
జూన్ నెల 16వ తేది, 2013 సాయంత్రం హుస్సైన్ సాగర్ నదిబొడ్డున జిబ్రాల్టర్ రాయిపై పై నెలకొన్న, మానవాళి కి పరిపూర్ణ సత్యాన్ని విప్పిచెప్పిన గొప్ప మానవతావాది బుద్ధుడి పాదాలచెంత, పెక్కు ఆసియా దేశాలకు నాగరికత, విజ్ఞానాన్ని పంచిన, కృష్ణా నది ఒడ్డున జ్ఞాన కుసుమాలతో విరాజల్లిన అమరావతి కథ "ఆంధ్రనగరి" ఆవిష్కరణ జరిగింది.
ఈ గ్రంధ రచయిత సాయి పాపినేని కి పురాతత్వశాస్త్రం పై మిక్కిలి ఆసక్తి. 25సంవత్సరాల క్రితం అమరావతిని మొదటిసారి సందర్శించినప్పుడు పొడసూపిన అనేక ప్రశ్నలకు సమాధానాలకై తనే అన్వేషకుడిగా మారి శోధించి సాధించిన జ్ఞాన ఫలం ఈ ఆంధ్రనగరి. అమరావతి కథను ఒక చారిత్రాత్మిక నవలగా ఆవిష్కరించారు.
ప్రస్తుతం నేను గతంలోకి, ఆంధ్రనగరి చరిత్ర పుటలలో మునిగిపోయా. తేలగానే ఈ పుస్తక విశేషాలు సవివరంగా, సచిత్రంగా చెప్తాను. అందాకా సెలవు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి