శనివారం, మే 10, 2008

బ్లాగ్వీక్షణం -6



నవతరంగంలో ఒక పాతకెరటం
http://canopusconsulting.com/salabanjhikalu/?p=58

రొటీన్ సినిమాలు చూసి విసిగెత్తారా? మై డిన్నర్ విత్ ఏంద్రె (1981) చిత్రం లో, కేవలం మూడే పాత్రలతో, ఒకే సెట్ లో, రెస్టారంట్ లో ఇద్దరు మిత్రులు, డిన్నర్ టేబుల్ దగ్గర కలిసి, భోజనం ప్రారంభించటం తో మొదలయ్యే కథ,అనేక సంభాషణలతో కొనసాగుతూ, ఎన్నో రసవంతరమైన అంశాలపై చర్చ జరుగుతూ,భోజనం అయ్యాక, మిత్రులు, ఎవరిదారిని వారు వెళ్లటం తో కథ ముగుస్తుంది. చూడతగ్గ సినిమా. నాగరాజు గారి వివరణాత్మక సమీక్ష.

నాలో సగం – కధ
http://jaahnavi.blogspot.com/2008/05/blog-post.html

భార్యా భర్తలలో ఒకరి గురించి మరొకరికి ఎంత తెలుసు? ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటే ఆ సంసారం పూల రధం కాదా? రతీ మన్మధులు అక్కడ రాజ్యమేలరా? కొత్త రచయిత్రి జాహ్నవి కథ మిమ్ములను అలరిస్తుంది.

రచయితలూ-విమర్శకులూ -పాఠకులూ!
http://kasturimuralikrishna.wordpress.com/2008/05/09/%e0%b0%b0%e0%b0%9a%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4%e0%b0%b2%e0%b1%82-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b6%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%82-%e0%b0%aa%e0%b0%be%e0%b0%a0%e0%b0%95/

రచయిత తన రచన ఎవరి కోసం, ఎందుకు, ఎలా రాయాలి? పాఠకుడికి అర్థం కాదేమోనన్న శంకతో, తన స్థాయికి దిగువుగా రాయాలా? జనరంజకంగా వుండేందుకు, పలువురిని ఆకర్షించేలా రాయాలా? రచయిత స్థాయికి పాఠకుడు ఎదగాలా?


కథల అత్తయ్యగారు
http://tethulika.wordpress.com/2008/05/09/%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b0%85%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%af%e0%b1%8d%e0%b0%af%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%81/

మాలతి గారి అత్తయ్య గారు, సినీనటి భానుమతి అత్తయ్యగారి లాంటి వారు కారు. ఎంతో వాత్సల్యంతో కథలు చెప్పటమే కాదు,ఆప్యాయంగా జడలో కదంబమాలా పెడ్తారు. తమాషా ఏమంటే ఈ అత్తయ్య గారు, మాలతి గారు ఎలాంటి బంధువులు కారు. అయినా లలితాంబ గారికి మాలతిగారంటే ఎంతో అనురాగం.ఆ కాలంలో ప్రేమలు అలా వుండేవి.జననాంతర సౌహృదాని అంటే ఇదేనా?

మా ఊరి శివారులో జరుగుతున్న యుద్ధం – 1 & 2
http://hridayam.wordpress.com/2008/05/07/sponge-iron-1/

కాలుష్యాకారక పరిశ్రమలు చక్కటి పర్యావరణానికీ తీవ్రమైన హాని కలుగ చేస్తాయి. రాబోయే, కాలుష్యాన్ని ఎదుర్కుంటున్న ఒక గ్రామ ప్రజల సంఘర్షణే ఈ కథనం. ఇది జరుగుతున్న కథ. సశేషం.


జీవిత పరమార్ధం
http://sangharshana.blogspot.com/2008/04/blog-post_21.html

జననం, విద్యాభ్యాసం, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు,వాళ్ల చదువు,పెళ్లిళ్లు,మనవలు,మనవరాళ్లు,అమెరికా లో మనమల బేబి సిట్టింగ్ ఆ పై అనారొగ్యం, ఆ తదుపరి మరణం.ఇదేనా జీవితం? జీవిత పరమార్ధమేమిటి?

నేను చదివిన మంచి పుస్తకం-మళ్ళీ నాలుగే!
http://kasturimuralikrishna.wordpress.com/2008/04/30/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%9a%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%95%e0%b0%82/

యజ్ఞం ఇది చాలా ప్రాచుర్యం పొందిన కాళీపట్నం రామారావు గారి కథ.రామారావు గారు 1924 నుంచీ కథలు రాస్తున్నారు. రచయిత అభిప్రాయాలు కాలానుగుణంగా మారుతుండటం సహజ పరిణామమే. కాలం ఎలాంటి మార్పులు రచయితపై తెచ్చిందీ, ఎవరి ప్రభావం రామారావు మాస్టారు గారి పై పడిందీ వివరిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.


వీడ్కోలు
http://naagodava.blogspot.com/2008/02/blog-post.html

ఓ,పయనమయే ప్రియతమా -మరలా ఎప్పుడు నిన్ను చూసేది? నా గుండెల నిండా నువ్వున్నావే; నీవు లేని నేను, నేనుగా ఉండగలనా? వచనంలో వున్న విరహ గీతిక.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి