తెలుగు జాతీయ వాది - అంబానాథ్
telugujaatheeyavaadi2.blogspot.com
Blog has been removed
నామనోభావాలు - శైలజ అంగర
http://naamanoabhaavaalu.blogspot.com/
చివరి టపా May 08, 2006
హృదయతరంగాలు - అమూల్య
http://hrudayatarangalu.blogspot.com/
చివరి టపా April 04, 2007
సాలభంజికలు - నాగరాజు
http://canopusconsulting.com/salabanjhikalu/
తాత్కాలికంగా ఈ బ్లాగు మూసేసాను. Blog closed temporarily.
అంతరంగం -చరసాల ప్రసాద్
నా ఆలోచనా తరంగాలు
http://blog.charasala.com/
చివరి టపా August 3, 2008
శోధన - సుధాకర్
చిట్ట చివరకు ముందరి టపా March 12, 2008 చివరి టపా Friday, December 26, 2008
http://sodhana.blogspot.com/
ఓనమాలుల లలిత - లలిత
http://onamaalu.wordpress.com/
The authors have deleted this blog.
అష్టావక్ర!! - యోగి
http://ashtavakram.blogspot.com
Blog has been removed
డిజిటల్ యోగి
http://geekyoga.blogspot.com/
Blog has been removed
మనలో మనమాట - రమణి
http://manalomanamaata.blogspot.com
Blog does not exist.
నా గొడవ - ఫణీంద్ర
naagodava.blogspot.com
Blog has been removed
పాన శాల - పానశాల నరేష్
http://panashaala.blogspot.com/
ఇది మూతబడి మరలా తెరువబడినట్లుగా అనిపిస్తుంది. చాలా టపాలు తొలగించబడ్డాయి.
గాన్వితిన్
http://gonewithin.blogspot.com This blog is open to invited readers only
ఊహలన్నీ-ఊసులై -పూర్ణిమా తమ్మిరెడ్డి
oohalanni-oosulai.blogspot.com
This blog is open to invited readers only
పర్ణశాల -కత్తి మహేష్ కుమార్
http://parnashaala.blogspot.com
కూడలి నుంచి ఐచ్ఛికముగా తొలగించబడినది.
అభిసారిక - అభిసారిక
http://abhisaarika.blogspot.com/
ఈ బ్లాగు September 30, 2006 న మూతబడి, Nov 2008 న మరలా ప్రారంభించబడినది.
జ్యోతి - జ్యోతి వలబోజు
http://jyothivalaboju.blogspot.com/
కొద్దికాలము మూయబడి మరలా తెరువబడినది.
ఇక బ్లాగుల స్థితి ఇలా ఉండటానికి కారణాలు
1) వ్యక్తిగతమైనవి
2) వృత్తిలో పదోన్నతి, బదలీ వల్ల వ్యవధి లేకపోవటం
3) ఆసక్తి ఇతర విషయాలపై మళ్లటం
4) ఆకాశరామన్న వుత్తరాలు
5) తమపై ఇతర బ్లాగులలో కించపరుస్తూ వస్తున్న అశ్లీల, వ్యంగ రాతలు.
ఆదివారం, ఫిబ్రవరి 22, 2009
శనివారం, ఫిబ్రవరి 21, 2009
తెలుగుభాషను నవీకరించాలా?
నేడు ప్రపంచమంతా మాతృభాషా దినోత్సవం జరుపుతున్నారు. మన తెలుగు ఆధునికమైనదేనా? తెలుగులో ఉన్నత విద్య ఎందుకు అభ్యసించలేకపోతున్నాము? తెలుగును నవీకరించాల్సిన అవసరం ఉందా? ఈ విషయాలపై ఇన్నయ్య గారి ప్రత్యేక వ్యాసం మీ కోసం, ఆంధ్రజ్యోతి సౌజన్యంతో . ఇది ఈ రోజు (21 st Feb 2009) ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో ప్రచురించబడినది.
-cbrao
Click on image to enlarge
-cbrao
Click on image to enlarge
గురువారం, ఫిబ్రవరి 19, 2009
ఆ నలుగురు
బ్లాగులోకంలో కల్లోలం లేపిన ఆ నలుగురు ఎవరో దీప్తిధారకు తెలిసింది. భారతదేశానికి దూరంగా, పర్యటనలలో ఉండటం వలన వీరిగురించి ఆలస్యంగా తెలిసింది. ఈ దుష్ట చతుష్టయం గురించి నా కంటే పాఠకులకు ఎక్కువే తెలిసి ఉండగలదు. వీరిని దుష్ట చతుష్టయం అనటం న్యాయమేనా?వీరు విదేశీ శక్తులేనా?వీరి కుట్రలేమిటి?వీరి అసభ్యరాతలకు కారణమేమిటి?ఇంతకీ వీరు నలుగురా, ముగ్గురా,లేక, ఇద్దరా?ఒక్కరే బహు పేర్లతో రాస్తున్నారా?
"ఏ విదేశీ శక్తి లేదు, ఈ కుట్ర లేదు. ఓర్వలేని వారి పని. " -పారాహుషార్.... జాగ్రత్త పడండి అనే టపాలో జ్యోతక్క అంటున్నది.కేవలం ఓర్వలేనితనమే వీరిచే అసభ్యరాతలు రాయించిందా? ఓర్వలేనితనం కంటే మించినదే వీరితో అలాంటి హేయమైన పని చేయించింది.
"we are making a laughing stock of ourselves . ఇలాటివాటికి అనవసరంగా డప్పు కొడుతూ ప్రచారం చేసి అనవసరమయిన " అపోహలు, అపార్థాలూ, అవకాశాలూ " ఇంకా పెంచిన వాళ్ళమవుతున్నాము" అన్న వంశీ గారి మాటతో కనీసం వివాదంలోకి లాగబడిన బ్లాగర్లు ఏకిభవించి ఉంటే మొరిగిన/మొరుగుతున్న కుక్కలు అలసి, సొలసి, సొమ్మగిల్లిపడిపొయ్యెవన్న అభిప్రాయం మీద "మీ స్పందన" ? అని అడుగుతున్నది netizen .
"మీరు గమనించారో లేదొ కానీ కాగడా మరియు ధూం బ్లాగుల ధోరణిలో చాలా మార్పు వచ్చింది. కాగడా వారు గతంలో జరిగిన తప్పులను (కొంతవరకు) ఒప్పుకొని తమ బ్లాగులో రాడికల్ మార్పులు తీసుకొని వస్తామని ప్రకటించి పాటించారు. ఇకపై వ్యక్తినింద వుండదని, సిద్ధాంత పరమయిన చర్చ మాత్రమే వుంటుందని ప్రకటించారు. ఆ రకంగా తమ బ్లాగులని క్లీన్ చేయడం నేను గమనించాను. మహిళా బ్లాగర్లపై అసభ్యకరమయిన వ్యాఖ్యలు, టపాలు ఆ బ్లాగుల్లో ఇప్పుడు లేవు. ఈ-తెలుగు గురించి మాత్రం విమర్శలు చెలరేగుతూనే వున్నాయి." అని శరత్ తెలుపుతున్నారు.
ఈ గాంగ్ లోని వ్యక్తులు మారారా? వీరు మారినట్లుగా, వీరి రాతలవలన ప్రభావితమైన బ్లాగర్లు లేక పాఠకులు ఎవరైనా చెప్పగలరా? మారితే ఈ ముసుగులెందుకు? దివిటీలెందుకు? e - తెలుగు పై వీరికున్న సందేహాలు నిజాయితీ గలవేనా? నిజాయితీ గలవే అయితే, హైదరాబాద్ లో నెల నెలా జరిగే బ్లాగర్ల సమావేశానికొచ్చి తమ సందేహాలు e- తెలుగు పెద్దలను అడిగి తెలుసుకోవచ్చుగా? మిడి మిడి జ్ఞానంతో e - తెలుగుపై బురద చల్లటమెందుకు?
తమ బ్లాగులలోని అసభ్య రాతలు తొలగించి, ముసుగు తీసి ఎప్పుడైతే జనస్రవంతి లో కలిసిపోతారో అప్పుడే వీరు మారినట్లు ఋజువు. అందాకా వీరి ప్రవర్తన అనుమానాస్పదమే. ఈ నలుగురు విద్యావంతులు, తమ మేధస్సును సక్రమమైన మార్గంలో వినియోగిస్తారని ఆశిద్దాము. ఆ తరుణం రావాలని, వీరికి హృదయపూర్వక స్వాగతం చెప్పాలనీ కోరుకుందాము.
"ఏ విదేశీ శక్తి లేదు, ఈ కుట్ర లేదు. ఓర్వలేని వారి పని. " -పారాహుషార్.... జాగ్రత్త పడండి అనే టపాలో జ్యోతక్క అంటున్నది.కేవలం ఓర్వలేనితనమే వీరిచే అసభ్యరాతలు రాయించిందా? ఓర్వలేనితనం కంటే మించినదే వీరితో అలాంటి హేయమైన పని చేయించింది.
"we are making a laughing stock of ourselves . ఇలాటివాటికి అనవసరంగా డప్పు కొడుతూ ప్రచారం చేసి అనవసరమయిన " అపోహలు, అపార్థాలూ, అవకాశాలూ " ఇంకా పెంచిన వాళ్ళమవుతున్నాము" అన్న వంశీ గారి మాటతో కనీసం వివాదంలోకి లాగబడిన బ్లాగర్లు ఏకిభవించి ఉంటే మొరిగిన/మొరుగుతున్న కుక్కలు అలసి, సొలసి, సొమ్మగిల్లిపడిపొయ్యెవన్న అభిప్రాయం మీద "మీ స్పందన" ? అని అడుగుతున్నది netizen .
"మీరు గమనించారో లేదొ కానీ కాగడా మరియు ధూం బ్లాగుల ధోరణిలో చాలా మార్పు వచ్చింది. కాగడా వారు గతంలో జరిగిన తప్పులను (కొంతవరకు) ఒప్పుకొని తమ బ్లాగులో రాడికల్ మార్పులు తీసుకొని వస్తామని ప్రకటించి పాటించారు. ఇకపై వ్యక్తినింద వుండదని, సిద్ధాంత పరమయిన చర్చ మాత్రమే వుంటుందని ప్రకటించారు. ఆ రకంగా తమ బ్లాగులని క్లీన్ చేయడం నేను గమనించాను. మహిళా బ్లాగర్లపై అసభ్యకరమయిన వ్యాఖ్యలు, టపాలు ఆ బ్లాగుల్లో ఇప్పుడు లేవు. ఈ-తెలుగు గురించి మాత్రం విమర్శలు చెలరేగుతూనే వున్నాయి." అని శరత్ తెలుపుతున్నారు.
ఈ గాంగ్ లోని వ్యక్తులు మారారా? వీరు మారినట్లుగా, వీరి రాతలవలన ప్రభావితమైన బ్లాగర్లు లేక పాఠకులు ఎవరైనా చెప్పగలరా? మారితే ఈ ముసుగులెందుకు? దివిటీలెందుకు? e - తెలుగు పై వీరికున్న సందేహాలు నిజాయితీ గలవేనా? నిజాయితీ గలవే అయితే, హైదరాబాద్ లో నెల నెలా జరిగే బ్లాగర్ల సమావేశానికొచ్చి తమ సందేహాలు e- తెలుగు పెద్దలను అడిగి తెలుసుకోవచ్చుగా? మిడి మిడి జ్ఞానంతో e - తెలుగుపై బురద చల్లటమెందుకు?
తమ బ్లాగులలోని అసభ్య రాతలు తొలగించి, ముసుగు తీసి ఎప్పుడైతే జనస్రవంతి లో కలిసిపోతారో అప్పుడే వీరు మారినట్లు ఋజువు. అందాకా వీరి ప్రవర్తన అనుమానాస్పదమే. ఈ నలుగురు విద్యావంతులు, తమ మేధస్సును సక్రమమైన మార్గంలో వినియోగిస్తారని ఆశిద్దాము. ఆ తరుణం రావాలని, వీరికి హృదయపూర్వక స్వాగతం చెప్పాలనీ కోరుకుందాము.
శనివారం, ఫిబ్రవరి 14, 2009
ప్రేమ ఎంత మధురం!

మధురమైన ప్రేమ గీతాలకు ఖజానా Jim Reeves (August 20, 1923 – July 31, 1964). Man with Golden Voice గా భావించబడే జిం రీవ్స్ పాటలు ఎంతో మధురమైనవి. ఆ గొంతులోని మాధుర్యం జిం రీవ్స్ చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, అభిమానులను అలరిస్తూ, అతని పాటలు మిలియన్స్ లో అమ్ముడుపోయేలా చేసింది. అంతే కాదు, నన్ను అమెరికా లోని నాష్విల్ , టెన్నిసీ రాష్త్రం లోని సంగీత కళాకారుల కీర్తిమందిరాన్ని (Nashville Country Music Hall of Fame and Museum) దర్శించేలా చేసింది. నిజానికి ఎప్పటినుంచో చూడాలని కలలుకన్న జిం రీవ్స్ మ్యూజియం చూడలేకపోయాను (ఎవో కారణాలవలన దాన్ని మూసివేశారు) కాని ఈ కీర్తిమందిరంలో జిం రీవ్స్కు సంబంధించిన ఎన్నో జీవిత విశేషాలను, తాను వాడిన వస్తువులను ప్రదర్శించారు. అవన్నీ చూస్తుంటే నేను B.Sc చదివే రోజులలో రేడియో సిలోన్ లో విన్న జిం రీవ్స్ పాటలు ఒక్కసారిగా గుర్తుకొచ్చేయి. రేడియోలో జిం రీవ్స్ పాటలొస్తే చెవులు రిక్కించి వినే వాళ్లము నేను, బాలసుబ్రమణ్యమూను. అతనే నాకు జిం రీవ్స్ ను పరిచయం చేశాడు. జిం రీవ్స్ అమెరికా సింగర్ అయినా U.K, Africa , Germany, India ఇంకా శ్రీ లంక లలో పెక్కు మంది అభిమానులున్నారు. క్రిస్టమస్ సమయంలో జిం రీవ్స్ పాటలు మారుమోగుతుంటాయి, ఇప్పటికీ.

ప్రేమ ఎంత మధురమో, ప్రియురాలి మనసు అంతకఠినమైతే! ప్రేమికులు విడిపోవటం హృదయంలో బాధా తప్తమైన గాయానికి కారణభూతమవుతుంది.ఇదే కొందరు కళాకారులు కొన్ని విలువైన కళాసృజనలను సృష్టించటానికి ప్రేరణ అవుతుంది. Jim Reeves పాటలలో ఎక్కువభాగం ఇలా విడిచివెళ్లిన ప్రియురాలిపై పాడినవే. He will have to go, Four Walls లాంటి గీతాలు ఈ విరహాగ్నిలో పుట్టినవే. విరహంలోని మధురిమ అనుభూతి చెందాలంటే జి ం రీవ్స్ పాటలు వినాల్సిందే.
Four Walls
Out where the bright lights are glowing
You're drawn like a moth to a flame
You laugh while the wine's over-flowing
While I sit and whisper your name
Four walls to hear me
Four walls to see
Four walls too near me
Closing in on me
Sometimes I ask why I'm waiting
But my walls have nothing to say
I'm made for love, not for waiting
But here where you've left me, I'll stay
Four walls to hear me
Four walls to see
Four walls too near me
Closing in on me
One night with you is like heaven
And so, while I'm walking the floor
I'll listen for steps in the hallway
And wait for your knock on my door
Four walls to hear me
Four walls to see
Four walls too near me
Closing in on me
Closing in on me
ఈ పాటను జిం రీవ్స్ పాడుతున్న వీడియో ఇక్కడ చూడండి.
విదేశీ శక్తుల కుట్ర - 2
ID theft in blogs గురించి రాసిన దీప్తిధార టపా "విదేశీ శక్తుల కుట్ర " ను మక్కికి మక్కి కాపీ చేసి, TELUGU BLOGS అనే బ్లాగులో Article lift అనే మోసపూరిత పద్ధతిలో ప్రచురించారు. ఆ టపా URL దిగువ ఇస్తున్నా.
http://telugugossipsq.blogspot.com/2009/02/blog-post_2854.html
ఈ విషయం నా దృష్టికి తెచ్చిన "తెలుగు'వాడి'ని " గారికి ధన్యవాదాలు. వ్యాసాలలో ఏది అసలు, ఏది నకలు అనేది గుర్తించటానికి నేను గమనించిన విషయాలివి.
1) మీరు గూగుల్ లో "విదేశీ శక్తుల కుట్ర" ను అన్వేషించండి. Genuine Article పైన ఉండగలదని భావిస్తాను.
2) రచయిత శైలి ఇంకా అదే విషయం పై గతంలో రాసిన వ్యాసాల ద్వారా కూడా ఏది అసలో ఏది నకలో తెలుసుకోవచ్చు.
3) Time Stamp అసలు పాత తేది, సమయంతో ఉంటే నకలు ఆ తరువాతి సమయంతో నమోదవుతుంది. ఇది అన్నివేళలా నిజం కాదు. ఆది బ్లాగరును నిర్ణయించే సమయంలో తెలిసిన విషయాల ఆధారంగా Time Stamp ను కూడా మార్చవచ్చు కాపీరాయుళ్లు.
ఈ కాపీలను ఎలా నివారించాలి?
ఇంతవరకు దీప్తిధార లో పాఠకుల ఉత్తరాలకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. అది దుర్వినియోగమవటంతో నేను కూడా, నా ఇష్టానికి వ్యతిరేకంగా Comment Moderation ప్రవేశపెట్టాల్సొచ్చింది. ఆటంకవాదులతో సమస్య లేదనుకున్నప్పుడు ఈ Comment Moderation తీసివేయగలను. అంతదాకా ఈ అసౌకర్యానికి మన్నించండి.
మిమ్ములను కించపరస్తూ నా i.d తో వ్యాఖ్యలు వస్తే కినుక వహించవద్దు. ఆ ఉత్తరం Genuine letter అవునా కాదా అని పరీక్షించగలరు. ID theft ను ఎలా గుర్తించాలి? నివారించాలి? ఈ ప్రశ్నలకు కొత్తపాళీ గారు తమ టపా ID theft in blogs లో కొన్ని ప్రాధమిక సూచనలిచ్చారు. ఇలా చెయ్యాలంటే anonymous వ్యాఖ్యలను అనుమతించకూడదు. Comment Settings లో Who Can Comment? అనే చోట Registered Users - includes OpenID ను మీరు సచేతనం చెయ్యాలి. మరిన్ని వివరాలకై శ్రీధర్ గారి టపా
http://telugugossipsq.blogspot.com/2009/02/blog-post_2854.html
ఈ విషయం నా దృష్టికి తెచ్చిన "తెలుగు'వాడి'ని " గారికి ధన్యవాదాలు. వ్యాసాలలో ఏది అసలు, ఏది నకలు అనేది గుర్తించటానికి నేను గమనించిన విషయాలివి.
1) మీరు గూగుల్ లో "విదేశీ శక్తుల కుట్ర" ను అన్వేషించండి. Genuine Article పైన ఉండగలదని భావిస్తాను.
2) రచయిత శైలి ఇంకా అదే విషయం పై గతంలో రాసిన వ్యాసాల ద్వారా కూడా ఏది అసలో ఏది నకలో తెలుసుకోవచ్చు.
3) Time Stamp అసలు పాత తేది, సమయంతో ఉంటే నకలు ఆ తరువాతి సమయంతో నమోదవుతుంది. ఇది అన్నివేళలా నిజం కాదు. ఆది బ్లాగరును నిర్ణయించే సమయంలో తెలిసిన విషయాల ఆధారంగా Time Stamp ను కూడా మార్చవచ్చు కాపీరాయుళ్లు.
ఈ కాపీలను ఎలా నివారించాలి?
ఇంతవరకు దీప్తిధార లో పాఠకుల ఉత్తరాలకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. అది దుర్వినియోగమవటంతో నేను కూడా, నా ఇష్టానికి వ్యతిరేకంగా Comment Moderation ప్రవేశపెట్టాల్సొచ్చింది. ఆటంకవాదులతో సమస్య లేదనుకున్నప్పుడు ఈ Comment Moderation తీసివేయగలను. అంతదాకా ఈ అసౌకర్యానికి మన్నించండి.
మిమ్ములను కించపరస్తూ నా i.d తో వ్యాఖ్యలు వస్తే కినుక వహించవద్దు. ఆ ఉత్తరం Genuine letter అవునా కాదా అని పరీక్షించగలరు. ID theft ను ఎలా గుర్తించాలి? నివారించాలి? ఈ ప్రశ్నలకు కొత్తపాళీ గారు తమ టపా ID theft in blogs లో కొన్ని ప్రాధమిక సూచనలిచ్చారు. ఇలా చెయ్యాలంటే anonymous వ్యాఖ్యలను అనుమతించకూడదు. Comment Settings లో Who Can Comment? అనే చోట Registered Users - includes OpenID ను మీరు సచేతనం చెయ్యాలి. మరిన్ని వివరాలకై శ్రీధర్ గారి టపా
"కామెంట్లలో మీ పేరు దుర్వినియోగం కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి " చూడగలరు.
ఆటంకవాదుల కొత్త దుశ్చర్యలను ఒక కంట కనిపెడుతూ అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది, వారి లక్ష్యం, బ్లాగులని. మీరు వారి చర్యలకు వెరవక బ్లాగును కొనసాగిస్తే, వారి దుష్కార్యాలను సమర్ధంగా తిప్పికొట్టినవాళ్లవుతారు.శుక్రవారం, ఫిబ్రవరి 13, 2009
విదేశీ శక్తుల కుట్ర
తెలుగు ప్రచారోద్యమానికై e తెలుగు వారు ఒక ఊరేగింపు ప్రశాంతంగా జరుపుతుంటే, బయటనుంచి ఒక ముష్కరుల మూక ఊరేగింపులో చేరిపోయి, పోలీసులపై రాళ్లు రువ్వితే ఏమవుతుంది? ఈ ముష్కరుల మూక ఎవరిది? వారి సిద్ధాంతాలేమిటి? వారి లక్ష్యాలేమిటి? వారి కుట్రలేమిటి?
దబ్బకాయ కుట్ర
బ్లాగడం ఆపను. కానీ... అన్న పర్ణశాల బ్లాగులోని టపాకు రాసిన వ్యాఖ్యలలో ఒక అజ్ఞాత ఒక గొప్ప కుట్ర సిద్ధాంతాన్ని బట్టబయలు చేశారు. తెలుగు ప్యూపుల్, ఆవకాయ, దబ్బకాయ సైట్లలో పేరు కోసం ప్రయత్నించి విఫలులైన వారు అక్కడి కలుషితవాతావరణాన్నే బ్లాగ్లోకానికి ఎగుమతి చేశారన్న సిద్ధాంతమది. ఇక్కడ బ్లాగ్లోకంలో పేరు తెచ్చుకోవటంలో విఫలమయి, పేరున్న బ్లాగరులను వివిధ పద్ధతులలో భయ భ్రాంతులను చేసి, వారిని మానసికంగా హింసించి, పైశాచిక ఆనందం పొందటంలో కృతకృత్యులయ్యారు. మహిళా బ్లాగరులపై అశ్లీలమైన రాతలతోను, ప్రచలిత పురుష బ్లాగులపై వ్యతిరేకంగా దొంగ పేర్లతో వ్యంగ రాతలు రాసి తమ ఆగడాలు మొదలెట్టారు. ఒక కుటుంబంగా ఉన్న బ్లాగరుల మధ్యనే తగాదాలు సృష్టించటంలో కూడా విజయం సాధించారు.
"ఈ తెలుగు అని ఒక గ్రూపు ఏర్పాటు చేసి ఏదో సాధిస్తున్నామని చెప్పుకునే వాళ్ళంతా వాళ్ళ అసలు ఎజెండా ఏంటో కూడా తెలియక సతమతమయ్యారు. ఈ గ్రూపు లో పెద్దలు ఎలా ఉన్నారంటే మనలో పుట్టి పెరిగి ఎమ్మెల్యే నో ఎంపీ నో ఆయిన ఒక రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తారు. మనమేం చెప్పినా వాళ్ళు వినరు. అంతా వాళ్ళిష్టమొచ్చినట్టే చేస్తారు. కొంతమంది అనుమానం ఏంటంటే వీళ్ళూ ఈ సంఘం ద్వారా ప్రభుత్వాన్ని బతిమాలో బెదిరించో డబ్బులు దండుకోవడమే కాకుండా ఇళ్ల స్థలాలు కూడా కొట్టేయ్యాలని ప్లాన్ చేస్తున్నారని."
-ఈ తెలుగు పై ఎన్ని అపోహలో. ఈ అపోహలు తొలగించటానికి వీవెన్ రెండు టపాలు రాశారు.
e-తెలుగు ఎలా ఏర్పడింది?
e-తెలుగు ప్రశ్నలు & జవాబులు
అవి సరిగా చదవక వీళ్లు తమ సందేహాలు లోకానికి వెళ్లడించి, ఈ తెలుగు పై తమ వంతు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్ల స్థలాలకై ఈ తెలుగు నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్న వీరి అభియోగం హాస్యాస్పదం. ఈ తెలుగు అనేది ఒక సంఘం. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఈ సొసైటీ నడుస్తుంది.
కొత్తగా వస్తున్న అవాంఛనీయ ధోరణి. దీప్తిధార మరి కొన్ని ఇతరుల బ్లాగులలో కొత్త పాళి, సుజాత, మరికొంతమంది పేర్లతో దొంగ ఉత్తరాలు రాసి తుంపులు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తే పలు పేర్ల తో వ్యంగ విమర్శలు, బెదిరింపు ఉత్తరాలు రాయటం అనే కొత్త సంస్కృతి కూడా బయలుదేరింది. బ్లాగరులు ఈ Impersonator ను జాగ్రత్తగా గమనిస్తుండాలి.
తెలుగు భాషా - సంస్కృతీ ధ్వంసమునకై కుట్ర
ఈ సిద్ధాంతమును హరిసేవకుడు దుర్గేశ్వరుని మిత్రుడు ప్రతిపాదించినది. హరిసేవ బ్లాగులోని e-తెలుగు కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల..మా తల్లీ కన్నీరుపెడుతోందో.... అనే టపాలో ఈ సిద్ధాంతాన్ని చూడవచ్చు. e తెలుగు వారి కృషివలన నేడు పెక్కుమంది కంప్యూటర్లో తెలుగు వాడటం నేర్చుకుంటున్నారు. తెలుగు బ్లాగుల గురించి ప్రజలు పత్రికలలో చదివి, e తెలుగు వారి సహాయంతో కూడలి, లేఖిని గురించి తెలుసుకొని పెక్కుమంది తాము మరుస్తున్న తెలుగుకు ఒకమారు మెరుగుపెట్టి తెలుగులో బ్లాగు రాయటానికి సంసిద్ధమవుతున్నారు. ఇట్లు జరిగిన తెలుగుకు తిరిగి పూర్వ వైభవమెక్కడ సంభవించునో అని ఈ ముష్కరులు స్త్రీ పురుష భేదం లేకుండా వారిని తమ రచనలతో వ్యంగ వాఖ్యలతో తూట్లు పొడిచి, గాయబరచి వారిని తెలుగుకు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముష్కరులు తెలుగు భాషకు, సంస్కృతి కి కి తమ శాయ శక్తులా హాని చేయ తలపెట్టుతున్నారు.
"మొత్తానికి తాలిబానైజేషన్ ఆఫ్ తెలుగు బ్లాగ్లోకం అన్నమాట! అందుకనేనా మొన్నటి సభ గురించి ఎవరూ ఇంకా నివేదికని ఇవ్వలేదు. e-తెలుగు వారు కూడ కిమ్మనటం లేదు." -అని కొందరు సభ్యులభిప్రాయపడుతున్నారు.
కడుపు మంట, ఉక్రోషం, అసూయల తో కుట్ర
పేరున్న బ్లాగరులపైనే కవ్వించే వ్యాఖ్యలు, కత్తిపోటు మాటల తూటాలు ఎందుకని?
"అసలు యేమీ అనకున్నా కడుపు మంటతో పేలిపోతారు ఇంకొందరు సన్నాసులు. మడిసి మనసు కుళ్ళిపోనాక సేయగలిగేది ఏముంటుంది సెప్పు?" అని అంటున్నది రత్తి; నేను-లక్ష్మి అనే బ్లాగులోని ఆడోళ్ళు-బ్లాగులు-పెమదావనాలు- యేందియన్నీ? అనే టపాలో. మరి దీనికి ఏమి చెయ్యలి? ఎట్లా చేస్తే పరిష్కారం లభిస్తుంది? క్షోభ పడిన హృదయాలు మరలా తేలికెలా పడతాయన్నదానికి రత్తి మాటలలో జవాబు లభిస్తుంది.
""మంచి బుద్ధికీ, సెడు బుద్ధికీ ఆడా మగా అన్న తేడా లేదు మావా. దేవుడూ, రాచ్చసుడూ ప్రతి మనసులోనూ ఉన్నారు. మనం సేసేది ఒప్పా తప్పా అని లెక్కలేసుకుంటే గొడవలెందుకు ఐతాయి సెప్పు. అందరూ సల్లంగుండాలి, అందరి జీవితాలు మంచిగుండాలి, ఎప్పుడు పేలిపోతుందో తెలియని ఈ బుడగ మీద మమకారంతో సాటి వాళ్ళ జీవితాలను పాడు సేసే పాడు బుద్ధి ఎవరికీ ఉండకూడదు. అలా ఉంటే బుద్ధి మార్చుకుని సంతోషంగుండాలి మావా, సంతోషంగుండాలి"
ముగింపు
ఈ ముష్కరులు తమ లక్ష్యాన్ని సాధించగలిగారా?
మహిళల బ్లాగులు కొన్ని మూతబడ్డాయి. పర్ణశాల బ్లాగు కూడలి, జల్లెడల నుంచి అదృశ్యం కాబోతుంది. సీనియర్ బ్ల్లాగర్లను హేళన చేయటంలో తాత్కాలిక విజయం పొందారు. ఎంతకాల మిలాగా? పిల్లి ఎదురు తిరగ గలదని, ఈ ముష్కరుల ఆటలు కట్టే రోజు త్వరలో రాగలదని ఆశిద్దాము.
దబ్బకాయ కుట్ర
బ్లాగడం ఆపను. కానీ... అన్న పర్ణశాల బ్లాగులోని టపాకు రాసిన వ్యాఖ్యలలో ఒక అజ్ఞాత ఒక గొప్ప కుట్ర సిద్ధాంతాన్ని బట్టబయలు చేశారు. తెలుగు ప్యూపుల్, ఆవకాయ, దబ్బకాయ సైట్లలో పేరు కోసం ప్రయత్నించి విఫలులైన వారు అక్కడి కలుషితవాతావరణాన్నే బ్లాగ్లోకానికి ఎగుమతి చేశారన్న సిద్ధాంతమది. ఇక్కడ బ్లాగ్లోకంలో పేరు తెచ్చుకోవటంలో విఫలమయి, పేరున్న బ్లాగరులను వివిధ పద్ధతులలో భయ భ్రాంతులను చేసి, వారిని మానసికంగా హింసించి, పైశాచిక ఆనందం పొందటంలో కృతకృత్యులయ్యారు. మహిళా బ్లాగరులపై అశ్లీలమైన రాతలతోను, ప్రచలిత పురుష బ్లాగులపై వ్యతిరేకంగా దొంగ పేర్లతో వ్యంగ రాతలు రాసి తమ ఆగడాలు మొదలెట్టారు. ఒక కుటుంబంగా ఉన్న బ్లాగరుల మధ్యనే తగాదాలు సృష్టించటంలో కూడా విజయం సాధించారు.
"ఈ తెలుగు అని ఒక గ్రూపు ఏర్పాటు చేసి ఏదో సాధిస్తున్నామని చెప్పుకునే వాళ్ళంతా వాళ్ళ అసలు ఎజెండా ఏంటో కూడా తెలియక సతమతమయ్యారు. ఈ గ్రూపు లో పెద్దలు ఎలా ఉన్నారంటే మనలో పుట్టి పెరిగి ఎమ్మెల్యే నో ఎంపీ నో ఆయిన ఒక రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తారు. మనమేం చెప్పినా వాళ్ళు వినరు. అంతా వాళ్ళిష్టమొచ్చినట్టే చేస్తారు. కొంతమంది అనుమానం ఏంటంటే వీళ్ళూ ఈ సంఘం ద్వారా ప్రభుత్వాన్ని బతిమాలో బెదిరించో డబ్బులు దండుకోవడమే కాకుండా ఇళ్ల స్థలాలు కూడా కొట్టేయ్యాలని ప్లాన్ చేస్తున్నారని."
-ఈ తెలుగు పై ఎన్ని అపోహలో. ఈ అపోహలు తొలగించటానికి వీవెన్ రెండు టపాలు రాశారు.
e-తెలుగు ఎలా ఏర్పడింది?
e-తెలుగు ప్రశ్నలు & జవాబులు
అవి సరిగా చదవక వీళ్లు తమ సందేహాలు లోకానికి వెళ్లడించి, ఈ తెలుగు పై తమ వంతు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్ల స్థలాలకై ఈ తెలుగు నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్న వీరి అభియోగం హాస్యాస్పదం. ఈ తెలుగు అనేది ఒక సంఘం. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఈ సొసైటీ నడుస్తుంది.
కొత్తగా వస్తున్న అవాంఛనీయ ధోరణి. దీప్తిధార మరి కొన్ని ఇతరుల బ్లాగులలో కొత్త పాళి, సుజాత, మరికొంతమంది పేర్లతో దొంగ ఉత్తరాలు రాసి తుంపులు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తే పలు పేర్ల తో వ్యంగ విమర్శలు, బెదిరింపు ఉత్తరాలు రాయటం అనే కొత్త సంస్కృతి కూడా బయలుదేరింది. బ్లాగరులు ఈ Impersonator ను జాగ్రత్తగా గమనిస్తుండాలి.
తెలుగు భాషా - సంస్కృతీ ధ్వంసమునకై కుట్ర
ఈ సిద్ధాంతమును హరిసేవకుడు దుర్గేశ్వరుని మిత్రుడు ప్రతిపాదించినది. హరిసేవ బ్లాగులోని e-తెలుగు కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల..మా తల్లీ కన్నీరుపెడుతోందో.... అనే టపాలో ఈ సిద్ధాంతాన్ని చూడవచ్చు. e తెలుగు వారి కృషివలన నేడు పెక్కుమంది కంప్యూటర్లో తెలుగు వాడటం నేర్చుకుంటున్నారు. తెలుగు బ్లాగుల గురించి ప్రజలు పత్రికలలో చదివి, e తెలుగు వారి సహాయంతో కూడలి, లేఖిని గురించి తెలుసుకొని పెక్కుమంది తాము మరుస్తున్న తెలుగుకు ఒకమారు మెరుగుపెట్టి తెలుగులో బ్లాగు రాయటానికి సంసిద్ధమవుతున్నారు. ఇట్లు జరిగిన తెలుగుకు తిరిగి పూర్వ వైభవమెక్కడ సంభవించునో అని ఈ ముష్కరులు స్త్రీ పురుష భేదం లేకుండా వారిని తమ రచనలతో వ్యంగ వాఖ్యలతో తూట్లు పొడిచి, గాయబరచి వారిని తెలుగుకు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముష్కరులు తెలుగు భాషకు, సంస్కృతి కి కి తమ శాయ శక్తులా హాని చేయ తలపెట్టుతున్నారు.
"మొత్తానికి తాలిబానైజేషన్ ఆఫ్ తెలుగు బ్లాగ్లోకం అన్నమాట! అందుకనేనా మొన్నటి సభ గురించి ఎవరూ ఇంకా నివేదికని ఇవ్వలేదు. e-తెలుగు వారు కూడ కిమ్మనటం లేదు." -అని కొందరు సభ్యులభిప్రాయపడుతున్నారు.
కడుపు మంట, ఉక్రోషం, అసూయల తో కుట్ర
పేరున్న బ్లాగరులపైనే కవ్వించే వ్యాఖ్యలు, కత్తిపోటు మాటల తూటాలు ఎందుకని?
"అసలు యేమీ అనకున్నా కడుపు మంటతో పేలిపోతారు ఇంకొందరు సన్నాసులు. మడిసి మనసు కుళ్ళిపోనాక సేయగలిగేది ఏముంటుంది సెప్పు?" అని అంటున్నది రత్తి; నేను-లక్ష్మి అనే బ్లాగులోని ఆడోళ్ళు-బ్లాగులు-పెమదావనాలు- యేందియన్నీ? అనే టపాలో. మరి దీనికి ఏమి చెయ్యలి? ఎట్లా చేస్తే పరిష్కారం లభిస్తుంది? క్షోభ పడిన హృదయాలు మరలా తేలికెలా పడతాయన్నదానికి రత్తి మాటలలో జవాబు లభిస్తుంది.
""మంచి బుద్ధికీ, సెడు బుద్ధికీ ఆడా మగా అన్న తేడా లేదు మావా. దేవుడూ, రాచ్చసుడూ ప్రతి మనసులోనూ ఉన్నారు. మనం సేసేది ఒప్పా తప్పా అని లెక్కలేసుకుంటే గొడవలెందుకు ఐతాయి సెప్పు. అందరూ సల్లంగుండాలి, అందరి జీవితాలు మంచిగుండాలి, ఎప్పుడు పేలిపోతుందో తెలియని ఈ బుడగ మీద మమకారంతో సాటి వాళ్ళ జీవితాలను పాడు సేసే పాడు బుద్ధి ఎవరికీ ఉండకూడదు. అలా ఉంటే బుద్ధి మార్చుకుని సంతోషంగుండాలి మావా, సంతోషంగుండాలి"
ముగింపు
ఈ ముష్కరులు తమ లక్ష్యాన్ని సాధించగలిగారా?
మహిళల బ్లాగులు కొన్ని మూతబడ్డాయి. పర్ణశాల బ్లాగు కూడలి, జల్లెడల నుంచి అదృశ్యం కాబోతుంది. సీనియర్ బ్ల్లాగర్లను హేళన చేయటంలో తాత్కాలిక విజయం పొందారు. ఎంతకాల మిలాగా? పిల్లి ఎదురు తిరగ గలదని, ఈ ముష్కరుల ఆటలు కట్టే రోజు త్వరలో రాగలదని ఆశిద్దాము.
గురువారం, ఫిబ్రవరి 12, 2009
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ - సారీ
Click on photo to enlarge

ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కు పెళ్లిళ్ల మార్కెట్ లో ఎంతో గిరాకీ ఉండేది. ఇప్పుడు Pharmacists, Doctors, Dentists, Physiotherapists, Lawers, Journalists, Scientists, Linguists,Business Analysts,Finance Experts,Professors ఇంకా Architects కు భలే ఛాన్స్.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం మృదులాంత నిపుణల గిరాకీ బాగా తగ్గించివేసింది. ఇంకో సంవత్సరం దాకా ఇలాగే ఉంటుందని నిపుణులంటున్నారు.

ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కు పెళ్లిళ్ల మార్కెట్ లో ఎంతో గిరాకీ ఉండేది. ఇప్పుడు Pharmacists, Doctors, Dentists, Physiotherapists, Lawers, Journalists, Scientists, Linguists,Business Analysts,Finance Experts,Professors ఇంకా Architects కు భలే ఛాన్స్.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం మృదులాంత నిపుణల గిరాకీ బాగా తగ్గించివేసింది. ఇంకో సంవత్సరం దాకా ఇలాగే ఉంటుందని నిపుణులంటున్నారు.
స్పందన -8

Golden Gate Bridge,San Francisco,CA Photo:cbrao
వ్యంగ రాతల ప్రభావం
బ్లాగు, ఎవరి కోసం, ఎందుకోసం? ఆసక్తికరమైన విషయమేమంటే ముష్కరులు ప్రచలిత బ్లాగుల రచయితలనే లక్ష్యంగా ఎంచుకొన్నారు, తమ వ్యంగ రాతలకు. కూడలి నుంచి నిష్క్రమిస్తే వారి వ్యూహం పారినట్లే. ఓటమిని ఒప్పుకున్నట్లా?
http://parnashaala.blogspot.com/2009/02/blog-post_10.html
ఇలా జరగొచ్చు
పదిహేను సంవత్సరాల తర్వాత ,మీ కార్యాలయ సహచరులతో, మీ పిల్లలతో కూడా ఆంగ్లంలో మాట్లాడతారు.
http://ramanagandham.blogspot.com/2008/08/telugu-hindix-english.html
ఒక చెంపన కొడితే
మీరు బ్లాగరులలో మహాత్మా గాంధీలాంటి వారు. మిమ్ములను బ్లాగ్ గాంధీగా పిలువవచ్చు.
http://durgeswara.blogspot.com/2009/02/blog-post_10.html
అనంతం - శ్రీశ్రీ
శ్రీ శ్రీ వైరుధ్యాల పుట్ట. రచనలు చూడాలా, రచయిత వ్యక్తిగత లోపాలను చూడాలా? మన అభిమానం ఎవరిపైన? రచనలపైనా లేక రచయిత పైనా? రచయిత నిబద్ధుడు కాకపోతే తను చెప్పిన మంచి విషయాలకు విలువ తగ్గుతుందా? పుస్తకం గురించిన రాసిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పుస్తక పరిచయం బాగుందని ప్రత్యేకంగా రాయనవసరం లేదనుకుంటాను.
http://pustakam.net/?p=536
క్రెడిట్ కార్డు కష్టాలు
Nice article.In the case of credit cards they are not following daily interest principle of commercial banks. Credit card companies are charging for silly mistakes like paying bills in cash. SCB charges penalty for paying credit card bills in cash.
http://kovela.blogspot.com/2009/02/blog-post_11.html
గడ్డిపూలు సుజాత బ్లాగు ప్రయాణం
"థాంక్యూ మేడమ్." అన్న రానారె వ్యాఖ్య నా జీ మైల్ ఇంబాక్స్ లో పడటంతో మీ టపా దగ్గరకు మరలా వచ్చాను. మీ బ్లాగు వ్యాఖ్యలలో "మీ రెండో వ్యాఖ్య 'ఇది ఫీడ్ కోసం.. ' అనేది అర్ధం కాలేదు." అన్నారు కదా. "This is for feed of comments." -దీని అర్థం మీ బ్లాగులో నా వ్యాఖ్య తరువాత ప్రచురించబడే వ్యాఖ్యలు నాకు మైల్ కావటానికి. సబ్స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom) ". Email follow-up comments" అనే పెట్టెలో మొదట వ్యాఖ్య రాసినప్పుడు టిక్ పెట్టడం మరిచాను. గుర్తొచ్చి టిక్ పెట్టి "This is for feed of comments." అని రాశాను. ఇదీ దానికర్థం. బోధపడిందని తలుస్తాను.
http://sangharshana.blogspot.com/2008/11/blog-post.html
టి.వి. లో అసభ్య దృశ్యాలు
"ప్రశాంతికి న్యూస్ రీడర్ ఉద్యోగం అనుకోకుండా దొరికింది. ఇంటిపని,పిల్లల పెంపకంలో తలమునకలయి ఉద్యోగ ప్రయత్నమే మానుకుంది చాలాకాలం." - అనాలోచితంగా వెలువరించే అసభ్య దృశ్యాలు టి.వి. చూసే పిల్లలపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. టి.వి.ఛానెల్స్ కు స్వయం నియంత్రణ అవసరమని మీ కధ చక్కగా చెప్పింది.
http://pramadavanam.blogspot.com/2009/01/blog-post_06.html
ఎక్కువ వ్యాఖ్యలు పొందిన టపాలు
ఈ వ్యాఖ్యల సంఖ్య తప్పుగా ఉంది. ఏ తారీకు లెక్కలివి? ఇలాంటి వాటికి As on ...date ఇస్తే బాగుండగలదు. అన్ని బ్లాగుల లెక్కలు ఒక్క రోజు తీసినవే అయితే బాగుంటుంది.
http://blog.jalleda.com/?p=137
మంగళవారం, ఫిబ్రవరి 10, 2009
స్పందన -7

San Jose,CA Winter annual flowers Photo:cbrao
మా ఊరు వెళ్తున్నా
మా ఊరు అంటే పాత మధుర స్మృతులు గుర్తుకు రావటం ఖాయం. మన ఊరు వెళ్తున్నాము అనగానే చిన్ననాటి సంగతులు మనసు నిండా ముసురుకోకుండా ఎలా వుంటాయి? అవి వెంటాడే జ్ఞాపకాలు. అప్పటి పాత స్నేహితులు ఇప్పుడు ఎక్కడున్నరో, ఏమి చేస్తున్నారో అని మనసు విలవిలలాడటం ఖాయం. ఇంతకూ ఏ వూరు వెళ్తున్నారు ?
http://bhavadeeyudu.blogspot.com/2009/02/blog-post.html
ఆడ దెయ్యాలు
ఈ సారి మళ్లా మీ అమ్మమ్మా వాళ్ళ ఊరు కి వెళ్లినప్పుడు ఆడ దెయ్యాలు కనపడితే వాటికి తెలుగు బ్లాగులు గురించి చెప్పి, మహిళా బ్లాగరిణులపై అసభ్యం గా రాస్తున్న ముష్కరుల పని పట్టమని చెప్పండి.
http://nenu-laxmi.blogspot.com/2009/02/blog-post_09.html
ఇంటింటి బ్లాగోతం
"ఆరు సార్లు చదివా ఈ కవితని తెలుసా అన్నాను ....
ఆరుసార్లా!!!!! ఇప్పుడు అన్ని సార్లు వినిపిస్తావా అన్నారు..
అర్దం అయ్యేంతవరకూ చదివి వినిపిస్తా అన్నాను పట్టుదలగా ..
నిజం చెప్పవే సినీ నటి శ్రీలక్ష్మి మీకు బంధువులు కదా అన్నారు అనుమానంగా." -పడి పడి నవ్వా చదువుతున్నప్పుడు.
http://jaajipoolu.blogspot.com/2009/02/blog-post_09.html
When NOTHING is better?
ఇంతకూ బ్లాగులో రాసినది కనబడకుండా ఎలా మాయం చేశారు? మరలా ఎలా తెప్పించారు? e-తెలుగు స్టాల్ పుస్తక ప్రదర్శనశాల వద్ద మిగతా బ్లాగరుల గురించి మీరు గమనించి రాసిన విషయాలు కొంతమందిని ఇబ్బందిలో పెట్టుంటాయనిపిస్తుంది.
http://bhavadeeyudu.blogspot.com/2008/09/blog-post_11.html
"తెలుగు సాహితి" తొలి సమావేశం
సమావేశ నివేదిక ద్వారా ఐ.బి.ఎం. ఉద్యోగస్తుల, తెలుగు సాహిత్యం పై కల ఆసక్తి తెలుస్తూంది. తెలుగు బ్లాగులు చదివి, ఎవరైనా తెలుగులో కొత్త బ్లాగు ప్రారంభించడానికి ఉత్సాహం చూపారా? మీ ప్రణాళిక ప్రకారం ఈ నెల 12 న జరగబోయే సమావేశం విజయవంతం కావాలని అభిలషిస్తున్నాను. కొత్త బ్లాగు ప్రారంభించటానికి ఏమైనా సహాయం కావాలంటే తెలుగు బ్లాగు గుంపు ను సంప్రదింపవచ్చు.
http://ibmtelugusaahiti.blogspot.com/2009/01/blog-post.html
"అంధ విద్యార్ధులకు ఉన్నత చదువులకు చేయూత"
మీ ఆశయాలు బాగున్నాయి. హైదరాబాదు లో మీ చిరునామా, ఫోన్ సంఖ్య ఇవ్వగలరు. మీకు TMAD వారు పరిచయమేనా?
http://sahaayafoundation412.blogspot.com/2009/02/blog-post_09.html
బ్లాగరులే మహనీయులు
అచ్చు రచనలకు, బ్లాగులో రచనలకు మౌలికంగా రెండు ముఖ్యమైన తేడాలున్నాయి. బ్లాగులో రాసినవి Search Engine కు దొరుకుతవి. పాఠకులకు తాము చదవదలచుకున్న విషయాలపై ఒక పెద్ద ఖజానా వారి ముందర ఉంటుంది. బ్లాగరులకు పాఠకులనుంచి వచ్చే స్పందన ఉభయత్రా లాభదాయకమైనది. రచనలో లేని విషయాలు కూడా, వ్యాఖ్యలు ద్వారా సత్వరం తెలుసుకోవచ్చు. అచ్చులో ఈ రెండు సదుపాయాలూ లేవు.
http://www.tadepally.com/2009/02/blog-post_10.html
Slumdog Millionaire (2008)
భారతదేశంలోని మురికివాడలు చూపిస్తే వారి చిత్రాలలో వాస్తవికత ఉట్టిపడగలదని ఈ దర్శకుల భావన అయ్యుండొచ్చు. అలా తీయడం చిత్ర వ్యాపార విజయానికి తోడ్పడితే ఏ నిర్మాత కాదంటాడు? సినిమాకు దారిద్ర్యం కూడా ఒక బాక్స్ ఆఫీస్ సూత్రమై కూర్చుందిప్పుడు.
http://anilroyal.wordpress.com/2009/02/09/%e0%b0%ae%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1-%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b2%e0%b0%bf%e0%b0%af%e0%b0%a8%e0%b1%88%e0%b0%b0%e0%b1%8d/
సోమవారం, ఫిబ్రవరి 09, 2009
స్పందన -6
Mount Diablo,North California Photo: cbrao
బ్లాగులలో అసభ్య రాతలు
"అప్పుడు హైందవం బుద్ధుడిని వ్యతిరేకించలేదు. అతడిని ఒక అవతారం చేసింది. తనలో కలుపుకుంది. దేశంలో బౌద్ధం అంతరించింది." -బౌద్ధ మతవ్యాప్తిని అరికట్టడానికిది హిందువుల ప్రయోగాత్మక వ్యూహం. అది ఫలించింది. బౌద్ధం భారత దేశం లో క్షీణించి హిందువులు లేని దేశాలలో ప్రకాశించింది.
"కాబట్టి, మనము కూడా, నచ్చని బ్లాగులను వదిలి, నచ్చని వ్యాఖ్యలని విస్మరిస్తూ, మనకు నచ్చిన రీతిలో బ్లాగు ప్రపంచాన్ని ముందుకు తీసుకుంటూ పోదాం." -మంచి మాటలు.
http://kasturimuralikrishna.wordpress.com/2009/02/06/open-letter/
Credit Card
While reimbursing the amount to merchants credit card companies deduct 1.85% towards their charges.This will eat away the profit margin of retail merchants. In the case of electronics, computer goods, because of competition the profit margins on sale of goods is low and hence they can't afford further erosion of profit. For this reason, electronic goods merchants charge additional 2% if you offer payment through Credit card or Debit card.
Use of cash is advised in such cases.
http://sangharshana.blogspot.com/2009/02/blog-post_06.html
వేయిపడగలు
ఇంతకూ ఈ విలువైన (400 రూపాయలు) పుస్తకం ఇచ్చే సందేశమేమిటో వివరించి ఉండవలసినది.
http://newjings.blogspot.com/2009/02/2.html
పర్ణశాల పై సమీక్ష
పర్ణశాల ఎలా వివాదాస్పద బ్లాగు అయ్యింది? అందులో ప్రతిపాదించిన మింగుడు పడని సిద్ధాంతాలేమిటి? ఒక ఉదాహరణ గా కాష్మీరాన్ని పాకిస్తాన్ కు ఇచ్చివేసి సుఖంగా వుందాం అనే సిద్ధాంతం. Parody బ్లాగుకు కత్తి ఏ విధంగా ప్రేరణ అయ్యారు? కత్తి భావజాలంతో బ్లాగరులు ఎందుకు విభేదిస్తున్నారు? శంఖారావం బ్లాగులో చెప్పినట్లుగా బ్లాగులలో ముసలానికి కత్తి మహేష్ కుమారే కారణమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ సమీక్షలో లేశ మంత కూడా గోచరమవటంలేదు.
http://computerera.co.in/blog/?p=1349
ఈ-తెలుగు లక్ష్యాలు
మీరు వీవెన్ వ్రాసిన e-తెలుగు ఎలా ఏర్పడింది? అన్న వ్యాసం కింది గొలుసులో చూడండి.
http://veeven.wordpress.com/2009/02/01/who-etelugu-started/ ఇది చదివితే మీ ప్రశ్నలకు సమాధానాలు లభ్యమవగలవు. మీరు e - తెలుగు సభ్యులు కావాలంటే, ముసుగులోంచి బయటకు రావాలని ప్రధమ నియమం. ముసుగు వీడి మీ పరిచయం చేసుకుంటే సంతోషిస్తాను. అలా పరిచయం చేసుకోవటం మీకు సమ్మతం కాకపోతే, మీరు e-తెలుగు సభ్యులు కాజాలరు. సభ్యుల ప్రవేశ రుసుము Rs.300/- సంవత్సర చందా Rs.200/-
http://dhoommachara.blogspot.com/2009/02/blog-post_07.html
పర్ణశాల పై సమీక్ష: వ్యాఖ్యలు లో ప్రశ్నలు ఎవరినుద్దేశించినవి?
'కంప్యూటర్ ఎరా' లో వచ్చిన బ్లాగు సమీక్ష పై, నా వ్యాఖ్య లోని ప్రశ్నలు, పర్ణశాల లో చర్చించిన సిద్ధాంతాలు, ఆచరణయోగ్యం కాదనో, లేక అవి సాధ్యం కాదనో చెప్పటానికో, అవి రాయలేదు. ఆ ప్రశ్నలు సమీక్షకులకు. ఆ ప్రశ్నలపై కూడా సమీక్షలో కొంత కేంద్రీకరిస్తే సమీక్ష సమగ్రంగా ఉండగలదని చెప్పటానికే. అందులో ఇచ్చిన ఉదాహరణలు కూడా సమీక్షకుల అవగాహనకు రాసినవే కాని పర్ణశాలకు ఎవో ఉద్దేశాలు ఆపాదించటానికి కాదు. వాస్తవంలో పర్ణశాల లో చర్చించిన విషయాలు ఎన్నో గంభీరమైనవి, విస్తృతమైనవి. అంతలోతుగా సమీక్ష ఉండాలని చెప్పటానికే ఉదాహరణగా ఇచ్చిన కల్లోల కాష్మీరం నా కొద్దు.
నా వ్యాఖ్య ఎవరికోసం, ఎందుకోసం రాయబడిందో అనే విషయం లో సందేహ నివారణకు అందులో లేవనెత్తిన ఒక ప్రశ్నకు నేనే బదులిచ్చి, ఈ ఉత్తరాన్ని ముగిస్తాను. "శంఖారావం బ్లాగులో చెప్పినట్లుగా బ్లాగులలో ముసలానికి కత్తి మహేష్ కుమారే కారణమా? " -నా జవాబు: ఇది హాస్యాస్పదమైన ఆరోపణ. నా వ్యాఖ్యలో లేవనెత్తిన ప్రశ్నలను చర్చిస్తూ, సమీక్ష సమగ్రంగా ఉండటానికై ఏమైతే రాయాల్సుంటుందో, అవి ఉదహరించి ఉండవలసినదని నేను అభిప్రాయపడ్డాను.
పర్ణశాల వంటి గంభీర బ్లాగు పై సమీక్షలను peer -review చేసి ఆ పత్రికా సంపాదకుడు ప్రచురించి వుంటే ఈ అపార్ధం కలిగేది కాదు.
http://parnashaala.blogspot.com/2009/02/blog-post_08.html
సారస్వత మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్
సోమసుందర్ గారి గురించిన ఉపయుక్తమైన సమాచారం, విశ్లేషణ బాగున్నాయి. ఇందులో బొమ్మలు కనిపించటం లేదు. వాటిని మరలా ఎగుమతి చెయ్యగలరు.
http://sahitheeyanam.blogspot.com/2008/10/blog-post_10.html
ఆదివారం, ఫిబ్రవరి 08, 2009
విశ్వనాధ వారి పై నార్ల

Narla Venkateswara Rao
నేపధ్యం:
విశ్వనాధవారిపై ప్రచురించిన వ్యాసాలు చదివి పాఠకులు పెక్కు ఉత్తరాలు రాశారు. రాస్తున్నారు. ఇంతవరకూ వచ్చిన ఉత్తరాలు విశ్వనాధవారి పలు పార్శ్వాలను స్పృశిస్తే భైరవభట్ల కామేశ్వర రావు గారి ఉత్తరం అసలు విశ్వనాధవారి తత్వమేమిటని ప్రశ్నించింది. ఇప్పటివరకూ అందిన ఉత్తరాలలో ఇదే ఉత్తమ జాబుగా తలుస్తున్నాను. ఆ ప్రశ్న దానికి జవాబు చదవండి.
భైరవభట్ల కామేశ్వర రావు: "నేనర్థం చేసుకున్నంతలో, విశ్వనాథ భావజాలం మీద వ్యతిరేకత వల్లనే ఇంత తీవ్ర విమర్శ వస్తోంది. అయితే, విశ్వనాథ భావజాలం ఏమిటి? "
- "పూర్వజన్మ సుకృతము వలెనే ఒకడు బ్రాహ్మణుడిగా, పాపఫలమున మరియొకడు అంటరానివాడుగా జన్మించునని, విశ్వనాధ రచనల సారాంశం. తపస్సు చేసినాడనే కారణంగా జరిగిన శంబూక వధను సమర్ధించే రామాయణ కాలం నాటి విధానాలు విశ్వనాధ వారికి ప్రీతిపాత్రం. వేదకాలం నాటి వ్యవస్థను ఆదర్శ ప్రాయమైన సాంఘిక వ్యవస్థ గా తలుస్తారు. స్త్రీ పురుషుల, వివిధ వర్ణాల మధ్య సాంఘిక అసమానతలను ప్రోత్సహించే మనుధర్మ శాస్త్రం విశ్వనాధవారికి శిరోధార్యం. " అని విశ్వనాధ విమర్శకులు అభిప్రాయపడతారు.
ఈ రోజు విశ్వనాధ వారి పై నార్ల వెంకటేశ్వర రావు గారి అభిప్రాయం తెలుసుకుందాము. నార్ల వారు జగమెరిన పత్రికా సంపాదకులు. 1970 లలో హైదరాబాద్ లో మిత్రులు నరిశెట్టి ఇన్నయ్య, వెనిగళ్ళ వెంకటరత్నం కలసి నెలకు ఒక సమావేశం అనే ఒక పధకం అమలు జరిపారు. ఆ సమావేశాల లోనే నేను నార్లవారిని దగ్గరగా చూడటం జరిగింది. ఒక పర్యాయము ఇన్నయ్యగారి తో కలిసి, road no:7, బంజారా హిల్స్ లోని నార్ల వారింటికి వెళ్లి, నార్ల వారిని వారింట్లో (Lumbini) కలిశాను. వారి ఇంట ప్రతి గది ఒక గ్రంధాలయమే. కారు గారేజ్ లో కూడా ట్రంక్ పెట్టెలలో పుస్తకాలుండెడివి. పుస్తకాలంటే నార్లవారికి అంత ఇష్టం.నార్ల తదనంతరం, ఆ పుస్తకాలు అన్నీ హైదరాబాద్ లోని అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి నార్ల వారి శ్రీమతి కానుకగా ఇచ్చారు.నార్ల వారి జీవిత విశేషాలు ఈ కింది గొలుసులు లో లభ్యమవుతాయి.
http://naprapamcham.blogspot.com/2008/03/10.html
http://naprapamcham.blogspot.com/2008/03/11.html
శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి "వీరవల్లడు" పై నార్ల వారి సమీక్ష చూడండి.
-cbrao
విశ్వనాథ కులతత్వం
శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి "వీరవల్లడు" నవ్యరచనే. కథా వస్తువు కొత్తది; కథా చిత్రణ కొత్తది. పాత్ర కల్పనలో, పాత్ర పోషణలో కొత్తదనం కలదు కూడా. ఇక, ఆయన ఉపయోగించిన భాష ఎంత ఉచితమైనదో, అంత ఉత్తమమైనది. మాటమాటలో జాతీయత తొణికిసలాడుతున్నది; వాక్యం వాక్యంలో మన పల్లె – మన పల్లె ప్రజ – కళ్ళకు కట్టినట్టు కానవస్తున్నది. కాని, తాత్కాలికంగా ఎంత అలరించినా, ఈనాడు ప్రతివానికి దానిలో ఏదో కొరత గోచరిస్తున్నది. ఆ కొరత, దానిలో అభ్యుదయం కొరవడ్డమే.
కుల విభేదాలు హిందూ సంఘానికి వేరుపురుగా పరిణమించినవని ఈనాడు ప్రతి విజ్ఞుని నమ్మకం. చాతుర్వర్ణాలు అవసరమని నిన్న మొన్నటివరకు ఉద్ఘాటించినా, నేడు గాంధీజీ సైతం కుల విభేదాలు పూర్తిగా తొలగిపోవాలంటున్నాడు. అవి తొలగనంతవరకూ హిందూ సంఘానికి శక్తిగాని, ముక్తిగాని లేదంటున్నాడు. కుల విభేదాల వినిర్మూలనం హిందూ సంఘాభ్యుదయానికి అత్యవసరమని దీని తాత్పర్యం. కాని, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రచన కులవిభేదాల పట్ల విరోధభావాన్ని, జుగుప్స ను కలిగించడానికి బదులుగా వాటిపట్ల ప్రేమాభిమానాల్ని పురికొల్పుతున్నది.
గుణగణాలను బట్టి కాకుండా కేవలం జన్మ వల్లనే ఒకడు భూసురోత్తముడు కావడం, మరొకడు అంటరానివాడు కావడం విపరీతమని ఆ రచన చెప్పడం లేదు సరి గదా, ఆ వైపరీత్యాన్ని సమర్థిస్తున్నది. శ్రీ సత్యనారాయణ విశాల భావాలు గలవారే కావచ్చు. వర్ణ వైషమ్యాలకు ఆయన అతీతుడే కావచ్చు. ఆయన తన కావ్యాలలో ఒకదాన్ని ఒక మిత్రునికి అంకితం చేస్తూ, వర్ణ వైషమ్యమ్ము వాడిపోయినదయ్య అర్ణవ వైశాల్యమైన నీ ఆత్మలో అని వ్రాసిన సంగతి కూడా మాకు తెలియకపోదు. కాని, ఆయన వీరవల్లడు బ్రాహ్మణ, ఛండాల సంబంధ బాంధవ్యాలపై ఒక మధుర గీతం. ఔరా! వీరవల్లడు ఎంత ప్రభుభక్తి పరాయణుడు అనే భావాన్నే అది రేకెత్తిస్తుంది గాని, నీవు ఎద్దుల తలతాళ్ళు పట్టుకో – పరవాలేదులే! ఇంటికి పోయి తలారా స్నానం చేస్తాను అని తను ఏ బ్రాహ్మణ గృహిణి సేవకై ఎన్ని కష్టాలకైనా పాల్పడ్డాడో ఆమె చేతనే అనిపించుకోవలసిన మహాపాపం అతడేమి చేశాడనే ఆగ్రహాన్ని పాఠకునికి కలిగించలేదు. అందువల్లనే అది నవ్య రచనే అయినా, అభ్యుదయ రచన కాదు, కానేరదు.
వీరవల్లడు విషయమై ఇక్కడ మేమింతగా ప్రస్తావించడానికి కారణం అది ఉత్తమమైన నవ్యరచనే అయినప్పటికీ, అభ్యున్నతి మార్గాలకు నిరోధంగా నిలవగల రచనలకు అది ఒక ఉదాహరణ కావడమే.
(- నార్ల రచనలు 5వ సంపుటి, పేజి -13 నుండి)
శుక్రవారం, ఫిబ్రవరి 06, 2009
స్పందన -5

Point Arena Lighthouse In Fog, North California Photo: cbrao
మరోప్రపంచం..
ఈ పోస్ట్ ఎలా మిస్ అయ్యానబ్బా? చదువుతున్నంత సేపూ నవ్వాగలేదు. ఏమి ఊహ!
http://pappusreenu.blogspot.com/2009/01/blog-post.html
బ్లాగోత్సాహం
@prasadcvln: "స్త్రీలు కుటుంబం, భర్త, పిల్లల నుంచి ఐడెండిటీని పొందటానికి ప్రయత్నిస్తారనేది ఒక సిద్ధాంతం. ప్రస్తుత ఒరవడి చూస్తుంటే బ్లాగులు కూడా ఆ కోవకి చేరాయనిపిస్తోంది." - ఈ అపప్రధ రాకూడదనే మహిళలు భర్త పేరు ఉదాహరించకుండా బ్లాగులు రాస్తున్నది.
"అరకొర జ్ఞానాన్ని.. అపరిమితమయిన విజ్ఞానంగా ఫీలయ్యి.. తమ గాఢ అజ్ఞాన తిమిరాన్ని అందరికి పంచాలని ప్రయత్నిస్తున్న బ్లాగర్ల సంఖ్యా పెరుగుతోంది. " -బ్లాగు ప్రక్రియ కేవలము విజ్ఞులకు మాత్రమే కాదు. బ్లాగు అనేది web log అని మీకు తెలుసు. ఇక్కడ (అమెరికా లో) హోటల్ సర్వర్, మంగలి, నర్సులకు కూడా బ్లాగులున్నాయి. వ్యక్తిగత అనుభవాలను రాయటానికి ఉద్దేశించినది బ్లాగు. మీరు రాసిన దాంట్లో తప్పులుంటే పాఠక మిత్రులు అవి మీ దృష్టికి తెస్తారు. తద్వారా మీరు improve అవవచ్చును.
"నలుపులో టెంప్లెట్ పెట్టుకుంటే- అది అడెల్డ్ కంటెంట్కు అన్న కనీస స్పృహ లేని వాళ్లు అనేకం. " -నలుపు మంగళకరం కాదని శుభలేఖలలో మన వారు వాడరు. దీనికర్ధం పెద్దలకు మాత్రమే అన్న విషయం నాకు తెలియదు. మరి ఇతర రంగులకు ఏమి అర్థం వస్తాయి? నీల రంగు టెంప్లేట్ పెట్టుకుంటే ఆ బ్లాగర్ romantic అనో లేక pink రంగు పెట్టుకుంటె ఆ బ్లాగు మహిళదనో అర్థాలున్నాయా? ఈ విషయం లో నా అజ్ఞానం అపారం.
http://arunam.blogspot.com/2009/01/blog-post_21.html
మాంగళోర్ లో స్త్రీలపై దాడి
"దాడి చేసి కొట్టడం తప్పే కావచ్చు.. మరి, పబ్బుల్లో మగాళ్ళతో కలిసి తాగి తందనాలాట్టం, ఎకిలేషాలెయ్యడం తప్పు కాదా? "- ఈ వ్యాసంలో స్త్రీలపై అమానుష ప్రవర్తన ఖండించటం జరగలేదు. ఆడవారు పబ్ కు వెళ్లటము చట్టసమ్మతము. రామసేన లు మహిళలతో వ్యవహరించిన విధానము ఏ విధముగా సమర్ధిస్తాము?
http://chaduvari.blogspot.com/2009/01/blog-post_29.html
ఎవరీ వరూధిని?
మీ బ్లాగుకు వరూధిని అని సిరిసిరిమువ్వ బ్లాగరి పేరు ఎందుకు వుంచారో వివరించగలరు. మీరు మహిళయో, పురుషుడో చెప్పటం ఇష్టం లేకపోతే, చెప్పవద్దు.
http://varudhini.blogspot.com/2009/01/blog-post_30.html
చాతక పక్షులు 12
"రమణ గీతనీ, హరినీ తీసుకుని Statue of liberty, white house, museum చూపించాడు గీతకి అవన్నీ చూస్తుంటే ఏదో మాయలోకంలో వున్నట్టు అనిపించింది. " -న్యూ యార్క్ లో White House ? దీని ప్రాముఖ్యతను వివరించండి. ఆ ఊళ్లో మూడు రోజులున్నా. దీని గురించి ఒక్కరు చెప్పలేదేమిటి?
http://tethulika.wordpress.com/2009/02/01/%E0%B0%9A%E0%B0%BE%E0%B0%A4%E0%B0%95-%E0%B0%AA%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-12/
e-తెలుగు ఎలా ఏర్పడింది?
"ప్రవాస భారతీయులు ఎన్నికలలో పోటీ చేయగలరా అన్నది స్పష్టంగా లేదు. "- ప్రవాస భారతీయులు వారు నివసించే ప్రదేశంలో ఏర్పరుచుకునే affiliated assocciation తరపున అక్కడి స్థానిక ఎన్నికలలో పాల్గొనవచ్చు. Affiliated assocciations స్వతంత్ర సంస్థలు. వీటికి కేంద్ర సంస్థనుంచి సాంకేతిక, ఇతర సలహాలు అందచేయబడతాయి. కేంద్ర e-telugu.org లో సంస్థ కేంద్రమైన హైదరాబాదు వారే ఎన్నికలలో పోటీ చేస్తారు. భారతీయ Registrar of companies & Societies వారి చట్టాలకు అనుగుణంగా కేంద్ర సంస్థ పనిచేస్తుంది.
http://veeven.wordpress.com/2009/02/01/who-etelugu-started/
బేతాళ కధలు
చక్కటి సటైర్. ఇది చదువుతుంటే ముళ్లపూడి రాజకీయ భేతాళ పంచ వింశతిక గుర్తుకు వచ్చింది.
http://blog.vikatakavi.net/2009/02/02/%e0%b0%ad%e0%b1%87%e0%b0%a4%e0%b0%be%e0%b0%b3-%e0%b0%95%e0%b0%a7%e0%b0%b2%e0%b1%81-1-2/
గురువారం, ఫిబ్రవరి 05, 2009
మహిళా బ్లాగర్ల పై జరుగుతున్న హేయమైన దాడి
"మీ తోటి మహిళా బ్లాగర్ల మీద జరుగుతున్న హేయమైన దాడి గురించి బ్లాగ్ ప్రముఖులెవరికీ చీమకుట్టినట్టు కూడా లేనట్టుంది. మీరందరూ కుటుంబంలా ఉంటారని చెప్పుకుంటారు. మరి మీ కుటుంబంలో ఆడవాళ్లను ఇంత అవమానకరంగా మాట్లాడితే ఇలాగే ఏమీ పట్టనట్టు మీ పని మీరు చేసుకుంటారా. ఒక్క మహేశ్ గారు తప్ప ఎవరూ ఖండించడం మాట అటుంచి, కనీసం స్పందించనూ లేదు, నిరసించడంలేదు. ఆ మహిళలు ఎంతా బాధపడుతున్నారో ఎవరైనా ఆలోచించారా. ఎంతమంది బ్లాగులు మూసేసారో మీకు తెలుసా. రమణి గారి తర్వాత ఇప్పుడు జ్యోతిగారి బ్లాగులన్నీ మూతబడ్డాయి. నేను జ్యోతిగారి వ్యాసం చదివి బ్లాగ్ లోకంలోకి వచ్చాను. బ్లాగు మొదలెడదామనుకుంటుండగానే ఈ గొడవ చూడ్డం జరిగి అసహ్యం వేసి నా ఆలోచన విరమించుకున్నాను." -ఇది దీప్తిధారకు ఒక అజ్ఞాత మహిళ పంపిన సందేశం. మహిళల మీద దాడి ఎందుకు జరుగుతున్నదో బోధ పడ లేదు.
కారణమడిగితే, దాడికి కారణం వివరిస్తూ పేరు వెళ్లడించటానికి భయపడ్డ ఇంకో మహిళా బ్లాగరు ఈ link పంపారు. "రవిగారికి ఏవన్నా అపోహలుంటే జ్యోతిగారిని అడగాలి గాని తన బ్లాగులో వేరెవరో వ్యక్తి , ఆడవాళ్ళను నీచంగా కామెంటుతుంటే ఏమీ పట్టనట్లు ఊరుకున్నారు కనీసం అలాంటి భాష వాడద్దు అని సూచించనైనా సూచించలేదు.."
మన సభ్యులలో రవిగారు ను ఎరిగినవారెవరైనా వున్నారా? ఈ రవి తన సైట్ వచ్చిన సాంకేతిక సమస్యలకు జ్యోతక్క కారణమని రాస్తున్నారు. ఈ టపాకు స్పందనగా వచ్చిన వ్యాఖ్యలు మహిళలను గాయపరిచేవిగా ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు తొలగించేలా రవిగారిని ఎరిగినవారు తక్షణం పూనుకోవాలి.
బొల్లోజు బాబా స్పందిస్తూ "జ్యోతిగారు, రమణిగారు, సుజాతగారుల ను వ్యక్తిగతంగా వారి గౌరవాలకు భంగం కలిగేలా కించపరుస్తూ వాఖ్యలు, టపాలు వెలువడుతున్నాయి. ఇది హేయం. దారుణం.
వీరేకాక కొత్తగా కొత్తపాళీగారిని మరింత జుగుప్సాకరంగా కించపరచటం జరుగుతున్నది. పెద్దవారు కనుక సంయమనంతో వ్యవహరిస్తున్నారని అనుకొంటున్నాను." అని రాస్తున్నారు.
ఈ బ్లాగులు మూతపడటానికి ఎవరు బాధ్యులు? మనము ఏమి చెయ్యాలి వీటిని నివారించటానికి? మహిళలపై అన్యాయంగా కత్తులు రువ్వుతున్నవారిని ఏమీ చెయ్యలేమా?