మంగళవారం, అక్టోబర్ 23, 2007

శుభలేఖ

నాకు గతంలో వచ్చిన ఒక వివాహ ఆహ్వానపత్రాన్ని మీ ముందుంచాను http://deeptidhaara.blogspot.com/2007/02/blog-post_07.html. అది మీకు నచ్చిందన్నారు. శుభలేఖ చలనచిత్రంగా ఉండటం అందులోని ప్రత్యేకత.

కొత్తగా నాకు ఇంకో శుభలేఖ వచ్చింది.ఇది కులాంతర, ప్రెమవివాహం అయినా, ఇరువైపులా పెద్దల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ క్రింది ఆహ్వాన పత్రాన్ని చూసి, అందులోని లింక్ ను అనుసరించితే, పెళ్లి వెబ్ సైట్ కు అది దారితీస్తుంది.మీ స్పీకర్ లో సరైన శబ్దంలో, సంగీతాన్ని ఆనందించండి. వెబ్ సైట్ లో,పెళ్లి వివరాలు, ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వగైరా చూడవచ్చు. వధూవరులకు మీ సందేశం పంపే సౌకర్యం కూడా వుంది. వధూ,వరులిద్దరూ బెంగళూరు లో Software Engineers గా పనిచేస్తున్నారు. మీ శుభాంక్షలు, ఈ ప్రేమజంటకు పంపవచ్చు.

నేను ఈ వివాహానికి, గుంటూరు వెళ్తున్నాను. గుంటూరు లో తెలుగు బ్లాగరులు, బ్లాగు అభిమానులు ఎవరైనా వుంటే నన్ను కలువవొచ్చు. నా సెల్ నంబరు:93973 48531

With new dreams,new hopes,new aspiration
and a desire to achieve new horizons
we are stepping into a new beginning of wedded life
Together with our parents
We
Sri Harsha
and
Ujwala
Cordially inviting you along with your family to our wedding




Click on image to enlarge

http://www.UjwalaWedsSriharsha.com

Put on Your Head phones please

Warm Regards,

Sriharsha & Ujwala

శనివారం, అక్టోబర్ 20, 2007

సాహితీవనం -12


పాతాళగంగ కు ఆకాశమార్గం, శ్రీశైలం Photo:cbrao

చివరి ప్రశ్నావళి

సాహితీవనం శీర్షికలో, ఇది చివరి ప్రశ్నావళి. సూర్యతేజ (Solarflare), తెలుగు వీర సూచనల ప్రకారం,పాఠకుల జవాబులు ప్రచురించబడవు.సరైన సమాధానాలు (key) తో మాత్రమే, పాఠకుల జవాబులు కలిసి ప్రచురించబడతాయి. పాఠకులను చివరి ప్రశ్నావళి లో ఉత్సాహంగా పాల్గొనకోరుతాను.

A) క్రికెట్ ఆస్ట్రేలియన్ కెప్టన్ రికీ పాంటింగ్ పై వచ్చిన “Inning with Panting" పుస్తకం ఖరీదు

1) Rs.2000/-
2) Rs.5000/-
3) Rs.8000/-
4) Rs.10, 000/-


B) పెళ్లైన కొత్తలో, సినిమాలో, అందరి మెప్పూ పొందిన, నటి ప్రియమణి నటించని చిత్రం.

1) ఎవరే అతగాడు
2) టాస్
3) భయ్యా
4) ఒక ఊరిలో

C) సుప్రసిద్ధ గాయని ఎమ్మెస్.సుబ్బలక్ష్మి గారి మాతృభాష
1) తెలుగు
2) తమిళ్
3) మలయాళం
4) కన్నడం

D) వీరు తెలంగాణ యాసలో వ్రాసిన కథలను విస్తృతంగా చదవటం వలన, తెలంగాణా భాష అంటే చాలామందికి వీరే గుర్తుకు వస్తారు.
1) అంపశయ్య నవీన్
2) పాకాల యశోదారెడ్డి
3) వాసిరెడ్డి నవీన్
4) కొండేపూడి నిర్మల

E) కె.వి.రెడ్డి, పింగళిల సమిష్టి కృషి, కళాఖండమైన మాయా బజార్ చిత్రం చూశారా? ఈ చిత్రం
1) పౌరాణికం
2) జానపదం
3) పింగళి మాయ
4) విష్ణు మాయ

F) తత్వమసి అంటే

1) దేవుడు నీలోనే ఉన్నాడు
2) బద్రీనాథ్ లో దొరికే పవిత్ర భస్మం
3) ఉపనిషత్‌లకు వక్రభాష్యం చెప్పటం
4) పైన చెప్పినవి ఏవీ కావు

G) నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో, రాజాలింగొ అంటూ S.P.శైలజ పాడిన, ప్రజాదరణ పొందిన పాట ఏ చిత్రం లోనిది?

1) యువతరం కదిలింది
2) ప్రజా శక్తి
3) ఎర్ర మల్లెలు
4) చలి చీమలు

H) ప్రొలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు?

1) ఎర్రాప్రెగడ
2) పోతన
3) తిక్కన
4) నన్నయ

I) ఎన్నో మధుర గీతాలున్న, జగ్గయ్య,కాంతారావు,గుమ్మడి ఇంకా క్రిష్ణకుమారి నటించిన కానిస్టేబుల్ కూతురు (1962) చిత్రానికి సంగీతం సమకూర్చినది

1) రమేష్ నాయుడు
2) ఆర్. గోవర్ధన్
3) సత్యం
4) ఆదినారాయణ రావు

J) “God of small things” నవలకు బూకర్ బహుమతి పొందిన, అరుంధతీ రాయ్ రాసిన “An ordinary person's guide to empire" అనే పుస్తకానికి ' సామ్రాజ్యం పై సమరం ' పేరుతో తెలుగులో అనువదించిన వారు

1) నాగసూరి వేణు గోపాల్
2) తెలకపల్లి రవి
3) రంగనాయకమ్మ
4) కొణతం దిలీప్


గుర్తుంచుకోండి - మీ సమాధానాలు కామెంట్స్ లో కనిపించవు. Key తో కలిసి ప్రచురించబడతాయి.

శుక్రవారం, అక్టోబర్ 19, 2007

సాహితీవనం -11


కూటి కోసం కోటి తిప్పలు, శ్రీశైలం Photo: cbrao


సాహితీవనం -9 లో మిగిలిన సాహితీవనం -7 ప్రశ్నలకు సమాధానాలు దిగువ ఇస్తున్నాను.

E) స్వర్గానికి నిచ్చెనలు రాసిన రచయిత

!) విశ్వనాధ సత్యనారాయణ
చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి శిష్యుడు. వీరు రాసిన వేయి పడగలను స్వర్గీయ పి.వి.నరసింహారావు గారు హిందీలోకి 'సహస్ర ఫణ్‌' పేర అనువదించారు. వీరు రాసిన ఏకవీర ఆధారంగా ఏకవీర చిత్రం వచ్చింది.

F) యాత్రాస్మృతి -స్వీయచరిత్ర రాసినది

2) దాశరధి కృష్ణమాచార్య
స్వాతంత్ర సమరయోధుడు, కవి దాశరధి గారి స్వీయ చరిత్ర ఇది.దాశరధి రంగాచార్య వీరి తమ్ముడు.గాలిబ్ గీతాలకు కృష్ణమాచార్య తెలుగు అనువాదానికి బాపు బొమ్మలు వేశారు.నిజాం రాజు అకృత్యాలను, కాళోజీతో చేతులుకలిపి ఎలుగెత్తి చాటారు.

G) నూరేళ్ల తెలుగు నవల పుస్తకం (వ్యాసాలు) రాసినది



1) సహవాసి
జె.ఉమా మహేశ్వర రావు (సహవాసి) ఎన్నొ అద్భుతమైన రచనలందించారు.వాటిలో పంచతంత్రం,రాజశేఖర చరిత్ర(కందుకూరి నవలకు నవీకరణ),అనువాదాలు ఏడు తరాలు, అమ్మ మొదలైనవి. మరణించే దాకా,పీకాక్ క్లాసిక్స్ తో కలిసి పని చేసి, అద్భుతమైన పుస్తకాలను తెలుగు వారికందించారు.
H) సావిత్రి, జమున, ఎన్.టి.రామారావు నటించిన మిస్సమ్మ చిత్రం చూశారా? ఈ చిత్రంలో సావిత్రి అసలు పేరు

4) మహా లక్ష్మి
1955లో విడుదలైన, ఒక అద్భుతమైన, పూర్తినిడివి హాస్య చిత్రం ఇది.ఈనాటికీ నూతనంగా ఉంటుంది.ఎన్ని సార్లైనా చూడవచ్చు.


I) బెంగళూరు విశ్వవిద్యాలయం వారు ఇటీవలనే వీరి సిద్ధాంత వ్యాసాన్ని (Ph.D కోసం) అమోదించి డాక్టరేట్ ప్రదానం చేశారు. వీరు పలు చిత్రాలలొ నటించారు.

2) జయమాల
కర్ణాటక లోని ఆల్మట్టీ డాం వలన నిర్వాసితులైన మహిళల, స్థితిగతుల పై చేసిన వీరి పరిశోధనకు డాక్టరేట్ లభించింది. శబరిమలై వెళ్లి స్వామిని పొరబాటుగా తాకినట్లు ప్రకటించి వార్తలలోకెక్కారు.

వివరాలకు చూడండి
http://www.koumudi.net/General/heroine_phd.html


J) హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే

చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి
చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
కేళి చలన్మణి కుండల మండిత గండయు గస్మిత సాలి
హరివిహముఘ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే
పి.సుశీల పాడిన ఈ పాట ఏ చిత్రం లోనిది?

2) తెనాలి రామకృష్ణ
ఎక్కువమంది అభిప్రాయపడినట్లు ఇది భక్త జయదేవ చిత్రంలోంచి కాదు. ఈ జయదేవుని అష్టపది తెనాలి రామక్రిష్ణ చిత్రం లోది. మధురమైన ఈ పాట చూడండి.పాటవింటూ మైమరుస్తారు.



ఇప్పుడు పాఠకుల స్పందన చూద్దాము. ప్రశ్నలైతే చాలామంది చూశారు కాని కొద్దిమంది మాత్రమే ధైర్యంగా సమాధానాలు పంపారు. ధన్యవాదాలు.సమాధానాలు పంపిన వారి పేర్లు, వారి స్కోర్ ఇవిగో.

1) గిరి 4
2) వికటకవి 5
3) సిరి 8
4) నేను సైతం 9

ప్రశ్నలు కఠినంగా ఉన్నా ఉత్తమసమాధానాలు పంపిన నేను సైతం, సిరి వీరిద్దరినీ దీప్తిధార అభినందిస్తున్నది;వీరతాడు వెస్తున్నది. హై!హై!!నాయకా.వీరిరువిరికీ, రసమయి మాసపత్రిక సంచిక దీప్తిధార నుంచి అందుతుంది.వారి చిరునామాలు,ఫోన్ నంబర్ వివరాలు cbraoin at gmail.com కు పంపవలసినదిగా మనవి.

బుధవారం, అక్టోబర్ 17, 2007

సాహితీవనం -10



రామా కనవేమిరా! శ్రీ రఘురామ కనవేమిరా!

సుషేణుడు వారధి కట్టినట్లు వ్రాసారు. సుషేణుడు సుగ్రీవునికి వైద్యుడని చదివానొకచోట (ఎంత వరకు నిజమో తెలియదు :-) )! వారధి కట్టినట్లున్న సమాచారం మీకెక్కడ లభ్యమైనదో చెప్పగలరా, దయచేసి? శ్రీదేవి తన ఉత్తరంలో, e-mail చిరునామా ఇవ్వలేదు.

వాల్మీకి రామాయణం యుద్ధకాండ లో, రామసేతు నిర్మాణం గురించిన వివరాలు వున్నాయి. లంక వెళ్లటానికి, అడ్డుగా ఉన్న సముద్రునిపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి రాముడు సిద్ధం కాగా, సముద్రుడు ప్రత్యక్షమై,రామునికి అభివందనం చేస్తూ అంటాడు

అయం సౌమ్యనలో నామ తనయో విశ్వకర్మణహః
పిత్రా దత్తవరః శ్రీమాన్ ప్రీతిమాన్ విశ్వకర్మణహః
ఏష సేతుం మహొత్సాహః కరోతు మయివానరహః
తమ హం ధారయిష్యామి యథాహ్యేష పితా తథా

ఓ! సౌమ్య రామా! నీ సైన్యంలోనే విశ్వకర్మ వరపుతృడైన నలుడున్నాడు.నా పై సేతువు నిర్మాణానికి నేను సహకరించెదను.ఇతని తండ్రివలే ఇతను కూడా నాకు ఇష్టుడు.నీవతని సేవలు వినియోగించుకొనుము.(యుద్ధ కాండ 22-45,46)

ఇతిహాసాలలో ప్రక్షిప్తాలు చాలా ఉంటాయి.మూలకవి రాసిన దాంట్లో, మధ్యన, కవులు, తమ సొంత కవిత్వాన్ని ఇరికించి ఉంచే రచనలను ప్రక్షిప్తాలంటారు. రామాయణ మహాభారతలలో ప్రక్షిప్తాలు కోకొల్లలు. ఇతిహాసాలలో ఎక్కడన్న వైరుధ్య విషయాలుంటే, దానికి ఈ ప్రక్షిప్తాలు కొంతవరకు కారణం అవుతాయి.

సుషేణుడు అంటే విష్ణువు, సుగ్రీవుని వైద్యుడు అనే రెండు అర్థాలు నిఘంటువులో కనిపిస్తాయి. వేదాలకు భాష్యం చెప్పిన దాశరధి రంగాచార్యులుగారు రామసేతు నిర్మాణం సుషేణుడనే వానర ఇంజనీర్ కావించాడని తమ అభిప్రాయం వెలిబుచ్చారు. రామాయణం అంతా చదివాక రాముడికి సీత ఏమవవుతుంది అనే విషయం పైనే ఇంతవరకూ ఏకాభిప్రాయం లేదు(చూడండి రాముడికి సీత ఏమవుతుంది? –ఆరుద్ర). రామసేతు ఎవరు కట్టారనే విషయం పై సందేహాలుండటం సహజమే మరి.

రామసేతు ఎవరు కట్టారు అనే విషయం పై చర్చ అయ్యాక,దీని గురించి ఇంకొన్ని విషయాలు కూడా చెప్పుకోవాలి మనం.
దశయోజన విస్తీర్ణం శతయోజనమాయతం
దదృశుర్దేవ గంధర్వాః నలసేతుం సుదుష్కరం
(యుద్ధకాండ 22-75)
10 యోజనాల వెడల్పు, 100 యోజనాల పొడవు వుంది; నలుడు కట్టిన ఈ సేతువు.దేవతలు, గంధర్వులేమిటి మనం కూడా ఆశ్చర్య పోవలసిందే ఈ కట్టడాన్ని చూస్తే. వాస్తవంలో భారతదేశానికి, లంకకు మధ్య వున్నది కేవలం 23 మైళ్లే కాని 800 మైళ్లు (100 యోజనాలు) కాదు. దీనికి రామభక్తులు రామసేతు కట్టినప్పుడు అంత దూరంలో ఉన్నవని వాదించవచ్చు.ఇది నమ్మకం మీద ఆధారపడి ఉంది.

భూగోళ శాస్త్ర రీత్యా, 10 కోట్ల సంవత్సరాల క్రితం, భారతదేశం, ఆస్ట్రేలియ ఇంకా దక్షిణ ఆఫ్రికా కలిసి వుండేవి. అంతే కాక మొదట లంక, భారతదేశంతో అవిభాజ్యంగా, కలిసే వుండేది.వెగ్నార్ ప్రతిపాదించిన,continental drift సిద్ధాంతం ప్రకారం, భూమి లోపలి రాతిపొరల (Plate tectonics) కదలిక వలన, ఖండాలు విడివడి. ఆ తదుపరి లంక, భారత్‌ల మధ్య ఖాళీ ఏర్పడింది. భూమి ఇప్పటి భౌతిక పరిస్థితికి ఇంకా ముందు, ఒక మండె అగ్నిగొళం లా వుండేది. అది చల్లబడి ఇప్పటి రూపానికొచ్చినా, భూమి లోపలి రాతిపొరల కింద ఇంకా ద్రవరూపం లోనే వుంది భూమి. ఈ ద్రవాల కదలికవలనే, ఖండాలు విడిపోయాయి.భూమి లోపలి కదలికలు,భూకంపాలు,జ్వాలముఖుల (volcanoes)విస్ఫొఠనాలు పర్వతాలకు,సముద్రంలో తేలే లావా రాళ్లకు కారణ భూతాలయ్యాయి. తేలే ఈ సున్నపు రాళ్లు, లావా రాళ్లే Adams bridge గా రూపాంతరం చెందాయి. ఈ విషయం పై మరిన్ని వివరాలకు చూడండి
http://en.wikipedia.org/wiki/Plate_tectonics

http://en.wikipedia.org/wiki/Adam%27s_Bridge

http://www.laputanlogic.com/articles/2002/11/03-83975630.html


కర్బన పరిశోధన కావిస్తే ఈ రాళ్లకు 10 కోట్ల సంవత్సరాల వయస్సు వుందో లేదో నిర్ధారితం కాగలదు.17లక్షల సంవత్సరాల క్రితం, రాముడు దీనిని కట్టివుండే అవకాశం లేదని శాస్త్రజ్ఞుల వాదన.

ఆశ్చర్యకరమైన సంగతేమంటే మదరాసు హైకోర్ట్ ఈ రామసేతును మానవ నిర్మిత కట్టడంగా గుర్తించింది. ప్రస్తుతం ఈ విషయం సుప్రీం కోర్ట్ పరిధిలో చర్చలో వుంది.

Further Reading:
1) నరావతారం - నండూరి రామమోహన రావు
2) The Blind Watchmaker: Why the Evidence of Evolution Reveals a Universe Without Design by Richard Dawkins
3) Why Darwin Matters: The Case Against Intelligent Design (Paperback)
by Michael Shermer (Author)
4) The scientific dating of the Ramayana & the Vedas -Dr Padmakar Vishnu Vartak

Discussions on the topic:
http://sodhana.blogspot.com/2007/05/blog-post_9061.html
http://churumuri.wordpress.com/2007/08/02/churmuri-poll-was-there-really-a-ram-sethu/

శనివారం, అక్టోబర్ 13, 2007

హిట్ల కోసం టపాలు


కృష్ణవేణికి భక్తితో సమర్పణకు, శ్రీశైలం పాతాళ గంగ వద్ద అమ్మకానికి వుంచిన పూలు Photo:cbrao

ప్రజా రంజకమైన విషయాలపై రాస్తే హిట్లు బాగా వస్తాయి. ఏ విషయాలపై రాస్తే ప్రజారంజకమౌతాయో, విహారి తమ “మీర్రాసిన టపా హిట్టా ఫట్టా �“ విశ్లేషణాత్మక వ్యాసం “లో విపులీకరించారు. బ్లాగరు తొలినాళ్లలో హిట్లకోసం వెంపర్లాడినా,తరువాత వాటిని పట్టించుకోక, విశ్వనాథ్ లా కళాత్మకంగా ఉండటం అభిలషణీయం. కామెంట్స్ వ్యామోహం నుంచి కూడా బయటపడటం కష్ట సాధ్యమైన విషయమే. తెలుగు వికిపెడియ కు మన మిత్రులు, నిజంగా చాలా కష్టపడి, అమూల్యమైన సమాచారాన్ని అందిస్తున్నారు.వీరంతా హిట్ల కోసం రాయటం లేదు.పేరుకోసం అసలే కాదు. వికీ లో వ్యాసకర్తలెవరో,పాఠకుడికి తెలియదు. తెలుగు పాఠకులకు కొత్త రచనలందించాలన్న తపనే, వీరిచేత రాయిస్తుంది. ఇది సామాజిక సేవా దృక్పధం కింద వస్తుంది.వీరందిరికీ నా వందనాలు. సంగీతంలో A.R.Rehman గొప్ప హిట్, నిస్సందేహంగా. కాని చరిత్రలో నిలిచే పాటలు కొద్ది మాత్రమే ఐతే,ఇళయ్ రాజా, కె.వి.మహాదేవన్, సి.ఆర్.సుబ్బరామన్,సుసర్ల, పెండ్యాల, రాజేశ్వరరావు వగైరా ప్రముఖులు స్వరపరచిన పాటలు సంగీతాభిమానుల మదిలో చిరస్మరణీయాలు. వీరి పాటలు కాల పరీక్షకు నిలిచే అణిముత్యాలు.

సాహితీ విషయాలపై గంభీరంగా టపాలు రాస్తే పాఠకులు కొంచెం దూరంగా వుంటారు.గంభీరంగా కాక, జనార్క్షణీయంగా కాక మధ్యస్తం గా రాస్తే, జటిలమైన విషయాలు కూడా పాఠకుడిని చేరతాయి.కొన్ని సాహిత్య విషయాల బ్లాగ్ టపాలకు, హిట్స్ రాకపోయినా, తరువాత చదివేవారి సమాచారం నిమిత్తం కొన్ని విషయాలు నేను నా బ్లాగులో రాస్తున్నాను. కర్ణాటక సంగీతకారిణి సౌమ్య పై నేను రాసిన టపా కొద్దిమందిని మాత్రమే ఆకర్షించగలిగింది. ఇవ్వాల్టి బ్లాగరులు మరో 15 సంవత్సరాల తరువాత ఈ టపా చూస్తే,అందులోని విషయాలు వారికి ఇష్టం కావచ్చు.ద్రాక్ష సార, శాస్త్రీయ సంగీతం వయస్సు పెరిగే కొలదీ మధురమౌతాయి.

హిట్స్ తో నిమిత్తం లేకుండా, తెలుగు వికిపిడియ వారి శోధన కు ఉపయోగపడే విధంగా,పుస్తక రూపం లొ వచ్చినా నిలవదగ్గ, టపాలు రాయాలని నా అకాంక్ష.నా రచనలలో, తెలుగు వికీ వారికి ఉపయోగపడేవి ఏవైనా,వారు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.

శుక్రవారం, అక్టోబర్ 12, 2007

సాహితీవనం -9



తెలుగులో లేఖా సాహిత్యం

వైజాగ్ నుంచి మిత్రులు కవికుమార్, సుంకర చలపతిరావు కు, వడ్డాది పాపయ్య, సంజీవదేవ్ రాసిన ఉత్తరారలను ' లేఖలు ' గా ప్రచురించిన పుస్తకాన్ని పంపారు.అది చూస్తుంటే ఉత్తరాలు గురించిన నా అనుభూతి, మిత్రులు చరసాల తన అంతరంగాలు బ్లాగులో, ఉత్తరాలు అనే వ్యాసం,December 12, 2006 న ప్రకటించినప్పుడు, చదివి, స్పందిస్తూ రాసిన విషయం గుర్తుకొచ్చింది.అప్పుడు నేను రాసాను "ఆంగ్లంలో , తెలుగులో, లేఖా సాహిత్యం కొన్ని కొత్త గవాక్షాలను తెరిచింది; జ్ఞాన ప్రపంచానికి. సంజీవదెవ్ లేఖలంటే నాకు ప్రాణం".

లేఖా సాహిత్యం ఆంగ్లంలో ఉన్నంతగా తెలుగులో లేదు. తండ్రి (జవహర్ లాల్) తనయ (ఇందిరా గాంధి) కు రాసిన ఉత్తరాలు జగత్‌ప్రసిద్ధం.జవహర్ జైలు గోడల మధ్య నుంచి రాసిన ఈ ఉత్తరాలు, ప్రపంచ నాగరికతను, చరిత్రను వివరిస్తాయి. ఇవి Two Alone, Two Together: Letters between Indira Gandhi and Jawaharlal Nehru 1922-64 గా పెంగ్విన్ వారు ప్రచురించారు.

కొడవటిగంటి కుటుంబరావు ఉత్తరాలు,శ్రీశ్రీ ఉత్తరాలు, చలం ఉత్తరాలు, సంజీవదేవ్ ఉత్తరాలు పుస్తక రూపం లో గతం లో వెలువడ్డాయి. ఇంకా మరుగున బడ్డ మాణిక్యాలెన్నో? వీటిలో ఎవరి శైలి వారిది. సంజీవదేవ్ ఉత్తరాలు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, ఎన్నో ఆసక్తికరమైన చర్చలతో నిండి ఉంటాయి. చాలామంది, నాతో కలుపుకుని, ఈ ఉత్తరాలు చదివాకే సంజీవదేవ్ కు ఉత్తరాలు రాయటం, వారి జవాబులకోసం నిరీక్షించటం జరిగాయి. దేవ్ తన ఉత్తరాలలో ఒక చిన్న కవితనో లేక తను వేసిన painting నో అదనంగా పంపే వారు. వాటిని మేము బోనస్ గా భావించేవారము. ఈ paintings, miniature landscapes అయి ఉండేవి. వీటిలో, తెలిసిన రూపాలను,అస్పష్ట రూపాలుగా చిత్రించే వారు. కొన్నింటిలో మానవాకారాలు సూచన ప్రాయంగా గోచరించేవి. సంజీవదేవ్ రసరేఖలు, రూపా రూపాలు, దీప్తిధార వగైరా వ్యాస సంకలనాలలో భారతీయ చిత్రకళ, శిల్ప కళ గురించి, కళాకారుల గురించి పరిచయ వ్యాసాలు రాస్తుండే వారు. చిత్రకళ, శిల్పకళల గురించి తెలుసుకోవటానికి అవి ఒక విజ్ఞాన ఖని.

‘ లేఖలు ' పుస్తకం లో వడ్డాది సంజీవదేవ్ పై వెలిబుచ్చిన అభిప్రాయాలు సత్య దూరమని, సంజీవదేవ్ గురించి ఎరిగినవారెవరైనా చెపుతారు. లలిత కళల పై సాధికారత ఉన్న సంజీవదేవ్ కు కళలు గురించి తెలియవని వడ్డాది అనటం విడ్డూరంగా ఉంది. (చూ. పజీలు 8,9 ఇంకా 10)
సంజీవదేవ్ ఉత్తరాలు, ఇంతవరకూ చదవని వారి కోసం, దేవ్ శైలి చూడటానికి, వారి ఉత్తరం లోంచి, ఒక పారాగ్రాఫు ఇస్తున్నాను.
“ ప్రస్తుతం ఏమీ వ్రాయటం లేదు.ఏమీ చిత్రించటం లేదు.ఎక్కడా ప్రసంగించటం లేదు.కొన్నాళ్లపాటు వీటన్నంటినీ చేయకపోవటం లో ఉంటుంది ఆనందం. ఏమైన చేయటం లో ఆనందం వున్నట్లే,ఏమీ చేయక పోవటంలో కూడా ఆనందం ఉంటుంది.ఆ చేయక పోవటం అనేది, చేయటానికి ఉత్సాహాన్నిస్తుంది.ఉల్లాసాన్నిస్తుంది.ఏమీ చేయకపోవటం అనేది the passive aspect of creativity అవుతుంది.అయితే, ఏదో ఒకటి చేయటానికి అలవాటయిన మనిషి ఎలా చేయకుండా వుండలేడు.ఏమీ చెయ్యకుండా వున్నప్పుడు కూడా ఎదో చేస్తున్న భ్రమలో, జీవిస్తాడు. భ్రమలన్నీ మంచివి కాకపోవచ్చు కాని కొన్ని భ్రమలు మాత్రం వాస్తవానికంటే,ఎక్కువ వాస్తవమేమో అనిపిస్తుంది. సరే, ఉంటాను.

మీ,
సంజీవ దేవ్ "

పుస్తకం వెల రూ.10/- మాత్రమే. ప్రతులకై

Smt Sunkara Jhansi Lakshmi,
Flat no: 201, R.R.Enclave,
Near Zinc Gate,Gajuvaka Post,
Visakhapatnam -26

సాహితీవనం -7 ప్రశ్నలకు సమాధానాలు దిగువ ఇస్తున్నాను.

A) సింధూ నది నాగరికతలో జన్మించిన,పాణిని 520–460 BC సంస్కృత భాషా పండితుడు. సంస్కృత భాషా వ్యాకరణాన్ని వివరిస్తూ అష్టాధ్యాయి అనే పుస్తకం రాసారు.అష్టాధ్యాయి అంటే

3) ఎనిమిది అధ్యాయాలు

B) అల్పజీవి నవల, ఆరు సారా కథలు, ఆరు సారో కథలు రాసిన ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాధ శాస్త్రి వృత్తి రీత్యా

4) న్యాయవాది

C) Romancing with Life స్వీయ చరిత్ర రాసిన వారు

2) దేవ్ ఆనంద్
దేవ్ ఆనంద్ తీసిన గైడ్ సినిమా, ఉత్తమ హిందీ చిత్రాలలో ఒకటి. R.K.Narayan రాసిన Guide ఆధారంగా ఈ చిత్రం తీశారు.దేవానంద్ ద్విపాత్రాభినయం చేసిన నలుపు - తెలుపు చిత్రం, హందోనో ను రంగులలోకి మార్చటానికి ప్రయత్నాలు జరుగుతున్నై.జీనత్ అమన్, టీనామునింలను తెరకు పరిచయం చేశారు. దర్శకుడు శేఖర్ కపూర్ కి మేన మామ ఇంకా చేతన్, విజయానంద్ లకు సోదరుడు. 1946 నుంచి 2005 దాక 110 చిత్రాలలో నటించారు.

D) భారతదేశము, శ్రీలంక ల మధ్య రామసేతు నిర్మాణం గావించిన కట్టడ నిపుణుడు

2) సుషేణుడు
రామసేతు నిర్మాణాన్ని నలుడు, సుషేణుదు అనే ఇద్దరు వానర ఇంజనీర్లు కావించారు. చారిత్రాత్మక ఆధారాలు అడగొద్దు. హిందువుల ఇతిహాసం, రామాయణం పై ఈ జవాబు ఆధారపడి ఉంది.

ఇంకా వుంది.

ఆదివారం, అక్టోబర్ 07, 2007

సాహితీవనం -8



పరుచూరి శ్రీనివాస్ గారు రసమయి లో రాసిన "1948 లో ప్రభాకరశాస్త్రిగారు తిరుమల ఆలయ ఆవరణలోని ఒక నేలమాళిగ లో నాలుగు శతాబ్దాల పైగా దాగివున్న తాళ్లపాక వాగ్గేయకారుల సంకీర్తనలు గల రాగిరేకులను గుర్తించి బైటికి తీయించి, దేవస్థానం చేత వాటిని ప్రచురింప చేశారు." విషయం పై తమ అభిప్రాయం వెలిబుచ్చుతూ, అన్నమాచార్య కృతుల రాగిరేకుల గురించి, 1815 ప్రాంతంలో, ఆ రాగిరేకులు, గుడి ప్రాంగణంలోనే వున్నట్లు మనకాధారాలున్నాయి అని తమ ఉత్తరంలో రాశారు. మరిన్ని వివరాలకు పాఠకులను కింద ఇచ్చిన లింక్, దాని అనుబంధ ప్రశ్నలు చూడ కోరుతాను.

http://groups.yahoo.com/group/racchabanda/message/17476

ఈ విషయమై పెక్కు వివాదాలున్న మాట వాస్తవమే. విషయ నిర్ధారణ కోసము మీ ఉత్తరాన్ని వెటూరి ఆనందమూర్తి గారికి పంపిస్తున్నాము. నవంబరు రసమయి లో తగు ప్రత్యుత్తరము ఉండగలదని ఆశిస్తున్నాము. అందులో విశేషాంశములు దీప్తిధార లో కూడా ప్రకటింపబడగలవు.

జులై 6 2007 న తెనాలిలో,తెలుగు రచయితలతో, ప్రధమ తెలుగు యునికోడ్ వర్క్ షాప్ నిర్వహించటానికి, తెలుగుభాషాబిమానుల సంఘం కార్యదర్శి సాయి లక్కరాజు గారు నాకు తోడ్పడినారు.వారి ఆధ్వర్యంలో వస్తున్న, శ్రీ స్వరలయ మాసపత్రిక అక్టోబర్ సంచిక వెలువడింది. ఇందులో మీ పిల్లలను మీరు ఎలా పెంచుతున్నారు అనే విషయం పై డా.దుగ్గరాజు శ్రీనివాసరావు, బెంగళూరిలోని, తెలుగు విజ్ఞాన సమితి విద్యాట్రస్ట్ చైర్మన్,ఏట్రియ,చాణ్యుక్య, కళింగ హోటళ్ల యజమాని ఐన చిన్నస్వామిరాజు పై ప్రత్యేక కథనం,డాక్టర్ యెల్లా వెంకటేశ్వర రావు పై వ్యాసం, చందమామ చిత్ర సమీక్ష,దసరా ప్రత్యేక వ్యాసం వగైరా కథనాలున్నాయి. శ్రీ స్వరలయ తాజా సంచికను ఇక్కడనుంచి ఉచితంగా download చేసుకోండి. http://www.swaralaya.net/swaralaya_oct_2007.zip

సాహితీవనం -5 ప్రశ్నలకు ఉత్తమ సమాధానాలిచ్చిన స్మైల్ గారికి అభినందనలు. ఆశ్చర్యకరంగా వీరొకరే సమాధానాలు పంపారు. అదీ తన బ్లాగులో, సమాధానాలతో పాటుగా వివరణ తో. ఇది చూసినవాళ్లు, ఇంక మేము సమాధానాలు పంపటానికి ఏముంది అని తలిచినట్లున్నారు. దానిని చూడని వారికోసం ఆ లింక్ దిగువన ఇస్తున్నాను. http://krishnadevarayalu.blogspot.com/2007/09/5.html
సాహితీవనం -5 ప్రశ్నలకు సమాధానాలు దిగువ ఇస్తున్నాను.

A) రష్యన్ సీత కథా సంపుటి రచయిత్రి

3) కందుకూరి వెంకట మహాలక్ష్మి
ఈ పుస్తకం గురించి ఇక్కడ చదవండి.
http://tinyurl.com/2ygdje ఈ పుస్తకం పేరు విచిత్రంగా ఉంది కదూ? ఈ పుస్తకానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?

B) "ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు" అని శ్రీశ్రీ రాసిన పాటకు ''ఏవి తల్లీ,నిరుడు మండిన ఎండుతాటాకుల్" అని పారొడి రాసిన కవి

4) ఆరుద్ర
స్వతంత్ర పత్రిక లో ఇది అచ్చయ్యింది. ఇంకా ఎన్నో అమూల్య రచనలు స్వతంత్ర లో ప్రచురితమయ్యాయి.

