శనివారం, జనవరి 31, 2009

స్పందన -4


An exhibit before a shop in Mendocino, North California Photo:cbrao

కన్నడ పుస్తకం పర్వ సమీక్ష

"ఆధునిక హేతువాద దృక్పధంతో మహాభారతాన్ని చదువుతుంటే ఉదయించే అనేకానేక ప్రశ్నలకు సంపూర్ణంగా సమాధానం ఇవ్వకపోయినా ఒక అంగీకారాత్మక కోణాన్ని ముందుకు తీసుకురావడంలో ఈ నవల సఫలమయ్యిందని చెప్పొచ్చు. " -మంచి విషయ వస్తువును ఎన్నుకున్న పుస్తకమే ఇది. హేతువాద దృక్పధంలో రచయిత ఎస్.ఎల్.భైరప్ప ఇచ్చిన అనేక సమాధానాలలో ఒక్కటైనా మచ్చుకి ఇచ్చిఉంటే పుస్తక స్వరూప, స్వభావాల నాణ్యత పాఠకులికి తెలిసిఉండేది. సాహిత్య అకాడెమీ వారే ఈ నవల ధర రూ. 250/- పెడ్తే ఎలా? ఇది కొనే ఆసక్తిని తగ్గిస్తుంది. అనువాద పుస్తకపు ముఖచిత్రాన్ని ప్రచురించిఉండాల్సింది, కానడ పుస్త ముఖ చిత్రం కాక. తెలుగు ముఖ చిత్రం ఇది మనది అనే అనుభూతుని కలుగచేస్తుంది. ఒక విభిన్నమైన పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

http://parnashaala.blogspot.com/2009/01/blog-post_14.html



~~ కలకాలమొకటిగా ~~

అందరికీ కలలొస్తాయి. కలలో నిత్యం మనము ఆలోచించే లేక అభిలషించే విషయాలే గోచరమవుతాయి. కలకు అక్షర రూపమివ్వటంలో మీ ప్రయోగం సఫలం. మీ కలల రాణి ని కూడా ఇలాగే పరిచయం చేయ కోరుతాను.

http://mynoice.blogspot.com/2009/01/blog-post_15.html



అమృతం కురిసిన రాత్రి

తొలుత మీ కధనాన్నే ఒక కథగా తలిచా. కథలో కథ అనుకుంటూ చదివా. చక్కటి కథను అలవొకగా పరిచయం చేశారు. మీ శైలి మీ టపాను తుదికంటా చదివేలా చేసింది. ఆ కథా రచయిత పేరు, సంచిక తేదీ ఇవ్వగలరు.

http://virajajulu.mywebdunia.com/2009/01/15/1232025720000.html


బ్లాగు విలాప కావ్యం…

అవును, ఈ మధ్య ఒకదాని తరువాత ఒకటిగా బ్లాగులు మూత పడటం విచారకరం. ఇలా బ్లాగుహత్యలు చేసుకునేవారికై, తక్షణమే ఒక సహాయ కేంద్రము నెలకొల్పవలసిన అవసరం ఉంది. బ్లాగు విలాపము ఈ ఆలోచన కలిగించుటలో సఫలమైనది.

http://uniqcyberzone.com/svennela/?p=120


ఎవరికి తెలియని కథలివిలే!

దేవుడా లేక బ్లాక్ మైలరా అనిపిస్తుంది ఆ కథలు వింటుంటే.

http://manishi-manasulomaata.blogspot.com/2009/01/blog-post.html


Stray Thoughts

"If you have no story to tell, that only means you have no meaning left in life అనిపిస్తుంది. " - బ్లాగటం సరే! ఆ బ్లాగే సమయం ఒక కొత్త పుస్తకం చదువుకుంటానికో, మంచి సంగీతం వినటానికో వినియోగించి ఆ క్షణాలను మనవి గా చేసుకుని -ఆనందిస్తే. కెనడా, అమెరికాల లో ఎన్నో ప్రదేశాలు చూశా. చూస్తున్నా. ఈ సమయంలో బ్లాగు రాయలేకపోయానన్న విచారం లేదు. ఇది స్వార్థమా?

బ్లాగు తలుపులు మూసివేసి కొందరికే ఆహ్వానం పంపే కొత్త దశకు చేరింది బ్లాగ్లోకం. ఇంకొన్నాళ్లకు ఫలానావారు బ్లాగు మూసివేత ప్రకటన ఇస్తే ఆశ్చర్య పోయేవాళ్లు తక్కువయితే-దానికి ఏమిటనర్ధం? మనం మరికొన్ని కాగడాలు, దివిటీలు, టార్చ్ లైట్ బ్లాగులకు అలవాటు కూడా పడతామేమో!

http://parnashaala.blogspot.com/2009/01/blog-post_25.html


టెనిస్ చూడ్డం ఓ తమాషా

"మొదటిది ఏస్ కొట్టినప్పుడు అది అయాచితంగా, ఆనాలోచితంగా జరుగుతుందా? లేక వ్యూహరచనలో భాగంగా ఏసులేస్తారా? " -టెనిస్ అంటే ఎంతో గ్లామర్, డబ్బు, పేరు ఇంకా ప్రతిష్ట. పేరొచ్చాక లింకా తాగుతూ కనిపిస్తూ కూడా డబ్బు చేసుకోవటం టెనిస్ తారలకు అతి సులభం. మరి ఇంత పేరు రావాలంటే ఆట గెలవాలి కదా. టెనిస్ లో ఏసులు, క్రికెట్ లో కాచ్లు (Catches win the matches) ఆటను గెలిపిస్తాయి. నిస్సందేహంగా ఏసులు ఆట గెలిచే వ్యూహంలో భాగమే. మీ వ్యాసంలో లేని విషయమైన టెనిస్ తారల దుస్తుల గురించి మీరు మరొక ప్రత్యేక వ్యాసం రాయవలసిన అంశం.

http://tethulika.wordpress.com/2009/01/25/%e0%b0%8a%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b1%8b%e0%b0%95-%e0%b0%9f%e0%b1%86%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%82-%e0%b0%93-%e0%b0%a4%e0%b0%ae/

గురువారం, జనవరి 29, 2009

స్పందన -3



Scenic Pacific Coast on the way to Mendocino, North California Photo: cbrao

సెగలు - పొగలు

టపా చల్లగా - వ్యాఖ్యలు వేడిగా, మునుపటివలెనే, మజా మజాగా. అబ్రకదబ్రా now rejoice.

http://parnashaala.blogspot.com/2008/12/e.html


పుస్తక ప్రేమికులకోసం

మంచి ప్రయత్నం. సినిమాలకు నవతరంగం, పుస్తకాలకు పుస్తకం బాగున్నాయి. కొద్ది కాలంలోనే ఇది ప్రాచుర్యం పొందాలని, తెలుగు వారికి దూరమైన పుస్తక పఠన అలవాటు, పుస్తకం సైట్ ద్వారా మరలా వెల్లివిరియాలని అభిలాష. ఇందుకు కాను interactive గా ఉండే గుణాలుకల కొత్త రూపురేఖలను ప్రవేశ పెట్టాలి. పాఠకులను సైట్ లో భాగస్వాములను చెయ్యాలి.

పుస్తకాలకు సంభందించిన సమాచారం తో నింపాలనుకుంటున్న, ఈ పుస్తక సమాచార భాండాగారంలో, ఇదివరలో వెలువడ్డ కొన్ని ఉత్తమ పుస్తక సమీక్షలు మరలా ప్రచురిస్తారా? లేక సరికొత్త వ్యాసాలు ఎక్కడా ప్రచురించబడనివి మాత్రమే ఇందులో చేరుస్తారా అనే విషయంలో స్పష్టత కావాలి.

ఈ ప్రయత్నం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను.

http://pustakam.net/?page_id=2


కొత్త సంవత్సర సంకల్పాలు

మీకు చాలా ఇష్టమయిన వస్తువు రాయటమయితే అది కాశీలో గంగా స్నానమాచరిస్తూ వదిలి రావాలన్నమాట.ఇవన్నీ పిచ్చి నమ్మకాలు.

అందుకోండి నూతన సంవత్సర శుభాకాంషలు.

http://tethulika.wordpress.com/2008/12/31/%e0%b0%8a%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b1%8b%e0%b0%95-%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b-%e0%b0%af%e0%b1%87%e0%b0%a1%e0%b1%82-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0/


Happy New Year

మిత్రులు కలుసుకొని సరదాగా గడపటానికి ఇది ఒక వంక; అంతే, కాలెండర్లో మరో కొత్త రోజు వస్తుంది. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంషలు.

http://kasturimuralikrishna.wordpress.com/2008/12/31/హాపీ-న్యూ-ఇయర్-టు-ఆల్

"సొగసు చూడ తరమా!!!"

ఇది నిజకథా లేక కల్పితమా? కల్పితమైతే కథ బాగుంది కాని కథా ప్రయోజనమేమిటి? చదువు కంటే పెళ్లి ముఖ్యమనే సందేశం ఇచ్చినట్లు కదూ? దురద్రుష్ట వశాత్తు మన కథా నాయకుడు ఏ ప్రమాదంలోనో చిక్కుకుంటే, నాయిక తన కాళ్లపై నిలబడటానికి కావలసినంత చదువుకోవద్దా?

కొత్త నేస్తానికి నూతన సంవత్సర శుభాకాంషలు.

cbrao
San Jose, CA

http://jaajipoolu.blogspot.com/2008/12/blog-post_30.html


తెలుగు బ్లాగుల ప్రస్థానం

శ్రీపద్మ కస్తూరి బ్లాగులో టపాలేవీ ఇంకా ప్రచురించలేదు. ఇలాంటి వాటిగురించిన ప్రస్తావన అనవసరమేమో! వర్గాల వారీగా బ్లాగు సమీక్షల విభజనలో కొత్త వర్గంగా పుస్తకాలు చేర్చటం అభిలషణీయం. పుస్తకం హస్తభూషణం అన్నారు కదా.

2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం - సమీక్ష ఉపయోగకరంగా ఉంది.

http://poddu.net/?p=1576


రచనలపై హక్కులు

ఏ వెబ్ పత్రికలు రచనలపై సర్వహక్కులూ తమవని చెప్తున్నాయి? ఆ పేర్లు వెల్లడించండి. మిగతా రచయితలు అలాంటి పత్రికలకు ఉత్తరాల ద్వారా తమ అసమ్మతి తెలియచేయవచ్చు. 60 ఏళ్ల పై బడ్డ రచనలకు కాపీరైట్ ఉంటుందా! పరుచూరి గారు ఈ విషయమై భారతీయ చట్టమేమంటుంది?

http://tethulika.wordpress.com/2008/12/22/ఊసుపోక-"కలం-బలం"-అంటే-నవ్


Bold theme

తొలికథలోనే ఇంత bold theme తో రాయటం కొంత ఆశ్చర్యం కలుగచేసింది. స్త్రీలు రాసే కథా వస్తువులో సెక్స్ పాత్ర గతంలో లత, వోల్గా కథలలో ఎప్పుడో చదివాను. ఈ కాలం రచయిత్రులెందుచేతనో (బహూశా సెక్స్ అంటే ఉన్న social stigma వల్ల కావచ్చు) సెక్స్ ఊసెత్తరు. చలం పదే పదే తన రచనలలో సెక్స్, స్త్రీ స్వేచ్ఛ గురించిన ప్రస్తావన పలు మార్లు తేవటం జరిగింది. స్త్రీ పురుషుల మధ్య sexual compatibility ఉంటే విడాకుల ప్రశ్న , ఎవో కొన్ని ఇతర బలీయమైన కారణాలుంటే తప్ప ఉత్పన్నం కాదు. మంచి కథ అందించినందులకు అభినందనలు.

http://arunam.blogspot.com/2009/01/blog-post_8969.html

Bay Area (CA,USA) - తెలుగు రచయితల సమావేశం


Click on photo to enlarge.

స్వాగతం - అందమైన ఈ కవిత రాసిన వారు కిరణ్ ప్రభ.సమావేశానికి ఈ కవితకు ఏమిటి సంబంధం?తెలుగు రచయితలను తమ ఇంటికి సాదరంగా స్వాగతిస్తున్నవారు కిరణ్ ప్రభ.

ఫిబ్రవరి 1 న కాలిఫోర్నియ బే ప్రాంతపు తెలుగు రచయితల సమావేశం కౌముది సంపాదకులు కిరణ్ ప్రభ గారి నివాసమున జరగనున్నది. తెలుగు భాషాభిమానులు, రచయితలు, బ్లాగర్లకు స్వాగతం పలుకుతున్నాము. మీ ఆగమనము మాకు సంతోషదాయకము.

తమరిరాకనభిలషించే
బే ప్రాంతపు తెలుగు రచయితలు
గమనిక: మీరు వస్తున్నట్లుగా ఒక జాబు లేక ఫోను ద్వారా కిరణ్ ప్రభ గారికి తెలియపరచగలరు.

Feb 1st 2009, SUNDAY at 2.00PM
KiranPrabha
4251 Escudo Ct
Dublin, CA - 94568
925-361-8620 (Home),
925-548-7431(Cell)
http://www.kiranprabha.com
http://www.koumudi.net

మంగళవారం, జనవరి 27, 2009

కవి సామ్రాట్టు....!



Chalasani Prasada Rao Painting by R.K.Laxman

నేపధ్యం:శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిపై ఇన్నయ్య గారి వ్యాసానికి అనూహ్య స్పందన లభించింది. లభిస్తున్నది. పాఠకులని విస్మయానికి గురిచేసిందా వ్యాసం. వారిలో ఎన్నో సందేహాలు పొడసూపినవి. పాఠకుల ఉత్తరాలకు ఒక్కటొక్కటిగా జవాబిస్తున్నాను. అయినా జవాబివ్వని ఉత్తరాలింకా చాలా ఉన్నవి. ప్రతి ఒక్కరికీ జవాబివ్వటం సులభ సాధ్యం కాదు. మిత్రులు కీ.శే.చలసాని ప్రసాద రావు (విపుల, చతుర మాస పత్రికల సంపాదకులు)వ్రాసిన "ఇలా మిగిలేం" అనే విమర్శనాత్మక వ్యాసాల పుస్తకం గురించి గతంలో దీప్తిధారలోని ఇలాకూడా జరగొచ్చు అనే టపాలో ప్రస్తావించియున్నాను.విశ్వనాధ వారి భావాలను, వారు తలకెత్తుకొన్న హైందవ సాంప్రదాయ పునరుద్ధరణాలోచనలపై సమీక్షలు,పాఠకులకు వాటిగురించిన అవగాహనకు తోడ్పడగలవు. ఈ ప్రయత్నంలో భాగంగా విశ్వనాధ వారి రచనలు,వారు వెలిబుచ్చిన భావాల పై చలసాని ప్రసాదరావు గారి అభిప్రాయాలను, వారి కబుర్ల శీర్షికలో వెలువడిన వ్యాసాన్ని, "ఇలా మిగిలేం" పుస్తకం నుంచి, మీ కోసం ప్రచురిస్తున్నాను. ఈ వ్యాస రచనా కాలం 1971.
-cbrao

కవి సామ్రాట్టు....!

"నూటికి తొంభయ్యయిదుగురు దరిద్రంలో మునిగిఉండే సమాజంలో వాళ్లకేవేనా దూరపుకొండలూ, వాటి మీద టెక్నికలర్ ఆశల పుష్పాలూ చూపించకపోతే వారిని ఆపటం కష్టం. కనుకనే, రేసులు, లాటరీల్లాంటివి పుట్టుకొచ్చి, తెల్లారేసరికెవరైనా సరే లక్షాధికారులు కాదగ్గ సోషలిజానికి దగ్గరి జాక్ పాట్ దారులు వేశారు.

మనకు బుర్రంటూ ఒకటున్నాక దానికి కాస్త కాలక్షేపం, వినోదం, ఉల్లాసం కలిగించటానికి నట, విట, గాయక, రచయితల్లో ఓ విదూషక బృందం కూడా తప్పనిసరి. మరి ఈ దరిద్రులక్కూడా ఏవేనా కలర్ ఆశలు చూపకుంటే ఎలా?

అందుకే ఏటేటా ఈ నిర్భాగ్యులకు నూట పదహార్లూ, వేయిన్నూట పదహార్లూ ఉదారంగా ముష్టి వేసే సాహిత్య కంపెనీలు కొన్ని బయలుదేరాయి. దాంతో ఈ అభాగ్యులు ఆ కంపెనీలచుట్టూ తిరుగుతూ, ఆయా బహుమతులు కోసం చేయవలసిన చెక్క భజనచేస్తూ, పట్టవలసిన వాళ్ల కాళ్లు పడుతూ, లేస్తూ, యధాశక్తి తమ కష్టాలు మరచి సాహిత్య సేవ చేస్తుంటారు.

కానీ, అసలే మన సోషలిస్టు రూపాయి డివాల్యుయేశన్ తో సగం చచ్చిన సంగతి అలా ఉండగా, ఈ లాటరీలూ, రేసులూ విజృంభించి పదార్లకూ, వేయిన్నూటపదార్లకూ విలువ లేకుండా చేశాయి. కనుక, సాహిత్యంలో కూడా "జాక్ పాట్" లు లేకుంటే లాభం లేదని కొందరు ఉదారులు లక్ష రూపాయల జాక్ పాట్ తో "జ్ఞానపీట" నోదాన్ని సృష్టించేరు, శుభం.

జ్ఞానపీఠం వారి లక్ష రూపాయల సాహిత్య జాక్ పాట్ ఈసారి మన కవిసామ్రాట్టు, కళా ప్రపూర్ణ, సాహిత్య డాక్టర్ విశ్వనాధ సత్యనారాయణ గారికి రావటం మనందరికీ గర్వకారణం. ఈ సారి మనం ఏ ఢిల్లీయో, కలకత్తాయో వెళ్లినప్పుడు, అక్కడ సగర్వంగా పిలక ఎత్తుకొని చెప్పుకోవచ్చు, మన తెలుగూ సాహిత్య ఘనతను గురించి. ఇంతవరకూ మరో అయిదుగురు మాత్రమే సాధించ గలిగిన ఈ జాక్ పాట్ ను కొట్టగలిగిన విశ్వనాధ వారి "రామాయణ కల్పవృక్షం" చదవటం సంగతలా ఉంచి, కనీసం మరోసారి చూసి, ఈ సారి కళ్లకద్దుకునైనా తరిద్దామని తహతహలాడి పోయాను.

ముందు తరాల విమర్శకులు విశ్వనాథ వారిని గొప్పకవిగా గాక పెద్ద నవలా రచయితగా గుర్తిస్తారు. ఆయన నవలలన్నింట్లోకి "రామాయణ కల్పవృక్షం" చాలా గొప్పదంటారు" అని, దివ్వదృష్టిగల ఓ మహాకవిగారు ఏనాడో సెలవిచ్చారు.

కనుక, నేనో పుస్తకాల దుకాణానికి పోయి 'ఫలానా నవల కావాలండీ' అంటే, అక్కడి సాహిత్య విక్రయకుడు నన్నెగాదిగా చూసి "ఆ పేరుతో నవలేదీ లేదు నాయనా! ఛందో బందోబస్తులతో పకడ్బందీగా అల్లిన విశ్వనాధ వారి కావ్యం మాత్రం ఉంద"న్నాడు.

నాకు సంస్కృతం అంతగా రాకున్నా సంస్కృత రామాయణం చదివి, అర్థం చేసుకుని, ఆనందించగలిగాను. కానీ, తెలుగు బాగా వచ్చి ఉండికూడా విశ్వనాధ వారి తెలుగు "రామాయణ కల్పవృక్షం" మాత్రం చదవలేకపోయాను. వారిది పాషాణ పాకం అని ఏనాడో శ్రీ శ్రీ అన్న మాటలు గుర్తొచ్చి, ఆ షాపు వాడికీ, వాడి అటక మీది సదరు జాక్ పాట్ గైడ్ కూ ఓ దండం పెట్టి వచ్చేశాను.

విశ్వనాథ వారు కారణ జన్ములు. మన తెలుగు సాహిత్యాన్నీ, ప్రాచీన హిందూ మత ప్రాభవాన్నీ ఉద్దరించేందుకే శ్రీవారు పుట్టారనటంలో సందేహం ఉన్నవారికి ఈ జన్మలో జాక్ పాట్ సంగతలా ఉంచి కనీసం లాటరీలో కన్సోలేషన్ ప్రై జయినా రాకపోగా సరాసరి నరకానికే పోతారు. ఆయనే స్వయంగా ఓసారి చెప్పుకున్నారట "నా అంతటి వాడు మరో వెయ్యేళ్ల దాకా పుట్టబోడు" అని మరెవరో అన్నారట గదా "నిజమే మహా ప్రభో! తమరు వెయ్యేళ్ల క్రితమే పుట్టేరు. ఇపుడు మమ్మల్ని అవస్త పెడుతున్నారు" అని.ఏది ఏమైనా మరో వెయ్యేళ్ల తర్వాత కూడా విశ్వనాథ వారి వంటి మహానుభావుడు పుట్టబోడనేది మాత్రం నిస్సందియమే.

విశ్వనాథ వారికి వ్యాకరణ, ఛంధో, అలంకారాది శాస్త్రాల్లో నూటికి సదా నూటొకటిన్నర మార్కులు వచ్చేవిట. అదీ వారి దర్జా! వారి వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, రామాయణ కల్పవృక్షం, హాహా... హిహీ... హుహూ, లాంటి మహద్గ్రంధాల్లోని మన మట్టి బుర్రలకు అర్థం గాని గొప్పల్నీ, ఉన్న – లేని అందాల్నీ కీర్తిస్తూ శ్రీవారి భక్త కోటి అసంఖ్యాకంగా వ్యాసాలు రాసి, సాహిత్య పత్రికల పేజీల్ని ఈ వరకే నింపివేశారు. ఇపుడు మనం అదనంగా పరిశోధించి పట్టుకునేందుకు ఏమీ లేదు.

"పురాణ వైర గ్రంధమాల" అంటూ విశ్వనాథ వారీ మధ్య ఓ అరబీరువాడు నవలల్ని లైబ్రరీల మీదికి వదిలేరు. అంత వేగంగా అన్ని నవలల్ని రాయగలగటం నిస్సందేహంగా గొప్ప సంగతే. "మన చరిత్రకారులు చరిత్రను సరిగా రాయలేదనీ, రాసిందంతా తప్పుల కుప్ప అనీ విశ్వనాధ వారు తమకు మాత్రం దైవానుగ్రహంతో లభ్యమైన దివ్య దృష్టి వల్ల కనుగొన్నారు. కనుక సదరు చరిత్రల్లోని తప్పులన్నింటినీ తిరుపతి వెళ్ళొచ్చిన గుండులా స్వచ్ఛంగా సవరించి బ్రహ్మణాధిక్యతనూ, బ్రాహ్మణేతరుల "నీచ" త్వాన్నీ సవివరంగా వర్ణిస్తూ, తాము కలల్లో కనుగొన్న అద్భుత చారిత్రక సత్యాలన్నింటినీ నవలలుగా మనకు అందించేందుకు స్పెషల్ గా ఓ కంకణం కూడా కట్టుకున్నారు.

"వారి ఉద్దేశం ఏమయినప్పటికీ, ఈ నవలల పుణ్యమా అని తెలుగు సాహిత్యంలో హాస్య రచనలు అంతగాలేని లోటు మాత్రం తీరిపోయింది. ఓపికగల పాఠక మహాశయులీ నవలల్లో అపూర్వ విషయాలెన్నో తెలుసుకుని చైతన్యవంతులు కాగలరు. ఉదహరణకు ఓ నవలలో "అచ్చోటనొక వాగుయున్నది" అంటూ విశ్వనాథ వారు. "అచటనే ఎందుకు యున్నది?" అని వారే ప్రశ్నించి, "యుండవలె గనుక యుండె" నని ఠకీమని
జవాబిస్తారు. "ఇంతకన్నా క్లుప్తంగా, ఘనంగా చెప్పి పాఠకుల నోళ్ళూ, బుర్రలూ మూయించగల ఘనులింకెవరన్నా మన తెలుగువాళ్ళలో ఉన్నారా?

