ఇ-బుక్‌' ఆవిష్కరణ
ఖైరతాబాద్‌, జూన్‌ 3 (న్యూస్‌టుడే): ప్రముఖ రచయిత ప్రొ|| హరిమోహన్‌ ఝా మైథిలీ భాషలో రాసిన పురాణ ప్రలాపం తెలుగు అనువాదంతో గల 'ఇ-బుక్‌' ఆవిష్కరణ జరిగింది. పురాణ ప్రలాపం పుస్తకానికి విదేశాల్లో తెలుగు వారి నుంచి మంచి ఆదరణ రావడంతో పుస్తకాన్ని వెబ్‌సైట్‌ http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_29html లో పొందుపర్చినట్లు సెంటర్‌ ఫర్‌ ఎంక్వైరీ ఛైర్మన్‌ ఎన్‌.ఇన్నయ్య తెలిపారు. అవసరమనుకుంటే పుస్తకాన్ని పూర్తిగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. పుస్తకాన్ని హైస్కూల్‌ స్థాయిలో నాన్‌డిటెయిల్డ్‌ పుస్తకంగా, టీవీ సీరియల్‌గా ఉంచితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో ఇ-బుక్‌ ఆవిష్కరణ అనంతరం పుస్తకాన్ని హిందీ నుంచి తెలుగులోకి అనువదించిన ప్రొ.లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ పురాణ ప్రలాపం ఎన్నిసార్లు చదివినా మళ్లీ చదువాలనిపిస్తుందన్నారు. సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రశ్నించే తత్వంతో మూఢనమ్మకాలు తొలగుతాయన్నారు. ఈ పుస్తకాన్ని ఛాందసవాదులు చదివినా, వైరులు చదివినా హాస్యం తప్ప కోపం రాదన్నారు. రవాణాశాఖ జాయింట్‌ కమిషనర్‌ సీఎల్‌ఎన్‌గాంధీ మాట్లాడుతూ వ్యంగ్య వినోద రూపంలో ఉన్న ఈ పుస్తకం మొదలు పెడితే పూర్తిచేయాల్సిందేనన్నారు. ఇందులో హేతువాద భావాలకు దగ్గరి సారూప్యం ఉందన్నారు. ప్రచురణ కర్త (వేమన ఫౌండేషన్‌) ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో కూడా విశ్వవిద్యాలయాల్లో మూఢనమ్మకాలపై బోధన చేయడం విచారకరమన్నారు.


వక్తలను పరిచయం చేస్తున్న ఇన్నయ్య (Centre for Inquiry India)