C) ఇది ఒక భక్తుడి, సాహితీకారుడి సమాధి

3) శ్రీత్యాగరాజ, తిరువాయూరు
1847 లో పరమపదించిన, వాగ్గేయకారుడు త్యాగరాజ సమాధి, తిరువాయూరు లో కావేరి నది ఒడ్డున ఆలనా, పాలనా లేకుంటే, దేవదాసి బెంగళూరు నాగరత్నమ్మ తన ఆస్తిని త్యాగరాజు సమాధి, ఆశ్రమం నిర్మాణానికి వినియోగించారు. త్యాగరాయ కృతులను సమాధి గోడలపై తెలుగులో చెక్కించి, సంగీత ప్రపంచానికి జనవరి25, 1925 న అంకితం చేశారు.నాగరత్నమ్మ సేవకు గుర్తుగా, ఆమె విగ్రహాన్ని, త్యాగరాజ మంటపానికి ఎదురుగా, ప్రతిష్టించారు.ఇప్పుడు ప్రతి సంవత్సరము అక్కడ, జనవరి,ఫెబ్రవరి మాసాలలో త్యాగరాజ ఉత్సవాలు సంగీతాభిమానులు, భక్తి శ్రద్ధలతో జరుపుతారు.


D) సుగాత్రి అంటే ఏమిటి?

2) మంచి శరీరం ఉన్నది
పెక్కుమంది దీని అర్థం మంచి గాత్రము గలది గా, తప్పుగా, అభిప్రాయ పడ్డారు.


E) కవి శేషెంద్ర శర్మ అభిమాన సంఘం

3) కవి సేన
1999 లో, కెంద్ర సాహిత్య అకాడమి బహుమతి గ్రహీత ఐన శేషేంద్ర శర్మ గారు, 1978 లో తన కవిసేన మానిఫెస్టో (ఆధునిక కావ్యశాస్త్ర) ను రచించారు. కవిత్వంపై ఒక గొప్ప విమర్శనా గ్రంధంగా ఇది పేరు పొందింది.

F) పంజరాన్ని నేనే, పక్షిని నెనే -కవితా సంపుటి రచయిత్రి

1) శిలాలోలిత
ఈ కవయిత్రి అసలు పేరు ' లక్ష్మి '.రేవతీదేవి రాసిన శిలాలోలిత అనే పుస్తక నామాన్నే,తన కలం పేరుగా స్వీకరించారు.

G) ఈ చిత్రం లో ఉన్నవారిని గుర్తించండి.

1) వెల్చేరు నారాయణ రావు
ఉత్తర అమెరికాలో,విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, మేడిసన్ లో తెలుగు సంస్కృతీచరిత్రలో ప్రధాన ఆచార్యుడిగా పనిచేస్తున్నారు.కొన్ని ప్రఖ్యాత తెలుగు రచనలను, ఆంగ్లంలోకి తర్జుమా చేశారు.


H) ఆలాపన రాసిన రచయిత

3) వి.ఎ.కె.రంగారావు
రంగారావు గారు గొప్ప సంగీతాభిమాని.ముళ్ళపూడి వెంకటరమణ మాటల్లో, "తినడం కోసం కాకుండా, వినడం కోసం బ్రతికే ఋషి". పెక్కు అరుదైన గ్రామఫోను రికార్డులు వీరు సేకరించారు. కొన్ని నాట్య ప్రదర్శనలిచ్చారు. కవి మల్లాది,సంగీతకారుడు సి.రామచంద్ర అభిమాని.చిక్కవరం జమీందారు, పలు పత్రికలలో సంగీతం పై క్రమంగా శీర్షికలు నిర్వహించారు.కృష్ణుడన్నా, కృష్ణతత్వం అన్నా మిక్కిలి ఇష్టం. పెక్కు గ్రామఫోన్ రెకార్డులకు sleeve notes రాసారు. ఆలాపన పేరుతో వార్త దిన పత్రికలో ఒక సంగీత శీర్షికను నిర్వహించారు. సినిమా, సంగీత విమర్శకుడిగా హైదరాబాదు వగైరా ప్రదేశాలలో ఉపన్యాసాలిచ్చారు.


I) చిత్రకారుడు, దర్శకుడు బాపు రూపొందించిన చీరలు ఈ చిత్రం లో వాడారు.

3) పెళ్లి పుస్తకం
రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రం లో చీరల రూపకల్పిగా నటించారు.


J) "మా నిజాం రాజు, జన్మ జన్మల బూజు" అని గర్జించిన రచయిత

2) దాశరధి కృష్ణమాచార్య
డాక్టర్ దాశరధి కవి, విమర్శకుడు, స్వాతంత్ర సమర యోధుడు.నిజామాబాద్ జైల్లో ఉండి " మా నిజాం రాజు, జన్మ,జన్మల బూజు " అని గర్జించాడు.

ఉత్తమ సమాధానాలిచ్చిన స్మైల్ గారికి దీప్తిధార వీరతాడు వేస్తున్నది. హై!హై! నాయకా.వీరికి రసమయి మాసపత్రిక సంచిక, దీప్తిధార అభినందనలతో అందగలదు.

గురువారం, అక్టోబర్ 04, 2007

సాహితీవనం -7

A) సింధూ నది నాగరికతలో జన్మించిన,పాణిని 520–460 BC సంస్కృత భాషా పండితుడు. సంస్కృత భాషా వ్యాకరణాన్ని వివరిస్తూ అష్టాధ్యాయి అనే పుస్తకం రాసారు.అష్టాధ్యాయి అంటే

1) ఎనిమిది దేవతలు
2) ఎనిమిది పండితులతో రాయబడినది
3) ఎనిమిది అధ్యాయాలు
4) ఎనిమదవ తరగతి నుంచి చదవ వలసినది

B) అల్పజీవి నవల, ఆరు సారా కథలు, ఆరు సారో కథలు రాసిన ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాధ శాస్త్రి వృత్తి రీత్యా

1) డాక్టర్
2) Bar Owner
3) అధ్యాపకుడు
4) న్యాయవాది


Gladiola flowers at my home Photo:cbrao

C) Romancing with Life స్వీయ చరిత్ర రాసిన వారు

1) సునీల్ దత్
2) దేవ్ ఆనంద్
3) రాజ్ కపూర్
4) గురు దత్

D) భారతదేశము, శ్రీలంక ల మధ్య రామసేతు నిర్మాణం గావించిన ఇద్దరు కట్టడ నిపుణుల లో ఒకరు

1) విభీషణుడు
2) సుషేణుడు
3) హనుమంతుడు
4) సుగ్రీవ

E) స్వర్గానికి నిచ్చెనలు రాసిన రచయిత

!) విశ్వనాధ సత్యనారాయణ
2) చలం
3) దేవులపల్లి
4) కట్టమంచి రామలింగా రెడ్డి

F) యాత్రాస్మృతి -స్వీయచరిత్ర రాసినది

!) కందుకూరి వీరేశలింగం
2) దాశరధి కృష్ణమాచార్య
3) చిలకమర్తి లక్ష్మినరసింహం
4) టంగుటూరి ప్రకాశం

G) నూరేళ్ల తెలుగు నవల పుస్తకం (వ్యాసాలు) రాసినది

1) సహవాసి
2) డి.వెంకట్రామయ్య
3) వల్లంపాటి వెంకట సుబ్బయ్య
4) పెద్దిభొట్ల సుబ్బరామయ్య

H) సావిత్రి, జమున, ఎన్.టి.రామారావు నటించిన మిస్సమ్మ చిత్రం చూశారా? ఈ చిత్రంలో, మేరీ గా నటించిన, సావిత్రి పాత్ర అసలు పేరు

1) కమల
2) కనక లక్ష్మి
3) వెంకట లక్ష్మి
4) మహా లక్ష్మి

I) బెంగళూరు విశ్వవిద్యాలయం వారు ఇటీవలనే వీరి సిద్ధాంత వ్యాసాన్ని (Ph.D కోసం) అమోదించి డాక్టరేట్ ప్రదానం చేశారు. వీరు పలు చిత్రాలలొ నటించారు.

1) మోహన్ బాబు
2) జయమాల
3) సుమలత
4) జయంతి

J) హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే

చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
కేళి చలన్మని కుండల మండిత గండయు గస్మిత సాలి
హరివిహముఘ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే

పి.సుశీల పాడిన ఈ పాట ఏ చిత్రం లోనిది?

1) భక్త జయదేవ
2) తెనాలి రామకృష్ణ
3) విప్రనారాయణ
4) మహాకవి కాళిదాసు

షరా మాములే! మీ జవాబులు దీప్తిధారకు ఎప్పటిలాగే పంపండి.

బుధవారం, అక్టోబర్ 03, 2007

సాహితీవనం -6


Click on photo to enlarge.

కొత్తపాళిగారు, తమ ఉత్తరంలో " టైటిలు మీరు వనం 2, 3, 4 అని పెడుతూ పోతే కొత్త క్విజ్జులు పెట్టారేమో అని ఆత్రంగా చూసి ప్రతిసారీ నిరాశ పొందాను ", అని రాస్తున్నారు.సాహితీవనం ఉద్దేశాలు తెలుపటానికి ఇది సరైన సమయమని తలుస్తాను. నేటి యువతరంలో పఠనాసక్తి తగ్గి పోతుంది. ప్రశ్నల సాకుతో,పాత, కొత్త పుస్తకాలపై, సాహితీ విషయాలపై , యువతరం దృష్టిని ఆకర్షించాలని చేసిన కుతంత్రమే, ఈ సాహితీవనం. ఇక్కడ,ప్రశ్నలు, జవాబుల కోసం కాకుండా, జవాబుల కోసం ప్రశ్నలు ఉంటాయి. దానర్ధం, జవాబుల రూపంలో, ఆసక్తికరమైన సాహితీ విషయాలు చర్చించటం. ఇంకోలా చెప్పాలి అంటే,ఒక ప్రశ్నకు జవాబు వెనుక కథ చెప్పటం. ఇందులో పెక్కు విషయాలు, ఇప్పటివారికి తెలియనివి కూడా వుంటాయి. కేవలం ప్రశ్నలు, జవాబులు అంటే, సాహితీవనం ఒక పరీక్షాకేంద్రంగా మిగిలిపోయే ప్రమాదముంది.పాఠకులు పరీక్షలు రాసే విధ్యార్థులు కారు. దీప్తిధార పాఠకులు విజ్ఞులు . నాకు తెలిసిన విషయాలు వారికి చెప్పే ఈ విధానంలో, నాకు తెలియని విషయాలను పాఠకులూ చెప్తున్నారు. ఈ ప్రక్రియ, ఇరువురికీ లాభదాయకమని తలంపు.

కొత్తపాళి గారు ఇంకో ఉత్తరంలో సాహితీవనం -5 ప్రశ్నలకు స్పందిస్తూ, ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి అన్నారు. ఇది వాస్తవమే.సాహితీవనం -1(Set I) ప్రశ్నలకు జవాబులు,త్వర త్వరగా వస్తుంటే,ప్రశ్నలు సులభంగా ఉన్నాయని తలచి, (Set II లో) కొంచం కష్టమైన ప్రశ్నలు ఉంచాను. నా అంచనాలను తలకిందులు చేస్తూ, స్మైల్ (http://krishnadevarayalu.blogspot.com/2007/09/5.html) వాయువేగంతో జవాబులు పంపారు. నేను కఠినమనుకున్న ప్రశ్నలకు గూగుల్ అన్వేషణ యంత్ర సహాయం తో , సులభంగా జవాబిచ్చి, నన్ను ఆశ్చర్యం లో ముంచేసారు.ప్రశ్నలు రాసే సమయంలో, పాఠకుడు గూగుల్ వాడవచ్చన్న ఆలోచన నాకు తట్ట లేదు. కొత్తపాళీగారికీ తట్టి ఉండదు. Hats off to Google.

రసమయి

ఒక మంచి అభిరుచి గల పత్రికను మీకు పరిచయం చేయటానికి సంతోషిస్తున్నాను. ఈ పత్రిక పేరు రసమయి. నెల నెలా వస్తుంది. సంపాదకులు నండూరి పార్థసారథి. వీరు గతంలో ఆంధ్ర ప్రభ దిన, వార పత్రికలలో పని చేశారు.Journalist గా, రచయితగా వీరికున్న అనుభవం ఈ పత్రికను ఉత్తమ అభిరుచిగల పత్రికగా తీర్చి దిద్దింది.నేను గతంలో తెలుగు బ్లాగులో రాసినట్లు వీరు ఎంకిపాటల, నండూరి సుబ్బారావు గారి కుమారుడు కాదు. విశ్వరూపం, నరావతారం రచనలు,రాజు - పేద, టామ్‌సాయర్ వగైరా అనువాదాలు చేసిన నండూరి రామమోహనరావు గారి తమ్ముడు.


Nanduri Partha Sarathi Photo:cbrao

నంపాసా (నండూరి పార్థసారథి గారు) మంచి హాస్య రచయిత. సాహిత్య హింసావలోకనం, పిబరే హ్యుమరసం వగైరా పుస్తకాలు వీరివే. సంగీతం అంటే ప్రాణం. గ్రాంఫోన్ రికార్డులు 78 rpm, 33 1/3 వేగం గల రెకార్డులు వీరి వద్ద చాలా వున్నాయి.ఇప్పటికీ ఇంకా సేకరిస్తూనే వున్నారు. సంగీతం, సాహిత్యం, వాఙ్మయాలు,కవితలు,ప్రబంధాలు, చిత్రలేఖనం, శిల్పం,నాట్యం,సినీ పాటలు, సినిమాలు వగైరా అన్ని విషాయలపై వీరికి అవగాహన ఉంది.అందుకే రసమయిలో మనకు ఇన్ని వైవివిధ్యమైన విషయాలపై వ్యాసాలు గోచరిస్తాయి. రసమయి ప్రతి ఒక్క సంచికా collectors issue లా రూపొందిస్తారు.

ప్రతి సంచిక లో ఎదో ఒక విషయం పై ప్రత్యేక కేంద్రీకరణ (focus) ఉంటుంది.ఉదాహరణకు సెప్టెంబర్ 2007 నెల లో, దృష్టి, వేటూరి ప్రభాకర శాస్త్రి ఇంకా వారి కుమారుడు వేటూరి ఆనంద మూర్తి గార్ల పరిశోధనలు, రచనలపై ఉంది. 1948 లో ప్రభాకరశాస్త్రిగారు తిరుమల ఆలయ ఆవరణలోని ఒక నేలమాళిగ లో నాలుగు శతాబ్దాల పైగా దాగివున్న తాళ్లపాక వాగ్గేయకారుల సంకీర్తనలు గల రాగిరేకులను గుర్తించి బైటికి తీయించి, దేవస్థానం చేత వాటిని ప్రచురింప చేశారు.1949 ప్రాంతంలో ప్రభాకర శాస్త్రి గారు, ఆయన శిష్యుడు అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులవారు తాళ్లపాక కవుల సాహిత్య పరిశోధన సాగిస్తున్న తరుణంలోనే తిరుమల ఆలయ చంపక ప్రదక్షిణ ప్రాకారం వద్ద స్వరసహితంగా కొన్ని వాగ్గేయ రచనలు చెక్కిఉన్న రెండు పెద్ద రాతిబండలు వారి దృష్టికి వచ్చాయి. ఆ రచనలు తాళ్లపాక వారివిగా శాస్త్రి గారు గుర్తించారు. వాటిని పరిశీలించి, పరిష్కరించి ప్రకటించగలమని ఆయన చెప్పారు. కాని కొద్దికాలానికే దివంగతులు కావడంతో ఆ పని ముందుకు సాగలేదు.ఆయన తనయుడైన ఆనందమూర్తిగారి పూనికతో ఆ పని పూర్తయ్యింది. ఆసక్తికరమైన పెక్కు విశేషాలతో కూడిన, వీరి పరిశోధన వివరాలు ఈ సంచికలో చూడగలరు.

ఇంకా గుంటూరు శేషేంద్ర శర్మ రచనలపై కోవెల సంపత్కుమారాచార్య విశ్లేషణ, అరవిందుల సావిత్రి పై యజ్ఞన్న,హిందీ కవి ప్రదీప్ పై జానమద్ది హనుమచ్చాస్త్రి , షకీల్-నౌషాద్ క్లాసిక్స్ పై కస్తూరి మురళీ కృష్ణ వగైరా రచనలున్నాయి. ఇంకా బాలలకై కొన్ని ప్రత్యేక పేజీలున్నాయి.

షడ్రుచులతో కూడిన ఇలాంటి పత్రిక తెలుగు లో మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు. అక్టొబర్ '07 సంచికతో 8 వ సంవత్సరం లోకి, అడుగుపెడుతున్నది. ఈ పత్రిక పాత సంచికలు కూడా చదవతగ్గ అణిముత్యాలే. వాటి వివరాలు ఇక్కడ చూడండి.
http://rasamayi.com/50915/50157.html#issue

ఈ పత్రిక హైదరాబాదు లో విశాలాంధ్ర,నవయుగ,నవోదయ,గోపాల్ పబ్లికేషన్స్,తెలుగు బుక్ హౌస్ విక్రయశాలల లో మాత్రమే లభ్యమవుతుంది.బయటింకెక్కడా కానరాదు. ఆసక్తిగలవారు
చందాదారులవటమే ఉత్తమ మార్గంలా కనిపిస్తుంది.

విడి ప్రతి రూ.30/- వార్షిక చందా రూ.300/-

చిరునామా:

Rasamayi,
Nanduri Publications,
A-21, Journalist colony,
Jubilee Hills,
Hyderabad- 500 033

అమెరికాలో వార్షిక చందా $40/- సంప్రదించవలసిన చిరునామా:
డాక్టర్ మధుసారధి నండూరి
madhu@nanduri.com

తెలుగుబ్లాగు చరిత్ర -2



ఈ విషయంపై, నా మొదటి టపా చదవని వారు దానిని ఇక్కడ http://deeptidhaara.blogspot.com/2007/05/blog-post_21.html చదవవొచ్చు.మీకు తెలుసా,ఘనత వహించిన బ్రిటీష్ రాజ్యానికి లిఖిత రాజ్యాంగం లేదని? తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరో? తాజ్‌మహల్ మార్పు చెందిన ఒక హిందూ కట్టడమని? తిరుమల(తిరుపతి) 250 కోట్ల సంవత్సరాల క్రితం నీళ్లలో ఉండేదని? సముద్రంలో పెరిగే మొక్కలు కొన్ని, తిరుమల కొండల పై పెరుగుతున్నాయని? తిరుమల కొండపై గల ఈ మొక్కలు అక్కడ ఎలా వచ్చాయంటే, ఆ ప్రాంతం ఒకప్పుడు సముద్ర గర్భంలో ఉండేదన్న చరిత్ర తెలియక పోతే, ఎలా బదులివ్వగలరు?
1493 లో ఉత్తర అమెరికా లో కాలిడిన క్రిస్టాఫర్ కొలొంబస్ తరువాతే అమెరికా చరిత్ర మొదలయ్యింది. అంతకు క్రితం అక్కడే ఉంటున్న తెగలవారిని కొలొంబస్ ఇండియన్స్ గా భావించాడు. అమెరికానే హిందూ దేశం గా కొలొంబస్ పొరబడటం వలన అమెరికా లో తెగలవారు ఇండియన్స్ గా గుర్తించబడ్డారు. కొలొంబస్ ముందు అమెరికా చరిత్ర అతి కొద్దిగా నమోదయ్యింది. ఈ 500 సంవత్సరాలు గానే అమెరికా చరిత్ర ఉంది. ఈ నేపధ్యంలో ఈ మధ్యనే మొదలయిన,చారిత్రాత్మక విషయాలను మనకు వివరించే ఈ తెలుగు బ్లాగు చూడండి.
http://theuntoldhistory.blogspot.com/

చరిత్ర ఒక సారి రాస్తే అయ్యేది కాదు. ఇది నిరంతరం రూపాంతరం చెందుతూనే ఉంటుంది.దీనికి భారత దేశ చరిత్రే ఒక ఉదాహరణ.స్వాతంత్ర్యం వచ్చిందాకా భారత దేశ చరిత్ర రాస్తే సరిపోతుందా? ఆ తరువాత చరిత్ర లేదా? తెలుగు బ్లాగుల చరిత్ర ఇప్పటి దాకా ఉన్నది సరిపోతుందా? తెలుగుబ్లాగు మొదట ఉన్నట్లుగానే ఇప్పుడు ఉందా? భవిష్యత్ లో కూడా ఇలాగే ఉంటుందా? మనం ఊహించే దానికన్నా తలదన్నే మార్పులు వస్తాయి. ఈ చరిత్ర మనం పదిలం గా సంరక్షించు కోపోతే, చరిత్ర హీనులము కామా?
తెలుగుబ్లాగు చరిత్ర విషయాలకై మీకు
1)కొత్త గుంపు కావాలా?
2) చరిత్ర లేకపోతే, తరువాత వారికి మన బ్లాగు చరిత్ర ఎలా తెలుస్తోంది? తెలుగు బ్లాగు గుంపు లోనే ఈ విషయాలు నమోదు చేద్దాము.
3) ఈ చరిత్ర వలన ఏమిటి ఉపయోగం? తెలుగు బ్లాగు గుంపులో రాయవద్దు. ఇంకెక్కడా అవసరం లేదు.
4) కొత్త బ్లాగు ప్రారంభించి, అందులో తెలుగు బ్లాగుల చరిత్ర రాద్దాము.

మీ అభిప్రాయాలు తెలియ చేయండి.