బుధవారం, అక్టోబర్ 17, 2007

సాహితీవనం -10



రామా కనవేమిరా! శ్రీ రఘురామ కనవేమిరా!

సుషేణుడు వారధి కట్టినట్లు వ్రాసారు. సుషేణుడు సుగ్రీవునికి వైద్యుడని చదివానొకచోట (ఎంత వరకు నిజమో తెలియదు :-) )! వారధి కట్టినట్లున్న సమాచారం మీకెక్కడ లభ్యమైనదో చెప్పగలరా, దయచేసి? శ్రీదేవి తన ఉత్తరంలో, e-mail చిరునామా ఇవ్వలేదు.

వాల్మీకి రామాయణం యుద్ధకాండ లో, రామసేతు నిర్మాణం గురించిన వివరాలు వున్నాయి. లంక వెళ్లటానికి, అడ్డుగా ఉన్న సముద్రునిపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి రాముడు సిద్ధం కాగా, సముద్రుడు ప్రత్యక్షమై,రామునికి అభివందనం చేస్తూ అంటాడు

అయం సౌమ్యనలో నామ తనయో విశ్వకర్మణహః
పిత్రా దత్తవరః శ్రీమాన్ ప్రీతిమాన్ విశ్వకర్మణహః
ఏష సేతుం మహొత్సాహః కరోతు మయివానరహః
తమ హం ధారయిష్యామి యథాహ్యేష పితా తథా

ఓ! సౌమ్య రామా! నీ సైన్యంలోనే విశ్వకర్మ వరపుతృడైన నలుడున్నాడు.నా పై సేతువు నిర్మాణానికి నేను సహకరించెదను.ఇతని తండ్రివలే ఇతను కూడా నాకు ఇష్టుడు.నీవతని సేవలు వినియోగించుకొనుము.(యుద్ధ కాండ 22-45,46)

ఇతిహాసాలలో ప్రక్షిప్తాలు చాలా ఉంటాయి.మూలకవి రాసిన దాంట్లో, మధ్యన, కవులు, తమ సొంత కవిత్వాన్ని ఇరికించి ఉంచే రచనలను ప్రక్షిప్తాలంటారు. రామాయణ మహాభారతలలో ప్రక్షిప్తాలు కోకొల్లలు. ఇతిహాసాలలో ఎక్కడన్న వైరుధ్య విషయాలుంటే, దానికి ఈ ప్రక్షిప్తాలు కొంతవరకు కారణం అవుతాయి.

సుషేణుడు అంటే విష్ణువు, సుగ్రీవుని వైద్యుడు అనే రెండు అర్థాలు నిఘంటువులో కనిపిస్తాయి. వేదాలకు భాష్యం చెప్పిన దాశరధి రంగాచార్యులుగారు రామసేతు నిర్మాణం సుషేణుడనే వానర ఇంజనీర్ కావించాడని తమ అభిప్రాయం వెలిబుచ్చారు. రామాయణం అంతా చదివాక రాముడికి సీత ఏమవవుతుంది అనే విషయం పైనే ఇంతవరకూ ఏకాభిప్రాయం లేదు(చూడండి రాముడికి సీత ఏమవుతుంది? –ఆరుద్ర). రామసేతు ఎవరు కట్టారనే విషయం పై సందేహాలుండటం సహజమే మరి.

రామసేతు ఎవరు కట్టారు అనే విషయం పై చర్చ అయ్యాక,దీని గురించి ఇంకొన్ని విషయాలు కూడా చెప్పుకోవాలి మనం.
దశయోజన విస్తీర్ణం శతయోజనమాయతం
దదృశుర్దేవ గంధర్వాః నలసేతుం సుదుష్కరం
(యుద్ధకాండ 22-75)
10 యోజనాల వెడల్పు, 100 యోజనాల పొడవు వుంది; నలుడు కట్టిన ఈ సేతువు.దేవతలు, గంధర్వులేమిటి మనం కూడా ఆశ్చర్య పోవలసిందే ఈ కట్టడాన్ని చూస్తే. వాస్తవంలో భారతదేశానికి, లంకకు మధ్య వున్నది కేవలం 23 మైళ్లే కాని 800 మైళ్లు (100 యోజనాలు) కాదు. దీనికి రామభక్తులు రామసేతు కట్టినప్పుడు అంత దూరంలో ఉన్నవని వాదించవచ్చు.ఇది నమ్మకం మీద ఆధారపడి ఉంది.

భూగోళ శాస్త్ర రీత్యా, 10 కోట్ల సంవత్సరాల క్రితం, భారతదేశం, ఆస్ట్రేలియ ఇంకా దక్షిణ ఆఫ్రికా కలిసి వుండేవి. అంతే కాక మొదట లంక, భారతదేశంతో అవిభాజ్యంగా, కలిసే వుండేది.వెగ్నార్ ప్రతిపాదించిన,continental drift సిద్ధాంతం ప్రకారం, భూమి లోపలి రాతిపొరల (Plate tectonics) కదలిక వలన, ఖండాలు విడివడి. ఆ తదుపరి లంక, భారత్‌ల మధ్య ఖాళీ ఏర్పడింది. భూమి ఇప్పటి భౌతిక పరిస్థితికి ఇంకా ముందు, ఒక మండె అగ్నిగొళం లా వుండేది. అది చల్లబడి ఇప్పటి రూపానికొచ్చినా, భూమి లోపలి రాతిపొరల కింద ఇంకా ద్రవరూపం లోనే వుంది భూమి. ఈ ద్రవాల కదలికవలనే, ఖండాలు విడిపోయాయి.భూమి లోపలి కదలికలు,భూకంపాలు,జ్వాలముఖుల (volcanoes)విస్ఫొఠనాలు పర్వతాలకు,సముద్రంలో తేలే లావా రాళ్లకు కారణ భూతాలయ్యాయి. తేలే ఈ సున్నపు రాళ్లు, లావా రాళ్లే Adams bridge గా రూపాంతరం చెందాయి. ఈ విషయం పై మరిన్ని వివరాలకు చూడండి
http://en.wikipedia.org/wiki/Plate_tectonics

http://en.wikipedia.org/wiki/Adam%27s_Bridge

http://www.laputanlogic.com/articles/2002/11/03-83975630.html


కర్బన పరిశోధన కావిస్తే ఈ రాళ్లకు 10 కోట్ల సంవత్సరాల వయస్సు వుందో లేదో నిర్ధారితం కాగలదు.17లక్షల సంవత్సరాల క్రితం, రాముడు దీనిని కట్టివుండే అవకాశం లేదని శాస్త్రజ్ఞుల వాదన.

ఆశ్చర్యకరమైన సంగతేమంటే మదరాసు హైకోర్ట్ ఈ రామసేతును మానవ నిర్మిత కట్టడంగా గుర్తించింది. ప్రస్తుతం ఈ విషయం సుప్రీం కోర్ట్ పరిధిలో చర్చలో వుంది.

Further Reading:
1) నరావతారం - నండూరి రామమోహన రావు
2) The Blind Watchmaker: Why the Evidence of Evolution Reveals a Universe Without Design by Richard Dawkins
3) Why Darwin Matters: The Case Against Intelligent Design (Paperback)
by Michael Shermer (Author)
4) The scientific dating of the Ramayana & the Vedas -Dr Padmakar Vishnu Vartak

Discussions on the topic:
http://sodhana.blogspot.com/2007/05/blog-post_9061.html
http://churumuri.wordpress.com/2007/08/02/churmuri-poll-was-there-really-a-ram-sethu/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి