బుధవారం, సెప్టెంబర్ 23, 2009

మనకు తెలియని మన త్రిపురనేని గోపీచంద్


Tripuraneni Gopichand

మనకు ఈ రోజున్న ఆశయాలు, భావాలే 15 సంవత్సరాల తరువాత కూడా ఉంటాయా? ఉండవచ్చు లేదా వాటిలో కొన్ని మార్పులు రావచ్చు. జీవితం లో తారసపడే కొందరు వ్యక్తులు, అనుకోని సంఘటనలు మనపై తీవ్ర ప్రభావాన్ని కలుగచేస్తాయి కొన్నిసార్లు. ఈ పరిణామ క్రమంలో కమ్యూనిస్టులు, పెట్టుబడిదారులుగా, నాస్తికులు ఆస్తికులుగా ఇంకా ఆస్తికులు నాస్తికులుగా మారటం కద్దు. ఒక రచయిత రచనలు సంకలనం గా తీసుకువచ్చే సమయంలో, రచనలతోపాటుగా రచనాకాలం కూడా ఇస్తుంటారు సంపాదకులు. ఇది మంచి సంప్రదాయం. దీనివలన కాలంగడిచే కొద్దీ రచయిత ఆలోచనా విధానంలోని ఎదుగుదల లేక పురోగమనం మనకు గోచరించగలవు. గోపీచంద్ శతజయంతి సందర్భంగా , ఆయన రచనలు తాజాగా 10 సంపుటాలుగా వెలువడ్డాయి. వీటిలో గొపీచంద్ లో వచ్చిన ఆలోచనాధొరణిలోని మార్పులను మనము చూడగలమా? గోపీచంద్ తొలుత ఒక హేతువాది. త్రిపురనేని రామస్వామి రచనలు వీరిని తొలినాళ్లలో ప్రభావితం చేస్తే, జీవితపు తుది అధ్యాయంలో అరవిందుని భజనలొ గడిపారు. M.N.Roy అనుచరుడినుంచి అరవిందు భక్తునిగా రూపాంతరం చెందిన గోపీచంద్ జీవిత విశేషాలను మనకు అందిస్తున్నారు ప్రముఖ హేతువాది ఇన్నయ్య.

-రావు

Tripuraneni Gopichand

గురువారం, సెప్టెంబర్ 03, 2009

మాట తప్పని మన రాజశేఖరుడు

ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి అకాలమరణం ఎవరూ ఊహించనిది. అరవైయేళ్ల వయసొచ్చాక రాజకీయ విరమణ చేస్తానని అంటుండేవారు. ప్రజల అకాంక్ష వారిని 60 ఏళ్లు దాటాక కూడా క్రియాశీలక రాజకీయాలలో వుండేలా చేసింది. ప్రతిపక్షాలు ఉచిత విద్యుత్ ఇవ్వటం సాధ్యం కాదంటే, సాధ్యమవగలదని నిరూపించి రైతు బాంధవుడిగా నిలిచారు. 60 ఏళ్లకు రాజకీయలనుంచి తప్పుకుంటానన్న్న తన మాటను, ఈ విధంగా నిలుపుకున్నారు.