ఆదివారం, డిసెంబర్ 20, 2009

పుస్తక ప్రియుల కోసం పాదయాత్ర (మూడవ రోజు)



హైదరాబాదులో పుస్తక ప్రియుల కోసం పాద యాత్రలో కుడి నుంచి ఎడమకు శ్రీయుతులు నటుడు,రచయిత జెన్నీ, పరుచూరి వెంకటేశ్వర రావు, తెలకపల్లి రవి


పుస్తకాల కోసం నడకలో పిల్లల విచిత్ర వేషధారణ


శ్రీయుతులు తెలకపల్లి రవి, చుక్కా రామయ్య


శ్రీమతి కాట్రగడ్డ అరుణ, శ్రీ గాలి ఉదయ్ కుమార్ వికాసధాత్రి.ఆర్గ్ వెబ్ సైట్ నిర్వహిస్తున్నారు. ఉచిత e - తెలుగు పుస్తకాలు లభిస్తాయిక్కడ.


పుస్తకాల కోసం నడకలో పరుగులు తీస్తున్న పుస్తకం.నెట్



ఈ సందర్భంలో TV 9 రవిప్రకాష్ మాట్లాడుతూ "అక్షరాస్యతలో మన రాష్ట్రం 23 వ స్థానం లో ఉంది. మనలను పట్టి పీడిస్తున్న సమస్యలకు మూలం అజ్ఞానం. పుస్తకాలు విజ్ఞానాన్ని ఇస్తాయి. ఆలోచించేవారు,పుస్తకాలు చదివేవారు, ప్రజల సమస్యలకు పరిష్కారం చెప్పాలి" అన్నారు.



ఎడమ నుండి కుడి వైపు: శ్రీయుతులు పరుచూరి శ్రీనివాస్ (పాత పాటల, సినిమాల విజ్ఞాన ఖని, పుస్తకాభిమాని),శిరీష్ కుమార్,మురళీధర్ నామాల



సందర్శకులతో e తెలుగు స్టాల్. ఈ రోజు సుమారు 3000 సందర్శకులు. e తెలుగురూపొందించిన CD లకు తెలుగు భాషాభిమానుల ఆదరణ లభించింది.



ముగ్గురు బ్లాగర్లు ఎడమ నుండి కుడి: శ్రీ శివ చెరువు (బ్లాగు పేరు: నేను గురివింద గింజ), రవిచంద్ర ( బ్లాగు: అంతర్వాహిని), సురేందర్ (బ్లాగు: పుల్లాయన కబుర్లు)



ఎడమ నుండి కుడి: చిరంజీవి భావన,అక్కిరాజు భట్టిప్రోలు, వీవెన్, కొలిచాల సురెష్, పరుచూరి శ్రీనివాస్, నాగమురళి, కశ్యప్



నటుడు, రచయిత జెన్నీ (పోలాప్రగడ జనార్దనరావు) మన స్టాల్ కి వచ్చి కంప్యూటర్లో తెలుగు రాయటం నేర్చుకున్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగవటం వలన జెన్నీ పేరుతో నాటకాలు, సినిమాలలో నటించానన్నారు. ఆసక్తికరమైన సంగతేమిటంటే వారి తండ్రిగారు ముద్దుగా వీరిని జెన్నీ (కార్ల్ మార్క్స్ భార్య) అని పిలిచేవారు. జెన్నీ అంత క్రితం పుస్తకాలకై నడక కార్యక్రమంలో పాల్గొని, ఉపన్యసిస్తూ "ఒక ప్రముఖుడు ఒక బహుళ అంతస్తులో లిఫ్ట్ లో పయనిస్తుండగా లిఫ్ట్ చెడిపోయి పై అంతస్తుకూ కింది అంతస్తుకూ మధ్య పదిహేను నిమిషాలు ఆగిపోయింది. లిఫ్ట్ బాగయ్యాక కార్యాలయ నిర్వహణ కార్యాలయానికి వెళ్లి లిఫ్ట్ లో ఇలాంటి అవాంతర సమయాలలో అందులో నిలబడిపోయిన వారి కోసం కొన్ని పుస్తకాలు వుంచాలని సలహా రాసి ఇచ్చి వెళ్లారు. పుస్తకాలంటే ఎంత ప్రేమో ఈ సంఘటన చెప్తుంది" అని చెప్పారు.

ఈ రోజు సందర్శకులు: శ్రీ కె.సురేష్ ( Alchemist నవల తెలుగు లో పరశువేది గా అనువాదించిన రచయిత), రాణి పులొమజా దేవి ( సర్కార్ వగైరా చిత్రాలకు పాటలు వ్రాసారు) మన స్టాల్ ని దర్శించారు.
వరూధిని,పి.ఎస్.లక్ష్మి, అరుణ పప్పు, పూర్ణిమ తమ్మారెడ్డి, చంద్రలత ఇంకా మాలాకుమారి మన e తెలుగు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

మన స్టాల్ లో లాప్టాప్ లో వినిపించిన మా తెలుగుతల్లికి అనే పాటకు విశేష స్పందన లభించింది.

Photos: cbrao Canon Powershot SD1100IS

1 కామెంట్‌:

Ramani Rao చెప్పారు...

బాగుందదండి, ఏరోజుకారోజు పుస్తక ప్రదర్శనశాల విషయాలు మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి