గురువారం, ఫిబ్రవరి 23, 2012

ఆంధ్రప్రశస్తి: విశ్వనాధ సత్యనారాయణ

ఈ చిన్ని పొత్తములో, పలువురు ఆంధ్రుల గురించిన కీర్తి చంద్రికలు, ఘనకార్యాలు పద్యావళి రూపంలో వివరించబడ్డాయి. ఇందులో శ్రీకాకుళం రాజధానిగా ఆంధ్రదేశమును పాలించిన ఆంధ్ర మహావిష్ణువుగురించిన ప్రధమ పద్యో ప్రశస్తి ఉన్నది. ఈ రాజు పేరుపై ఆంధ్రదేశమునుకు ఆ పేరొచ్చెను. ఇంకా, చక్రవర్తి శాతవాహనుడు, గౌతమి పుత్ర శాతకర్ణి, పల్లవ రాజు మాధవ వర్మ, వేగి క్షేత్రము, గంజాం మండలం (ఒరిస్సా) లోని మహాక్షేత్రమైన ముఖలింగము, కవి నన్నయ భట్టు, క్రీ.శ.1140 వ వాడైన ప్రోలరాజు,  కొండవీడు, పల్నాటి చరిత్రలోని చంద్రవంక యుద్ధము, అళియ రామరాయల కళ్యాణిదుర్గ ముట్టడి గురించి పద్యావళి ఉన్నవి.
గొట్టుపదములు కొన్నింటికి అక్కడక్కడా అధోజ్ఞాపిక (footnote) లో వివరణలు ఇవ్వబడ్డాయి. అయినా సామాన్య పాఠకుడుకి ఈ పద్యాలు సులభ గ్రాహ్యం కావు.

ఆంధ్రప్రశస్తి నుండి  గోదావరీ పావనోదార…  

గోదావరీ పావనోదార వాఃపూర
మఖిల భారతము మాదన్ననాడు
తుంగభద్రా సముత్తుంగరావము తోడ
కవుల గానము శ్రుతిగలుపు నాడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ
శ్రేణిలో తెన్గు వాసించునాడు
కృష్ణా తరంగ నిర్ణిద్ర గానముతోడ
శిల్పము తొలిపూజ సేయునాడు

అక్షరజ్ఞానమెఱుగదో యాంధ్రజాతి?
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుబాట పిచ్చుక గూళ్ళు కట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు

(పద్యం.నెట్ సౌజన్యంతో  ఈ కవిత ఇవ్వబడినది)

2006 సంవత్సరములో ఈ పుస్తకాన్ని సుందరయ్య విజ్ఞానకేంద్రం వారు డిజిటైజ్ చేసారు. ఆసక్తికలవారు ఇక్కడనుంచి దిగుమతి చేసుకోవచ్చును.

ప్రచురణ:
ప్రధమ ముద్రణ: చెన్నపురి, కేసరి ముద్రాక్షరశాల - 1928

నవమ ముద్రణము: 2003
ముఖచిత్రం: అడవి బాపిరాజు
వెల: 30 రూపాయలు
Viswanadha Publications.Viswanadhapuram, Marutinagar, Vijayawada -520 004

Further listening: విశ్వనాధవారి గళంలో కిన్నెరసాని పాట ఇక్కడ వినండి. 

Further reading:  నేనెఱిగిన విశ్వనాథ 

1 కామెంట్‌:

కాశి రాజు చెప్పారు...

భాస్కర్ రావు గారూ మంచి వివరాలు అందించారు ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి