ఆదివారం, మే 25, 2008

బ్లాగ్వీక్షణం -9


చెట్లపై నడక, తలకోన అడవులలో చిత్రం సౌజన్యం: భూమిక సత్యవతి

ఆకుపచ్చ లోయల్లో, ఆనందపు హేలల్లో
http://maagodavari.blogspot.com/2008_01_01_archive.html

రచయిత్రులతో కాంపులు నిర్వహించటం లో అనుభవం గడించిన భూమిక సత్యవతి గారి ట్రావెలాగ్ ఇది. ఇది చదువుతున్నంత సేపు, పాఠకులు కూడా ప్రళయ కావేరి లో బోటు ప్రయాణం చేసిన అనుభూతి, మామండూర్ అడవులలో పెదవాగులో స్నానం చేసినట్లూ, తలకోన అడవిలో తరుల మీద నడిచినట్లు (canopy walk) మరువలేని అనుభవం, పొందుతారు. ఇంకా అడవిలో, పంతం సుజాత ‘ముంగిట్లో మువ్వలశబ్ధం’ నవల ఆవిష్కరణ, వెన్నెల్లో విహారం వగైరా వగైరా అనుభూతులు ప్రయాణం ముగిసాక కూడా, చాన్నాళ్లు వెంటాడే తీపి జ్ఞాపకాలు.

గ్లాసులో మొలకలు
http://everydaysuruchi.blogspot.com/2008/05/blog-post_14.html

అమెరికా లో అపార్ట్‌మెంట్ లో కూరగాయలు, దుంపకూరలు పండించడం సాధ్యమా? జ్ఞాన ప్రసూన గారు తమ అనుభవాలు వివరిస్తున్నారు.

బ్లాగుతా తీయగా చల్లగా
http://kranthigayam.blogspot.com/2008/05/blog-post.html

క్రాంతికి పెళ్లయ్యాక వచ్చిన కొత్త కష్టాలేమిటి? అవి ఎలా deal చేస్తుందో, ఈ టపా లో చదవండి. మీరు తనతో ఎకీభవిస్తారా?

వచ్చే సారి కూడా దేవుడిపాలనే - వై.ఎస్.ఆర్
http://telugulekha.blogspot.com/2008/05/blog-post_15.html

రాష్ట్రం లో కొత్తదేవుడి పరిపాలనగురించి వివరిస్తున్నారు చక్స్. వ్యంగ రచన.

ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల... : ........................
http://ekantham.blogspot.com/2008/05/blog-post_16.html

ఎందుకనో

బ్లాగ్వీక్షణం లో పరిచయం చేస్తున్న మొదట కవిత ఇది. అంత గొప్ప కవితా అంటే కాదనే సమాధానం వస్తుంది. మరెందుకు పరిచయం చెయ్యటం? ఈ బ్లాగరి ప్రకృతి తో తాదాత్మ్యం చెందగల భావకుడు. తన గుండె లోని విచారాన్ని, ఈ కవిత లో వ్యక్తపరుస్తున్నారు, దీపు.

వార్తాపత్రిక నిత్యావసర వస్తువా!
http://anilroyal.wordpress.com/2008/05/07/%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be%e0%b0%aa%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b5%e0%b0%b8%e0%b0%b0-%e0%b0%b5/

ఒక దినపత్రికను పాఠకుడు ఏమి ఆశించి కొంటాడు? రెండు రుపాయలకు కిలో పేపర్ ఇస్తే సాక్షి కొంటాడా? పాఠకుడు ఆశించేది తక్కువ ధర ఐతే ఆంధ్రభూమి దిన పత్రిక రూపాయిన్నరకే అమ్ముతున్నారు.అయినా దాని circulation అంతంత మాత్రమే. అందరూ రెండు రూపాయలకే పేపర్ అమ్మాలని సాక్షి ఉద్యమం. ఆ సిద్ధాంతం ప్రకారం సాక్షి కూడా రూపాయిన్నరకే అమ్మాలని ఆంధ్రభూమి వాళ్లు వాదించవచ్చుగా? ధరతో నిమిత్తం లేకుండా నిజాయితీ వార్తలిచ్చే పత్రికే, పాఠకుడి ప్రాధాన్యం. సమకాలీన సంగతులపై తెలుగోడు అబ్రకదబ్ర విశ్లేషణ.

ప్రయాణం
http://snehama.blogspot.com/2008/05/blog-post_06.html

ఎవరన్నారు, కవితలకు పాఠకులు లేరని? ప్రయాణమంటే ఎవరికిష్టముండదు? అందులో, ఊహల పల్లకి లో, చుక్కల దారిలో మెత్తని ప్రయాణం.నక్షత్రాలెక్కడుతూ, గెలుపే లేని ఆట ఆడుతూ, అలుపే లేని ఆనందమయితే,తారకే నిన్ను వచ్చి చేరదా? ఇది ప్రయాణ గీతం కాదు, ప్రణయ గీతమని,శృంగార గీతమని విశ్లేషిస్తున్నారు, పాఠకులు. గెలుపే లేని ఆట కు అర్థం తెలుసుకోవాలంటే, కామెంట్స్ చదవ వలసినదే. అయితే, కవిత రాసే సమయంలో,అది రాధిక ఊహకు అందని విషయం.ఈ చిన్న కవితకు ఈ రోజు దాకా వచ్చిన కామెంట్స్ సంఖ్య 18. మీరూ ప్రయాణానికి సిద్ధం కండి.

1 కామెంట్‌:

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

@ రావు గారు
నా రచనని బ్లాగరులకి పరిచయం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి