బుధవారం, అక్టోబర్ 17, 2012
Meals Ready - Short Film
పుష్పక విమానం సినిమా గుర్తుందా? అట్లాంటి మాటలు లేని చిత్రమే ఈ Meals Ready లఘు చిత్రం. దర్శకురాలు నిథున నెవిల్ దినేష్ కు బహుమతి తెచ్చిపెట్టిందీ చిత్రం. జీవిత విలువలను తెలిపే ఈ చిత్రం తప్పక చూడతగ్గది. చూసి మీ అభిప్రాయం చెప్పండి.
శనివారం, సెప్టెంబర్ 29, 2012
రాబోయే చిత్రాలలో ధ్వని చేయబోతున్న విశ్వరూపం
డాల్బీ, డి.టి.స్ Sound Systems పాత బడ్డాయి. ఇంట్లో సినిమాలను (Home Theatre) చూసే ప్రేక్షకులను థీయేటర్ కు రప్పించాలంటే కొత్త చమక్కులు చేయాల్సిందే. కమల్ హాసన్ కొత్త చిత్రం "విశ్వరూపం" Auro 3D ధ్వని ముద్రతో రాబోతుంది. ఇది చాలా సహజమైన ధ్వనులను వినిపించి, చిత్రంలో ఉన్న ప్రదేశం లో ఉన్నట్లు ప్రేక్షకులకు అనుభూతి నిస్తుంది.
ఇదే సమయంలో డాల్బీ వారు మరో ధ్వని ప్రధాన అద్భుత ఆవిష్కరణ చేశారు. అది Dolby Atmos surround sound technology. Pixar's Brave చిత్రం లో మొదటగా దీనిని ఉపయోగించారు. ఈ కొత్త డాల్బీ ధ్వనుల కోసం లాస్ ఏంజెల్స్ (కాలిఫొర్నియా) లోని డాల్బీ థీయేటర్ (పాత పేరు కొడాక్ థీయేటర్) కు వెళ్ళాల్సిందే. ఆ ధ్వని విని ఆశ్చర్యచకితులం కావటం తప్పదు. 128 sound tracks తో 64 speakers లోంచి వెలువడే ధ్వనులు మనలను మంత్ర ముగ్ధులను చేస్తాయి. అయితే భారతదేశం లో ఈ అనుభూతికి 2013 దాకా ఆగాల్సిందే. అందాకా Dolby Atmos demo వినవచ్చును.
ఇదే సమయంలో డాల్బీ వారు మరో ధ్వని ప్రధాన అద్భుత ఆవిష్కరణ చేశారు. అది Dolby Atmos surround sound technology. Pixar's Brave చిత్రం లో మొదటగా దీనిని ఉపయోగించారు. ఈ కొత్త డాల్బీ ధ్వనుల కోసం లాస్ ఏంజెల్స్ (కాలిఫొర్నియా) లోని డాల్బీ థీయేటర్ (పాత పేరు కొడాక్ థీయేటర్) కు వెళ్ళాల్సిందే. ఆ ధ్వని విని ఆశ్చర్యచకితులం కావటం తప్పదు. 128 sound tracks తో 64 speakers లోంచి వెలువడే ధ్వనులు మనలను మంత్ర ముగ్ధులను చేస్తాయి. అయితే భారతదేశం లో ఈ అనుభూతికి 2013 దాకా ఆగాల్సిందే. అందాకా Dolby Atmos demo వినవచ్చును.
బుధవారం, సెప్టెంబర్ 26, 2012
నిషేధానికి గురయిన 10 ప్రముఖ పుస్తకాలు
అశ్లీలం, మత, రాజకీయ కారణాల వలన పలు గ్రంధాలు నిషిద్ధానికి గురయ్యాయి;వివిధ దేశాలలో. మరికొన్ని పుస్తకాల నిషేదానికి కారణం నవ్వు తెప్పిస్తుంది. ఇలా నిషేధానికి గురయిన 10 ప్రముఖ పుస్తకాల గురించి ఈ కింది వీడియోలో తెలుసుకోగలరు.
మంగళవారం, ఆగస్టు 28, 2012
తెనాలి తో నా అనుబంధం
'గీతాంజలి'
, 'గీతా సారం' పుస్తకాల రచయిత గీతాంజలి మూర్తి గారు ఆంధ్రా పారిస్ గా
పిలువబడే తెనాలి పట్టణం తో తమకు గల అనుబంధాన్ని వివరిస్తున్నారు. వారి
మాటలలో ఈ వ్యాసాన్ని చదువగలరు. -సి.బి.రావు.
తెనాలి తల్లితో నాకున్నది 'కన్నతల్లి పేగుబంధం' వంటిదే అంటే అతిశయోక్తి కాదు. స్వతంత్ర భారతావనిలో 1947 లోతెనాలిలోనే జన్మించి కళా/ సాహిత్య సౌరభాలను ఆఘ్రాణిస్తూ ఈ నేలతో, ఈ గాలితో, ఈ నీటితో పెనవేసుకున్న నా ఈ జీవన నౌకాయానం, ఒక సుమధుర స్వప్నం వంటిది. ఈ స్వప్నం సాకారమవగా, నా స్మృతి పేటికలో దొంతర్లుగా చేరి తెనాలిలో నేను పెనవేసుకున్న అనుబంధాల మందారమాలను గురించి కొన్ని మాటలలో ఇమడ్చాటానికి ప్రయాత్నిస్తాను. చిన్ననాట, మిషన్ స్కూల్ లో 'క్రీస్తు జననం' నాటికలో, గొర్రెలకాపరి పాత్రలో, తరువాత తాలుకా హై-స్కూల్ లో 'వెంకన్న కాపురం' నాటికలో, చిన్న పాత్రలో నటించి 'బాల రామాయణం' బహుమతి పొందటం నాలో ఉన్న నటునికి ప్రాణం పోసింది. శ్రీ రామ నవమి, దసరా పండుగల సమయం లో తెనాలి శోభను, తెనాలి విశ్వరూపాన్ని చూసి ఆనందించిన వారి జీవితం ధన్యం.తెనాలి ని 'రెండవ భద్రాద్రి' అని ఎందుకు అన్నారో ఆనాటి శ్రీ రామనవమి ఉత్సవాలు చూసిన వారికి తెలుస్తుంది. శివరాత్రికి సంగం జాగర్లమూడి నడచి వెళ్లి చెరుకుగడలు తింటూ రాత్రంతా జాగారం చేసి పొందిన ఆనందం, కొద్ది మాటలలోనే ఎలా చెప్పటం ? కొండను అద్డం లో చూపినట్లు ఉంటుంది కదా !
ముఖ్యంగా, అప్పుడు నిర్వహించిన ఆధ్యాత్మికోపన్యాసములు, కూచిపూడి నాట్యాలు, తెల్లవార్లూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పద్య నాటకాలూ - ఓహ్ ! ఒకటేమిటి ? ఎప్పుడూ తెనాలి - ఉత్సవ శోభతో వెలిగి పోయేది. ముఖ్యంగా శ్రీ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి గీతోపన్యాసాలు, వాటికి హాజరైన క్రిక్కిరిసిన జనంతో కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణం నిండిపోగా బయట బోస్ రోడ్డు మీద కూడా జనం నిలబడి వినడం తెనాలి తో నాఆధ్యాత్మిక అనుబంధాన్ని మరింత దృఢపరచిన సందర్భం. నాలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించటం లో ఈ కార్యక్రమాల ప్రభావం ఎంతో ఉంది. మా మిత్రమండలి సమావేశాలు, చినరావూరు పార్కు లోనూ, అప్పుడే ప్రారంభించిన వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వరుని ఆలయ ప్రాంగణంలోనూ, గంటలతరబడి జరిగి మమ్మల్ని అలరించేవి.
తెనాలి నేల, నీరు, గాలి ఎంత గొప్పవో !! ప్రఖ్యాత రచయితలైన కొడవడిగంటి, చలం, త్రిపురనేని, చక్రపాణి, జి.వి కృష్ణారావు; బొల్లిముంత శివరామ కృష్ణ, శారద, మరియు వందలమంది కళాకారులు నడచి తెనాలి వాసులను ఉత్తేజపరచిన ఈ నేలపై నేను కూడా ఆత్మీయానుబంధంతో నడవగలగటం నా ఆదృష్టం. అందుకే, నేను హైదరాబాద్ లో ఉంటున్నా, ఇప్పటికీ ఇక్కడ వీచే సాహిత్య, కళా సౌరభాలను తెనాలి వచ్చి పోతూ ఆస్వాదిస్తున్నాను. ఈ క్రమంలోనే, నేను అనువదించిన 'గీతాంజలి' ని, 'గీతా సారం' సంకలన గ్రంధాన్నీ' తెనాలి లోనే ఆవిష్కరించి, పంచిపెట్టటం జరిగింది. ఇలా తెనాలి తో నా అనుబంధాన్ని కొనసాగిస్తూ ఎంతో సంతోషాన్ని పొందుతున్నాను. ఇటువంటి "తెనాలి తల్లికి, వందనం" ! తెనాలి వాసులకు 'అభివందనం' !!.
గీతాంజలి మూర్తి
23.8.2012
తెనాలి తల్లితో నాకున్నది 'కన్నతల్లి పేగుబంధం' వంటిదే అంటే అతిశయోక్తి కాదు. స్వతంత్ర భారతావనిలో 1947 లోతెనాలిలోనే జన్మించి కళా/ సాహిత్య సౌరభాలను ఆఘ్రాణిస్తూ ఈ నేలతో, ఈ గాలితో, ఈ నీటితో పెనవేసుకున్న నా ఈ జీవన నౌకాయానం, ఒక సుమధుర స్వప్నం వంటిది. ఈ స్వప్నం సాకారమవగా, నా స్మృతి పేటికలో దొంతర్లుగా చేరి తెనాలిలో నేను పెనవేసుకున్న అనుబంధాల మందారమాలను గురించి కొన్ని మాటలలో ఇమడ్చాటానికి ప్రయాత్నిస్తాను. చిన్ననాట, మిషన్ స్కూల్ లో 'క్రీస్తు జననం' నాటికలో, గొర్రెలకాపరి పాత్రలో, తరువాత తాలుకా హై-స్కూల్ లో 'వెంకన్న కాపురం' నాటికలో, చిన్న పాత్రలో నటించి 'బాల రామాయణం' బహుమతి పొందటం నాలో ఉన్న నటునికి ప్రాణం పోసింది. శ్రీ రామ నవమి, దసరా పండుగల సమయం లో తెనాలి శోభను, తెనాలి విశ్వరూపాన్ని చూసి ఆనందించిన వారి జీవితం ధన్యం.తెనాలి ని 'రెండవ భద్రాద్రి' అని ఎందుకు అన్నారో ఆనాటి శ్రీ రామనవమి ఉత్సవాలు చూసిన వారికి తెలుస్తుంది. శివరాత్రికి సంగం జాగర్లమూడి నడచి వెళ్లి చెరుకుగడలు తింటూ రాత్రంతా జాగారం చేసి పొందిన ఆనందం, కొద్ది మాటలలోనే ఎలా చెప్పటం ? కొండను అద్డం లో చూపినట్లు ఉంటుంది కదా !
ముఖ్యంగా, అప్పుడు నిర్వహించిన ఆధ్యాత్మికోపన్యాసములు, కూచిపూడి నాట్యాలు, తెల్లవార్లూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పద్య నాటకాలూ - ఓహ్ ! ఒకటేమిటి ? ఎప్పుడూ తెనాలి - ఉత్సవ శోభతో వెలిగి పోయేది. ముఖ్యంగా శ్రీ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి గీతోపన్యాసాలు, వాటికి హాజరైన క్రిక్కిరిసిన జనంతో కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణం నిండిపోగా బయట బోస్ రోడ్డు మీద కూడా జనం నిలబడి వినడం తెనాలి తో నాఆధ్యాత్మిక అనుబంధాన్ని మరింత దృఢపరచిన సందర్భం. నాలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించటం లో ఈ కార్యక్రమాల ప్రభావం ఎంతో ఉంది. మా మిత్రమండలి సమావేశాలు, చినరావూరు పార్కు లోనూ, అప్పుడే ప్రారంభించిన వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వరుని ఆలయ ప్రాంగణంలోనూ, గంటలతరబడి జరిగి మమ్మల్ని అలరించేవి.
తెనాలి నేల, నీరు, గాలి ఎంత గొప్పవో !! ప్రఖ్యాత రచయితలైన కొడవడిగంటి, చలం, త్రిపురనేని, చక్రపాణి, జి.వి కృష్ణారావు; బొల్లిముంత శివరామ కృష్ణ, శారద, మరియు వందలమంది కళాకారులు నడచి తెనాలి వాసులను ఉత్తేజపరచిన ఈ నేలపై నేను కూడా ఆత్మీయానుబంధంతో నడవగలగటం నా ఆదృష్టం. అందుకే, నేను హైదరాబాద్ లో ఉంటున్నా, ఇప్పటికీ ఇక్కడ వీచే సాహిత్య, కళా సౌరభాలను తెనాలి వచ్చి పోతూ ఆస్వాదిస్తున్నాను. ఈ క్రమంలోనే, నేను అనువదించిన 'గీతాంజలి' ని, 'గీతా సారం' సంకలన గ్రంధాన్నీ' తెనాలి లోనే ఆవిష్కరించి, పంచిపెట్టటం జరిగింది. ఇలా తెనాలి తో నా అనుబంధాన్ని కొనసాగిస్తూ ఎంతో సంతోషాన్ని పొందుతున్నాను. ఇటువంటి "తెనాలి తల్లికి, వందనం" ! తెనాలి వాసులకు 'అభివందనం' !!.
గీతాంజలి మూర్తి
23.8.2012
బుధవారం, ఆగస్టు 22, 2012
మౌంటైన్ వ్యూ కబుర్లు -3
T.V. Technology in USA
Pause Live TV
12th august 2012 నాడు ఒలింపిక్ ఆటల ముగింపు ఉత్సవాలు NBC ఛానల్ లో Live చూస్తూఉన్నా. శ్రీమతి రమణ పావ్ భాజి తయార్ అని వంటింట్లోంచి కేక వేయటంతో టి.వి. కి వ్యవధానం (Pause) బొత్తం నొక్కి, వంటింట్లోకి వెళ్ళి పావ్ భాజి తెచ్చుకొని వచ్చి, ఇందాక టి.వి. ఆపిన దగ్గరి నుంచి చూడటం మొదలెట్టాను. అమెరికా లో డిష్ టి.వి లో Live TV ని పాజ్ లో పెట్టి, పని ముగించుకొని వచ్చి, ఎక్కడ ఆపామో అక్కడనుంచి టి.వి చూసే సౌకర్యం ఉంది. మనకు ఎవరన్నా ఫోన్ చేసినా టి.వి ని పాజ్ చేసి, నింపాదిగా ఫోన్ మాట్లాడి, టి.వి కార్యక్రమాన్ని అంతరాయం లేకుండా చూసి ఆనందించవచ్చును. భారతదేశం లో ఈ సౌకర్యం నేను ఎప్పుడూ వాడలేదు. మీరెవరైనా ఈ సదుపాయం వాడుతున్నారా? టి.వి. లో జాన్ లెనన్ Imagine పాట వస్తుంది. ఊహించండి, దేశాలు, సరిహద్దులు లేని, విశ్వశాంతి నెలకొన్న ప్రపంచం ఎంత బాగుంటుందో!
Digital Video Recorder
ఇక్కడ మా ఇంట్లో డిష్ టి.వి. సాటిలైట్ తో సంధానమైనది ఉన్నది. ఒక ప్రోగ్రాం చూస్తూ మరో ప్రోగ్రాం Digital Video Recorder లో సంగ్రహింప (Record) వచ్చు. అంతే కాదు Digital Video Recorder లో సంగ్రహింపబడిన ఏ కార్యక్రమమైనా చూస్తూ టి.వి. లోని మరో కార్యక్రమాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం వలన మంచి ఆసక్తికరమైన ప్రొగ్రాం ఏదైన వచ్చే సమయంలో బయటకు వెళ్ళాల్సి వస్తే, ఆ కార్యక్రమాలను రికార్డ్ చెయ్యమని Digital Video Recorder కు మనము ఆదేశం ఇవ్వవచ్చు. ఉదాహరణగా రోజూ చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్ చూసే అలవాటు మనకు ఉందనుకోండి. ఒకసారి Schedule చేసి ప్రతి రోజూ రికార్డ్ చెయ్యమని ఒకేసారి ఆజ్ఞ ఇస్తే చాలు. హచ్ కుక్కపిల్లలా ఆ ప్రొగ్రాం ఎప్పుడొచ్చినా స్వయంచాలితంగా అది తన పని తను చేసుకుపోతుంది.
Video on Demand
ఇంతే కాదు టి.వి లో మనకు కావల్సిన కార్యక్రమం కొరకు అన్వేషణ కూడా జరపవచ్చు. ఇంకా Video on Demand పద్ధతిలో పలు కార్యక్రమాలు మనం కొరినవిధంగా చూసే ఏర్పాటు ఉందిందులో. ఉదాహరణకు Olympic Games Opening Ceremony సమయంలో మనము వేరే ఊళ్ళో ఉన్నా, ఆ ప్రొగ్రాం కొరకు అన్వేషిస్తే వచ్చే లింక్ సాయంతో ఆ ప్రోగ్రాం మనము చూడవచ్చు. Video on Demand లో కొన్ని ప్రోగ్రాంలు చెల్లింపు పద్ధతిపై చూడవచ్చు. ఉదాహరణకు Dish TV లో మీరు విద్యా బాలన్ నటించిన "The Dirty Picture' చిత్రాన్ని 5 డాలర్ల చెల్లింపుతో చూడవచ్చును.
భారతదేశం లో నిర్మితమయ్యే కార్యక్రమాలున్న ఈ టి.వి., జెమిని, మా టి.వి., టి.వి.5, టి.వి. 9, సోనీ, ఆప్ కా కలర్స్ (భారత దేశంలో కలర్స్) కార్యక్రమాలు మాములుగా ప్రసారమయితే, ఆంగ్ల ప్రోగ్రాంలు, దాదాపుగా అన్నీ HD లో ప్రసారమవుతాయి. ఎంత పెద్ద టి.వి తెరపై నన్నా ఇవి ఎంతో శ్రవణ, దృశ్య నాణ్యతతో ప్రసారమవుతాయి.ఒలింపిక్ ఆటలు వంటి ప్రసారాలు ప్రత్యక్ష ప్రసారాలవుతాయిక్కడ.
ఆగస్ట్ 16 మధ్యాహ్న సమయాన టి.వి లో ఏదో ప్రొగ్రాం చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా టి.వి.లో ప్రసారాలు ఆగిపోయాయి. ఎందుకు ఆగాయో అంతుపట్టలేదు. 2నిమిషాలు శల్యపరీక్ష తరువాత తెలిసినదేమంటే విద్యుచ్ఛక్తి కి అంతరాయం కలిగిందని. 2 నిమిషాలు ఎందుకంటే, కరంట్ పోతుందనే విషయం ఊహకు అందని అంశం ఇక్కడ. మన హైదరాబాదులో భూకంపం వస్తే ఇళ్ళలోవారు ఎలా బయటకు వస్తారో, అలాగా, మా ఇరుగు పొరుగు బయటకు వచ్చి మీ ఇంట్లో Power ఉందా అని అడగ సాగారు. అమెరికా వచ్చాక మా పక్కింటివారిని చూడటం అదే ప్రధమం. వారు జపనీయులని తెలిసింది. ఈ సమయంలో గాలి స్థంభించినట్లుగా అనుభూతి చెందాము. ఎయిర్ కండిషనర్ పనిచేయదు. Cooking Stove పని చెయ్యలేదు. 40 నిమిషాల తర్వాత కరంట్ వచ్చింది. అందరి కళ్ళలో కాంతి కనిపించింది. ఇందాక చూస్తూ ఆగిపోయిన టి.వి ప్రోగ్రాం చూడాలని టి.వి. బొత్తం నొక్కాను. డిష్ టి.వి. ఉపగ్రహ సంకీతనం (Signal) అందకపోవటంతో, టి.వి. ఆ సిగ్నల్ అందుకోవటానికి ఏదో ప్రొగ్రాం స్వయంచాలితమై 5 నిమిషాల తర్వాత సంకీతనం అందుకుని టి.వి. మరలా పని చేయసాగింది.
టి.వి లో కార్యక్రమాలను మనకు అనువైన వేళలో చూడటానికి Dish Network HDTV Digital Video Recorder Satellite Receiver లో ప్రోగ్రాం చేసుకొని నాకు వీలయిన సమయంలో వాటిని చూసి ఆనందించేవాడిని. అలాగా Globe Trekker, బడే అచ్ఛె లగ్తె హై, చిన్నారి పెళ్ళికూతురు వగైరా కార్యక్రమాలను DVR లో సంగ్రహించేవాడిని. కార్యక్రమం చూశాక ఆ ప్రోగ్రాం DVR నుంచి తొలగించటం ఒక అలవాటుగా మారింది. ఆ సాయంత్రం చిన్నారి పెళ్ళికూతురు చూశాక ఆ తల (చిన్నారి పెళ్ళికూతురు) కింద ఉన్న అన్ని కార్యక్రమాలను ఎంచుకొని Delete బొత్తం నొక్కాను. ఏమయ్యిందో ఏమో మరి చిన్నారి పెళ్ళికూతురు తో పాటుగా, నేను, ఇంకా మా ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులు ఎన్నో నెలలుగా Record చేసిపెట్టుకున్న కార్యక్రమాలు మొత్తం, తుడిచిపెట్టినట్లుగా, అన్నీ తొలగించబడ్డాయి.
ఆ మరుసటి రోజు టి.వి గదిలోకి వెళ్తే ఎప్పుడూ వినోదాన్నందించే DVR ఎలాంటి కార్యక్రమాలు తనలో ఇముడ్చుకొని లేకుండా శూన్యంగా కనిపించింది. మనసు భారమయ్యింది. DVR కు కూడా Backup ఉంటే బాగుణ్ను అనిపించింది.
Pause Live TV
12th august 2012 నాడు ఒలింపిక్ ఆటల ముగింపు ఉత్సవాలు NBC ఛానల్ లో Live చూస్తూఉన్నా. శ్రీమతి రమణ పావ్ భాజి తయార్ అని వంటింట్లోంచి కేక వేయటంతో టి.వి. కి వ్యవధానం (Pause) బొత్తం నొక్కి, వంటింట్లోకి వెళ్ళి పావ్ భాజి తెచ్చుకొని వచ్చి, ఇందాక టి.వి. ఆపిన దగ్గరి నుంచి చూడటం మొదలెట్టాను. అమెరికా లో డిష్ టి.వి లో Live TV ని పాజ్ లో పెట్టి, పని ముగించుకొని వచ్చి, ఎక్కడ ఆపామో అక్కడనుంచి టి.వి చూసే సౌకర్యం ఉంది. మనకు ఎవరన్నా ఫోన్ చేసినా టి.వి ని పాజ్ చేసి, నింపాదిగా ఫోన్ మాట్లాడి, టి.వి కార్యక్రమాన్ని అంతరాయం లేకుండా చూసి ఆనందించవచ్చును. భారతదేశం లో ఈ సౌకర్యం నేను ఎప్పుడూ వాడలేదు. మీరెవరైనా ఈ సదుపాయం వాడుతున్నారా? టి.వి. లో జాన్ లెనన్ Imagine పాట వస్తుంది. ఊహించండి, దేశాలు, సరిహద్దులు లేని, విశ్వశాంతి నెలకొన్న ప్రపంచం ఎంత బాగుంటుందో!
Digital Video Recorder
ఇక్కడ మా ఇంట్లో డిష్ టి.వి. సాటిలైట్ తో సంధానమైనది ఉన్నది. ఒక ప్రోగ్రాం చూస్తూ మరో ప్రోగ్రాం Digital Video Recorder లో సంగ్రహింప (Record) వచ్చు. అంతే కాదు Digital Video Recorder లో సంగ్రహింపబడిన ఏ కార్యక్రమమైనా చూస్తూ టి.వి. లోని మరో కార్యక్రమాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం వలన మంచి ఆసక్తికరమైన ప్రొగ్రాం ఏదైన వచ్చే సమయంలో బయటకు వెళ్ళాల్సి వస్తే, ఆ కార్యక్రమాలను రికార్డ్ చెయ్యమని Digital Video Recorder కు మనము ఆదేశం ఇవ్వవచ్చు. ఉదాహరణగా రోజూ చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్ చూసే అలవాటు మనకు ఉందనుకోండి. ఒకసారి Schedule చేసి ప్రతి రోజూ రికార్డ్ చెయ్యమని ఒకేసారి ఆజ్ఞ ఇస్తే చాలు. హచ్ కుక్కపిల్లలా ఆ ప్రొగ్రాం ఎప్పుడొచ్చినా స్వయంచాలితంగా అది తన పని తను చేసుకుపోతుంది.
Video on Demand
ఇంతే కాదు టి.వి లో మనకు కావల్సిన కార్యక్రమం కొరకు అన్వేషణ కూడా జరపవచ్చు. ఇంకా Video on Demand పద్ధతిలో పలు కార్యక్రమాలు మనం కొరినవిధంగా చూసే ఏర్పాటు ఉందిందులో. ఉదాహరణకు Olympic Games Opening Ceremony సమయంలో మనము వేరే ఊళ్ళో ఉన్నా, ఆ ప్రొగ్రాం కొరకు అన్వేషిస్తే వచ్చే లింక్ సాయంతో ఆ ప్రోగ్రాం మనము చూడవచ్చు. Video on Demand లో కొన్ని ప్రోగ్రాంలు చెల్లింపు పద్ధతిపై చూడవచ్చు. ఉదాహరణకు Dish TV లో మీరు విద్యా బాలన్ నటించిన "The Dirty Picture' చిత్రాన్ని 5 డాలర్ల చెల్లింపుతో చూడవచ్చును.
భారతదేశం లో నిర్మితమయ్యే కార్యక్రమాలున్న ఈ టి.వి., జెమిని, మా టి.వి., టి.వి.5, టి.వి. 9, సోనీ, ఆప్ కా కలర్స్ (భారత దేశంలో కలర్స్) కార్యక్రమాలు మాములుగా ప్రసారమయితే, ఆంగ్ల ప్రోగ్రాంలు, దాదాపుగా అన్నీ HD లో ప్రసారమవుతాయి. ఎంత పెద్ద టి.వి తెరపై నన్నా ఇవి ఎంతో శ్రవణ, దృశ్య నాణ్యతతో ప్రసారమవుతాయి.ఒలింపిక్ ఆటలు వంటి ప్రసారాలు ప్రత్యక్ష ప్రసారాలవుతాయిక్కడ.
ఆగస్ట్ 16 మధ్యాహ్న సమయాన టి.వి లో ఏదో ప్రొగ్రాం చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా టి.వి.లో ప్రసారాలు ఆగిపోయాయి. ఎందుకు ఆగాయో అంతుపట్టలేదు. 2నిమిషాలు శల్యపరీక్ష తరువాత తెలిసినదేమంటే విద్యుచ్ఛక్తి కి అంతరాయం కలిగిందని. 2 నిమిషాలు ఎందుకంటే, కరంట్ పోతుందనే విషయం ఊహకు అందని అంశం ఇక్కడ. మన హైదరాబాదులో భూకంపం వస్తే ఇళ్ళలోవారు ఎలా బయటకు వస్తారో, అలాగా, మా ఇరుగు పొరుగు బయటకు వచ్చి మీ ఇంట్లో Power ఉందా అని అడగ సాగారు. అమెరికా వచ్చాక మా పక్కింటివారిని చూడటం అదే ప్రధమం. వారు జపనీయులని తెలిసింది. ఈ సమయంలో గాలి స్థంభించినట్లుగా అనుభూతి చెందాము. ఎయిర్ కండిషనర్ పనిచేయదు. Cooking Stove పని చెయ్యలేదు. 40 నిమిషాల తర్వాత కరంట్ వచ్చింది. అందరి కళ్ళలో కాంతి కనిపించింది. ఇందాక చూస్తూ ఆగిపోయిన టి.వి ప్రోగ్రాం చూడాలని టి.వి. బొత్తం నొక్కాను. డిష్ టి.వి. ఉపగ్రహ సంకీతనం (Signal) అందకపోవటంతో, టి.వి. ఆ సిగ్నల్ అందుకోవటానికి ఏదో ప్రొగ్రాం స్వయంచాలితమై 5 నిమిషాల తర్వాత సంకీతనం అందుకుని టి.వి. మరలా పని చేయసాగింది.
టి.వి లో కార్యక్రమాలను మనకు అనువైన వేళలో చూడటానికి Dish Network HDTV Digital Video Recorder Satellite Receiver లో ప్రోగ్రాం చేసుకొని నాకు వీలయిన సమయంలో వాటిని చూసి ఆనందించేవాడిని. అలాగా Globe Trekker, బడే అచ్ఛె లగ్తె హై, చిన్నారి పెళ్ళికూతురు వగైరా కార్యక్రమాలను DVR లో సంగ్రహించేవాడిని. కార్యక్రమం చూశాక ఆ ప్రోగ్రాం DVR నుంచి తొలగించటం ఒక అలవాటుగా మారింది. ఆ సాయంత్రం చిన్నారి పెళ్ళికూతురు చూశాక ఆ తల (చిన్నారి పెళ్ళికూతురు) కింద ఉన్న అన్ని కార్యక్రమాలను ఎంచుకొని Delete బొత్తం నొక్కాను. ఏమయ్యిందో ఏమో మరి చిన్నారి పెళ్ళికూతురు తో పాటుగా, నేను, ఇంకా మా ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులు ఎన్నో నెలలుగా Record చేసిపెట్టుకున్న కార్యక్రమాలు మొత్తం, తుడిచిపెట్టినట్లుగా, అన్నీ తొలగించబడ్డాయి.
ఆ మరుసటి రోజు టి.వి గదిలోకి వెళ్తే ఎప్పుడూ వినోదాన్నందించే DVR ఎలాంటి కార్యక్రమాలు తనలో ఇముడ్చుకొని లేకుండా శూన్యంగా కనిపించింది. మనసు భారమయ్యింది. DVR కు కూడా Backup ఉంటే బాగుణ్ను అనిపించింది.
మంగళవారం, ఆగస్టు 14, 2012
వీక్షణం: Bay Area Telugu Writers Forum
మౌంటైన్ వ్యూ కబుర్లు -2
ఉత్తర అమెరికాలో సాహితీ చైతన్యం
ఉత్తర అమెరికాలో సాహితీ సమావేశాలు డెట్రాయిట్, డాలస్, హూస్టన్ నగరాలలో ఉత్సాహంగా, తరచుగా జరుగుతుంటాయి. అయితే ఇక్కడి బే ఏరియాలో (Silicon Valley) సాహితీ వాతావరణం స్తబ్దుగా ఉంటుంది ఏడాదిలో ఎక్కువ భాగం; ఎప్పుడో అడపా తడపా శ్రీయుతులు గొర్తి శాయి బ్రహ్మానందం,కిరణ్ప్రభ ప్రభృతులు నిర్వహించే కాలిఫొర్నియా తెలుగు సదస్సులు తప్పిస్తే. 2008 నుంచి ఇక్కడ తెలుగు బ్లాగర్ల, రచయితల సమావేశాలు నేను కొన్ని నిర్వహించినప్పటికి, డాలస్ లో లాగా తరచూ సాహితీ సమావేశాలు జరిపే సంస్కృతి ఇంకా అలవాటు కాలేదు ఇక్కడ. అయితే బే ఏరియా లో పేర్గాంచిన రచయితలు, కవులు ఇంకా సంపాదకులు ఉన్నారు. కౌముది, సృజనరంజని వెబ్ మాసపత్రికలు ఈ ప్రాంతము నుంచే వెలువడుతున్నాయి. మరి లోపం ఎక్కడుందో ఒక పట్టాన బోధపడదు.
తానా, ఆటా వగైరా సంస్థలు తొలితరం తెలుగు వారితో స్థాపించబడ్డాయి. ఇవి కుల జాడ్యం, ప్రాంతీయ భేదాలు వగైరాలతో మరిన్ని చీలికలయ్యాయి. పాత తరం వారినే తప్ప నేటి తరం తెలుగు యువతను ఈ సంస్థలు ఆకర్షింపలేకపోతున్నాయి. ఇక్కడే పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లలు అమెరికన్ సంస్కృతిలో మమేకం అవటం ముఖ్య కారణంగా అనిపిస్తుంది. మన తెలుగు బాష, సంస్కృతి కి వారసులైన వీరు తెలుగు నేర్చుకొనకపోతే తరువాతి తరంలో తెలుగు సంస్కృతి ఇక్కడ కరువయ్యే ప్రమాదముంది. ఈ చారిత్రక అవసరాన్ని గుర్తించి సిలికాన్ అంధ్రావారు మన బడి అంటూ తెలుగు అధ్యయన తరగతులు ప్రారంభించినప్పటికి, తెలుగు చదవటం రాని తెలుగు అమెరికన్ పిల్లలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు అమెరికాలో. తెలుగు పిల్లలకు తెలుగు నేర్పటానికి మరిన్ని సంస్థలు, వ్యక్తులు ముందుకు రావాలి.
ఇలాంటి చారిత్రక సమయంలో డా|| గీతా మాధవి తెలుగు వికాసం అనే వేదిక స్థాపించి స్థానిక పిల్లలకు తెలుగు, సంగీతం నేర్పుతున్నారు. ఆగస్ట్ 12 ఆదివారం, భారత స్వాతంత్ర్య వేడుకలను సన్నీవేల్ లోని షిర్డీ శాయి దేవాలయంలో తమ శిష్యులతో కలిసి డా|| గీత నిర్వహించారు. ఈ సందర్భంగా వీక్షణం అనే మరో వేదిక ఆవిష్కరించబడ్డది. ఇంకా కవనం అనే బాలల e-book కూడా ఆవిష్కరించబడ్డది. "వీక్షణం" సాహిత్యకారులను ఒక చోట చేర్చి సదస్సులు నిర్వహించడం, రచనల ప్రచురణలు, ఆవిష్కరణలు మొదలైన వాటి ద్వారా బే ఏరియాలో సాహిత్యానికి కొత్త గవాక్షాల్ని తెరుస్తుంది. విద్యార్థుల సృజనాత్మక శక్తిని బాలల పత్రిక "కవనం" ద్వారా వెలికి తెస్తుంది. వీక్షణం ద్వారా కొన్ని సాహితీ సభలు నిర్వహించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.వీక్షణం కార్యక్రమాలలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు తెలుగు వికాసం ను లేక భవదీయుడును సంప్రదించవచ్చు.
Click on photo to view the album of the event.
ఉత్తర అమెరికాలో సాహితీ చైతన్యం
ఉత్తర అమెరికాలో సాహితీ సమావేశాలు డెట్రాయిట్, డాలస్, హూస్టన్ నగరాలలో ఉత్సాహంగా, తరచుగా జరుగుతుంటాయి. అయితే ఇక్కడి బే ఏరియాలో (Silicon Valley) సాహితీ వాతావరణం స్తబ్దుగా ఉంటుంది ఏడాదిలో ఎక్కువ భాగం; ఎప్పుడో అడపా తడపా శ్రీయుతులు గొర్తి శాయి బ్రహ్మానందం,కిరణ్ప్రభ ప్రభృతులు నిర్వహించే కాలిఫొర్నియా తెలుగు సదస్సులు తప్పిస్తే. 2008 నుంచి ఇక్కడ తెలుగు బ్లాగర్ల, రచయితల సమావేశాలు నేను కొన్ని నిర్వహించినప్పటికి, డాలస్ లో లాగా తరచూ సాహితీ సమావేశాలు జరిపే సంస్కృతి ఇంకా అలవాటు కాలేదు ఇక్కడ. అయితే బే ఏరియా లో పేర్గాంచిన రచయితలు, కవులు ఇంకా సంపాదకులు ఉన్నారు. కౌముది, సృజనరంజని వెబ్ మాసపత్రికలు ఈ ప్రాంతము నుంచే వెలువడుతున్నాయి. మరి లోపం ఎక్కడుందో ఒక పట్టాన బోధపడదు.
తానా, ఆటా వగైరా సంస్థలు తొలితరం తెలుగు వారితో స్థాపించబడ్డాయి. ఇవి కుల జాడ్యం, ప్రాంతీయ భేదాలు వగైరాలతో మరిన్ని చీలికలయ్యాయి. పాత తరం వారినే తప్ప నేటి తరం తెలుగు యువతను ఈ సంస్థలు ఆకర్షింపలేకపోతున్నాయి. ఇక్కడే పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లలు అమెరికన్ సంస్కృతిలో మమేకం అవటం ముఖ్య కారణంగా అనిపిస్తుంది. మన తెలుగు బాష, సంస్కృతి కి వారసులైన వీరు తెలుగు నేర్చుకొనకపోతే తరువాతి తరంలో తెలుగు సంస్కృతి ఇక్కడ కరువయ్యే ప్రమాదముంది. ఈ చారిత్రక అవసరాన్ని గుర్తించి సిలికాన్ అంధ్రావారు మన బడి అంటూ తెలుగు అధ్యయన తరగతులు ప్రారంభించినప్పటికి, తెలుగు చదవటం రాని తెలుగు అమెరికన్ పిల్లలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు అమెరికాలో. తెలుగు పిల్లలకు తెలుగు నేర్పటానికి మరిన్ని సంస్థలు, వ్యక్తులు ముందుకు రావాలి.
ఇలాంటి చారిత్రక సమయంలో డా|| గీతా మాధవి తెలుగు వికాసం అనే వేదిక స్థాపించి స్థానిక పిల్లలకు తెలుగు, సంగీతం నేర్పుతున్నారు. ఆగస్ట్ 12 ఆదివారం, భారత స్వాతంత్ర్య వేడుకలను సన్నీవేల్ లోని షిర్డీ శాయి దేవాలయంలో తమ శిష్యులతో కలిసి డా|| గీత నిర్వహించారు. ఈ సందర్భంగా వీక్షణం అనే మరో వేదిక ఆవిష్కరించబడ్డది. ఇంకా కవనం అనే బాలల e-book కూడా ఆవిష్కరించబడ్డది. "వీక్షణం" సాహిత్యకారులను ఒక చోట చేర్చి సదస్సులు నిర్వహించడం, రచనల ప్రచురణలు, ఆవిష్కరణలు మొదలైన వాటి ద్వారా బే ఏరియాలో సాహిత్యానికి కొత్త గవాక్షాల్ని తెరుస్తుంది. విద్యార్థుల సృజనాత్మక శక్తిని బాలల పత్రిక "కవనం" ద్వారా వెలికి తెస్తుంది. వీక్షణం ద్వారా కొన్ని సాహితీ సభలు నిర్వహించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.వీక్షణం కార్యక్రమాలలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు తెలుగు వికాసం ను లేక భవదీయుడును సంప్రదించవచ్చు.
Click on photo to view the album of the event.
![]() |
Telugu Vikasam, Mountain View, CA, Independence Day Celebrations 2012 |
గురువారం, ఆగస్టు 09, 2012
బ్లాగులు- వ్యాఖ్యలు -16
హైదరాబాదులోని చార్మినార్ నుంచి బాద్శాహి అసుర్ఖానా వెళ్ళే Heritage Walk లో గుల్జార్ హౌస్ దగ్గరి Sher-E-Batil-Ki-Kaman వద్ద కల సింహపు శిల్పం. Photo: cbrao
అట్లాస్ ష్రగ్డ్ పుస్తకం తెప్పించుకొని భుజాలు ఎగిరేసాను
"ప్రపంచ ఆర్ధిక స్థితి గురించి ఈమధ్య బాగా పరిశీలిస్తున్నాను. " - గ్రీసు ఎప్పుడు ఐ పి పెడుతుందోనని స్టాక్ మార్కెట్లు వణుకుతున్నాయి. గ్రీసు దేశ దివాలాకోరుతనానికి కారణాలేమిటి?
http://sarath-kaalam.blogspot.com/2011/10/blog-post.html
స్టీవ్ జాబ్స్.. భారతదేశం.. యాపిల్
ఆపిల్ అధినేత స్టీవ్ జాబ్స్ గురించి అనేక కొత్త విషయాలు తెలిసాయి. ఆసక్తికరంగా ఈ వ్యాసాన్ని అందించినందుకు అభినందనలు.
http://kanthisena.blogspot.com/2011/10/blog-post.html
వాక్యకోవిదుడు హనుమంతుడు
ఈ పుస్తక పరిచయం వలన, హనుమంతుడి నడవడిక తెలుసుకోవడం ద్వారా, మాట తీరు, వ్యక్తిత్వ వికాసం పెంచుకోవచ్చనే ఉషశ్రీ గారి పరిశీలనతో ఏకీభవించకుండా ఉండలేము. సమీక్ష ఏకబిగిన ఆసక్తిగా చదివించింది.
http://pustakam.net/?p=8534
తుమ్మపూడి – సంజీవ దేవ్ స్వీయ చరిత్ర
Afterword: సంజీవదేవ్ వ్రాసిన పుస్తకాల వివరాలు, వర్ణచిత్రాలు, ఛాయాచిత్రాలు, తన చిత్రాల పై సంజీవదేవ్ విశ్లేషణ ఇంకా ఇతరులు సంజీవదేవ్ పై వ్రాసిన వ్యాసాలు ఈ దిగువ గొలుసులో చూడవచ్చు.
http://sanjivadev.tripod.com/
http://pustakam.net/?p=8520
సామల సదాశివ ముచ్చట్లు – “మలయ మారుతాలు”
సదాశివుని సంగీతం ముచ్చట్లు ఆసక్తికరంగా చెప్పారు. సంగీత ప్రియులకు ఈ పుస్తకం చదువుతుంటేనే, నేపధ్యంలో, చక్కని సంగీతం వీనులకింపుగా వినిపిస్తుంది. సదాశివ వ్రాసిన సంగీత శిఖరాలు,మిర్జా గాలిబ్ (జీవితము, రచనలు) పుస్తకాలు కూడా పాఠకులను ఆకట్టుకుంటాయి. డాక్టర్ సామల సదాశివ పై వారాల ఆనంద్ తీసిన లఘు చిత్రాన్ని ఈ దిగువ గొలుసుద్వారా చూడవచ్చు.
http://www.maganti.org/videofiles/sahityam/yadi/yadi.html
http://pustakam.net/?p=8825
ఈ రోజు పొద్దున్నే బాగోతం ఇదయ్యా......మాగంటి.ఆర్గ్ సైటు మూసే ఉంచుతా!!!
మొన్నే శ్రీరామరాజ్యం చిత్రం చూసాను. ఎవడో గొట్టం అన్న మాటలకు శ్రీరాముడు సీతమ్మవారిని అడవులకు పంపాడు. ఎవడో కొణంగి తెలిసో తెలియకో ఒకే ఫైల్ ను పదే పదే నొక్కితే మాగంట్.ఆర్గ్ సైట్ ను మూసెయ్యటమా? తగదు. మరలా తెరవాలని కోరుతాను.
http://janatenugu.blogspot.com/2011/11/blog-post_2139.html
కర్ణాటక తీర్థ యాత్ర -1
సచిత్రంగా కళ్ళకు కట్టినట్టుగా వ్రాశారు మీ యాత్రను. నేను కూడా మీతో ఈ యాత్రలో సూక్ష్మరూపంలో పాల్గొంటూ, ఆనందిస్తాను. పదండి ముందుకు.
http://sarasabharati-vuyyuru.com/2011/12/28/%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5-%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-1/
Durgesh Nandini – Bankim Chandra Chatterjee
For those interested in reading Durgesh Nandini in Telugu, here is good news. It was translated by late Dandamudi Mahidhar garu into Telugu and was first published in the year 1966. The reprint was made in October 2011 by Sahiti Publications of Vijayawada. The cost of the book is Rs. 70/- This book also contains translation of the novel Sitaram by Bankimchandra which is tranlated by D.Venkatramayya garu. The reader thus gets two novels of Bankim for Rs.70/- The quality of printing and the cover page are good. It is now available with leading book sellers of Andhra Pradesh.
http://vbsowmya.wordpress.com/2008/07/27/durgesh-nandini-bankim-chandra-chatterjee/
CHANGE...
చుక్కల్లేని పగటి ఆకాశం
కాదు కాదు చుక్కలు కనపడని ఆకాశం
కనపడతాయి చుక్కలు పొద్దు వాలంగానే
రేపు మూసిన పిడికిలి
నేడు తెరిసిన పిడికిలి
మూసిన పిడికిలి లో ఏముందో
ఈరోజే తెలిస్తే కాదా జీవితం
ఆసక్తి రహితం
కాలం ఆగితే
ప్రపంచగమనం ఆగితే
ఉండిపోతే నేనలాగే
కామా మనం బాల వృద్ధులం
http://jabilisirineni.blogspot.com/2011/07/change.html
బుధవారం, ఆగస్టు 08, 2012
మౌంటైన్ వ్యూ కబుర్లు
2012 మే మాసంలో అంధ్రలో ఎండలు, మండుటెండలు ఇంకా వడగాల్పులు. ఆ వేడిని తప్పించుకోవటానికి ఎయిర్ కూలర్ లేక ఎ.సి. ఉన్న గదిలో ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడతాం.అదే ఇల్లంతా ఎ.సి. ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అసలు ఊరంతా ఎ.సి.ఐతే! మరీ దురాశగా ఉంది కదూ! ఊహకందని ప్రతిపాదన కదా?
కాని మౌంటైన్ వ్యూ (Mountain View, Silicon Valley, California) కు వొచ్చాక ఆ ఊహ నిజమైంది. ఇక్కడ ఇల్లే కాదు ఊరు ఊరంతా ఎ.సి.లాగా ఉంది ఇక్కడ వాతావరణం. ఎంతో హాయిగా ఉంది. అయితే జూన్ నెల వచ్చాక ఇక్కడ వాతావరణం లో మార్పు కనిపిస్తోంది. నిన్న, ఇవ్వాళ ఆశ్చర్యకరంగా ఇంట్లో గాలి పంఖా (fan) వాడుతున్నాము. బహుశా ఇంకొన్ని రోజులు ఫాన్ అవసరం ఉండవచ్చు. ఆ తర్వాత వచ్చే సంవత్సరం దాక పంఖా కు విశ్రాంతే.
మా పెరటి ఆపిల్ చెట్టు
మేము వచ్చేసరికి ఆపిల్ చెట్టు పూలు పూసి, పిందెలతో ఉంది. ఏ కారణం వలనో గత పర్యాయం ఇక్కడకు వచ్చినప్పుడు కాసినంత కాపు ఇప్పుడు లేదు. 2010 లో అయితే శ్రీమతి రమణ పచ్చి ఆపిల్ కాయలతో ఎంచక్కా ఆవకాయే పెట్టింది. చిన్న పరిణామంలోని ఆకుపచ్చ ఆపిల్ కాయలు కొంత వగరుగా, పుల్లగా ఉండి ఆపిల్ ఆవకాయకు కావల్సిన రుచినిచ్చాయి.
తెలుగు వారి సమావేశాలు
వారాంతం వొస్తే ఇక్కడ కోలాహలమే. మన ఆంధ్రప్రదేష్ లో ఐతే బంధు మిత్రులను తరచుగా వివాహలలో కలుస్తుంటాము. ఎన్ని వివాహాలంటే, పెళ్లికి వెళ్లాలంటే విసుగేశంత. ఇక్కడ వివాహాలు అరుదుగా తప్ప బంధు మిత్రుల లో జరగవు. ఆ లోటు తీర్చటానికా అన్నట్లు ఇక్కడ పుట్టిన రోజు పండగ, సీమంతం (Baby shower), దసరా, దీపావళి, సంక్రాంతి మరియు ఉగాది పండుగ సమయాలలో సామాజిక సమావేశాలు తరచుగా జరుగుతుంటాయి. పండగ సమయాలలో ఇక్కడి తెలుగు సాంస్కృతిక సంఘాలవారు పార్క్ లలో సమావేశాలు జరుపుతారు. ఇంకా తానా, ఆటా, నాటా, నాట్స్ వగైరా సంఘాలవారు ప్రతి సంవత్సరము తెలుగు సభలను జరుపుతుంటారు. అమెరికా తెలుగువారు కుల ప్రాతిపదకపై విడిపోయి ఇలా భిన్న సంఘాలు పెట్టుకోవటం బాధాకరం. తమాషా విషయమేమంటే ఈ పుట్టిన రోజులు వగైరా వేడుకలు అన్నీ వారాంతం లోనే ఎక్కువగా జరుగుతాయి. వారం రోజులలో ఇక్కడివారు తమ తమ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం దృష్ట్యా ఇది అనివార్యం.
మౌంటైన్ వ్యూ పార్క్ లో తెలుగు మిత్రుల సమావేశం
ఇక్కడికి వచ్చిన మొదటి వారాంతం లో కవయిత్రి గీతా మాధవి ఇక్కడి తెలుగు వారితో Mountain View, Rengstorff Park లో ఒక సమావేశం ఏర్పరిచారు. ఇక్కడి తెలుగు వారితో పరిచయం కలిగింది. ఆటలు, పాటలు, కబుర్లు, మధ్యాహ్న విందు భోజనం (Potluck lunch) ల తో సరదాగా గడిచింది.మరిన్ని సమావేశ ఛాయాచిత్రాలు ఈ దిగువ ఇచ్చిన గొలుసులలో చూడవచ్చు.
https://plus.google.com/photos/114125420321576521677/albums/5750046785761708305?authkey=CM38tumN58qv5wE
https://plus.google.com/photos/115779731434350218592/albums/5750317393696013697?authkey=CJTjvfX_-paCxwE
డా|| గీతా మాధవి తెలుగు వికాసం ను స్థాపించి తెలుగు భాష, సంగీత తరగతుల ద్వారా అమెరికా విద్యార్థులకు భాషా, కళా సేవ చేస్తున్నారు. తన వెబ్ సైట్ లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
http://www.teluguvikasam.com/
కార్యక్రమం చివరలో శ్రీమతి గీత విద్యార్ధులు తాము నేర్చుకున్న పాటలను ఆహుతులకు వినిపించి శ్రవణానందం కలుగచేశారు.
మా పెరటి ఆపిల్ చెట్టు
మేము వచ్చేసరికి ఆపిల్ చెట్టు పూలు పూసి, పిందెలతో ఉంది. ఏ కారణం వలనో గత పర్యాయం ఇక్కడకు వచ్చినప్పుడు కాసినంత కాపు ఇప్పుడు లేదు. 2010 లో అయితే శ్రీమతి రమణ పచ్చి ఆపిల్ కాయలతో ఎంచక్కా ఆవకాయే పెట్టింది. చిన్న పరిణామంలోని ఆకుపచ్చ ఆపిల్ కాయలు కొంత వగరుగా, పుల్లగా ఉండి ఆపిల్ ఆవకాయకు కావల్సిన రుచినిచ్చాయి.
తెలుగు వారి సమావేశాలు
వారాంతం వొస్తే ఇక్కడ కోలాహలమే. మన ఆంధ్రప్రదేష్ లో ఐతే బంధు మిత్రులను తరచుగా వివాహలలో కలుస్తుంటాము. ఎన్ని వివాహాలంటే, పెళ్లికి వెళ్లాలంటే విసుగేశంత. ఇక్కడ వివాహాలు అరుదుగా తప్ప బంధు మిత్రుల లో జరగవు. ఆ లోటు తీర్చటానికా అన్నట్లు ఇక్కడ పుట్టిన రోజు పండగ, సీమంతం (Baby shower), దసరా, దీపావళి, సంక్రాంతి మరియు ఉగాది పండుగ సమయాలలో సామాజిక సమావేశాలు తరచుగా జరుగుతుంటాయి. పండగ సమయాలలో ఇక్కడి తెలుగు సాంస్కృతిక సంఘాలవారు పార్క్ లలో సమావేశాలు జరుపుతారు. ఇంకా తానా, ఆటా, నాటా, నాట్స్ వగైరా సంఘాలవారు ప్రతి సంవత్సరము తెలుగు సభలను జరుపుతుంటారు. అమెరికా తెలుగువారు కుల ప్రాతిపదకపై విడిపోయి ఇలా భిన్న సంఘాలు పెట్టుకోవటం బాధాకరం. తమాషా విషయమేమంటే ఈ పుట్టిన రోజులు వగైరా వేడుకలు అన్నీ వారాంతం లోనే ఎక్కువగా జరుగుతాయి. వారం రోజులలో ఇక్కడివారు తమ తమ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం దృష్ట్యా ఇది అనివార్యం.
మౌంటైన్ వ్యూ పార్క్ లో తెలుగు మిత్రుల సమావేశం
ఇక్కడికి వచ్చిన మొదటి వారాంతం లో కవయిత్రి గీతా మాధవి ఇక్కడి తెలుగు వారితో Mountain View, Rengstorff Park లో ఒక సమావేశం ఏర్పరిచారు. ఇక్కడి తెలుగు వారితో పరిచయం కలిగింది. ఆటలు, పాటలు, కబుర్లు, మధ్యాహ్న విందు భోజనం (Potluck lunch) ల తో సరదాగా గడిచింది.మరిన్ని సమావేశ ఛాయాచిత్రాలు ఈ దిగువ ఇచ్చిన గొలుసులలో చూడవచ్చు.
https://plus.google.com/photos/114125420321576521677/albums/5750046785761708305?authkey=CM38tumN58qv5wE
https://plus.google.com/photos/115779731434350218592/albums/5750317393696013697?authkey=CJTjvfX_-paCxwE
డా|| గీతా మాధవి తెలుగు వికాసం ను స్థాపించి తెలుగు భాష, సంగీత తరగతుల ద్వారా అమెరికా విద్యార్థులకు భాషా, కళా సేవ చేస్తున్నారు. తన వెబ్ సైట్ లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
http://www.teluguvikasam.com/
కార్యక్రమం చివరలో శ్రీమతి గీత విద్యార్ధులు తాము నేర్చుకున్న పాటలను ఆహుతులకు వినిపించి శ్రవణానందం కలుగచేశారు.
సోమవారం, జులై 09, 2012
తెలుగు సంస్కృతి -అమెరికా లో ఎలా పరిచయం చెయ్యాలి?
చిత్రం: వేమన పద్యాలు సౌజన్యం: తెలుగు గ్రీటింగ్స్.నెట్
1963 లో అమెరికా ప్రభుత్వ ఆహ్వానం పై అమెరికా పర్యటించిన సాహితీ ప్రియుడు, మానవవాది ఐన ఆవుల గోపాల కృష్ణమూర్తి గారు మన తెలుగు సంస్కృతిని ఇక్కడి ప్రజలకు, పిల్లలకు ఎలా పరిచయం చేశారో వివరిస్తున్నారు ఈ దిగువ వ్యాసం లో మరో మానవవాది ఐన నరిశెట్టి ఇన్నయ్య గారు.
కీ||శే ఆవుల గోపాల కృష్ణమూర్తి Telugu Samskruti
1963 లో అమెరికా ప్రభుత్వ ఆహ్వానం పై అమెరికా పర్యటించిన సాహితీ ప్రియుడు, మానవవాది ఐన ఆవుల గోపాల కృష్ణమూర్తి గారు మన తెలుగు సంస్కృతిని ఇక్కడి ప్రజలకు, పిల్లలకు ఎలా పరిచయం చేశారో వివరిస్తున్నారు ఈ దిగువ వ్యాసం లో మరో మానవవాది ఐన నరిశెట్టి ఇన్నయ్య గారు.
కీ||శే ఆవుల గోపాల కృష్ణమూర్తి Telugu Samskruti
మంగళవారం, మే 01, 2012
తనను తానే పేల్చుకునే ఐఫోన్-5
మీ ఫోన్ ఎవరైనా దొంగిలించి పాస్ వర్డ్ ఊహించి తెరవటానికి ప్రయత్నిస్తే, ఐఫోన్ లో పాస్ వర్డ్ సెక్యూరిటీ ఫీచర్ ఎనేబిల్ చేసి ఉంటే ఫోన్ లోని సమాచారం మీ ఐట్యూన్స్ ఖాతాకు పంపి ఐఫోన్ తనను తానే పేల్చుకొంటుంది. ఇది ఊహాజనితమైన వీడియో అని చెప్పనవసరం లేదుగా.
మీ ఫోన్ మీరు కాక మరెవరూ ఉపయోగించకూడదంతే.
మీ ఫోన్ మీరు కాక మరెవరూ ఉపయోగించకూడదంతే.
శుక్రవారం, ఫిబ్రవరి 24, 2012
చిత్రకారుడు శంకర్
Self Portrait of Sankara Narayana Sathiraju
దర్శకుడు బాపు తమ్ముడైన చిత్రకారుడు సత్తిరాజు శంకర నారాయణ (శంకర్),1936 లో నర్సాపురంలో జన్మించారు. లయోలా కాలేజ్, మద్రాసు లో ఎకానమిక్స్ లో హానర్స్ చేశాక, అక్కడి ఆకాశవాణి లో 1963 లో చేరారు. రేడియోలో, అనేక విభాగాలలో సేవలందించి 1995 లో చెన్నై స్టేషన్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణకు ముందు, చిత్రకళపై ఆసక్తి తో ఆకాశవాణి వెలువరించే, పలు ప్రచురణలకు తనే ముఖపత్ర రచన చేసేవారు. పదవీ విరమణ తరువాత తనకు ఆసక్తి ఉన్న చిత్రకళా రంగం లో కృషి చేస్తున్నారు. కట్టెబొగ్గు, ఇండియన్ ఇంక్ మరియు పెన్సిల్ మాధ్యమాల లో ఇప్పటిదాకా సుమారు 1500 చిత్రాలు గీశారు. 1992లో తిరుపతి లో భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు నిర్వహించిన సమయంలో శంకర్ తొలిగా చిత్రించిన స్వర్గీయ పి.వి.నరసింహారావు చిత్రం ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధమ పేజీలో ముద్రితమయ్యింది. తదుపరి పలు రంగాలలో ఉన్న, ప్రఖ్యాత భారతీయ వ్యక్తుల చిత్రాలను గీస్తూ, పలువురి మన్ననలందుకున్నారు.
శంకర్ చిత్రాలు Samudra, Sruthi, Splendour, Post Noon ఆంగ్ల పత్రికలు, ఆంధ్ర ప్రదేష్, స్వప్న, జగతి మాస పత్రికలు, నవ్య వార పత్రిక, ఈనాడు,వార్త, సూర్య, ఉదయవాణి (కర్నాటక) మొదలగు దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి. శంకర్ చిత్రించిన కన్నడ జ్ఞానపీఠ్ బహుమతి గ్రహీతల చిత్రాల ప్రదర్శన, 2007 లో మైసూరు పట్టణం లో జరిగింది. కర్ణాటక చిత్ర కళాపరిషత్ , బెంగలూరు లో 2011 లో శంకర్ చిత్రాలు (భారతదేశ ప్రముఖులవి) తొలిసారిగా ప్రదర్శించబడ్డాయి. ఈ సందర్భం లో మైసూర్ టర్బన్ తో శంకర్ ను సత్కరించారు.
SriRamana
2008 లో హాసరేఖలు అనే పుస్తకం, శంకర్ గీసిన 80 మంది ప్రఖ్యాత భారతీయుల చిత్రాలతో, హాసం ప్రచురణలు వారిచే ప్రచురించబడింది.108 చిత్రాల తో కూడిన ధృవతారలు అనే శంకర్ చిత్రాల పుస్తకాన్ని ముఖి మీడియా వారు అక్టొబర్ 2011 లో ప్రచురించారు. ఈ సందర్భం లో శంకర్ బొమ్మల కొలువు అనే పేరుతో, శంకర్ చిత్రాలు, హైదరాబాదు లోని ICCR Art Gallery రవీంద్రభారతి లో ప్రదర్శించబడ్డాయి. శంకర్ గీచిన కర్ణాటక సంగీతకారుల చిత్ర ప్రదర్శన డిసంబర్ 2011 లో చెన్నై సంగీత అకాడెమి లో జరిగింది.
ఉద్యోగ విరమణ తర్వాత తన భార్య కీ.శే. శాంత ప్రోత్సాహంతో తాను చిత్రకళ చేపట్టినట్లు చెప్తారు. అన్న బాపు, వియ్యంకుడు కీ.శే. ముళ్ళపూడి వెంకట రమణ కళాత్మక రంగంలో కృషి చేయటానికి మంచి ప్రేరణ ఇచ్చారంటారు శంకర్. శంకర్ చిత్రాలు మరిన్ని చూడాలంటే శంకర్ వెబ్సైట్ www.sankarportraits.com చూడవచ్చు. శంకర్ ప్రస్తుత నివాసం చెన్నై.
తాజా కలం: ఈ వ్యాసం లో ప్రచురించిన చిత్రాల కాపీరైట్ హక్కులు చిత్రకారుడు శంకర్ గారివి. ఈ చిత్రాలు అనుమతి తో ప్రచురించబడ్డవి.
గురువారం, ఫిబ్రవరి 23, 2012
ఆంధ్రప్రశస్తి: విశ్వనాధ సత్యనారాయణ

గొట్టుపదములు కొన్నింటికి అక్కడక్కడా అధోజ్ఞాపిక (footnote) లో వివరణలు ఇవ్వబడ్డాయి. అయినా సామాన్య పాఠకుడుకి ఈ పద్యాలు సులభ గ్రాహ్యం కావు.
ఆంధ్రప్రశస్తి నుండి గోదావరీ పావనోదార…
గోదావరీ పావనోదార వాఃపూర
మఖిల భారతము మాదన్ననాడు
తుంగభద్రా సముత్తుంగరావము తోడ
కవుల గానము శ్రుతిగలుపు నాడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ
శ్రేణిలో తెన్గు వాసించునాడు
కృష్ణా తరంగ నిర్ణిద్ర గానముతోడ
శిల్పము తొలిపూజ సేయునాడు
అక్షరజ్ఞానమెఱుగదో యాంధ్రజాతి?
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుబాట పిచ్చుక గూళ్ళు కట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు
(పద్యం.నెట్ సౌజన్యంతో ఈ కవిత ఇవ్వబడినది)
2006 సంవత్సరములో ఈ పుస్తకాన్ని సుందరయ్య విజ్ఞానకేంద్రం వారు డిజిటైజ్ చేసారు. ఆసక్తికలవారు ఇక్కడనుంచి దిగుమతి చేసుకోవచ్చును.
ప్రచురణ:
ప్రధమ ముద్రణ: చెన్నపురి, కేసరి ముద్రాక్షరశాల - 1928
నవమ ముద్రణము: 2003
ముఖచిత్రం: అడవి బాపిరాజు
వెల: 30 రూపాయలు
Viswanadha Publications.Viswanadhapuram, Marutinagar, Vijayawada -520 004
Further listening: విశ్వనాధవారి గళంలో కిన్నెరసాని పాట ఇక్కడ వినండి.
Further reading: నేనెఱిగిన విశ్వనాథ
బుధవారం, ఫిబ్రవరి 22, 2012
డా. జంపాల చౌదరి గారితో ముఖా ముఖి
డా. జంపాల చౌదరి గారు Snowfall ఇతివృత్తంగా ఒక కధ వ్రాసారనే విషయం మీకు తెలుసా? వ్యాసాలుగా వ్రాయవలసిన ఇతివృత్తాలను నేటి రచయితలు కధలుగా వ్రాస్తున్నారా? కధకు కధానికకు తేడా ఏమిటి? ఉత్తర అమెరికా లోని రచయితలు, సాహిత్యం తీరుతెన్నులేమిటి? యునికోడ్ లో లేని, ఆంధ్రభారతి.కాం ప్రత్యేకతేమిటి? అమెరికా లో నాటా, తానా, ఆటా ఇంకా నాట్స్ అని ఇన్ని సంఘాలు అవసరమా?
తెలుగు పాఠకులలో పఠనాసక్తి తగ్గిందా? జంపాల గారి అభిమాన రచయితలెవరు? జంపాల గారితో ముఖా ముఖి చూడండి.
సాక్షి టి.వి. సౌజన్యంతో
మంగళవారం, ఫిబ్రవరి 21, 2012
మహమ్మద్ ఖదీర్బాబు కధా సంపుటం - న్యూ బాంబే టైలర్స్-2
ఈ పుస్తక పరిచయం మొదటి భాగం ఇక్కడ చదవవొచ్చును.
http://deeptidhaara.blogspot.in/2012/02/1.html
ఈ పుస్తకం ఎందుకు చదవాలనే విషయంపై వొల్గా గారు మాట్లాడాక జంపాల చౌదరి గారు ఈ పుస్తకం లోని కధలపై తమ అభిప్రాయం వెళ్ళడించారు. వినండి.
http://dl.dropbox.com/u/31976678/nbt-3.mp3
ఒకే ఇతివృత్తం పై ఉన్న ఖదీర్ ' జమీన్ ', వోల్గా 'సారీ జాఫర్ ' కధల మధ్య వ్యత్యాసాన్ని వోల్గా వివరించారు. ఆ తర్వాత Usha S Dani (ఖాన్ యజ్ఞాని) ఖదీర్ కధలను విశ్లేషించారు. వినండి.
http://dl.dropbox.com/u/31976678/nbt-4.mp3
తర్వాత పాత్రికేయుడు సతీష్ చందర్ ఖదీర్ కధల పరిచయం చేశారు. వినండి.
http://dl.dropbox.com/u/31976678/nbt-5.mp3
చివరగా ఖదీర్బాబు మాట్లాడుతూ తన కధల సంపుటి రావటానికి పదిహైను సంవత్సరాలు పట్టిందనీ, భావితరం వారు తననొక మంచి కధకుడిగా గుర్తించ కోరుతానన్నారు. వీడియో చూడగలరు.
ఈ పుస్తకం లోని కధలపై ఇంకొందరి అభిప్రాయం కూడా చదవగలరు.
పాపినేని శివశంకర్ గారి మాటలలో
"ప్రపంచీకరణ నేపధ్యం లో ఇవాళ గ్రామలలో చేతి వృత్తుల విధ్వంసం, కార్పొరేట్ వ్యవసాయ పద్ధతులు మొదలైన మార్పులు వేగంగా జరుగుతున్నాయి. కావలి ప్రాంతంలో వీటి ప్రకంపనలను చక్కగా పసికట్టిన కధకుడు మహమ్మద్ ఖదీర్బాబు. 'న్యూ బాంబే టైలర్స్ కధ దర్జీ వృత్తి విధ్వంసం పై అల్లింది. ఖాదర్ లేడు రోడ్డు విస్తరణ సమస్యకు సంబంధించినది. పెండెం సోడా సెంటర్ సామ్రాజ్య వాద వ్యాపార సంస్కృతి దిగుమతిని ధిక్కరించిన వ్యక్తి కధ."
దుప్పల రవికుమార్ గారి మాటలలో
"మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ‘పెండెం సోడాసెంటర్‘ గ్లోబలైజేషన్ దారుణ విపరిణామాలను చర్చించిన మరో మంచి కథ. నమ్మిన ఆదర్శం కోసం సర్వనాశనానికి సైతం వెరవని చంద్రయ్య, అతడి కొడుకు క్రిష్ణమూర్తులను మనం నిజ జీవితంలో చూడగలమా? వట్టి వేళ్లు, నిమ్మకాయ, అల్లంలతో తయారైన పానీయాలు, షర్ బత్ లకుతోడు దేశభక్తులందరికీ అడ్డాగా నిలిచింది పెండెం సోడా సెంటర్. కోకోకోలా, పెప్సీలు దేశంలోకి రావడాంతోటే ఆడ్రసులు లేకుండా పోయాయి. ఈ కథ భారతదేశంలో నిలువనీడకూడా లేకుండా మట్టికొట్టుకుపోయిన అనేక చిన్న, సన్నకారు చేతివృత్తుల వారి అందరి జీవితాలను మనకు గుర్తుకు తెప్పించి హృదయాన్ని బరువెక్కిస్తుంది. ‘దూద్ బఖష్’, ‘జమీన్’, ‘న్యూబాంబే టైలర్స్’ లాంటి చక్కటి, చిక్కటి మేలిమి కథలందిస్తున్న మహమ్మద్ ఖదీర్ బాబు తెలుగు కథ మీద మనకెంతో విశ్వాసం, నమ్మకం పుట్టిస్తాడు. "
ఈ సంపుటిలో మొత్తం 12 కధలున్నాయి. ముందుగా వీటన్నిటి ఇతివృత్తం వ్రాస్తే, ఈ కధలు చదివేటప్పుడు కలిగే చక్కటి అనుభూతి, పాఠకుడు కోల్పోగలడు. ఈ పుస్తకం లోని కధలపై ఇంత తెలుసుకొన్న తరువాత, న్యూ బాంబే టైలర్స్ కొని చదవకుండా ఉండటం సాధ్యమా?
New Bombay Tailors and Other stories -Telugu Stories
Mohammed Khadeerbabu
తొలి ప్రచురణ: 2012
డెమి1/8 పేజీలు 214
అందమైన ముద్రణ - నాణ్యతకల కాగితం
ధర: 160/-
కావలి ప్రచురణలు
లభ్యత: ముఖ్య పుస్తకాల దుకాణాలలో
Photos, Audio, Video and Text by cbrao.
http://deeptidhaara.blogspot.in/2012/02/1.html
ఈ పుస్తకం ఎందుకు చదవాలనే విషయంపై వొల్గా గారు మాట్లాడాక జంపాల చౌదరి గారు ఈ పుస్తకం లోని కధలపై తమ అభిప్రాయం వెళ్ళడించారు. వినండి.
http://dl.dropbox.com/u/31976678/nbt-3.mp3
ఒకే ఇతివృత్తం పై ఉన్న ఖదీర్ ' జమీన్ ', వోల్గా 'సారీ జాఫర్ ' కధల మధ్య వ్యత్యాసాన్ని వోల్గా వివరించారు. ఆ తర్వాత Usha S Dani (ఖాన్ యజ్ఞాని) ఖదీర్ కధలను విశ్లేషించారు. వినండి.
Usha S Dani
http://dl.dropbox.com/u/31976678/nbt-4.mp3
Satish Chandar
తర్వాత పాత్రికేయుడు సతీష్ చందర్ ఖదీర్ కధల పరిచయం చేశారు. వినండి.
http://dl.dropbox.com/u/31976678/nbt-5.mp3
చివరగా ఖదీర్బాబు మాట్లాడుతూ తన కధల సంపుటి రావటానికి పదిహైను సంవత్సరాలు పట్టిందనీ, భావితరం వారు తననొక మంచి కధకుడిగా గుర్తించ కోరుతానన్నారు. వీడియో చూడగలరు.
ఈ పుస్తకం లోని కధలపై ఇంకొందరి అభిప్రాయం కూడా చదవగలరు.
పాపినేని శివశంకర్ గారి మాటలలో
"ప్రపంచీకరణ నేపధ్యం లో ఇవాళ గ్రామలలో చేతి వృత్తుల విధ్వంసం, కార్పొరేట్ వ్యవసాయ పద్ధతులు మొదలైన మార్పులు వేగంగా జరుగుతున్నాయి. కావలి ప్రాంతంలో వీటి ప్రకంపనలను చక్కగా పసికట్టిన కధకుడు మహమ్మద్ ఖదీర్బాబు. 'న్యూ బాంబే టైలర్స్ కధ దర్జీ వృత్తి విధ్వంసం పై అల్లింది. ఖాదర్ లేడు రోడ్డు విస్తరణ సమస్యకు సంబంధించినది. పెండెం సోడా సెంటర్ సామ్రాజ్య వాద వ్యాపార సంస్కృతి దిగుమతిని ధిక్కరించిన వ్యక్తి కధ."
దుప్పల రవికుమార్ గారి మాటలలో
"మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ‘పెండెం సోడాసెంటర్‘ గ్లోబలైజేషన్ దారుణ విపరిణామాలను చర్చించిన మరో మంచి కథ. నమ్మిన ఆదర్శం కోసం సర్వనాశనానికి సైతం వెరవని చంద్రయ్య, అతడి కొడుకు క్రిష్ణమూర్తులను మనం నిజ జీవితంలో చూడగలమా? వట్టి వేళ్లు, నిమ్మకాయ, అల్లంలతో తయారైన పానీయాలు, షర్ బత్ లకుతోడు దేశభక్తులందరికీ అడ్డాగా నిలిచింది పెండెం సోడా సెంటర్. కోకోకోలా, పెప్సీలు దేశంలోకి రావడాంతోటే ఆడ్రసులు లేకుండా పోయాయి. ఈ కథ భారతదేశంలో నిలువనీడకూడా లేకుండా మట్టికొట్టుకుపోయిన అనేక చిన్న, సన్నకారు చేతివృత్తుల వారి అందరి జీవితాలను మనకు గుర్తుకు తెప్పించి హృదయాన్ని బరువెక్కిస్తుంది. ‘దూద్ బఖష్’, ‘జమీన్’, ‘న్యూబాంబే టైలర్స్’ లాంటి చక్కటి, చిక్కటి మేలిమి కథలందిస్తున్న మహమ్మద్ ఖదీర్ బాబు తెలుగు కథ మీద మనకెంతో విశ్వాసం, నమ్మకం పుట్టిస్తాడు. "
ఈ సంపుటిలో మొత్తం 12 కధలున్నాయి. ముందుగా వీటన్నిటి ఇతివృత్తం వ్రాస్తే, ఈ కధలు చదివేటప్పుడు కలిగే చక్కటి అనుభూతి, పాఠకుడు కోల్పోగలడు. ఈ పుస్తకం లోని కధలపై ఇంత తెలుసుకొన్న తరువాత, న్యూ బాంబే టైలర్స్ కొని చదవకుండా ఉండటం సాధ్యమా?
New Bombay Tailors and Other stories -Telugu Stories
Mohammed Khadeerbabu
తొలి ప్రచురణ: 2012
డెమి1/8 పేజీలు 214
అందమైన ముద్రణ - నాణ్యతకల కాగితం
ధర: 160/-
కావలి ప్రచురణలు
లభ్యత: ముఖ్య పుస్తకాల దుకాణాలలో
Photos, Audio, Video and Text by cbrao.
సోమవారం, ఫిబ్రవరి 20, 2012
బ్లాగులు- వ్యాఖ్యలు -15
Rashtrapati Nilayam, Bolaram, Secunderabad Photo: cbrao
మీరో మాంచి కథ రాసారు. పుస్తక రూపంలో చూసుకోవాలని ఆశగా ఉంది. డబ్బులు లేవు. ఏం చేస్తారు?
What an idea! Nice.
http://janatenugu.blogspot.com/2011/07/blog-post_1693.html
"మాయదారి వీడియో"
వీడియో తో చిక్కేనండి మరి. మీ వారు చెప్పినట్లు, అరగంట తరువాత (ఈ లోపు మీ భోజనం కూడా అయిపోతుంది) క్యూ పెద్దగా ఉండదు. అప్పుడు ఇలా మధ్యలో దూరాల్సిన అవసరం కూడా రాదు. నింపాదిగా వధూ వరులతో కబుర్లు కూడా చెప్పవచ్చు.
http://srilalitaa.blogspot.com/2011/02/blog-post.html
'For Women' లో నా ఆర్టికల్!
షికాగొ, న్యూయార్క్ చిత్రాలు ఉంచారు వ్యాసంలో. మీరు ఆ నగరాలు సందర్శించినప్పుడు తీసినవా? మరో విషయం అమెరికాలో. మన కవితలలో గోడ మీద బల్లి, మంచంలో నల్లి అంటూ అక్కడ వ్రాయలేము. గోడలపై విద్యుత్ దీపాలకు ఆకర్షితులయే పురుగులు కూడా అమెరికా, కెనడాలలో నా దృష్టికి రాలేదు.
http://vennelasantakam.blogspot.com/2011/07/for-women.html
"నరిశెట్టి ఇన్నయ్య గారిని, యార్లగడ్డ (LP) గారిని కలిసాను"
"అవును ఒబామా వీరి పొరుగువారే అని నవ్వుతూ నేను అంటే ఇన్నయ్య గారు నవ్వారు. " - ఒబామా పొరుగువారు నరిసెట్టి రాజు (ఇన్నయ్య గారి కుమారుడు). The Washington Post దినపత్రిక Managing editor గా ఉన్నారు. వీరి పత్రిక కార్యాలయాన్ని ఒబామ సందర్శించి (ఎన్నికలముందు) సంపాదకులని కలిశారు.
షికాగో లో ఉంటూ శ్రీయుతులు ఇన్నయ్య, యార్లగడ్డలను మీరు కలవగలగటం ముదావహం. శ్రీయుతులు జంపాల, జయదేవ్, రామరాజ భూషణుడు యలవర్తి ప్రభృతులు షికాగో లో చక్కటి సాహితీ సేవ చేస్తున్నారు.
ఆనాటి గుంటూరు జిల్లా ఇ-పుస్తకం ఈ దిగువ లింక్ లో లభ్యమవుతుంది.
http://deeptidhaara.blogspot.com/2011/03/blog-post_17.html
http://sarath-kaalam.blogspot.com/2011/07/lp.html
http://alanaati-telugu-chandamamaama.blogspot.com/
http://manateluguchandamama.blogspot.com/2011/08/blog-post.html
http://mytelugurachana.blogspot.com/2011/08/65-53.html
వ్యాసం చాలా వివరంగా ఉంది. స్టాక్ మార్కెట్ మదుపుదారులకు ఉపయుక్తమైన సమాచారమిది.
http://teluguvartalu.wordpress.com/2011/08/24/%E0%B0%9C%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%87%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%A4/
పుస్తకాల పురాణం
"ఒక్కసారి చదవగానే జన్మంతా గుర్తుండేలాంటి పుస్తకం, వాసిరెడ్డి సీతాదేవి గారి "మట్టిమనిషి"." -అవును. ఆంధ్ర ప్రభ దినపత్రిక లో ధారావాహికంగా వస్తున్నప్పుడు చదివాను. మరలా చదవక పోయినా ఈ నవల లోని కొన్ని సంఘటనలు ఇంకా గుర్తున్నాయి అంటే ఈ రచన గొప్పదనమే.
"పిల్లలక్కూడా పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది." - అదృష్టం. టి.వి., కంప్యూటర్ ఆటలు, సినిమాల వల్ల, పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు చెయ్యటం కష్టమవుతున్న సమయం లో, పుస్తకాలు చదివే పిల్లలని చూస్తే ముచ్చటేస్తుంది.
http://sunitatelugublog.blogspot.com/2011/08/blog-post_27.html
శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం ప్రచురించటం శ్లాఘనీయం. అయితే, దీనిని ఈ నాటి యువతరం కూడా అర్థం చేసుకునేలా, ప్రతి టపా దిగువున వచనంలో సరళంగా భావాన్ని వ్రాస్తే మరింత ఉపయుక్తకరంగా ఉండగలదు.
http://sahityasourabham.blogspot.com/2011/08/14.html
మూగబోయిన ఆదిలక్ష్మిగారు
అయ్యో! చనిపోయి ఏమి సాధించేది? ఏ ప్రయోజనం నెరవేరుతుంది? ఆదిలక్ష్మి గారు త్వరలో కోలుకుంటారని ఆశిద్దాము.
http://pradeepblog.miriyala.in/2011/09/blog-post.html
మీరో మాంచి కథ రాసారు. పుస్తక రూపంలో చూసుకోవాలని ఆశగా ఉంది. డబ్బులు లేవు. ఏం చేస్తారు?
What an idea! Nice.
http://janatenugu.blogspot.com/2011/07/blog-post_1693.html
"మాయదారి వీడియో"
వీడియో తో చిక్కేనండి మరి. మీ వారు చెప్పినట్లు, అరగంట తరువాత (ఈ లోపు మీ భోజనం కూడా అయిపోతుంది) క్యూ పెద్దగా ఉండదు. అప్పుడు ఇలా మధ్యలో దూరాల్సిన అవసరం కూడా రాదు. నింపాదిగా వధూ వరులతో కబుర్లు కూడా చెప్పవచ్చు.
http://srilalitaa.blogspot.com/2011/02/blog-post.html
'For Women' లో నా ఆర్టికల్!
షికాగొ, న్యూయార్క్ చిత్రాలు ఉంచారు వ్యాసంలో. మీరు ఆ నగరాలు సందర్శించినప్పుడు తీసినవా? మరో విషయం అమెరికాలో. మన కవితలలో గోడ మీద బల్లి, మంచంలో నల్లి అంటూ అక్కడ వ్రాయలేము. గోడలపై విద్యుత్ దీపాలకు ఆకర్షితులయే పురుగులు కూడా అమెరికా, కెనడాలలో నా దృష్టికి రాలేదు.
http://vennelasantakam.blogspot.com/2011/07/for-women.html
"నరిశెట్టి ఇన్నయ్య గారిని, యార్లగడ్డ (LP) గారిని కలిసాను"
"అవును ఒబామా వీరి పొరుగువారే అని నవ్వుతూ నేను అంటే ఇన్నయ్య గారు నవ్వారు. " - ఒబామా పొరుగువారు నరిసెట్టి రాజు (ఇన్నయ్య గారి కుమారుడు). The Washington Post దినపత్రిక Managing editor గా ఉన్నారు. వీరి పత్రిక కార్యాలయాన్ని ఒబామ సందర్శించి (ఎన్నికలముందు) సంపాదకులని కలిశారు.
షికాగో లో ఉంటూ శ్రీయుతులు ఇన్నయ్య, యార్లగడ్డలను మీరు కలవగలగటం ముదావహం. శ్రీయుతులు జంపాల, జయదేవ్, రామరాజ భూషణుడు యలవర్తి ప్రభృతులు షికాగో లో చక్కటి సాహితీ సేవ చేస్తున్నారు.
ఆనాటి గుంటూరు జిల్లా ఇ-పుస్తకం ఈ దిగువ లింక్ లో లభ్యమవుతుంది.
http://deeptidhaara.blogspot.com/2011/03/blog-post_17.html
http://sarath-kaalam.blogspot.com/2011/07/lp.html
బ్లాగు పేరు మార్పు
చందమామ కబుర్లు బాల్యంలోకి తీసుకెళతాయి. సంతోషకరమైన రోజులని మరలా గుర్తుకుతెస్తాయి. పాత చందమామ కు ఆహ్వానం. కొత్త (పాత) చందమామ బ్లాగు చిరునామాలో చందమామ స్పెల్లింగ్ సరిగా ఉన్నట్లు లేదు.http://alanaati-telugu-chandamamaama.blogspot.com/
http://manateluguchandamama.blogspot.com/2011/08/blog-post.html
డయాబెటిస్ తో ఆరోగ్య జాగ్రత్తలు
నలుగురికీ ఉపయోగపడే వ్యాసాలివి. కొనసాగించండి. ఆరొగ్యమే మహాభాగ్యము.http://mytelugurachana.blogspot.com/2011/08/65-53.html
జపాన్ క్రెడిట్ రేటింగ్ తగ్గించిన మూడీస్, రాజకీయ అనిశ్చితే కారణం
వ్యాసం చాలా వివరంగా ఉంది. స్టాక్ మార్కెట్ మదుపుదారులకు ఉపయుక్తమైన సమాచారమిది.
http://teluguvartalu.wordpress.com/2011/08/24/%E0%B0%9C%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%87%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%A4/
పుస్తకాల పురాణం
"ఒక్కసారి చదవగానే జన్మంతా గుర్తుండేలాంటి పుస్తకం, వాసిరెడ్డి సీతాదేవి గారి "మట్టిమనిషి"." -అవును. ఆంధ్ర ప్రభ దినపత్రిక లో ధారావాహికంగా వస్తున్నప్పుడు చదివాను. మరలా చదవక పోయినా ఈ నవల లోని కొన్ని సంఘటనలు ఇంకా గుర్తున్నాయి అంటే ఈ రచన గొప్పదనమే.
"పిల్లలక్కూడా పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది." - అదృష్టం. టి.వి., కంప్యూటర్ ఆటలు, సినిమాల వల్ల, పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు చెయ్యటం కష్టమవుతున్న సమయం లో, పుస్తకాలు చదివే పిల్లలని చూస్తే ముచ్చటేస్తుంది.
http://sunitatelugublog.blogspot.com/2011/08/blog-post_27.html
శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -14
శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం ప్రచురించటం శ్లాఘనీయం. అయితే, దీనిని ఈ నాటి యువతరం కూడా అర్థం చేసుకునేలా, ప్రతి టపా దిగువున వచనంలో సరళంగా భావాన్ని వ్రాస్తే మరింత ఉపయుక్తకరంగా ఉండగలదు.
http://sahityasourabham.blogspot.com/2011/08/14.html
మూగబోయిన ఆదిలక్ష్మిగారు
అయ్యో! చనిపోయి ఏమి సాధించేది? ఏ ప్రయోజనం నెరవేరుతుంది? ఆదిలక్ష్మి గారు త్వరలో కోలుకుంటారని ఆశిద్దాము.
http://pradeepblog.miriyala.in/2011/09/blog-post.html
ఆదివారం, ఫిబ్రవరి 19, 2012
మహమ్మద్ ఖదీర్బాబు కధా సంపుటం - న్యూ బాంబే టైలర్స్-1

Link 1 Link 2
పోలేరమ్మబండ కతలు (2004 ) - బాల్యం, స్కూల్ విద్యార్థుల కధలు, జ్ఞాపకాలు
Bring mouse on top of titles to get linked pages
దర్గామిట్ట కతలు
ఈ కధలు చదివాక ముళ్లపూడి ఖదీర్ ను అభినందిస్తూ “ఈ (కతల) నది నీటిలో ప్రతి బిందువు ఒక ఆణిముత్యం. మంచిని ఎగజిమ్మే అగ్ని పర్వతం. ఇందులో నాన్నలూ, అమ్మలూ, అవ్వలూ, తాతలూ అందరూ భూలోక దేవతలు. సుఖసంతోషాలలాగే కష్టాలనూ కన్నీళ్లనూ కూడా నగలుగా వేసుకుని హుషారుగా తిరుగుతారు” అంటారు.
ఖదీర్ బాబు కధలను పరిచయం చేస్తూ కొత్తపాళి "సజీవ మైన పాత్రలతో నిజ జీవితాన్ని సెంటిమెంట్ల లాంటి చీప్ ట్రిక్కులేవీ లేకుండా సూటిగా, కొంత హాస్యంతోనూ, కొంత ఆర్ద్రతతోనూ కలిపి చెప్పుకొచ్చిన చక్కటి కథలు. మీకు మధ్య తరగతి తెలుగు ముస్లిముల జీవితం గురించి ఆట్టే తెలియక పోతే పుస్తకం తెరవగానే ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టే ఉంటుంది. కంగారు పడకుండా రెండడుగులు లోపలికి వచ్చారనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి బాగా తెలిసిన వాళ్ళే. " అంటారు.
బాలీవుడ్ క్లాసిక్స్
మన్ చాహే గీత్
నూరేళ్ళ తెలుగు కథ
అందరితోను ప్రశంసలు పొందిన ఖదీర్ కు దిష్టి తగిలినట్టుంది. ఈ పుస్తకం ప్రశంసలతో పాటు విమర్శలనూ అందుకొంది. కధలను ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేశారని కొందరు, తెలంగాణ రచయితలకు తగినంత ప్రాధాన్యం లభించలేదని ఇంకొందరు, కధలు తిరిగి చెప్పిన తీరు బాగా లేదని మరికొందరూ విమర్శలు గుప్పించారు. నామిని శిష్యుడైన ఖదీర్ పై నామిని ప్రభావం ఉంది. వీరిద్దరిలో ఎవరు పెద్ద పుడింగో విమర్శకులకు అంతుపట్టలేదు.
న్యూ బాంబే టైలర్స్ - Genre వృత్తుల ఇతివృత్తం, ప్రపంచీకరణ, ఆటంకవాదులు, ముస్లిం వ్యక్తుల జీవన చిత్రణ
ఖదీర్ పై విమర్శలకు సమాధానమా అన్నట్లు ఇప్పుడు వెలువడింది న్యూ బాంబే టైలర్స్ పేరుతో కొత్త కధా సంపుటి. మనల్ని వెంటాడే, మధన పరిచే కధలున్నాయిందులో.

Click on photo to enlarge
Left to right: M/s Jampala choudary, K.I.Varaprasad Reddy,Volga, Khadeer Babu, Danny, Satish Chandar ఫిబ్రవరి 15, 2012 న హైదరాబాదు ప్రెస్ క్లబ్, సోమాజిగూడాలో, వొల్గా గారి అధ్యక్షతన ఈ పుస్తకాన్ని శాంతా బయోటెక్స్ అధినేత కె.ఐ. వరప్రసాద్ రెడ్డి గారు ఆవిష్కరించారు.

http://dl.dropbox.com/u/31976678/nbt-1.mp3
ఈ కధా సంపుటం లోని మొదటి కధ న్యూ బాంబే టైలర్స్ . ఈ కధ పేరునే పుస్తకానికి పేరుగా పెట్టారు. కావలి లోని పీరుభాయి అనే కుర్రాడు బాంబే వెళ్లి అక్కడి కొత్త ఫాషన్స్ నేర్చుకుని కావలి వచ్చి అక్కడి రైల్వే రోడ్ లో బాంబే టైలర్స్ అనే పేరుతో ఒక దర్జీ దుకాణం తెరిచి అక్కడి కాలేజ్ విద్యార్ధుల, పెద్ద రెడ్ల అభిమానం సంపాదించుకుంటాడు. పేరు, డబ్బు సంపాదించుకుంటున్న తరుణంలో పులిమీద పుట్రలా ఆ ఊరు చివర కొత్తగ కొన్ని రేడీమేడ్ దుస్తుల కర్మాగారాలొచ్చి స్థానిక దర్జీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం కలుగచేస్తాయి. దర్జీలు దుకాణాలు మూసివేసి ఈ రేడీ మేడ్ ఫాక్టరీలలో కూలీలుగా చేరిపోతుంటారు. మెల్లగా ఈ ప్రభావం బాంబే టేలర్స్ పై కూడా పడి తండ్రీ కొడుకులు రేడీ మేడ్ కర్మాగారంలో కూలీలుగా చేరటానికి వెళ్లినప్పుడు, వారి పేర్లకు బదులుగా కొన్ని అంకెలుతో వారిని పిలవాల్సొస్తుంది. అంతే కాదు; ముందే కత్తిరించిన కొన్ని బట్టలు ఇచ్చి, కుట్టి తీసుకు రమ్మంటే, పీరుభాయి అది అవమానంగా భావిస్తాడు. బలుసాకైనా తిని బ్రతుకుతా కాని ఈ పని నా వల్ల కాదు అని ఉద్యోగం నిరాకరిస్తాడు. ప్రపంచీకరణ దుష్ఫలితాలను చక్కగా వివరిస్తుందీ కధ.
ఈ సంపుటి లోని జమీన్ కధకు 1999లో దాని కళాత్మక కాల్పనిక చిత్రణకై కధ అవార్డ్ వచ్చింది. సంక్షిప్తంగా జమీన్ ఇతివృత్తం: ఇది ఇద్దరు బాల్యమిత్రుల కధ. కసాయి కొడుకు హుసేన్, మాలపల్లె లో నివసించే బ్రమ్మయ్య ల మధ్య అనుబంధం ఎక్కువే. చీరాల లో ఉండే హుసేన్కు తన స్వస్థలమైన కావలి లో చిన్న ఇల్లు కట్టుకోవాలని, అక్కడే కనుమూయాలని ప్రగాఢ కోరిక. స్థలం లభ్యమయ్యిందన్న కబురు బ్రమ్మయ్య నుంచి అందగానే కావలికి పయనమైన హుసేన్ ఆ స్థలం తన మిత్రుడు బ్రమ్మయ్యదే అని తెలుసుకొని ఆనందభరితుడవుతాడు. అయితే బ్రమ్మయ్య కొడుకు రమణ ఆర్.ఎస్.ఎస్. పార్టీ లో చేరి ఆ సిద్ధాంతాలను ఒంటపట్టించుకొని, సాయిబు హుసేన్ కు స్థలం అమ్మకానికి తన తీవ్ర అసమ్మతిని తెలియపరుస్తాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య తీవ్ర అగాధాన్ని సృష్టించటంతో, ఖిన్నుడయిన హుసేన్ చీకటిలోనే తన ఊరు చీరాలకు తిరుగు ప్రయాణం కట్తాడు, వికల హృదయంతో.
ఒక సాయంత్రపు అదృష్టం - ఈ కధను చెప్పటం కష్టం; ఎందుకంటే ఇందులో కధ కంటే అనుభూతి ఎక్కువ. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే కధానాయకుడు తన ఊహల్లో క్రియ కంటే ఎప్పుడూ ముందుండి, ప్రక్రుతి సహజమైన అనుభూతులకు దూరమవుతూ, వేదనకు లోనవుతుటాడు. అయితే ఒక వర్షం కురిసిన సాయంకాలం, పూలమ్మి అమ్మే పూలబుట్టలలోంచి వచ్చే పూల పరిమళాళలకు పరవశుడై, తన భార్యకు అనూహ్యంగా సంతోషాన్ని కలిగించే, చిన్న చిన్న ఆశ్చర్యాలు కలిగించి ఆమెను సంతోషపెడ్తాడు. రేపు లేదన్నట్లుగా, ఆ సాయంత్రం వారిరువురిదే అన్నట్లుగా, ఆ రాత్రి అనుభవిస్తారు. మరుసటి రోజు ఎప్పటిలా తెల్లవారింది. కధానాయకుడిలో ఆశావాదం పెల్లుబికింది. అయినా రేపు మిధ్య, ఈ రోజే నిజం అన్నట్లుగా తన కర్తవ్యానికుపక్రమిస్తాడు.

http://dl.dropbox.com/u/31976678/nbt-2.mp3
(ఇంకా ఉంది)
మహమ్మద్ ఖదీర్బాబు కధా సంపుటం - న్యూ బాంబే టైలర్స్-2 లో
ఖదీర్బాబు కధలపై జంపాల చౌదరి తదితరుల విశ్లేషణ
ఖదీర్బాబు మాటలలో తన కధల గురించి - Video
Photos, Audio, Video and Text by cbrao.