సమస్యకు దాడులు ప్రతిరూపాలు కాదు
సోమాజిగూడ, జూన్‌ 3 (ఆన్‌లైన్‌): ప్రశ్న పెట్రోలు కంటే బలమైంది అయినప్పుడు 'ఆంధ్రజ్యోతి' పత్రికను ప్రశ్నించడం మాని పెట్రోలు పోయడం ఏమిటని 'టి ' చానల్‌ సి.ఇ.ఓ. కె.రామచంద్రమూర్తి ప్రశ్నించారు. విద్యా వేత్త, ప్రొఫెసర్‌ జె.లక్ష్ష్మారెడ్డి తెలుగులోకి అనువదించిన 'పురాణ ప్రలాపం' పుస్తకాన్ని ఇంటర్నెట్‌ ద్వారా విదేశాల్లో ఉన్న తెలుగు వారికి అందించేందుకు వెబ్‌సైట్‌ (DEEPTIDHAARA.BLOGSPOT.COM) ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్ర మూర్తి మాట్లాడుతూ పురాణ ప్రలాపం పుస్తకంలో పదబంధాలు సున్నితంగా వ్యంగ్య రూపంలో చెప్పడం వల్ల ఆలోచన పెరుగుతుందన్నారు. ఏపుస్తకం చదివినా అందులో ప్రశ్నించడం మొదలుపెడితే మరో ప్రశ్న మొదలవుతుందన్నారు.
బలహీనమైన వాదన వినిపిస్తుంద న్నారు. హేతుబద్ధంగా వాదన వినిపించాలి కానీ సమస్యకు దాడులు ప్రతిరూపాలుకాదని చెప్పారు. పుస్తక అనువాదకర్త జె.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలుగు పుస్త కాలను హిందీలోకి అనువదించాను కానీ హిందీలో హరిమోహన్‌ ఝూ రచించిన పురాణ పుస్తకాన్ని తెలుగు ప్రజలకు అందించాలన్న ఉద్ధేశంతో రాశానన్నారు. సమాజంలోని మూఢనమ్మకాలను ఖండించి విమర్శనా త్మకంగా, వ్యంగ్యంగా ప్రజలకు విజ్ఞానాన్ని కలిగించి, ఆలోచింప చేసే విధంగా పురాణప్రలాపం ఉందన్నారు. ఆర్టీఏ శాఖ అధికారి పి.ఎల్‌.ఎన్‌ గాంధీ మాట్లాడుతూ హేతువాద భావాలను సారుప్యతతో ఆకట్టుకునే విధంగా పురాణ ప్రలాపం ఉందని తెలిపారు. వేమన ఫౌండేషన్‌ అధినేత ఆంజినేయరెడ్డి మాట్లాడుతూ ఫౌండేషన్‌ ద్వారా వేమనసాహిత్య పుస్తకాలు, 5వేల పద్యాలను ప్రాచుర్యం లోకి తీసుకురావడంతోపాటు వేమన గ్రంథాలను ప్రచురి స్తున్నామని వెల్లడించారు.
ప్రముఖ హేతువాది ఇన్నయ్య మాట్లాడుతూ పురాణ ప్రలాపం పుస్తకాన్ని పదవ తర గతిలో పాఠ్యాంశంగా తీసుకురావాలని సూచించారు. టీవీ ల్లో సీరియల్‌గా మార్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చిత్రీకరించాల న్నారు. ఈ కార్యక్రమంలో పలువురు హేతు వాదులు, రచయితలు, విప్లవ కవులు పాల్గొన్నారు.


అనువాదం చేసిన జె.లక్ష్మీ రెడ్డి





Meeting Photos: cbrao

సోమవారం, జూన్ 02, 2008

వేసవిలో పిల్లలు



పిల్లలు ఏమీ తోచటం లేదని ఫిర్యాదు చేస్తున్నారా? పిల్లలను దగ్గర కూచోబెట్టుకుని, ఆత్మీయంగా చక్కటి కబుర్లు, కథలు చెప్పండి. వారికి శాస్త్ర విషయాలు కూడా ఆసక్తికరంగా చెప్పండి. లేత మనసులను అంధ విశ్వాసాలతో నింపకండి. యుక్త వయస్సు వచ్చాక, ఏది మంచో, ఏది సహేతుకమో వారు నిర్ణయించుకొంటారు. మీ పిల్లలకు విజ్ఞాన శాస్త్ర విషయాలు చెప్పేందుకు, మీకు ఉపయుక్తంగా ఉండే పుస్తకం ఈ కింది లింక్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి.

http://www.thegreatstory.org/awesome-stuff-star.pdf

ఆదివారం, జూన్ 01, 2008

ఫేస్‌బుక్ లో పోకిరి


మీకు Facebook గురించి తెలిసే వుండవచ్చని ఊహ. ఫేస్‌బుక్ చాలా ప్రాచుర్యం పొందింది; ఆర్కుట్ లాగా. ఫేస్‌బుక్ మిమ్ములను, మీ తోటివారితో కలిపే,ఒక సామాజిక ఉపయూగకారి. దీని గురించిన సమాచారానికై చూడండి

http://en.wikipedia.org/wiki/Facebook

ఇంత ప్రసిద్ధి చెందాక, ఇందులోకి పోకిరి రాకుండా ఎట్లా వుంటాడు? ఎవరా పోకిరి? ఏమా కథ ? చూడండి.