"విశ్వనాథ వారి పురాణ వైర గ్రంథమాలా శైలి అద్భుతం. అంతగొప్పగా వాల్మీకి కూడా రాయలేదని వారి శిష్యుల ఉవాచ, పైచెప్పిన వాగునే తీసుకుందాం. ఆవాగు అక్కడనే ఎందుకున్నదీ బల్లగుద్ది చెప్పాక, అసలు వాగు అననేమి? అదెట్లు పుట్టును... అనే శాస్త్ర చర్చ మొదలెడతారు, శ్రీవారు. "అక్కడెక్కడో కొండలుండెను. వాటిపై మంచు పేరుకొనును. అది కరిగి నీరుగా ప్రవహించును. ఆ పిల్ల వాగులు అలా, అలా, అలా, అలా, రాళ్ళను ఒరుసుకుని, వాటిని అరగదీయుచూ ప్రవహించి పెద్దవై, పెద్దవై, మరింత పెద్దవై వాగుగా మారును... అంటూ ఓపికను బట్టి ఆరు... లేదా పదారు పేజీల పొడుగునా వివరిస్తారు, విశ్వనాథ గారు.

"అంతగొప్ప ప్రకృతి రహస్యాన్ని ఇంత సులువుగా, మామిడి కాయలోని రసం పిండి నోరు పగలదీసి సరాసరి గొంతులో పోసినంత చక్కగా మరే కవి అయినా చెప్పగలడా?

"అందుకే ఆయన మహాకవి అయ్యేడు. తాము చెప్పెడిదే వేదము, రాసినదే ప్రామాణికము, దానికి తిరుగులేదనేది విశ్వనాథ వారి దృఢాభిప్రాయం. "తందాన" అనుటయే వారి శిష్యుల క్వాలిఫికేషన్. అందుకేనేమో వళ్ళుమండి కొత్త సత్యనారాయణ చౌదరి అనే మరో కవిగారు "నీకేం తెలీదు విశ్వనాథా! అసలు నీకే శాస్త్రమూ సరిగా రాదు. నీ రామాయణ కల్పవృక్షం వాల్మీకికే అపచారం. అందులోని పద్యాలు వజ్రపు తునకలు కావు, రాళ్ల ముక్కలు రానాయనా, రాళ్ళ ముక్కలు" అంటూ విరుచుకుపడి, ఆ విషయాన్ని సశాస్త్రోక్తంగా నిరూపించారు.

"ఓ ఆర్నెల్ల పాటు అలా నానా సాహిత్య గొడవా, రగడా జరిగాక విశ్వనాథ వారిహ ఈ సాహిత్య నాస్తిక దుర్మార్గుల్తో వాదించలేక "నాయనలారా! నా మేడ మీద గదిలో నేనొక్కడినే ఒంటరిగా పడుకుంటూ ఉంటాను గదా! మీకు అంత కసిగా వుంటే ఓ సైనేడ్ బుడ్డీ విసిరేయకూడదా! ఇలా చిత్ర వథ చేయనేల!" అని చేతులెత్తేసి మరీ వాపోయారు.

ఆ తుఫాను అలా వెలిసిందగ్గర్నుంచీ శ్రీవారు అహంకారం కాస్త తగ్గించుకుని ప్రశాంతంగా "పురాణవైర గ్రంథమాల"లో తమ మానసిక దురదలన్నింటినీ సాహిత్య వరంగా గోక్కోనారంభించారు. అందుకే దేవుడు గారు దయదలచి జ్ఞానపీఠ జాక్ పాట్ రూపంలో అనుగ్రహించినట్లున్నారు.

అందులో సందేహం అక్కర్లేదని విశ్వనాథ వారే అంటున్నారు. "నా గ్రహబలమే ఈ జ్ఞానపీఠం బహుమతి అనుగ్రహఫలం" అని శ్రీవారే స్వయంగా చెప్తున్నారంటే మనం చచ్చినట్లు నమ్మాల్సిందే! ఇప్పుడు నాకు బుధ మహర్దశ వచ్చింది. నా జాతకం అలా ఉంది. కనుకనే ఎన్ని లాటరీ టిక్కెట్లు కొన్నా రాని ప్రైజు ఏ టిక్కెట్టూ కొనకుండానే వచ్చి నా కాళ్ల మీద పడింది అంటున్నారు విశ్వనాథ వారు.

మరి "రామాయణ కల్ప వృక్షం" సంగతేమంటారా? అయ్యా, తమరు ఉత్త అమాయకులు. ఇవన్నీ నశ్వరాలు, నిమిత్త మాత్రాలు. విశ్వనాథ వారే శలవిస్తున్నట్లు ఇవన్నీ రాయువాడూ, ఇప్పించువాడూ, ఇచ్చువాడూ, పుచ్చుకొనువాడూ, తినువాడూ, లేదా దాచుకొని వడ్డికిచ్చువాడూ, అంతా ఆ పరంధాముడి చేతికీలు బొమ్మలే!".

ఇది విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ్ అవార్డ్ వచ్చిన సందర్భంగా అప్పట్లో నేను నెలనెలా "వసుధ" మాసపత్రికలో రాసే "కబుర్లు" శీర్షికలో 1971 ఆగస్టు సంచికలో రాసినది.

అప్పట్లో మిత్రులే కొందరు "మరి ఇంత కటువుగానా?" అని నొచ్చుకున్న సందర్భాలున్నాయి. అయితే వ్యక్తిగత విషయాల్లో మర్యాదలు పాటిస్తాంగానీ, సాహిత్య సిద్ధాంత విషయాల్లో నిర్మొహమాటంగా ఉండాల్సిందే. అది లేకనే మనమిలా తగలడ్డాం అనేది నా అవగాహన.

నిజానికి అంతకు చాలా చాలా సంవత్సరాలకు పూర్వమే నేను "విశాలాంధ్ర"లో పనిచేసే రోజుల్లో ఈ అంశం మీదనే అప్పటి రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి మద్దుకూరి చంద్రశేఖరరావు గారికి నా నిరసన తెలిపి ఉన్నాను.

అదేమంటే....

ఓ రోజున విశాలాంధ్ర ప్రచురణాలయం మేనేజర్ నన్ను పలిచి, ఓ పుస్తకాల లిస్టు ఇచ్చి "ఇవి ఏలూర్రోడ్డు మీద ఫలానా ఎస్సారార్ సివిఆర్ కాలేజీ దగ్గర్లో, ఫలానా చోట ఉండే విశ్వనాధ సత్యనారాయణ గారి ఇంటి వద్ద దొరుకుతాయి. ఈ చీటి ఆయనకిచ్చి పుస్తకాలు పట్రా" అని ఆజ్ఞాపించారు.

నేనప్పటికే విశ్వనాధ వారి పుస్తకాలు దొరికినంత వరకు చదివి ఉన్నాను. ముఖ్యంగా "వేయిపడగలు" మూలంగా ఆయన్ను మహా ఛాదస్తునిగా లెక్కవేసుకొని ఉన్నాను. "హాహా హిహి హుహు"లోనో మరెందులోనో గానీ ఆంగ్ల భాష విషయంలో ఆయన విమర్శలు మరీ హాస్యాస్పదంగా కనుపించాయి. అందుకని "ఈయన పుస్తకాలు అంతదూరం నించీ మోసుకొచ్చి అమ్మే ఖర్మ మనకేమిటీ? అనడిగేను, మేనేజరు వెంకట్రామయ్య గారిని. "ఓ ఆర్డరు ఉందిలేవోయ్! మన పుస్తకాల్తో పాటు అవీ సప్లయి చేయాలిగానీ, వెళ్ళి పట్రా" అన్నారాయన.

సరే, నేను అంతదూరం శ్రమపడి వెళ్లేను, కనీసం అంత "గొప్ప" వాడిని, "కవిసామ్రాట్టు"ను చూసినట్లవుతుందని.

కాలేజీలో లెక్చరర్ గనుకా, కవి సామ్రాట్ బిరుదాంకితులు గనుకా ఏలూరు కాల్వకు సమీపంలోని ఆయన "పర్ణశాల" నాకు తేలిగ్గానే దొరికింది. నిజంగా ఆదో పర్ణశాలే! చుట్టూ కర్రల్తో కట్టిన "దడి", దానికో గేటు, మధ్యలో పూరిల్లు.

నేనాగేటుకున్న తాడో పేడో గానీ వదిలించి గేటు తీసుకొని రెండు అడుగులు లోపలికి వేశానో లేదో, సాక్షాత్తూ కవిసామ్రాట్టు గారే ఆ కుటీరంలోంచి బయటికి వచ్చేరు, రెండు చేతులూ ఎత్తి "ఆగుము, ఆగుము" అని ఆదేశిస్తూ.

ఆయన నా దగ్గరకు రాగానే నేనెవర్నో బహుశా అర్థం అయిపోయుంటుంది. అయినా, ఫలానా అని చెప్పి జేబులోంచి మా మేనేజరు గారి లేఖ మరియు శ్రీవారి పుస్తకముల జాబితా ఉన్న కవరుతీసి వారిచేతికి అందివ్వబోయేను.

మడి, అంటరాని తనం అలా పాటించారు:

ఆయన జడుసుకున్నారో ఏమో గానీ "ఆగాగు" అని చెప్పి నాలుగడుగులు వెనక్కి వేసి "ఆ లేఖనట పెట్టుము" అని వర్ణశాల అరుగుకేసి చూపించేరు. నేనున్నూ కవి సామ్రాట్టుల వారి ఆజ్ఞ శిరసావహించేను.

అపుడాయన ఆ లేఖ రాజంబును మడిచెడకుండా రెండు వ్రేళ్లతో ఎత్తి తీసుకొని శ్రద్ధగా పఠించిన వారై "అచ్చోటనే యుండుము, ముందుకు రాకుము" అని యాజ్ఞాపించి వర్ణశాలలోని కేగిన వారయిరి. మరి కొంతసేపటికి పుస్తకములు తెచ్చి, తీసుకుపోమ్మని యువాచించగా "హమ్మయ్య" అనుకుని నేను గ్రంథరాజములను నా ద్విచక్ర వాహనము వెనుక సీటుకు తగ్గించుకొని, ఆఫీసున కేగి, మానేజర్ గారికా పుస్తకములకట్ట, కవి సామ్రాట్టుల స్వహస్త లిఖిత బిల్లు సహితంగా అందజేసి "అయ్యా, నన్నింకెన్నడూ సదరు చాదస్తుని వద్దకు పంపకుడు" అని ప్రార్థించిన వాడినైతిని.

ఆ తర్వాత ఓ రోజు "మద్దుకూరి చంద్రశేఖ రావు గారు" కాస్త తీరిగ్గా కనపడితే అడిగేను "ఇలాంటి వాళ్ల పుస్తకాలు అమ్మే ఖర్మ మనకేమిటండీ" అని.

చంద్రం గారు కేవలం పార్టీ కార్యదర్శేకాదు. సాహితీ పరులకు గౌరవ పాత్రుడయిన ఆనాటి ప్రముఖ విమర్శకుడు కూడానూ.

"కొందరు రచయితలు రాజకీయంగా మనకు మిత్రులే, మనవాళ్లే అయినా, వారి రచనల్లో మనకు నచ్చని రాజకీయ లేదా సిద్ధాంతపర అంచనాలున్నాయన్న కారణంగా ఇప్పటికే కొందరి పుస్తకాలు విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా అమ్మటానికి నిరాకరించి విరోధాలు తెచ్చి పెట్టుకున్న అసలు సిసలు కమ్యూనిస్టులం గదా మనం! మరి ఈ విశ్వనాధ సంగతేమిటండీ!" అనేది నా అభ్యంతరం సారాశం.

ఆయన అందుకు సమాధానంగా ఏమీ అనలేక పోయినట్లున్నారు. కేవలం విని ఊరుకున్నారు. నేను రెట్టించలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాంటి ప్రశ్నలు అడిగే వాడేలేడు.

ఆనాడు విశ్వనాథ వారి ఫ్యూడల్ సంస్కృతీ ప్రతీకలైన సాహిత్యాన్ని అమ్మిపెట్టే విషయంలో ఏదో పొరపాటు జరిగింది లెమ్మనుకున్నా అది ఆ తర్వాత అలవాటుగా మారి, అంతకన్నా హీనమైన పెట్టుబడిదారీ "క్షుద్ర" సాహిత్యాన్ని కూడా అమ్మిపెట్టే స్థితికి అభివృద్ధి చెందామంటే దానికి బీజాలు ఆనాడలా పడినవే కాదా!

- కీ.శే. చలసాని ప్రసాదరావు

("ఇలా మిగిలేం" పుస్తకం (1993) నుండి స్వీకరణ)

సోమవారం, జనవరి 26, 2009

స్పందన -2



Western gulls on North California sea coast photo-cbrao

అవిడియాలు

"అవిడియాలు" అనే పద ప్రయోగం సరైనదేనా? తెలుగు పదమేనా?

http://palakabalapam.blogspot.com/2008/12/blog-post_26.html



కోడీహళ్ళి మురళీ మోహన్:తురుపుముక్క

మీ పరిచయానికి చాలా సంతోషం. బ్లాగ్లోకానికి స్వాగతం. ప్రతి నెలా రెండవ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కృష్నకాంత్ పార్క్ (యూసఫ్‌గూడా) లో జరిగే సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం.

మీ గురించిన వివరాలతో "నా పరిచయం" అనే టపా ఒకటి ప్రచురించగలరు. మీ బ్లాగు చూసేవారికి మీరెవరో తెలియగలదు.

http://turupumukka.blogspot.com/2008/12/sameeksha.html


చూస్తుండు, ఇప్పుడే వస్తా

జీవితానికి మరణానికి దూరమెంత?

http://oohalanni-oosulai.blogspot.com/2008/12/brb.html


చివరి ఉత్తరం

భూమిక Helpline కి ప్రచారం కల్పించేలా ప్రమదావనం తరపున ఎవరైనా ఒక టపా రాయటం అవసరం. జ్యోతక్కా వినిపిస్తుందా?

http://muralidharnamala.wordpress.com/2008/12/28/lastletter/


మంచి పిల్లలు

జీవని constitution ఏమిటి? Aided or unaided?. జీవని గురించిన వివరాలతో, సచిత్రంగా మరొక టపా రాయండి. మన తెలుగు బ్లాగరులు సహృదయులు. స్పందించే గుణం ఉంది వారికి.

http://jeevani2009.blogspot.com/2008/12/blog-post.html


ది క్యూరియస్ కేస్ ఆఫ్ 'బెంజిమన్ బటన్'

ఈ చిత్ర సమీక్ష, చదవటానికి ముందు, ఎవరు రాసేరు అని ఒక పర్యాయం తల పై కెత్తి చూస్తే అతిధి అని కనిపించింది. ఎవరైతే మనకేంటి, మనకు కావలసినది ఈ చిత్రం గురించిన సమాచారం అనుకుని చదవడం, మొదటి వాక్యంతో మొదలు పెడ్తే, చివరంటా అలా ఆసక్తికరంగా చదివింపచేసిందీ వ్యాసం. చివరన, సమీక్షకుడి పేరు చూసి, డిటెక్టివ్ సినిమాలో వంటవాడే హంతకుడు అని తెలుసుకుని ఆశ్చర్యపోయినంతగా, ఆశ్చర్యపడ్డా. ఈ రచయిత తెలుగు బ్లాగు పాఠకులకు సుపరిచితుడే. అయితే నవతరంగం పాఠకులకు సరికొత్త. మరిన్ని సమీక్షలు డాక్టర్ గారు రాయాలని కోరుకుందాము.

http://navatarangam.com/2008/12/the-curious-case-of-benjamin-button/

శీతాకాల సొగసులు

ఒకటే కారు ఉన్న చిత్రం తక్కువ distraction తో రమ్యంగా ఉంది. శాన్ హోజే పురంలో fall ఆలస్యమే, తూర్పు తీరం తో పోలిస్తే.

http://anilroyal.wordpress.com/2008/12/28/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b0%b2%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d/


కలయా! నిజమా?

క్రిస్మస్ రోజు పుస్తక ప్రదర్శన: మన e- తెలుగు స్టాల్ కు నేను కూడా వచ్చా. మీ అందరి హడావుడి చూసి ఆనందించాను. మీరు నన్ను చూడలేక పోయారు - కారణం నేను సూక్ష్మ రూపంలో రావటం వలన.

డిసెంబర్ మాసం 2008 తెలుగు బ్లాగుల చరిత్రలో మరువలేనిది. బ్లాగరులు ప్రత్యక్షంగా ఒకరినొకరు కలుసుకోవటమే కాక, తెలుగు బ్లాగుల, కంప్యూటర్లో తెలుగు వాడకానికి, ఎంతో శ్రమించి మిక్కిలి ప్రచారం కావించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభినందనీయులే. తెలుగు బ్లాగు చరిత్రలో వీరందరి పేరు, చిరస్థాయిగా ఉంటుంది.

http://manalomanamaata.blogspot.com/2008/12/blog-post_25.html

ఆదివారం, జనవరి 04, 2009

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ



వ్యాస నేపధ్యం

కోగంటి సుబ్రహ్మణ్యం సంపాదకత్వాన రాడికల్ హ్యూమనిస్ట్ పక్ష పత్రిక తెనాలి నుంచి ప్రచురితమైంది. 1958 ప్రాంతాలలో ఇన్నయ్య గారు విశాఖపట్టణం లో వుంటూ హ్యూమనిస్ట్ లో రాసిన ఈ వ్యాసం ఇటీవలనే లభించింది. విశ్వనాధ సత్యనారాయణ గారిపై ఆ నాటికే త్రిపురనేని రామస్వామి, శ్రీ శ్రీ, ఆవుల గోపాలక్రిష్ణమూర్తి, జాషువా వంటి వారు తీవ్ర విమర్శలు చేశారు.విమర్శకుల దృష్టిలో, కులం, మత ఛాందసం, దుష్టాచారాలను సమర్ధించిన విశ్వనాథ తిరోగమనవాది.

ఆంధ్ర ప్రదేష్ లో పాఠ్య పుస్తకాలను జాతీయం చేసిన సందర్భంలో విశ్వనాథ వారు, అభ్యుదయ మానవతావాదుల తీవ్ర విమర్శలను ఎదుర్కొనవలసివచ్చింది. బుద్ధుడిని రాక్షసుడిగా రాయటం జరిగింది. AGK తీవ్రంగా విమర్శించటంతో ఆ వ్యాసాన్ని పాఠాలనుంచి తొలగించారు. కులం పేర్కుంటూ, జాషువా పై అవహేళనగా వ్యాఖ్యలు చేసారు. ఇవి ఈ వ్యాసం రాసిన సమయాన ఉన్న నేపధ్యం. ఇన్నయ్య గారి వ్యాసం దిగువున ఇస్తున్నాము.

-cbrao

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

అధికార కేంద్రీకరణ సాహిత్యరంగంలో ప్రబలుతున్నకొద్దీ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారిని రచయితగా, నవలాకారునిగా, నాటకకర్తగా, కవిగా, పండితునిగా, కవిపండిత, పండిత కవి వగైరాలుగా – విభజించి – ఏ రంగానికారంగమైనా సరే – మొత్తం కలిపి అయినాసరే – ఏరీ ఆధునికాంధ్ర సాహిత్య రంగంలో విశ్వనాథకు ఎదురేరీ – ఇదీ నేడు వీధి వీధినా జరుగుతున్న తోలుబొమ్మలాట, సాహిత్యంలో స్వాతంత్ర్య పిపాసువులూ, నిష్కర్ష విమర్శకులు లోపిస్తుండగా భట్రాజీయం విరివిగా – కలుపువలె పెరిగిపోతున్నది. ఎవరి స్వార్థములు వారివి. సత్యనారాయణగారితర్వాత ఎవరైతేనేమి... (నెహ్రూ తర్వాత ఎవరన్నట్లు) వర్తమానం గడవాలి. అంటే భజన చెయ్యాలి. అది సరేనయ్యా.

ఈ విధంగా వీధి వీధినా ఏదో శక్తి వుండక పోతుందా – మళ్ళీ తిన్న అన్నమే తిని చూశాను. తిన్న అన్నం తింటే మనిషికి విషం కాదూ మరి ? పశువులైతే నెమరువేయగలవు కానీ పరిణామంలో ఆ శక్తిని అధిగమించాంగా. తిన్న అన్నము వంటిది తినగలము. అంతకుముందున్న అభిప్రాయాలు అవతలకు నెట్టి, పొగడే వారిపై గల గౌరవంతో మళ్ళీ కల్పవృక్షం తిరగేస్తే అంతా చిన్నము నిలువక వ్రాసినట్టే వున్నది. దీపికా లతాంతములో దివ్యజ్యోతి వుంటుందా, అక్కడక్కడ కవిత్వపు పటుత్వం, దుర్విదగ్ధతతో కూడిన శిల్పం మసక మసకగా కన్పించినవి. విశ్వనాథ పేరు నిలబెడితే, అంటే ఆయన తర్వాత కీర్తిని శేషింప చేయగలిగినది పలువురు పేర్కొంటున్న రామాయణ కల్పవృక్షమే యిటులుండ యిక మిగిలిన వాటి మాటేమిటి.

వ్రాసిన నవల లన్నిటిలోకి ఏకవీర అత్యుత్తమమన్నారెవరో. చదివి అభిప్రాయం సైతం యిదివరకే వ్రాశాంగాని, మరలా ఒక్కసారి తిరగేస్తే వంటబట్టని మనస్తత్వ శాస్త్రం కనిపించింది. అదే శరత్ అయితే.



వేయి పడగలు చిత్రం తెలుగు వికిపిడియా సౌజన్యంతో

పరిమాణాన్ని బట్టి అయినా – విశ్వనాథవారి ఓపిక చిహ్నమైన – వేయిపడగలు ఇది ఏ కోవలోకి చెందినదబ్బా? నవల అనటానికి వీలు లేదు. కేవలం వచన రచన అనలేం. అంత జుగుప్స కలిగించే సంభాషణలు, చాదస్తం ఎలా ప్రవేశపెట్టగలిగారో విశ్వనాథవారు. పండిత కవి కదా.

కొందరెవరో వీధి శృంగారమనేవారట విశ్వనాథవారి శృంగార వీధిని. ఏమోగాని వీధిలో సైతం అలాంటి శృంగారం కన్పట్టదు. ఆ మధ్య సన్నిధానం సత్యనారాయణ శాస్త్రిగారి నరస భూపాలీయం చూస్తుంటే శృంగార వీధి లోనిదంతా ఆరీతి అని అన్నారాయన. మరి తెలిసిన వారు ఎక్కడేమాట అనాలో అలాగే అంటారు. విశ్వనాథవారిని చదివి చదివి అభిప్రాయం చెప్పలేని నాలాంటివారికేం తెలుసు ఏమనాలో. తెలియనిచ్చేట్లు రాశారా ఆయన.

విశ్వనాథవారి రచనలన్నీ ఓపిగ్గా సేకరించి ( కొన్నట్లయితే ఎంత అదనంగా బాధపడేవాడినో) చదివిన తర్వాత ఎందుకు ఇంత కాలం వృధా చేశానా? అనిపించింది. అసలు మాతో రోశయ్యగారంటుండేవారు. – తపస్సు చేస్తే మాత్రం పానుగంటి సమాసపు కట్టు విశ్వనాథకు అబ్బుతుందా. విశ్వనాథవారు తన శక్తినంతా దుర్వినియోగమే చేశారు. చక్కని భాషలో గద్యరచన చేసినా బాగుండేది. అన్నిటిల్లో కాలు పెట్టి – దేనిలోనూ సాధన లేకుండా పాడు చేసుకున్నారు. అడుగడుగునా నాగుబాము వలె ఏమారక విషం కక్కుతూ, ఆ వైదికాధ్యాయత తొంగి చూస్తూనే ఉంటుంది ఆయన రచనల్లో. నన్నయకున్న లోటదేగా. ఎందుకో ఆయన శిష్యుడయ్యాడు విశ్వనాథవారు.

విశ్వనాథవారి రచనలు యికనుంచి రావు – వచ్చే అవకాశాల్లేవు – అని నిశ్చితాభిప్రాయాని కొచ్చిన తర్వాత పంచశతి కనిపించింది. అవినీతికి శిఖరాగ్రమందినట్లేనని నిశ్చయించుకున్నాను. ఏమైనా యీ ఆధునిక కాలంలో – అటువంటి రచనలు సాగిస్తూ చెలామణి కాగలుగుతున్నందుకు చెప్పదలచినది ఎవరేమనుకున్నా ధైర్యంగా చెబుతున్నందుకు ఆయన్నభినందించాలి. అయితే నా సందేహమల్లా? విశ్వనాథవారే స్వయంగా వెళ్ళి ఎన్ని సభల్లో తన కావ్యాల విశిష్టతను వివరించగలరు గనుక. వయసు మీరింది. త్వరగా కాలం వృధా చేయక పేరు నిలబడటం కోసం – వెంటనే రచనలన్నిటికీ టీకాతాత్పర్య సహిత వ్యాఖ్యానము వ్రాసిపెట్టిపోతే అభిమానులకు తర్వాత చదువుకునేందుకు బాగుంటుంది. ఈ ఉపన్యాసాలు తాత్కాలికమే కాని చెప్పినదంతా గుర్తుంచుకుంటారా ఏమన్నానా.
ఇంత వ్రాసిన తర్వాత మిత్రుడొకడు, ఎంత చెడ్డా కవిగదా, ఆయన కవిత్వంపై ఏమీ వ్రాయలేదేమన్నాడు. భట్రాజులంతా జీలగబెండులో సారం పిండిన తర్వాత, మిగిలినది పిండి నీవు అనుభవించు అన్నట్లుంది. శక్తి దుర్విదగ్ధతవల్ల చెడగొట్టుకున్నవారిని చెప్పిన తర్వాత, యింకా శక్తి విషయం చెప్పమనటంలో అర్థం లేదు.

మరి వూరూరా విశ్వనాథ సత్యనారాయణ గారికింత ప్రచారం సాగటంలో అంతర్యం? కవిత్వమా? కవిత్వం ఎవడికి కావాలి. లౌకికం. అదే భారతీయ సంస్కృతి లోతుపాతులు తెలిసిన వారికి ఈ విషయాలాట్టే చెప్పనక్కరలేదు. అమ్ముడుపోయే ప్రతులూ, భట్రాయాలూ కాదు. కవిత్వపు విలువను నిర్ణయించేది. అది కాలగమనంలో ఋజువౌతుంది. పేరుకు గ్రాంధికం, లౌక్యానికి వ్యావహారికం, యిది కాదు. సమ్రాట్ లక్షణాలు. అకాడమీలు విలువల్ని కొలవలేవు. అన్నీ ప్రియమైన సత్యాలు చెబుదామనే మొదలు పెట్టాను. సత్యంలో ప్రియత్వమేదీ? ఉంటే విశ్వనాథవారు కవిత్వమే వ్రాయక పొయ్యేవారు.

ఇంతకూ విశ్వనాథను గురించి ఏమంటావు? అన్నాడు మిత్రుడు. కచ్చితంగా చెప్పలేను, పండితుడని, సాహిత్య దృష్టిగలవాడని, తద్వారా ప్రయోజనాన్ని ఆశించిన వాడని సాహిత్య రంగంలో ప్రమాదకర వ్యక్తి అనీ – యింకా ఇలాంటివే ఏవో కొన్ని కారణాలు అందరికీ వంటబట్టవు. ఆహా సరుకుంటే యింత వందిమాగధత్వం ఎందుకవసరమౌతుందీ. ఏమైనా విశ్వనాథ కళ్ళతో తిక్కన, శ్రీనాథుల చూసే దౌర్భాగ్యం కలగకుండు గాక. సాహిత్య రంగంలో ఈ అవ్యవస్థకు భట్రాజీయం అంతిరించు గాక.
అసతోమా సద్గమయ.

-- ఇన్నయ్య

శనివారం, జనవరి 03, 2009

ప్రేమా, పిచ్చి రెండూ ఒకటేనా?

true-love-4a91aaea429b

Love

Photo courtesy:Nachofoto

ఈ మధ్య జరుగుతున్న ప్రేమికుల ఉన్మాద చర్యలు మనసును కలవరపెడటం సహజం. Shakespeare తన డ్రామా A Midsummer Night's Dream లో లిశాండెర్ తో అనిపించినట్లుగా The course of true love never did run smooth. ఈ నాటకంలో, లిశాండెర్ తో హెర్మియ ప్రేమను ఆమె తండ్రి ఆమోదించక డెమిత్రయస్ ను వివాహం చేసుకోవాలని అజ్ఞాపిస్తాడు. అప్పటి అథెన్స్ చట్టం ప్రకారం హెర్మియా తండ్రి మాట ఉల్లంఘించితే మరణ శిక్ష లేక పోతే కన్యగా ఉంటూ భగవంతుని సేవలో గడపాలి.

ఈ ప్రేమ కథలలో విషాదాలు చాలా ఉంటాయి. అబ్బాయి, అమ్మాయిల ఇద్దరి తప్పిదాలూ ఈ కథలలో మనకు కనిపిస్తాయి. అమ్మాయిలను మోసగించే అబ్బాయిలున్నట్లే, మరో better కుర్రాడు దొరకగానే మొదటి boy friend కు టాటా చెప్పే అమ్మాయిలూ ఉన్నారు. విపత్కర పరిస్థితులలో, ధృఢమనస్కులై మనో వ్యాకులతలకు లోను కాకుండా సర్దుకుపోయి, ముందుకు పోవటం ప్రేమికులకు అభిలషణీయం.

వయస్సు ప్రభావం వల్ల అబ్బాయిలు, అమ్మాయిలు పరస్పర ఆకర్షణలో పడటం సహజం. వీరికి ఏది మంచి, ఏది చెడు అనే తల్లి తండ్రుల విచక్షణ వలన, వారి సలహా, ఒత్తిడి కి లొంగి ప్రేమ అనే ఆకర్షణలోంచి బయటపడటానికి, ప్రేమికులు ఎంతో క్షొభ అనుభవిస్తారు. అమ్మాయిలు తట్టుకుని, మనసు కుదుటబడ్డాక తల్లి తండ్రులు చూసిన సంబంధం ఖాయం చేసుకుంటే, అబ్బాయిలు అంత త్వరగా ఆ relationship లోని ప్రేమను మరవటానికి క్షోభ పడతారు. ప్రేమికులు వివాహానికి తల్లితండ్రుల ఆశీర్వాదం కావాలని ధృఢంగా కోరుకొంటారు. దీనికి చాల కారణాలు - తల్లి తండ్రులపై ఇన్ని సంవత్సరాలుగా ఉన్న బాంధవ్యం, వారిచ్చే support, ఆస్తి హక్కు వగైరా కారణాలు. పిల్లలు ప్రేమించటము, తల్లి తండ్రులు వారించటం - ఇవన్నీ ఇప్పటికి, గణిత భాషలో చెప్పాలంటే 'n' times జరిగుంటాయి. అయినా చరిత్ర నుంచి యువతీ యువకులు ఏమి నేర్చుకున్నారన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోతూనే ఉంది. ఇవే కథలు పునరావృతమవుతాయని, వీటిని ఆపటం ఎవరితరం కాదని చరిత్ర నేర్పిన పాఠం.

తల్లి తండ్రులు పిల్లలను స్నేహితులుగా భావిస్తూ, వారి మంచి చెడులను పట్టించుకొంటూ, వారిలోని మార్పులను గమనిస్తూ, అవసరమైన సలహాలు ఇవ్వటమే, యువతీ యువకులను ప్రేమ బారిన పడకుండా తద్వారా ప్రేమల వలన రాగల దుష్పరిణామాల నుంచి వారిని కొంత వరకూ కాపాడవచ్చు.

శుక్రవారం, జనవరి 02, 2009

స్పందన



View from my window at San Jose, CA Photo: cbrao


ఈ-తెలుగు స్టాల్లో

మీ ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు సంతోషం. మహిళ బ్లాగర్లు ఒకరినొకరు కలిసే అవకాశం ఇన్నాళ్లకు, e- తెలుగు స్టాల్ ద్వారా వచ్చినందుకు ప్రమోదం. ఛాయా చిత్రాలకింద పేర్లు రాయకపోతే, ఎవరెవరో ఎలా పోల్చుకోవటం?
"అప్పటివరకూ ఊహల్లో వేరే రూపాలు ఉన్నా, కలుసుకున్న తర్వాత వెంటనే ఎప్పటినుంచో స్నేహితులుగా మసలుతున్న అనుభూతితో ముచ్చటించుకున్నాం అందరం! రూపాలకు ప్రాముఖ్యం లేదని తేలిపోయింది."
-ఇది పూర్తి సత్యం కాదు. పాక్షిక సత్యం. అందరి అనుభవాలు ఒక్కలా ఉండవు.

http://manishi-manasulomaata.blogspot.com/2008/12/blog-post_25.html



పురాణ ప్రలాపం

@ యోగి - The outcast : హైదరాబాదు నగరంలో జానిటర్లు ఒక వారం రోజులు సమ్మె చేస్తే వారి ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని రక్షించటం లో వారి పాత్ర ఎంతో చెప్పుకో తగ్గది.


"వేధాలు" అచ్చు తప్పు గురించి రాసినందుకు ధన్యవాదాలు. సరిచేశాను.
పురాణ ప్రలాపం పుస్తకం లో రాసిన విషయాలను, అసందర్భంగా, హేతుబద్ధంగా లేని వాటి గురించి రాయండి.చర్చించండి. వ్యక్తుల పై ఛలోక్తులేల? పుస్తకాన్ని విమర్శించండి. ఫలానా విషయం తప్పు రాసారని సోదాహరణంగా రాయగలరు. అప్పుడు నేనూ మీతో ఏకీభవిస్తాను.

http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_29.html


అమ్మనాన్నల ఆఖరి ఉత్తరం


ఈ కథ ఈ రోజే చదవటం జరిగింది. గుండె ఝల్లుమంది. గతంలో ఒక చిత్రంలో (దాసరి నారాయణరావు?) ఇలాంటి సన్నివేశమే చూశాను. ఆంగ్లంలో ఒక నానుడి Great men think alike అని.

http://palakabalapam.blogspot.com/2008/12/blog-post_20.html


మంచుతుఫాను

మంచు పడటాన్ని ఆపలేనప్పుడు, మంచు పడటాన్ని ఆనందించాలి. మేము snow చూడాలంటే ఎంతో ఖర్చు పెట్టి Lake Tahoe వెళ్లాలి. ఖర్చు లేకుండా మీ దగ్గరికే మంచు రావటం, మీ అదృష్టం. మీ మంచు చిత్రాలు చూశాక నాకు Mount Shastaa కు ఎప్పుడు వెల్దామా అనిపిస్తుంది.

-cbrao
San Jose, CA

http://ramakantharao.blogspot.com/2008/12/blog-post_8161.html



దేవరపల్లి రాజేంద్రకుమార్

రాజేంద్ర మరో పార్శ్వం సినిమాలు గురించిన ప్రశ్నలేవి? విశాఖతీరాన నడపటంలో అనుభవాలు గురించిన ప్రశ్న ఏది? వ్యక్తిని బట్టి ప్రశ్నలలో వైవిధ్యం చూపాలి.

http://chaduvu.wordpress.com/2008/12/26/interview09/


ఫిరోజ్ గాంధి

ఫిరోజ్ గాంధి సెప్టెంబర్12, 1912 న ఒక పార్శీ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి తండ్రులు రతిమాయ్, జెహంగీర్ ఫరెదూన్. మరింత సమాచారానికై చూడండి Feroze Gandhi was a Parsi

చరిత్ర పై రాయాటానికి కావలసినది B.A., M.A. (History) డిగ్రీలు కాదు . ఉండవలసింది చరిత్రను విశ్లేషించగల నైపుణ్యం. ఒక వ్యక్తి గొప్పదనం అతని పూర్వీకుల వల్లనో లేక వారసుల వల్లనో కాదు. తను సమాజానికి కొత్తగా ఏమి చెప్పాడు, ఇచ్చాడు అన్న అంశాలపై ఆధారిపడిఉంటుంది. ఉదాహరణగా రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు గారు వగైరాలను తీసుకోండి. ఆధ్యాత్మిక రంగంలో ఐతే మీకు స్వామి వివేకానంద ఉదాహరణగా నిలుస్తారు. వీరి గొప్పతనం వారి పూర్వీకులపైనో, వారసుల పైనో ఆధారపడి లేదు. కొన్ని విషయాలకు నిర్ధారిత చరిత్ర లభించటం కష్టం. అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించటమే మనము చెయ్యగలిగినది.

http://hinducharities1.blogspot.com/2008/12/blog-post_716.html



తెలుగు బ్లాగు రచయితలు, పాఠకులు
@ఇస్మాయిల్: మీ ఆత్మీయ ఆహ్వానానికి ధన్యవాదాలు. అట్లాంటా దాకా వచ్చాను. మీ గురించిన సమాచారం నా వద్ద లేక పోవటం తో, మిమ్ములను కలువలేక పోయాను. నా వ్యక్తిగత వేగుకు మీ చిరునామా, ఫోన్ నంబర్లు పంపగలరు. ఈ సారి down south వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పక కలుస్తాను. ఈ లోపు మీ ప్రాంత తెలుగు పాఠకుల, రచయితల సమాచారం సేకరించండి.

మీ ఊరు న్యూ ఒర్లేన్స్ వస్తే Tuesday Feb.24.2009 న జరిగే Mardi Gras పండగకు రావాలి. అప్పుడు నగరమంతా ఊరేగింపులతో కోలాహలంగా ఉంటుంది. Bluegrass, Jazz సంగీతం వింటూ, మార్గరిటా ఇష్టంగా తాగుతూ, Cajun/Creole/New Orleans-style ఆహారం తింటూ, ఆనందించటానికి అంతకంటే మంచి సమయముండదు.

@ మాలతి: మీకు సీన్ లేక పోవటమేమిటి? మీరు మంచి రచయిత్రుల కోవలో ఉన్నారు. సరయూ మీ అమ్మాయి. ఇవి చాలవా? సరే ఇంతకీ విషయమేమిటంటే, బ్లాగర్ల దినొత్సవం నాడు మీరు మీ ఇంట గాని లేక మీకు రెండు గంటల దూరంలో ఉన్న రాధిక (స్నేహమా....) ఇంట గాని సమావేశమవ్వండి. ఆ విశేషాలు మీ బ్లాగులో రాయండి. చికాగో బ్లాగర్ల సమావేశానికి మీకు ఆహ్వానం పంపమని అక్కడి బ్లాగర్లకు రాస్తాను. మీకు వీలయితే వెళ్లవచ్చు. డెట్రాయిట్ సమావేశం లో ఎందరో సాహితీ ప్రేమికులను కలిసే అవకాశం కలిగింది. మీరు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది.

మీ ఊరొస్తే నాకు మీ, సరయూల ఆటోగ్రాఫ్స్ ఇస్తారా? "స్నేహమా" రాధిక వివరాలిస్తూ మీకు వ్యక్తిగత వేగు పంపుతున్నాను. వారిని సంప్రదించి సమావేశమవ్వండి. నా వివరాలు కూడా పంపుతున్నా, మీకు వీలయినపుడు మాట్లాడవచ్చు.

@ మాలతి:
సరే. మీకు రాధికకు వీలుకుదిరినప్పుడే కలవండి. తెలుగు సంఘాలలో పదవులకై , అంతర్గత ముఠా కుమ్ములాటలు, సంఘాలపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసాయి. అదృష్టవశాత్తు తెలుగు వికీ కి పనిచేసే వారు, బ్లాగులు రాసే వారు నిస్వార్ధంగా, లాభాపేక్షలేకుండా పని చేస్తున్నారు.

తెలుగు వికి కి మీరు కొత్త అని తలుస్తాను. ఒక అసమగ్ర వ్యాసం రంగనాయకమ్మపై ఉన్నది. అది విస్తరించగలరా? చూడండి

http://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE

ఇంకా వికీలో చెయ్యవలసిన పనులు చాలా ఉన్నయ్. ఒక సారి వికీలో రాయటం మొదలు పెడితే, అవేమిటో, మీకే తెలియగలవు.

రచయిత్రి నిడదవోలు మాలతి పై ఎలాంటి పరిచయ వ్యాసం లేదు. అది రాయవలసిఉన్నది. కొంత వ్యవధి తర్వాత నేను ఆ పని ప్రారంభించాలి.


http://deeptidhaara.blogspot.com/2008/12/blog-post.html


ముంబాయి పై "టెర్రర్ ఎటాక్"
ముంబాయి నగరం పై ఉగ్రవాదుల దుశ్చర్య ఖండించాల్సిందే. అది ఎంతో విషాదాన్ని మిగిల్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా ధైర్యం కోల్పోక, రెండు జొకులు చెప్పి, నువ్వు నవ్వి మమ్ములని నవ్వించావు. ఇప్పుడు ముంబాయి లో జీవితం మరలా ఎప్పటిలా ఉరకలు-పరుగులుగా మారి ఉంటుందని తలుస్తాను. ముంబాయిలో నీ కొత్త స్నేహితుల గురించి రాసినట్లు లేదు. ఇంకా ఎవరూ స్నేహితులు కాలేదా?
-cbrao
San Jose, CA

http://sravyavarali.blogspot.com/2008/12/blog-post.html